breaking news
	
		
	
  Visakhapatnam Steel
- 
      
                   
                                                       మరణశయ్యపై విశాఖ ఉక్కు..!‘‘విశాఖ స్టీలులో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై 2021 జనవరిలో కేబినెట్ కమిటీ తీర్మానం చేసింది. దీనిని వెనక్కి తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదు’’⇒ వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు ఆగస్టు 1వ తేదీన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన ప్రకటన‘‘అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వహణ సాధ్యం కాకుండా ఉన్న విశాఖ స్టీలు ప్లాంటు మూతపడటానికి దగ్గరగా ఉంది. ఉద్యోగుల భారాన్ని తగ్గించేందుకే వీఆర్ఎస్ అమలు చేస్తున్నాం’⇒ వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఆగస్టు 8వ తేదీన అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సెప్టెంబరు 16న సభలో ఇచ్చిన సమాధానం‘‘ఆర్ఐఎన్ఎల్కు సంబంధించి ప్రైవేటీకరణపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదు’’⇒ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్రావు 2025 మార్చి 2వ తేదీన ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు మార్చి 18న కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) అండర్ సెక్రటరీ అజయ్ నాగ్పాల్ వివరణసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనేక సందర్భాల్లో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని... ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అయినప్పటికీ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్, లోకేశ్లు ప్రకటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు స్టీలు ప్లాంటు సిబ్బందిని మభ్యపెట్టేందుకు పదేపదే ప్రజలను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. వేతన బకాయిల సమస్యలో ఉద్యోగులుస్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సమయంలో క్రెడిట్ తమదంటే తమదంటూ కూటమి నాయకులు గొప్పలు పోయారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ మొత్తం రాకపోగా, ఇప్పటికీ స్టీలు ప్లాంటు కార్మికులు భారీ వేతన బకాయిలతో సతమతమవుతున్నారు. మరోవైపు ఉద్యోగులను తొలగించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అమలు చేస్తున్నారు. మొదటి దఫాలో వీఆర్ఎస్ ద్వారా 1,120 మంది కార్మికులతో రాజీనామా చేయించారు. రెండో విడతలో 464 మందిని ఇంటికి సాగనంపారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులు 5,000 మందిని ఇప్పటికే తొలగించారు.కార్మిక సంఘాల ఆగ్రహంఅన్నింటికీ మించి విభాగాల వారీగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకుగానూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 32 విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకెళుతోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలు మాత్రం ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందంటూ ప్రకటనలు ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముడిసరుకుల కొరతతో విశాఖ స్టీల్ ఉత్పత్తి పెరగని పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది.సెయిల్లో విలీనం అవశ్యం...స్టీల్ ప్లాంట్కు ప్రస్తుతం రోజుకు 6 ర్యాక్ల బొగ్గు అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయి ఉత్పత్తికి 9 ర్యాక్లు కావాలి. నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేటు ప్లాంటు ప్రారంభమైతే మొత్తం 13–14 ర్యాక్ల బొగ్గు అవసరం ఏర్పడుతుంది. కానీ ఒక్క రైల్వే లైన్తో ఈ సరఫరా సాధ్యం కాదు. మిట్టల్ సంస్థలు తమ వనరులతో సమస్య పరిష్కరించుకోగలుగుతాయి. విశాఖ స్టీలుకు అది కష్టమే. ఉద్యోగుల సంఖ్యను 12 వేల నుంచి 7 వేలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా, ఈ సిబ్బందితో పూర్తి ఉత్పత్తి సాధ్యం కాదంటున్నారు. కాబట్టి బొగ్గు గనులు కలిగిన సెయిల్లో విలీనం చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని భావిస్తున్నారు.వైఎస్సార్సీపీది దీర్ఘకాలిక పోరాటం...!విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచీ వైఎస్సార్సీపీ ఒకే నిర్ణయంపై ఉంది. కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తోంది. విశాఖ స్టీలు ప్లాంటును 100 శాతం ప్రైవేట్పరం చేసేందుకు అనుగుణంగా 2021 జనవరిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 2021 ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు 2021 మేలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎప్పటికప్పుడు పార్లమెంటులో కూడా తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్రానికి పలు దఫాలుగా విశాఖ స్టీలును ప్రైవేటీకరించవద్దంటూ వినతిపత్రాలను వైఎస్ జగన్ సమర్పించారు.లక్షల మంది సాక్షిగా ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్లో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోడీ సభలో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించవద్దంటూ స్వయంగా ఆయన ఎదుటే వైఎస్సార్సీపీ తన గళాన్ని వైఎస్ జగన్ వినిపించారు. తద్వారా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమయంలో ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేయడం ప్రారంభమైంది.
- 
      
                   
                                                       కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవుకూర్మన్నపాలెం/గాజువాక/ఉక్కునగరం: విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలపై టీడీపీ ఎంపీ ఎం.శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు. కాంట్రాక్ట్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకున్నారు. మళ్లీ ఆ నాయకులే కూటమి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు’ అంటూ శ్రీభరత్ ఆరోపించారు. జీవీఎంసీ 87వ వార్డులో రూ.6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం వీరు శంకుస్థాపన చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ మాట్లాడుతూ.. కార్మిక నాయకులది రాజకీయ ఎత్తుగడ అని, ప్రజలే అలాంటి వారిపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ‘కార్మిక నేతలు రూ.లక్షలు తీసుకుని వేలాది మందిని కాంట్రాక్టు కార్మికులుగా నియమించుకున్నారు. ప్యాకేజీ ఇచ్చినా ఉనికి కాపాడుకోవడం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. కాలక్షేపం చేస్తామంటే ప్రజల్లో చులకన అవుతారు’ అని వ్యాఖ్యానించారు. స్టీల్ప్లాంట్లో అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు, కార్మిక నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కవడంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. నాయకులు స్వార్థం విడనాడి కర్మాగారంలో ఉత్పత్తి సాధనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, కాంట్రాక్ట్ పోస్టులు అమ్ముకున్నామంటూ ఎంపీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ బాగుంటే లబ్ధి పొందలేమనే ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు.డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ప్రస్తుతం వ్యవహారాలను పక్కదోవ పట్టించడానికి కూటమి ప్రజాప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కేటాయింపు గురించి అడగని ఈ ప్రజాప్రతినిధులు.. ప్రారంభమే కాని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడుగుతున్నారు. నిర్వాసితుల మధ్య చిచ్చు పెట్టేలా విమర్శలు చేస్తున్నారు. –మంత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్టీయూసీ సీబీఐ విచారణకైనా సిద్ధం కాంట్రాక్ట్ కార్మికుల పోస్టులను అమ్ముకున్న కార్మిక నేతల పేర్లను ప్రజాప్రతినిధులు బయటపెట్టాలి. ఈ అంశంపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి. దీనికి మా యూనియన్ కట్టుబడి ఉంది. – కేఎస్ఎఎన్ రావు, అధ్యక్షుడు, స్టీల్ ఏఐటీయూసీఆ విషయాన్ని తేల్చాలి..ఇటీవల తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు డబ్బులు కట్టి చేరినవారా? లేక నిర్వాసితులా? అనేది తేల్చి చెప్పాలి. ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. – జె.అయోధ్యరామ్, గౌరవ అధ్యక్షుడు, స్టీల్ సీఐటీయూ
- 
      
                   
                                 కుంచె కదిపితే... సజీవ చిత్రాలు
 చిత్రకళా రంగంలో రాణిస్తున్న ఉక్కు ఉద్యోగి వెంకట్రావు
 
 విశాఖపట్నం : ఆయన కుంచె కదిపితే ప్రకృతి పులకరిస్తుంది.. సెలయేళ్లు పరవళ్లు తొక్కుతాయి.. మేఘాలు వర్షిస్తాయి.. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది.. పడుచుపిల్లలు ఊహల పల్లకిలో ఊరేగుతారు.. దేవతామూర్తులు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తారు.. ఇలా ఆ కుంచె ఎన్నో అద్భుత చిత్రాలను సృష్టించింది. ఆ చిత్రాలు కొల్లి వెంకట్రావు సృజనాత్మక శక్తికి దర్పణాలు. ఉద్యోగిగా, కళాకారునిగా రాణిస్తు న్న ఆయన విశాఖ స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్ సీసీడీ వి భాగంలోని హైడ్రాలిక్ ఫోర్మన్గా పనిచేస్తున్నారు. అగనంపూడి నిర్వాసిత కాలనీలో నివసిస్తున్నారు. చిరుప్రాయంలోనే బొమ్మలు గీయడం నేర్చుకొని స్వగ్రామంలోని రామాలయం గోడలమీద చిత్రాలు వేయడంతో ప్రారంభమైంది ఆయన చిత్ర కళా నైపుణ్యం.
 
 ఇలా ఆయన చిత్రిం చిన కళాఖండాలను విశాఖ స్టీల్ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రియేటివ్ కల్చరల్ డీలైట్ కార్యక్రమంలో ప్రదర్శించి, ఉక్కు కిర ణం బిరుదును పొందా రు. ఇంకా వివిధ ఆల యాల నమూనాలు, బ హుళ అంతస్తుల భవనాలను ధర్మాకోల్తో రూపొందిస్తారు. ఈనెల 4వ తేదీన స్టీల్ప్లాంట్ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో వెం కట్రావు రూపొందించిన చిత్రాలకు ప్రథమ, తృతీయ బహుమతులు ల భించడం విశేషం. ఈ పోటీల్లో విశా ఖ స్టీల్ప్లాంట్, మాదారం, బయ్యా రం, జగ్గయ్యపేట, గర్భాం గనుల నుంచి అనేకమంది కార్మికులు తమ పెయింటింగ్లతో హాజరైనప్పటికీ, కొల్లి గీసిన చిత్రాలకు బహుమతులు దక్కాయి. ఉక్కు సీఎండీతోపాటు వివిధ ఉన్నతాధికారులు, గుర్తింపు యూనియన్ నాయకులు వెంకట్రావును అభినందించారు.
 
- 
      
                   
                                 విశాఖ స్టీల్ప్లాంట్కు జాతీయ అవార్డు
 విశాఖపట్నం: పని ప్రదేశ నిర్వహణ(ఫైవ్ ఎస్)లో విశాఖ స్టీల్ప్లాంట్కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) ఆధ్వర్యంలో చెన్నై చాప్టర్ సహకారంతో మధురైలో నిర్వహించిన 2వ జాతీయ సదస్సుకు దేశ వ్యాప్తంగా 30 సంస్థలకు చెందిన జట్లు, 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో విశాఖ స్టీల్ ప్రతిభకు పార్ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది.
 
 క్యూసీఎఫ్ఐ అధ్యక్షుడు డాక్టర్ ఎ.కె మిట్టల్, ఈడీ డి.కె.శ్రీవాత్సవ చేతుల మీదుగా ఉక్కు డైరక్టర్ (పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ప్లాంట్ నుంచి కోక్ ఒవెన్స్ జిఎం ఆర్.నాగరాజన్, ఎంఎస్ డీజీఎం గాంధీ తదితరులు పాల్గొన్నారు. వాయ్ఘాయ్ ఆగ్రో ప్రాడక్ట్స్ ఎండీ నీతీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఉక్కు ఉద్యోగులను అభినందించారు.
- 
      
                   
                                 ఉక్కు ఆశలపై నీళ్లు
 ఏలేరు నీటి సరఫరాలో కోత
 గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు
 గోదావరి పంపింగుకూ ఆటంకాలు
 రెండు పైపులుమొరాయింపు
 కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు
 
 ఉక్కునగరం : విశాఖ స్టీల్ప్లాంట్కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్ప్లాంట్కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్ప్లాంట్కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది.
 
 ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్ప్లాంట్కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి.
 
 ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు.
- 
      
                   
                                 వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్మెంట్ ఈ ఏడాదే..
 త్వరలో ఉక్కుశాఖ కొత్త పాలసీ
 
 విశాఖలో విలేకరులతో కేంద్ర ఉక్కుశాఖ
 కార్యదర్శి జి. మోహన్కుమార్
 స్టీల్ ప్లాంట్లో గోదావరి బ్లాస్ట్ఫర్నేస్, సింటర్ పవర్ ప్లాంట్ ప్రారంభం
 
 సాక్షి, విశాఖపట్నం: కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో ఈ ఏడాదే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి జి.మోహన్ కుమార్ వెల్లడించారు.కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లో తమ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కొనసాగిస్తుందని, వైజాగ్ స్టీల్ప్లాంట్లోనూ దీన్ని అమలుచేస్తామని స్పష్టం చేశారు.ై వెజాగ్ స్టీల్ప్లాంట్లో రెండురోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఆర్ఐఎన్లో రూ.600 కోట్లతో చేపట్టిన గోదావరి బ్లాస్ట్ఫర్నేస్ ఆధునికీకరణ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.
 
 అనంతరం జపాన్దేశ సాంకేతిక సహకారంతో రూ.300 కోట్లతో స్టీల్ప్లాంట్ నిర్మించిన 20.6 మెగావాట్ల సింటర్ కూలర్ వేస్ట్హీట్ రికవరీ పవర్ ప్లాంట్ను సైతం మోహన్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ స్టీల్ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వెలువడే వృథా వాయువులతో విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం మంచి ప్రయత్నమని అభినందించారు. దేశంలో ఇతర ఉక్కు సంస్థలు కూడా ఇదేబాటలో పయనిస్తే పర్యావరణ కాలుష్యాన్ని నివారించి వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఉక్కు ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయనే ప్రశ్నకు ఇది ఆయా కంపెనీల విధానాలపై ఆధారపడి ఉంటుందని,దీనిపై తామేం చేయలేమన్నారు.
 
 స్టీల్ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం కొంతవరకు బాధాకరమేనని, రాజస్థాన్ గనుల అనుమతి రూపంలో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉక్కు ఉత్పత్తి వ్యయం క్రమేపీ పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించుకోగలిగితేనే ఏ కంపెనీకైనా మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని కంపెనీలకు కలిపి 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, వ్యక్తిగత ఉక్కు వినియోగం తక్కువగా ఉంటున్నందున 80 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ భవిష్యత్లో రెండో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 అనంతరం ఆర్ఐఎన్ఎల్ సీఎండీ మధుసూదన్ ప్రసంగించారు. గోదావరి బ్లాస్ట్ఫర్నేస్ను ఆధునీకరించడం వలన ఫర్నేస్ ఉత్పత్తి సామర్థ్యం రెండు మిలియన్ టన్నుల నుంచి 2.5 మి లియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. స్టీల్ప్లాంట్ నుంచి వెలువడే వృథా వాయువుల నుంచి సింటర్ పవర్ ప్లాంట్ను నిర్మించడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటూ ఇందుకు తోడ్పాటునందించిన జపాన్దేశ ప్రతినిధులైన జేపీ స్టీల్ ప్లాన్టెక్ కంపెనీ డెరెక్టర్ శొశకు ఉమెజావా, నీడో కంపెనీ ఈడీ ఫ్యుమియో యెడాలను అభినందించారు.


