breaking news
visakha KGH
-
తప్పు ఒప్పుకోండి.. అబద్ధాలు ఆపండి: వైఎస్ జగన్
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. గిరిజన విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణం. మరోసారి ఈ తరహా దారుణాలు జరగకుండా సమస్య పరిష్కరించేలా చూడాల్సింది పోయి.. తప్పులు దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం.కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో! ఒకే స్కూల్ నుంచి 170 మందికి ఒకేసారి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. - వైఎస్ జగన్సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామెర్ల బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని గురువారం రాత్రి ఆయన విశాఖలోని కేజీహెచ్లో పరామర్శించారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం.. రాత్రి 8.15 గంటలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడి.. వ్యాధుల బారిన పడటానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు.. తదితర విషయాలపై ఆరా తీశారు. మొదలైన వివరాల్ని ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించి.. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..నీటి కాలుష్యమని వైద్యులు చెబుతున్నారు..కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో 5, 6, 7 తరగతుల పిల్లలు పచ్చ కామెర్లతో కేజీహెచ్లో చేరారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు నీళ్లు బాగోలేవనే చెప్పారు. వైద్యులు కూడా నీటి కాలుష్యం కారణంగానే వ్యాధులు ప్రబలాయని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? అది పని చేయడం లేదు. ఒకే హాస్టల్కు చెందిన దాదాపు 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వస్తే.. ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు దానికి గల కారణాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప.. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి.. అక్కడ తలెత్తిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచించక పోవడం దారుణం.పరిహారం ఇవ్వకపోతే న్యాయపోరాటంఅభం శుభం తెలియని ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చికిత్స పొందుతున్న పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుని 170 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. ఇది మెడికో లీగల్ కేసు. ఎస్టీ పిల్లలను పట్టించుకున్న పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వీరికి పరిహారం ఇవ్వకపోతే అవసరమైతే వైఎస్సార్సీపీ వీరి తరఫున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి మరీ.. పరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.దేవుడు కూడా క్షమించడు..తక్షణమే హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించండి. బాత్ రూమ్లు రిపేర్ చేయాలి. శానిటేషన్పై దృష్టి పెట్టాలి. వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు కొద్దో గొప్పొ క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చÆý‡్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో. 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? తప్పు ఒప్పుకోమని చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తంగా ఏమేం చేయాలో చేయండి. చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. పరిహారం ఇవ్వండి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి.. చదివే పరిస్థితి ఉండేలా చర్యలు తీసుకోండి.గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడొద్దుఎవరైనా పట్టించుకున్నారా అని ఓ తల్లిని ప్రశ్నిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నారు. ఇదే పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా కట్టించి ఉంటే ఆ ఆస్పత్రి అందరినీ కాపాడేది. 200 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆస్పత్రికి రాకుండా అక్కడే మెడికల్ కాలేజీ ద్వారా అందరి ప్రాణాలు బాగుపడేవి. దాన్ని నాశనం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైగా అబద్ధాలు. నీటి కాలుష్యం లేదంటూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ మళ్లీ దాని గురించి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)కు వైఎస్ జగన్ ఈ బాధ్యత అప్పగించారు.ఆయన ప్రతిపక్ష నేత కాదు..పోలీస్ కమిషనర్ ఓవరాక్షన్విశాఖలో వైఎస్ జగన్ పర్యటనను ఆద్యంతం అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి కేజీహెచ్లో కురుపాం ప్రాంతానికి చెందిన పచ్చకామెర్ల బాధిత విద్యార్థుల్ని పరామర్శించేందుకు వచ్చినా.. అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేజీహెచ్కు ఎవ్వరూ రాకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వచ్చి.. కేజీహెచ్ని ఖాకీ వలయంలో బంధించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో వైఎస్ జగన్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో.. పక్కనే ఉన్న సీఎస్సార్ బ్లాక్కు తరలించి.. అక్కడ నిర్బంధించారు.వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఒక విద్యార్థిని తల్లికి మాత్రమే అనుమతించారు. మీడియాపైనా సీపీ బాగ్చీ చిందులు తొక్కారు. కేజీహెచ్ నుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ప్రతిపక్షనేత వస్తే మీడియాతో మాట్లాడనివ్వరా.. అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సీపీ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆయన ప్రతిపక్ష నేత కాదని, ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. అలాగైతే.. మీడియా ఆయనతో మాట్లాడకూడదా.. అని అడగ్గానే అక్కడి నుంచి విçసురుగా వెళ్లిపోయారు. కేజీహెచ్ సిబ్బంది, వై§ý ్యులు, రోగుల బంధువులు వైఎస్ జగన్ని చూసేందుకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పిల్లల వార్డుకు చేరుకున్నారు. వందల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అభిమానాన్ని ఆపలేక తుదకు చేతులెత్తేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందిమా పాప కల్పనకు సరైన ట్రీట్మెంట్ అందలేదు. ప్రభుత్వం తరఫున ఎవ్వరూ పట్టించుకోలేదు. మా పాపను ఇక్కడికి తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డామో.. అయినా మంచి వైద్యం అందలేదు. ఎన్నో రోజుల నుంచి బాగోలేకపోయినా హాస్టల్ వాళ్లు చెప్పలేదు. కురుపాం, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్.. ఇలా పలు చోట్ల ఆస్పత్రులకు తిప్పాను. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. ఐసీయూలో పెట్టలేదు. మా పాపకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు. ఎవ్వరూ బతికించలేకపోయారు. ఇంత కష్టం వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే మా పాప చనిపోయింది. – మృతి చెందిన కల్పన తల్లి తోయక జయమ్మ -
కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్లో కోవిడ్–19 వ్యాక్సిన్.. కోవీషీల్డ్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ను తయారుచేసిన సంగతి తెలిసిందే. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కేజీహెచ్లో వ్యాక్సిన్ ట్రయల్స్కు శ్రీకారం చుట్టాయి. తొలి రోజు ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ పర్యవేక్షణలో కేజీహెచ్లో ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన 57, 90, 180వ రోజుల్లో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి.. వారి పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు. -
పునర్జన్మనిచ్చారు!
‘ఆ రోజు రాత్రి అమ్మ దగ్గర పడుకున్నాను. మధ్య రాత్రిలో ఏదో వాసనకు మెలకువొచ్చింది. ఊపిరాడలేదు. ఒళ్లంతా మంటలు.. నోట్లోంచి నురగలొచ్చేస్తున్నాయి. తమ్ముడికీ అంతే. చచ్చిపోతున్నామా అమ్మా? అని ఏడ్చాను. అంతా బయటకొచ్చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్పృహ వచ్చాక హాస్పిటల్ బెడ్మీద ఉన్నాం. డాక్టర్లు మమ్మల్ని బతికించారు’ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పదేళ్ల పీతల లాస్య సంతోషంతో చెప్పిన మాటలివి. ‘గ్యాస్ పీల్చడం వల్ల నాకు, నా భర్త, ఇద్దరు పిల్లలు చేతన (14), చిన్మయి (9)లకు వాంతులయ్యాయి. కాసేపటికి స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంబులెన్స్లో కేజీహెచ్కు తీసుకొచ్చారంట. స్పృహలోకి వచ్చాక మేం బతికినా.. చావుకు దగ్గర్లో ఉన్నామనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వైద్యం అందేలా చేసింది. డాక్టర్లు పగలూ, రాత్రి ప్రత్యేక చికిత్స చేయడంతో మా బిడ్డలు బతికారు’ అని పేడాడ నారాయణమ్మ చెమర్చిన కళ్లతో చెప్పింది. కోలుకున్న ఇద్దరు కూతుళ్లతో నారాయణమ్మ సాక్షి, విశాఖపట్నం: లాస్య, నారాయణమ్మే కాదు.. విషవాయువు బారినపడి విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులందరిదీ ఒకే మాట. మా బిడ్డలకు వైద్యులు పునర్జన్మనిచ్చారంటూ ఆనందంతో చెబుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయడంతో వీరంతా వైద్యులను దేవుళ్లతో పోలుస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారంటూ నిండైన హృదయాలతో కృతజ్ఞతలు చెబుతున్నారు. 17 మంది డిశ్చార్జ్ ► స్టైరీన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఆర్.ఆర్. వెంకటాపురానికి చెందిన 585 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది చిన్నారులకు కేజీహెచ్ పిల్లల వార్డులో వైద్యం అందిస్తున్నారు. ► ఇందులో ఆదివారం నాటికి 17 మంది పిల్లలను డిశ్చార్జ్ చేశారు. నలుగురికి న్యుమోనియా లక్షణాలుండడంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం చేస్తున్నారు. ► ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కేజీహెచ్ వైద్యులు అన్ని అత్యవసర చర్యలు చేపట్టారు. రేయింబవళ్లు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సు చొప్పున నియమించారు. ► ఆక్సిజన్ను అందుబాటులో ఉంచారు. బాధిత పిల్లలందరికీ నిరంతరం మూత్ర, రక్త పరీక్షలను నిర్వహించారు. అవసరమైన మందులను అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ► ఫలితంగా రెండు మూడు రోజులకే చిన్నారులంతా కోలుకున్నారు. మిగిలిన పిల్లలనూ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించి వేస్తామని వైద్యులు చెబుతున్నారు. ► ఆస్పత్రిలో తమ బిడ్డలకు మంచి వైద్యంతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు. మూడు రోజుల్లోనే కోలుకున్నారు నేను.. నా ఇద్దరు పిల్లలు దీపు (12), భవ్య (9) గ్యాస్ పీల్చి వాంతులు చేసుకుని, నురగలు కక్కుతూ పడిపోయాం. ఆ రోజు ఉదయాన్నే 108లో కేజీహెచ్కు తీసుకొచ్చారంట. పిల్లల పరిస్థితి చూస్తే బతుకుతారన్న ఆశ కనిపించలేదు. మంచి వైద్యం అందించడంతో మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశ్చార్జి ఇచ్చారు. సంతోషంగా వెళ్తున్నాం. వైద్యులకు, తక్షణమే స్పందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఈసంశెట్టి భారతి, ఆర్.ఆర్. వెంకటాపురం పిల్లలంతా సేఫ్ స్టైరీన్ గ్యాస్ పీల్చడం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొందరు, ఆపస్మారక స్థితిలో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలూ నిపుణులైన పిల్లల వైద్యులతో చికిత్స అందించాం. మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సును నియమించాం. తక్షణమే ప్రత్యేక వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్లను సిద్ధం చేసినా వాటి అవసరం పిల్లలెవరికీ రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లాక న్యుమోనియా రాకుండా మందులిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఆస్పత్రి తీసుకు రావాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
ఆ రసాయనాన్ని కొన్నారా?
-
ప్రాణాలు తీసిన రసాయనం!
సాక్షి, విశాఖపట్నం/గాజువాక : చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే కుటుంబాల్లో విప్పసారా రూపంలోని విషపూరిత రసాయనం తీవ్ర విషాదం నింపింది. ఎప్పట్నుంచో నిషాకు అలవాటుపడిన ఆ బడుగు జీవులు తాము సేవిస్తున్నది విషమని గమనించలేకపోయారు. రోజంతా కష్టపడ్డ శ్రమను గుక్కెడు సారాతో మరచిపోవచ్చని భావించారే తప్ప అది తమను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్తుందని ఊహించలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇంకో 11మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ నగర శివారు పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీకి చెందిన వారు చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తుంటారు. ఎప్పటిలాగే కాలనీకి చెందిన వాడపల్లి అంకమ్మ శనివారం సాయంత్రం సమీపంలోని డంపింగ్ యార్డుకు చిత్తు కాగితాల కోసం వెళ్లింది. అక్కడ తుప్పల మాటున నల్లని ప్లాస్టిక్ డబ్బా (20 లీటర్ల సామర్థ్యం) కనిపించడంతో దాని మూతతెరచి వాసన చూసింది. విప్ప సారాగా భావించి ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి తన మామ వాడపల్లి అప్పడు (75), అతని చెల్లెలు పెండ్ర అప్పాయమ్మ (70)లకు ఇచ్చి ఆమె కూడా తాగింది. సమీప బంధువులు ఆసనాల కొండోడు, ఆసనాల చిన్నారావు, ఆసనాల రమణమ్మ, పెండ్ర లోవరాజు సహా మరో 20 మంది వరకు ఇచ్చింది. వారంతా రాత్రి తాగి నిద్రించారు. వీరిలో కొందరు వాంతులు చేసుకున్నారు. ఉదయానికి పెండ్ర అప్పాయమ్మ మృతి చెందింది. ఈమె అనారోగ్యంతో చనిపోయిందనుకుని దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేశారు. ఆ కాసేపటికి అప్పడు కూడా చనిపోయాడు. ఆందోళనతో కాలనీ వాసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిలో అంకమ్మను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి, కొండోడుతో పాటు మిగతా వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. మార్గమధ్యంలో కొండోడు కూడా మరణించాడు. వీరిలో ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నారావుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆదివారం రాత్రి కేజీహెచ్కు తరలించారు. దీంతో ప్రస్తుతం కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 11కి చేరింది. ఆ రసాయనాన్ని కొన్నారా? ఈ ఘటనలో రసాయన డబ్బా దొరకడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాగుడు అలవాటు ఉన్న కాలనీ వాసులు మద్యంతో పాటు మత్తెక్కించే ద్రావణాలను రహస్యంగా సేవిస్తారని తెలుస్తోంది. తనకు డంపింగ్ యార్డులో రసాయన డబ్బా దొరికిందని, అది విప్ప సారాగా భావించి తీసుకొచ్చానని కాలనీ వాసులకు అంకమ్మ చెప్పింది. అయితే, దీనిని తాగిన మరికొందరు బాధితులు తాము వంద రూపాయల చొప్పున కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు కేజీహెచ్ వైద్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంకమ్మ చెబుతున్నట్టు డంపింగ్ యార్డులో దొరికిందా? లేక కొన్నాళ్లుగా ఎవరైనా కాలనీ వాసులకు విప్పసారా పేరిట మత్తునిచ్చే ఇతర ద్రావణాలను తెచ్చి విక్రయిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. పరీక్షకు రసాయనం.. కాగా, ఎక్సైజ్ అధికారులు ఆ ద్రావణాన్ని పరీక్ష కోసం ల్యాబ్కు పంపించారు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అది పరిశ్రమలకు వినియోగించే నాన్పోటబుల్ కెమికల్గా తేల్చారు. పూర్తిస్థాయి నివేదిక సోమవారం వస్తుందని ఎక్సైజ్ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మద్యంలో పోటబుల్ లిక్కర్ను మాత్రమే వాడతారని తెలిపారు. బాధితులకు పరామర్శ స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఏసీపీ ప్రవీణ్కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్లు సందర్శించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ కె.భాస్కర్, ఎక్సైజ్ డీసీ టి.శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. ఈ రసాయనం ప్రాణాంతకమైనదే.. బాధితులు సేవించినది స్పిరిట్లాంటి ప్రాణాంతక రసాయనంగా భావిస్తున్నాం. ఇందులో మత్తు కలిగించే ఆల్కహాల్ కూడా ఉండడంవల్ల దీనిని సేవించిన వారికి కిక్కు ఇస్తుంది. ఇలాంటి రసాయనాలు పరిశ్రమల్లో వాడతారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి దీనిని తాగామని బాధితులు చెబుతున్నారు. మత్తు, న్యూరో వైద్యులతో నిరంతర వైద్యం అందిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. – డా. జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్
కేజీహెచ్లో 13 మందికి చికిత్స సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్టుకు చెందిన 13 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్లో చేరారు. వివ రాలిలా ఉన్నాయి. పనసపుట్టులో ఇటీవల కొంతమంది గిరిజనులు చనిపోయిన మేక మాంసాన్ని తిన్నారు. దీంతో చేతి వేళ్లపై పొక్కుల్లా వచ్చాయి. వీరు పాడేరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ వైద్యులు వీరికి ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం వీరిని మంగళవారం రాత్రి విశాఖ కేజీహెచ్కు తీసుకువచ్చారు. వీరిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. వీరిని కేజీహెచ్లోని చర్మవ్యాధుల చికిత్స వార్డులో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితులకు చర్మవ్యాధుల చికిత్స విభాగాధిపతి డాక్టర్ అనీలా నాయర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. వీరి శరీరం నుంచి శాంపిళ్లను తీసి పరీక్షలకు పంపుతామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్బాబు తెలిపారు. -
పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం
-
మరపురాని విషాదం
వంగర : చిన్న నిర్లక్ష్యం ఏడుగురు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పొట్టకూటికోసం బాణసంచా పనికి వెళ్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలియక మృత్యుపంజరంలో చిక్కుకున్నారు. మండలంలోని కొత్తమరువాడలో ఈ నెల 15న జరిగిన బాణాసంచా పేలుడులో గాయపడిన వారంతా మృతిచెందారు. క్షతగాత్రుల శరీర భాగాలు పూర్తిగా కాలిపోవడంతో మృత్యువుతూ పోరాడుతూ విశాఖ కేజీహెచ్లో మరణించగా, ఆఖరుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గేదెల పోలీసుల కూడా బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ కుటుంబంలో ఆయనతోపాటు తల్లి గేదెల రాములమ్మ, కొడుకు గేదెల శ్రీను, సోదరుడు గేదెల భాస్కరరావు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరు కాకుండా మరో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. పోలీసు కుటుంబంలో ఉన్న మగవారంతా మృతిచెందారు. 18 ఏళ్ల కుమార్ మినహా ఆ నాలుగు కుటుంబాల్లో మగవారన్నవారు లేకుండా పోయారు. రెండు ఇళ్లుతోపాటు సర్వం కాలిబూడిదయ్యాయి. శోకసంద్రంలో గ్రామం కొత్తమరువాడ దుర్ఘటనలో క్షతగాత్రులంతా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాయపడిన ఏ ఒక్కరూ బతకకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి వద్ద వారి రోదనలు మిన్నంటాయి. వారిని చూసిన వారంతా కంటతడిపెడుతున్నారు. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పొట్టకూటి కోసం చేసే కూలి పని ప్రాణాల మీదకు తెచ్చిందని, జీవనాధారమైన ఇళ్లు, గృహోపకరణ వస్తువులు, తిండిగింజలతోపాటు, విలువైన ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయని వాపోతున్నారు. బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని స్థానికులు, బాధితులు వేడుకుంటున్నారు. -
రెండురోజుల పసికందు అపహరణ
విశాఖ : విశాఖ కేజీహెచ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కేజీహెచ్లో రెండు రోజుల పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఓ మగ శిశువు అపహరణకు గురైంది. దాంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బంధువులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కేజీహెచ్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయక పోవడంతో శిశువును ఎవరు అపహరించారనే పోలీసులు విచారణ ప్రారంభించారు. -
కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం
విశాఖ : విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో దొంగలు గురువారం బీభత్సం సృష్టించారు. సిబ్బందిని గాయపర్చి పిల్లలను ఎత్తుకు వెళ్లేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. సిబ్బందితో పాటు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించటంతో దొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా పిల్లల బంధువులపై దుండగులు దాడికి ప్రయత్నించారు. కాగా నిన్న మొన్నటి వరకూ పిల్లల వార్డులో కుక్కలు యధేచ్చగా వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా పిల్లలనే ఎత్తుకు పోయేందుకు యత్నించటం కలకలం సృష్టించింది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.