విశాఖలోని కేజీహెచ్లో సెల్ఫోన్ టార్చ్ వెలుతురులో వైద్యం చేస్తున్న సిబ్బంది
మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. గురువారం మ.12.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేబుల్ ద్వారా సబ్ స్టేషన్కు వెళ్లే లైన్లు దెబ్బతినడంతో వివిధ వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 
విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉన్న కేజీహెచ్లోని అర్థోపెడిక్ వార్డు 
సెల్ఫోన్ వెలుతురులో రోగికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

గైనిక్ వార్డు, భావనగర్ వార్డు, పిల్లల వార్డులు, రాజేంద్రప్రసాద్ తదితర వార్డుల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఐసీయూ, చిన్న పిల్లల వార్డుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖరనాయుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా, అమెరికాను మించి టెక్నాలజీని తేగల సమర్థుడు ప్రభుత్వాస్ప త్రిలో కరెంటు ఇవ్వలేకపోతున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి టీవీతో కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణి
- కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు మరో రెండు గంటల సమయం పడుతుంది
- క్రిటికల్ కేర్ బ్లాక్ వద్ద పనులు చేస్తుండగా పవర్ కేబుల్ కట్ అయింది
- జనరల్ వార్డుల్లో కరెంటు లేక రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే
- ఇలా జరగడం చాలా బాధాకరం
- ఎమర్జెన్సీ వార్డులకు జనరేటర్ల ద్వారా పవర్ అందిస్తున్నాం
- పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటా
- నేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చాను పనులు పర్యవేక్షిస్తున్నాను


