breaking news
vc appointments
-
పదవీకాలం ముగిసినా..
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ (వీసీ) పదవీకాలం ముగిసిన తరువాత నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వైస్ చాన్స్లర్ను నియమించే నిబంధన రాబోతోందా? అంటే ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టడంతో నెలల తరబడి జాప్యం జరిగేది. అలాంటి జాప్యాన్ని నివారించే చర్యలపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యావేత్తలు, నిపుణులు, వర్సిటీల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వర్సిటీల చట్టాల రూపకల్పన కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 11 వర్సిటీలకు వేర్వేరు చట్టాలు, వేర్వేరు నిబంధనలు ఉన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభు త్వం ఒకే రకమైన వర్సిటీలకు ఒకే రకమైన చట్టాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గతేడాది ఉన్నత విద్యా మండలి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ తమ నివేదికను రూపొందించింది. దానిపై వర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఆ అభిప్రాయాల్లో కొన్నింటిని తమ నివేదికలో పొందుపరిచే చర్యలు చేపట్టింది. సోమవారం కూడా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ఓయూ లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, నిరంజన్చారి తదితరులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా తమకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించింది. ప్రధానంగా వీసీల పదవీ కాలం పూర్తి కాగానే నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వీసీలను నియమించాలన్న నిబంధనను పొందుపరచాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిటీ ఆ నిబంధననూ çపరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7న మరోసారి సమావే«శమై తుది నివే దిక ఖరారు చేయనుంది. వీలైతే అదే రోజు లేదంటే వారంలోగా ప్రభుత్వానికి తమ సిఫారసులతో కూడిన వర్సిటీల కొత్త చట్టాల తుది నివేదిక అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భౌగోళిక స్వరూపాల్లోనూ మార్పులు.. ఈ చట్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు కామన్ నిబంధనలే ఉండనున్నాయి. చాన్స్లర్, వీసీ, రిజిస్ట్రార్ వంటి నియామకాల నిబంధనలు ఒకే రకంగా ఉండనున్నాయి. మిగతా 30 నుంచి 40 శాతం నిబంధనలు మాత్రం ఆయా యూనివర్సిటీల ప్రత్యేకతకు అనుగుణంగా ఉంటాయి. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సబ్జెక్టు సంబంధమైన కొన్ని నిబంధనలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. వర్సిటీ భౌగోళిక స్వరూపాల్లో మార్పులకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే నివేదికను ఇవ్వనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఆయా జిల్లాలు ఏ వర్సిటీకి దగ్గరగా ఉంటాయో ఆ వర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. ఆ నివేదికను తెప్పించుకొని, వీలైతే ఆ అంశాలను కూడా యూనివర్సిటీల చట్టాల్లో పొందుపరిచే అవకాశం ఉంది. నాలుగు రకాల చట్టాలు.. ముఖ్యంగా 11 యూనివర్సిటీలకు 4 రకాల చట్టాలను తీసుకొచ్చేలా కమిటీ సిఫారసు చేస్తోంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వంటి సంప్రదాయ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేసేలా నివేదికను సిద్ధం చేస్తోంది. జేఎన్టీయూ, జేఎన్ఏఎఫ్ఏయూ, బాసరలోని ఆర్జీయూకేటీ వంటి టెక్నికల్ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. తెలుగు వర్సిటీని, భవిష్యత్తులో ఏదైనా భాషా సంబంధ వర్సిటీలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకునేలా లాంగ్వేజ్ అండ్ కల్చర్వర్సిటీల చట్టం ఉండాలని పేర్కొంటోంది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. దీనిలో భాగంగా గత చట్టాల్లో ఉన్న లోపాలు పునరావృతం కాకుండా పరిశీలన జరుపుతోంది. -
హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వీసీల నియామకాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని వర్సిటీలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీలను నియమించడమే తప్పన్నారు. నిబంధనలు, విధి విధానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను కొట్టేసినా, పలు అంశాలపై మొట్టికాయలు వేసినా రాష్ట్రప్రభుత్వానికి సిగ్గు రావట్లేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను కోర్టులే తప్పు పడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. -
'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'
-
'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'
హైదరాబాద్: వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. కేసు పెండింగ్లో ఉండగా నియామకాలు ఎలా చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు, మూడు రోజులు ఆగలేరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు రిజర్వులో ఉంచింది. తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రవీణ్ రావులను నియమించారు.