-
ఆదర్శనీయం వంగపండు జీవితం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు జీవితం ఎందరికో ఆదర్శనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బుధవారం వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..సాంస్కృతిక, కళా రంగానికి వంగపండు జీవితం అంకితం చేశారని చెప్పారు. ప్రజాకవి గుమ్మడి విట్టల్రావు (గద్దర్) మాట్లాడుతూ..కళాకారులంతా వంగపండు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. వంగపండుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని గౌరవం కల్పించిందన్నారు. ఆయన చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని గుర్తుచేశారు. బీచ్రోడ్డులో వంగపండు విగ్రహం ఏర్పాటుకు చర్యలు, ఏటా ఆయన పేరిట ఓ కళాకారుడికి రూ.2 లక్షల నగదు అవార్డు ప్రదానం చేయడం మంచి నిర్ణయమన్నారు. కళాకారులకు సీఎం వైఎస్ జగన్ ఎంతో గౌరవం ఇస్తున్నారంటూ సభాముఖంగా సెల్యూట్ చేశారు. గద్దర్, ఆర్.నారాయణమూర్తి, విమలక్క తదితరులు తమ ఆటపాటలతో అలరించారు. బాడ సూరన్నకు అవార్డు ప్రదానం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్నకు జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం తరఫున అందించారు. బాడ సూరన్న మాట్లాడుతూ..తన 36 ఏళ్ల జీవితంలో కళను, కళాకారుడిని ఇంతలా గౌరవించిన ప్రభుత్వం మరొకటి చూడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైరపర్సన్ వంగపండు ఉష, వీఎంఆర్డీఏ చైరపర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్కుమార్, రాష్ట్ర విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
సిక్కోలు పొద్దుపొడుపు వంగపండు
సిక్కోలు సమరాన ధిక్కార స్వరమొకటి విశాఖ ఉక్కయిన ఆంధ్రుల హక్కొకటి ఎడతెగని సంద్రాన ఎదురెల్లె నావొకటి అడిగాయిలే నిన్ను వంగపండూ– నీ కలము నుండి జారి పడుకుంటూ జానెడు కడుపునకై దారబోసిన చెమట దేహమే కంజరయి ధన ధన సప్పుడట కాళ్లగజ్జెలు ఘల్లు నెమలితో పోటీపడి చేతి అందెల మోగె వంగపండు– నీ గుండె చప్పుడును వినుకుంటూ ఏం పిల్లడోయని ఎలుగెత్తి పాడినా ఎల్దమస్తవంటు రమ్మని అడిగినా యంత్రాల పాటతో మంత్రముగ్దుల జేసె కథ జెప్తవా వింటాను వంగపండు– నా రెండు కండ్లు జూస్తె చాలకుండూ ఎవరు దోసుకు పోని ఆటపాటల మూట ఆస్తులుగ పిల్లలకు పంచిపోయావంట సీమల దండులో సిలుకలా గుంపులో సాగిపోతివ నీవు వంగపండు వంగె పొద్దులో వర్ణాలు జూసుకుంటూ కాలమే కడుపుతో కన్నకవులెందరో మేరిమి కొండల్లో మెరుపులింకెందరో జముకు జనరాగంగా అందియలు మోగంగ ఉర్రూతలూగెనట ఉత్తరాంధ్ర– నీ చరితనే దేశము చదువుతుండా సలాములే నీకు వంగపండు – పాట సలాములె నీకు వంగపండు లాల్సలాములే నీకు వంగపండు– ఆట సలాములే నీకు వంగపండు – మిత్ర (నేడు విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి) -
వంగపండుకు సుస్థిర స్థానం
మార్పు కోసం తూర్పు కొండల్లో ఉదయించిన ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావుకు ఏపీ ప్రభుత్వం విశేష గుర్తింపునిచ్చింది. ఆయన పేరుమీద జానపద పురస్కారం ఏర్పాటు చేయటమేకాక, నిరుపేద జీవితం గడిపిన ఆయన కుటుంబానికి పదిలక్షల పారితోషకం అందిస్తూ సాంస్కృతిక శాఖ జీఓను విడుదల చేసింది. వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న ప్రతి ఏటా పురస్కారం ఇచ్చేందుకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేసిన వంగపండు,ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా పలు ప్రదర్శనలు ఇచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, యంత్రమెట్ట నడుస్తున్నదంటే వంటివి విశేష ఆదరణ పొందాయి. 300కి పైగా జాపపదాలు రచించారు. బాణీకట్టి, తానే స్వయంగా కాలికి గజ్జెకట్టి ఆడి, పాడే ఆయన తెలియనివారు ఎవరూ ఉండరు. పార్వతీపురం దగ్గర్లోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఎంత సంచలనం కలిగించింది. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమ కళాకారులలో ఆయన అగ్రగణ్యులు. ప్రజాకళాకారుడు. మూడు వందల పాటల సృజనతో, ఎడతెగని ప్రదర్శనలతో, ఏళ్ల తరబడి ఆడిన నాటకాలతో వంగపండు తన సాహిత్య, కళా, ప్రజాజీవితాన్ని సుసంపన్నంగా గడిపారు. నిజమైన అర్థంలో కార్మిక కవి. ‘జజ్జనకరి జనారే... ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..’, యంత్రమెట్టా నడుత్తు ఉందంటే’, ఓడా నువ్వెళ్లిపోకే’, ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’... ‘ఉందర్రా మాలపేట’ వంటి పాటలు ప్రజాబాహుళ్యంలో ఉర్రూ తలూగిం చాయి. వంగపండు దళితసంవేదనను పలికించారు. కుల నిర్మూలన భావజాలంతో గజ్జెకట్టి ఆడిపాడారు. భూమిభాగోతం – వంగపండు రాసిన నృత్యరూపకం. ఈ రూపకాన్ని తెలుగునేలపై ఎన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారో తెలియదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి, అదే సమయంలో సాహిత్య కళా రంగాలలో గొప్ప వారసత్వమున్న ప్రాంతానికి, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వంగపండు చరిత్రలో చిరస్థానాన్ని సాధించుకున్నారు. అటువంటి మహా కళాకారుడికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అత్యున్నత గుర్తింపు ఇవ్వడమేకాక, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు (04–08–2021న వంగపండు ప్రథమ వర్థంతి సందర్భంగా) -
‘విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement