breaking news
United National Liberation Front
-
Manipur violence: మణిపూర్లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు. కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్లోని 12 మంది జూన్లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
మణిపూర్లో 11 మంది తీవ్రవాదులు అరెస్ట్
మణిపూర్లో భద్రతదళాలు వివిధ ప్రాంతాలల్లో నిర్వహించిన కూంబింగ్ అపరేషన్లలో 11 మంది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇంఫాల్ సరిహద్దులోని భారత్-మయన్మార్ సరిహద్దు దాటుతున్న ఐదుగురు తీవ్రవాదులను 24వ అసోం రైఫిల్ బెటాలియన్కు చెందిన సైనికులు అరెస్ట్ చేశారని చెప్పారు.వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి ఎం.16 రైఫిల్స్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిన్న సాయంత్రం ఉర్కల్ జిల్లాలోని అసంగ్ కులెన్ ప్రాంతంలో యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కంగ్లీపక్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు తీవ్రవాదులను తబొల్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే కూకి నేషనల్ ఆర్మీకి చెందిన తీవ్రవాదిని చురాచంద్పూర్ జిల్లాలో అరెస్ట్ చేసి, అతని వద్ద పిస్టల్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన్టుల వివరించారు. వారందరిని ఇంఫాల్ పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు అసోం పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.