breaking news
unemloyees dharna
-
హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్..!
హైదరాబాద్: 'హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రిలీజ్ చేశారు. ఈ రోజు(శనివారం, జూన్ 28) తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్ను హరీష్ రావు విడుదల చేశారు. దీనిలో భాగంగా హరీష్ రావు మాల్లాడుతూ.. ‘ ఉస్మానియా యూనివర్శిటీ, అశోక్ నగర్ నుంచి పెద్ద ఎత్తును నిరుద్యోగులు తెలంగాణ భవన్కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జూలై 4వ తేదీన ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం కార్యక్రమంకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.నిరుద్యోగుల ఛలో సచివాలయంకు CPM పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. బీఆర్ఎస్ హయంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ ఇది దగా క్యాలెండర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు.ఎన్నికల సమయంలో ఇందిరమ్మ నమరాలుగా మాట ఇస్తున్న అని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు.యూత్ డిక్లరేషన్ లో 5 అంశాల చెప్పిన ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీ అంటే నాకు ఇష్టమని చెప్పిన ప్రియాంక గాంధీ, మహిళ స్టూడెంట్స్ కి ఇస్తామన్న స్కూటీ ఏమైందొ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చెప్పిన ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నిరుద్యోగ భృతి అతి గతి లేదు. యూత్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చిన ప్రియాంక గాంధీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మొట్టి కాయలు వెయ్యడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనురి మురళీ, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుంది. నిరుద్యుగులరా మీరు పోరాడుతూనే ఉండండి. మీ న్యాయ బద్ధమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ ఇస్తుంది. రేపటి తరమైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు నిరుద్యోగుల ధర్నా
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక సభ్యులు శుక్రవారం బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ట్రస్ట్భవన్ ముట్టడికి యత్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు... కానీ ఆ తర్వాత బాబు వచ్చాడు జాబు పోయింది అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రస్ట్ భవన్ ముందు బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అనే హామీని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు వీరిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్.గోవిందరావు, పలువురు నేతలు, నిరుద్యోగులు ఉన్నారు.