uma krishnan
-
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
త్రిష రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ తల్లి!
హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని, అందుకు ఓ స్టార్ వెనకుండి సాయం చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్తపై తాజాగా త్రిష తల్లి ఉమ కృష్ణన్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది. అంతేకాక, ప్రస్తుతం తను సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని, పలు భాషల్లో సినిమాలు చేసేందుకు సమాయత్తమవుతోందని చెప్పుకొచ్చింది. మరోవైపు త్రిష కూడా ఇలాంటి రూమర్లు ఎక్కడినుంచి వస్తాయని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు పాలిటిక్స్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదని సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్రిష చివరగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. చదవండి: ఆమె పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు ఓటీటీలో రాజ్కుమార్ రావు హిట్, స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! -
త్రిష ఆరోగ్యంపై వదంతులే!
హీరోయిన్ త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, ఆమె ఆస్పత్రిలో చేరారనే ప్రచారం చిత్రపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. మూడు పదుల వయసులోనూ.. నటిగా బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో మోహిని, గర్జన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కాగా మిగిలినవి కమర్షియల్ నాయకి పాత్రలు. వీటిలో ఒక మలయాళ చిత్రం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు మంగళవారం గుప్పుమన్నాయి. దీంతో పలువురు అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు పత్రిక కార్యాలయాలు ఫోన్ చేసి వివరణ కోరడం జరిగింది. దీంతో కోలీవుడ్లో కలకలమే చెలరేగింది. అయితే అవన్నీ వదంతులేనని త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. త్రిషపై వచ్చిన ప్రచారంలో నిజం లేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని, ప్రస్తుతం మలేషియాలో అరవిందస్వామికి జంటగా సతురంగవేట్టై–2 చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.


