-
ఉదయగిరి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. కారణం ఇదేనట!
డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఛస్తే సరిపోదు. ఆ విషయమే పాపం ఓ ఎన్.ఆర్.ఐ. కి ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇపుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫండ్ కింద కొంత..టికెట్ కోసం కొంత చొప్పున ఈ ఎన్.ఆర్.ఐ. నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బానే లాగేశారట. విదేశాల్లో సంపాదించుకున్నది జన్మభూమిలో ఉట్టి పుణ్యాన పోగొట్టుకోవలసి వచ్చిందని ఇపుడా నేత భోరు మంటున్నారు. ఎవరా నేత? ఏమా ఏడుపు కథ? టీడీపీ స్థాపించిన కొత్తలో చాలా మంది డాక్టర్లు, న్యాయవాదులను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిలో చాలా మంది తమకున్న అద్భుతమైన ప్రాక్టీసులు వదులుకుని రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి రాజకీయాలకూ.. తమ వృత్తులకూ పనికిరాకుండా పోయారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్.ఆర్.ఐ.లపై పగ బట్టినట్లు కనిపిస్తోంది. ప్రవాస భారతీయులను పిలిచి అరచేతిలో రాజకీయ వైకుంఠం చూపించిన చంద్రబాబు కోట్లకు కోట్లు గుంజి టికెట్లు అంటగట్టారు. రాజకీయాల్లో అదరగొట్టేద్దామని వచ్చిన ఎన్.ఆర్.ఐ.లకు ప్రచారం మొదలైన తర్వాత అసలు పిక్చర్ కనిపిస్తోంది. తాము అనవసరంగా టికెట్లు కొన్నామని వారు చిందులు తొక్కుతున్నారు. అటువంటి కొద్ది మంది అభాగ్యుల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్ను కోట్లు పోసి కొనుక్కున్న ఎన్.ఆర్.ఐ. కాకర్ల సురేష్ అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తన అనుచరులతో చెప్పుకుని పెడబొబ్బలు పెడుతున్నారు.ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావుకు టికెట్ ఇస్తామని చివరి నిముషం దాకా ఊరించిన చంద్రబాబు చివర్లో సూట్ కేసులతో వచ్చిన ఎన్.ఆర్.ఐ. సురేష్కు టికెట్ ప్రకటించారు. దీంతో బొలినేని వర్గం ఆగ్రహంగా ఉంది. సురేష్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. సురేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొలిననేని రావడం లేదు. తన వర్గీయులను కూడా వెళ్లద్దని చెబుతున్నారట. నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ఉదయగిరిలో ప్రచారానికి వచ్చినపుడు సురేష్తో కలిసి తిరిగారు. ఎక్కడా జనం లేకపోవడంతో వేమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.రోజులు గడుస్తోన్న కొద్దీ ఉదయగిరిలో గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో సురేష్లో టెన్షన్ మొదలైందంటున్నారు. ఓడిపోయే సీటును ఎందుకు కొనుక్కున్నామా అని కాకర్ల సురేష్ తలపట్టుకుంటున్నారట. ఇపుడు టికెట్ వద్దంటే డబ్బులు వెనక్కి రావు. గోడకి కొట్టిన సున్నంలా టీడీపీకి చదివించుకున్న కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చినట్లే. -
ఇప్పుడు బాబును కలవడానికి కుదరదయ్యా..!
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని వెంకటరామారావును కాదని చంద్రబాబు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు ఇవ్వడంతో బొల్లినేని, అతని వర్గీయులు గత పది రోజులుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధిష్టానం తన ప్రకటనను వెనక్కి తీసుకుని టికెట్ మార్చకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని, కాకర్లకు సహకరించేది లేదని బొల్లినేని బహిరంగంగా ప్రకటించారు. దీంతో పార్టీలో రాజుకున్న వివాదం, క్యాడర్లో తీవ్ర ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి. బొల్లినేని పంచాయితీ తేలకపోవడం, నెల్లూరులో చంద్రబాబు సభకు బొల్లినేని వర్గీయులు డుమ్మా కొట్టడంతో ఆయన తీరుపై అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బొల్లినేనికి దొరకని అపాయింట్మెంట్ గత వారం రోజులుగా చంద్రబాబును కలిసేందుకు బొల్లినేని చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఉదయగిరిలో అనుచరుల సమావేశం తర్వాత చంద్రబాబును కలిసి టికెట్ ఓకే చేసుకుని వస్తానని చెప్పిన 12 గంటల లోపే కాకర్ల పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్కు గురయ్యారు. అనంతరం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చంద్రబాబే బొల్లినేనికి ఫోన్ చేసి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినా ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బొల్లినేని కలిగిరిలో గత నెల 28వ తేదీన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలకు వివరించి చంద్రబాబును కలిసి తాడోపేడో తెల్చుకుని వస్తానని ప్రకటించారు. తర్వాత తమ అధినేతను కలిసే ప్రయత్నం చేస్తున్నా అవకాశం రావడం లేదు. ఉద్దేశపూర్వకంగా అపాయింట్మెంట్ లేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాడర్లో ఉన్న ఆగ్రహావేశాలను తగ్గించి బొల్లినేనిని తన దారిలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు వ్యూహంగా ఉన్నట్లు కొంతమంది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సోమ, మంగళ వారాల్లో బాబు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని బొల్లినేని వర్గీయులు చెబుతున్నారు. నెల్లూరులో జరిగిన చంద్రబాబు సభకు బొల్లినేని తన అనుచరులు రాకుండా అడ్డువేయడంపై కూడా అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే భయం కూడా టీడీపీ క్యాడర్లో నెలకొంది. -
సామాజిక విప్లవ సారథి జగన్కు జేజేలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, బాపట్ల/సాక్షి, కడప: సామాజిక విప్లవ సారథి వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు మూడో రోజు శనివారం ప్రజలు నీరాజనం పలికారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర శనివారం విశాఖ జిల్లా భీమిలి, బాపట్ల జిల్లా బాపట్ల, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ బస్సు యాత్ర సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల్లో జరగనుంది. బాపట్లలో అపూర్వ స్పందన బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, సంగుపాలెం కోడూరు గ్రామాల మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు చందోలులోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరింది. అక్కడ అమ్మవారికి నేతలు పూజలు చేశారు. పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్య, వైద్యం తదితర విభాగాల్లో జరిగిన అభివృద్ధిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల చేరుకుంది. నియోజకవర్గంలోని యువకులు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేశారు. అంబేడ్కర్ సెంటర్లో సభ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలును మంత్రులు వివరించిన సమయంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జనసంద్రంగా మారిన పసిడిపురి పసిడిపురి ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర జనజాతరలా సాగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్ రోడ్డు మీదుగా రామేశ్వరం వైపు సాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి బస్సు ముందు నడుస్తుండగా మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేశారు. రామేశ్వరంలోకి బస్సు చేరుకోగానే బాణాసంచా కాల్చారు. వన్టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. రాజీవ్ సర్కిల్ వద్ద ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్లో అసంఖ్యాక జనం మధ్య బహిరంగ సభ జరిగింది. దసరా ఉత్సవాలకు పసిడిపురి పెట్టింది పేరు. భారీ స్థాయిలో ప్రజానీకం వీటిని వీక్షిస్తుంటారు. శనివారం సామాజిక సాధికార యాత్ర కూడా ఇదే ఉత్సవాలను తలపించింది. శివాలయం సెంటర్ నుంచి కనుచూపు మేర రోడ్డుకు ఇరువైపులా ప్రజానీకం నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. భీమిలిలో 2వేల బైక్లతో భారీ ర్యాలీ భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఎండాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగా ర్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను నాయకులు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆనందపురం మండలం బోయిపాలెం కూడలి నుంచి 2 వేలకు పైగా బైక్లు, వందకు పైగా కార్లతో ర్యాలీగా యాత్ర ప్రారంభమై హైవే మీదుగా తగరపువలస చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అక్కడ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి బహిరంగ సభ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళర్పించి మంత్రులు ప్రసంగించారు. -
‘చంద్రశేఖర్రెడ్డి.. మా దెబ్బేంటో చూపిస్తాం ఆగు’
సాక్షి, నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వంచనపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. పార్టీ ద్రోహి చంద్రశేఖర్రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్రెడ్డి వర్సెస్ వైఎస్సార్సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు చంద్రశేఖర్రెడ్డిపై పార్టీ నేత మూల వినయ్రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్రెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. మరో నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్రెడ్డికి పది ఓట్లు కూడా రావన్నారు. ఇక జిల్లా ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్రెడ్డిని నిలదీశారు. -
బొల్లినేనికి ఓట్లు అడిగే హక్కు లేదు
సాక్షి, ఉదయగిరి: ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గత ఎన్నికల సమయంలో ఉదయగిరి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలను ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే బొల్లినేనికి లేదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఉదయగిరిలోని బీసీ కాలనీ, చాకలివీధి, పూసలకాలనీ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చాకలివీధిలో ఏర్పాటు చేసిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రచారానికి వచ్చే టీడీపీ నాయకులను ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నించాలన్నారు. గత ఎన్నికల సమయంలో బొల్లినేని అండర్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తానని, నీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు తీర్చలేదన్నారు. టీడీపీని సాగనంపేందుకు ఓటర్లు నడుం బిగించాలన్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే వెలుగొండ, సోమశిల జలాలను ఉదయగిరి ప్రాంతానికి తీసుకొచ్చి సాగు, తాగునీటి సమస్య లేకుండా తనవంతు కృషి చేస్తానన్నారు. టీడీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచుకుని దాచుకోవడమే అలవాటై పోయిందన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఉదయగిరి ప్రాంతం తమ సోదరుల హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని మేకపాటి కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీగా ఎక్కువ అబద్ధాలు చెప్పింది బొల్లినేనినే అని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు ఇంతవరకు ఎమ్మెల్యే బొల్లినేని తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని చెప్పారని, తాము ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని మేకపాటి తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అందుబాటులో ఉండే సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, నాయకలు మూలె సుబ్బారెడ్డి, అక్కుల్రెడ్డి, షంషీర్, మట్ల లక్ష్మయ్య, వెంగళరెడ్డి, మధు, హరి, సలీం, జబ్బార్, లియాఖత్అలీ, ముర్తుజా హుస్సేన్, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేలటూరులో.. ఉదయగిరి మండలంలోని నేలటూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పెండేల లక్ష్మీనరసయ్య ఆధ్వర్యం లో ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెండేల రవీంద్ర, మోహనరావు, సుబ్బారావు, బూరగ లక్ష్మీనరసయ్య, మాల్యాద్రి, పతకమూరి రాములు, జానకిరాం, మేడేపల్లి సుబ్బారావుతోపాటు 30 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో రమణయ్య, రత్నం, శ్రీనివాసులు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement