breaking news
trslp meet
-
అలా కేసీఆర్ చేస్తే తప్పేంటి?: తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కొందరంటున్నారు. వారిని ఎవరైనా నామినేట్ చేశారా? ప్రజలు ఎన్నుకుంటే గెలిచారు. సీఎం అనే గౌరవం లేకుండా కొందరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు, కేటీఆర్ కుమారుడిని కూడా దూషించే నీచస్థాయికి దిగజారారు’అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘మాకు కూడా తిట్టడం తెలుసు. నోరుంది కదా అని మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సరైనరీతిలో బుద్ధి చెప్తారు’అని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్తో కలసి శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాయలయంలో మీడియాతో మాట్లాడారు. ‘బాధ్యతాయుత పదవిలో ఉంటూ రేవంత్రెడ్డి అసభ్య పదజాలం వాడుతున్నారు. కేసీఆర్ వరి పండిస్తే తప్పేంటి, ఆయన పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రశ్నించాలి. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎక్కడ ఉన్నారు’అని విమర్శించారు. తెలంగాణకు నిధులివ్వని కేంద్రం అవార్డులు మాత్రం ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని తలసాని అన్నారు. బీజేపీ ఇన్చార్జి తరుణ్చుగ్ సొంత రాష్ట్రం పంజాబ్లోనే ఆ పార్టీకి దిక్కులేదని ఎద్దేవా చేశారు. -
రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్..!
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన రాజ్భవన్కు వెళ్లారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లినట్లు సమాచారం. బుధవారం ఉదయం టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే జిల్లాలు 683 ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. దేశ వ్యాప్తంగా జిల్లాల్లో సగటు జనాభా 18.3లక్షలు అని అన్నారు. కానీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇది 36లక్షలు ఉందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటుపై అవసరమైన సూచనలు చేయండని కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఈలోగా ఆయనకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ రావడంతో సమావేశం మధ్యలో వెళ్లిపోయారు.