breaking news
trs-mim
-
మళ్లీ టీఆర్ఎస్, మజ్లిస్ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ను నేను, మా పార్టీ కేవలం సీఎంగా చూడం. ఆయనకు ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. తెలంగాణను సాధించడం మామూలు విషయం కాదు. మేం కూడా తెలంగాణ ఏర్పాటులో పాలుపంచుకున్నామని కొందరు అంటారు. కేసీఆర్ శక్తి సామర్థ్యాలు, ప్యూహం కారణంగా మేం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక తప్పలేదు. మేం తెలంగాణ ఇచ్చామని ఎవరైనా అంటే, మీరు ఇవ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎవరి విజయం? మేము సాధించాం. మా లీడర్ ఇచ్చింది. మా ప్రభుత్వం ఇచ్చిందని ఎవరైనా అంటే.. మీకో ప్రశ్న మీరు మీ లీడర్కు ఏం ఇచ్చారు?’ అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ సుదీర్ఘంగా మాట్లాడారు. కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఆలకించారు. ‘2019లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సవాలే లేదు. మజ్లిస్, టీఆర్ఎస్లు కలసి మళ్లీ అధికారంలోకి వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా తుడిచిపెట్టుకుపోయారో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. 2024లోనూ మాదే అధికారం. అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాలం గడి పే రోజులు పోయాయి. ఇది సోషల్ మీడియా కాలం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని కాంగ్రెస్కు అక్బర్ కౌంటర్ ఇచ్చారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలు, ఇతర మైనారిటీల సంక్షేమానికి ఎంతో కృషిచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఇదంతా ఆయన వ్యక్తిగతంగా చేసినదే. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన కార్యా ల ఘనతను ఇవ్వలేం. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా అమలు చేయలేదు’ అని అన్నారు. ఫలిస్తున్న ముస్లింల ఆశలు.. ‘ముస్లింలు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీల కంటే వెనకబడి ఉన్నారని సచార్, కుందు, గోపాల్ కమిటీలు నివేదించాయి. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో అన్యాయానికి గురైంది ముస్లింలే. ముస్లింలనే రెండో తరగతి పౌరులుగా చూశా రు ఇనాం, జాగిర్ అబాలిషన్, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాల కింద ముస్లింలు భూములు కోల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ముస్లింల చదువులు, అభివృద్ధి కోసం కేటాయించిన వేల ఎకరాల వక్ఫ్ భూములను గత ప్రభుత్వాల హయాంలో కబ్జా చేసి తెగనమ్మాయి’ అక్బరుద్దీన్ విమర్శించారు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు తమకు ఆశాకిరణంగా కనిపించిందన్నారు. ఆ ఆశలు ఆడియాశలు కాలేదని, కేసీఆర్ నేతృత్వంలో ముస్లింల ఆశలు, ఆశయాలు ఫలిస్తున్నాయని అన్నారు. ప్రవేశ పరీక్షల్లో 10 వేల ర్యాంక్లోపు సాధించిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని కాంగ్రెస్ పాల కులు పోతుపోతూ మెలిక పెట్టారన్నారు. ర్యాం కులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇస్తామని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య స్కాలర్షిప్లు ప్రకటించారన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు.. ముస్లింలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా అన్ని అభివృద్ధి ఫలాలు అమలు చేయా లని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ అందరినీ ఒకే దృష్టి తో చూసే నాయకుడని ప్రశంసించా రు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ను సాధించగలమనే ధీమాతో ఉన్నానన్నారు. కాంగ్రెస్ సభ్యులు అడ్డుప డగా, 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని మండిపడ్డారు. మీకు 70 ఏళ్లు పాలించేందుకు అవకాశం దొరికితే ఏం ఇచ్చారు? బాబ్రీ మసీదును కూల్చి ఇనాంగా ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. ఏ రాష్ట్రంలోనైనా మైనారిటీల కోసం 200కు పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా? ఇది విజయం కాదా? వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది. వక్ఫ్ కమిటీ ఏర్పాటు చేశారు. తమ విజ్ఞప్తిపై 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ను ప్రశంసల్లో ముంచెత్తారు. 600 మంది ముస్లిం విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో విదేశీ విద్య చదువుకుంటున్నారని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ముస్లింలకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. ముస్లిం నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల కోసం 1.22 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీరికి రూ.150 కోట్లు విడుదల చేసిన తర్వాతే కొత్త దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు సీజ్కు మద్దతు తెలంగాణ వక్ఫ్ బోర్డును సీజ్ చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అక్బరుద్దీన్ స్వాగతించారు. బోర్డులో అవకతవకలపై దర్యాప్తు జరగాలని అన్నారు. వక్ఫ్ బోర్డును లూటీ చేసిన వారిపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపి శిక్షించాలన్నారు. -
మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు?
చట్టం మేరకు సెప్టెంబర్లోనే ఎన్నికలు అంతకన్నా నెల రోజుల ముందు నోటిఫికేషన్ సన్నద్ధమవుతున్న పార్టీలు సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా చల్లారనే లేదు. త్వరలోనే నగరంలో మరో ఎన్నికల వేడి రాజుకోనుంది. రాబోయే మూడు మాసాల్లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు వివిధ రాజకీయ పార్టీలు గ్రేటర్పై (జీహెచ్ఎంసీ కార్యాలయంపై) తమ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలో నెగ్గిన టీఆర్ఎస్తోపాటు తెలుగుదేశం, బీజేపీ తదితర పార్టీలు సైతం రాబోయే రోజుల్లో కార్పొరేషన్ తమ చేతిలోకే వస్తుందని చెబుతున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ సైతం జీహెచ్ఎంసీపై దృష్టి పెడతామని ప్రకటించారు. టీఆర్ఎస్- ఎంఐఎం నేతల మధ్య ఇటీవల జరిగిన విందు సందర్భంగా సైతం జీహెచ్ఎంసీయే ముఖ్యాంశంగా నిలిచింది. ఇలా.. ఏ కోణంలో చూసినా ఏ పార్టీకా పార్టీ జీహెచ్ఎంసీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. పాలకమండలి గడువు డిసెంబరు 3 జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే నవంబర్- డిసెంబర్ మాసాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయనేది ఆయా పార్టీల అంచనాగా ఉంది. జీహెచ్ఎంసీ చట్టం .. నిబంధనల మేరకు పాలకమండలి గడువు ముగియడానికి మూడు నెలల ముందు నుంచి గడువు తేదీలోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ నిబంధన మేరకు సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్లోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుంది. పోలింగ్కు నెలరోజుల గడువుతో నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి జీహెచ్ఎంసీని గుండెకాయగా భావిస్తున్న టీఆర్ఎస్కు రాష్ట్రంలో అధికార పగ్గాలు లభించినప్పటికీ, కార్పొరేషన్లో ఇంతవరకు ఉనికే లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పార్టీ ముఖ్యనాయకులు కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకుగాను కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తూనే ఎంఐఎంతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర అవగాహనతో జీహెచ్ఎంసీలో నెగ్గి అధికారాన్ని పంచుకున్నాయి. ఈసారి కాంగ్రెస్ స్థానంలో టీఆర్ఎస్ వచ్చే అవకాశాలున్నాయి. లేదా ఏక పక్షంగానే కార్పొరేషన్లో నెగ్గేందుకు ఉన్న అవకాశాలను టీఆర్ఎస్ అంచనా వే స్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే.. మూడు నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలా కాకుండా కొంతకాలం వేచి చూశాక కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటే మాత్రం పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలకు వెళ్తుంది. రెంటిలో ఏది తమకు ఎక్కువ అనుకూలంగా ఉంటే దానికి మొగ్గు చూపనుంది. పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు నిర్వహిస్తే.. ఈలోగా ఓట్ల జాబితా సవరణ.. డూప్లికేట్ల తొలగింపు తదితర కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్లోనే ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్నికలన్నీ ముగిసి పాలనకు అనువుగా, ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించేందుకు వీలుంటుందన్న అభిప్రాయాలున్నాయి.