breaking news
TRS guarantees
-
టీఆర్ఎస్ హామీలే మనకు ఆయుధాలు
• టీపీసీసీ వ్యూహరచన • ఇంటింటికీ తిరుగుదాం... వాస్తవాలేమిటో చెబుదాం • డిసెంబర్ మొదటి వారంలో సోనియా లేదా రాహుల్ రాక సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్రావు హామీలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అమలుకు నోచుకోని హామీలను ఆయుధాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. రైతులకు, విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలే ఆయుధాలుగా చేసుకుని పోరాడాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో వ్యూహరచన కమిటీ గురువారం సమావేశమైంది. ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియాతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రుణమాఫీ చేయాలని రైతులతో, ఫీజు రీయింబర్స్మెంటు చేయాలని విద్యార్థులతో దరఖాస్తుల ఉద్యమాన్ని నవంబర్లో చేపట్టాలని తీర్మానించారు. ప్రతీ రైతును, విద్యార్థిని కలసి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు, చేసిన మోసం గురించి వివరించాలని నిర్ణయించారు. ‘ఫీజులను రీయింబర్స్మెంటు చేయకుండా ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను, వాటిల్లోని సిబ్బందిని ఎందుకు కష్టపెడుతున్నారు. వీటికి సంబంధించి కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను ఆయుధంగా చేసుకుంటాం’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడు వెల్లడించారు. రైతులు, విద్యార్థులు ఇచ్చిన దరఖాస్తులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేతుల మీదుగా రాష్ట్రపతికి అందజేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న రైతు ఉద్యమం, ప్రభావాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొప్పుల రాజు ఈ సమావేశంలో వివరించారు. నియోజకవర్గాలవారీగా ఏఐసీసీ నిఘా ఏఐసీసీ కనుసన్నల్లో జరుగుతున్న రైతు, విద్యార్థి ఉద్యమాల్లో క్షేత్రస్థాయిలో పనితీరుపై ఏఐసీసీ నిఘా వేసిందని నేతలు తెలిపారు. నియోజకవర్గాలవారీగా నాయకుల పనితీరు, లోపాలపై ఏఐసీసీ పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. పనితీరును బట్టి నాయకుల భవిష్యత్తు ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. రైతు, విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన ప్రచారంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వినూత్నంగా ప్రచారం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై పలు అడ్వర్టైజింగ్ సంస్థల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలో ఒకరు రాష్ట్రానికి రానున్నారు. రైతు, విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన ఉమ్మడిసభను తెలంగాణలో నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. దీనికి సోనియా లేదా రాహుల్ను వస్తారని ముఖ్యనేతలు వెల్లడించారు. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు మధుయాష్కీ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, డి.కె.అరుణ, సబితాఇంద్రారెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలపై నిలదీయండి
- సామాజిక తెలంగాణ ఇదేనా..? - ఇంటికో ఉద్యోగం ఏదీ? - అల్లుడొచ్చి 11 నెలలైంది.. ఇల్లు ఎక్కడ? - టీఆర్ఎస్పై మాజీ ఉప ముఖ్యమంత్రి ఫైర్ పుల్కల్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. శనివారం మండల పరిధిలోని శివ్వంపేట, అంగడ్పేట గ్రామాలను సందర్శించారు. అనంతరం నవయుగ యూత్ 15వ వార్సికోత్సవంలో దామోదర మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అమాయక ఓటర్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హామీలను విస్మరించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేదలు ఇరుకు ఇండ్లల్లో ఉంటున్నారని.. పండుగకు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదని అందుకోసం టీఆర్ఎస్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి 11 నెలలైంది. అల్లుడు ఎక్కడ పడుకోవాలని సీఎం చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకున్నా ఆయన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు సంపాదించుకున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలపై ఆలోచింప చేసే బాధ్యత యువతపై ఉందన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ మారిన నాయకునికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే యువకులు గెలిపించారన్నారు. తాను ఈ నియోజవర్గ ప్రజలు ఊహించని విధంగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చానన్నారు. ఫలితంగా రూ.1400 కోట్లతో భవ నాలు నిర్మాణం కావడంతో ఈ ప్రాంత రూపురేకలు మారిపోయాయని భూముల రేటు పెరిగిందన్నారు. జేఎన్టీయూ కావాలని ఎవరూ అడగలేదు? వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల కావాలని, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కావాలని అడుగకుండానే నియోజకవర్గ అభివృద్ధి కోరి తీసుకొచ్చానని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శివ్వంపేట నుంచి వెంకటకిష్టాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ రాంచెంద్రారెడ్డి, మాజీ జె డ్పీటీసీ మ ల్లప్ప, పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నవయుగ యూత్ జిల్లా అధ్యక్షుడు సదానందం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకునికి పరామర్శ... మండల పరిధిలోని మిన్పూర్ మాజీ సర్పంచ్ పాండును దామోదర రాజనర్సింహా పరామర్శించారు. శనివారం మండల పర్యటనకు వచ్చిన ఆయన మండల కాంగ్రెస్నాయకుడు, మిన్పూర్ మాజీ సర్పంచ్ పాండు కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.