-
నేడు ఆన్లైన్ విధానం ప్రారంభం
అనంతపురం సెంట్రల్: రవాణాశాఖలో డ్రైవింగ్ లైసెన్స్లు ఆన్లైన్ ద్వారా తీసుకునే విధానాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉపరవాణా కమిషనర్ సుందర్వద్దీ తెలిపారు. ఎస్కేయూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి విద్యార్థులకు తొలిసారిగా ఆన్లైన్ద్వారా ఎల్ఎల్ఆర్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సదరు కళాశాలతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్లకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలుత ఆన్లైన్లో 24 గంటల్లోనే ఎల్ఎల్ఆర్లు మంజూరు చేస్తామని వివరించారు. -
నేడు నుంచే ఆన్లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్
అనంతపురం సెంట్రల్: ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి ఆన్లైన్లో ఎల్ఎల్ఆర్లు పొందే నూతన విధానాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్ సుందర్వద్దీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్ మంజూరు చేసి నూతన ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ మేళా పాల్గొని ఎల్ఎల్ఆర్ పొందాలని కోరారు. -
గూగూడుకు బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి కుళ్లాయిస్వామి ఉత్సవాలు రాత్రికి స్వామివారి ప్రథమ దర్శనం ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు నార్పల: రాష్ట్రంలోనే మొహర్రం ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఏటా మొహర్రం నెలలో ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప పాతెహ చదివింపులు నిర్వహించనున్నారు. ఇక స్వామివారి పంజాలను ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఉత్సవమూర్తులను తిరుమల కొండారెడ్డి వంశీకులు ఊరేగింపు నిర్వహించనున్నారు. క్షేత్ర ప్రాశస్త్యం పూర్వం నార్పల సమీపంలోని ఓ ప్రాంతంలో గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముని కోసం తపస్సు చేయగా...అరణ్యవాసం వెళుతున్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై గుహుడి ఆశ్రమం సందర్శించి అతని ఆతిథ్యం స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత అయోధ్యకు వెళ్లే సమయంలో తిరిగి ఆశ్రమానికి వస్తానని శ్రీరాముడు మాట ఇవ్వగా...అప్పటి నుంచి గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడట. అయితే శ్రీరాముడి వనవాసం పూర్తయినా తన ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన గుహుడు ఆత్మార్పణం చేసుకునేందుకు ఓ అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులో దూసేందుకు సిద్ధమవగా...తన దూరదృష్టితో ఇది గమనించిన శ్రీరాముడు...ఆంజనేయుడిని గుహుడి దగ్గరకు పంపి తాను వస్తున్న వర్తమానం అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీతా, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ వెళ్తూ గుహుడి ఆశ్రమాన్ని సందర్శించి ఆతిథ్యం స్వీకరించాడట. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరి వెళ్లగా... ఆంజనేయస్వామి అక్కడే నిలిచిపోగా...ఆయనకు గుడికట్టించారని పురాణాలు చెబుతున్నాయి. గుహుడు ఆత్మార్పణం కోసం సిద్ధం చేసుకున్న అగ్నిగుండమే నేడు ఆలయం ఎదుట ఉన్న గుండమని భక్తులు చెబుతున్నారు. అందుకే ఇక్కడివచ్చే భక్తులు తప్పకుండా ఈ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఉత్సావాలు సాగేదిలా... గూగూడు కుళ్లాయిస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు పీర్ల పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంజాను బయటకు తీసి చందనం, గంధంతో శుద్ధిచేస్తారు. సంప్రదాయ పూజల అనంతరం భక్తులకు ప్రథమ దర్శనం చేయిస్తారు. - 23వ తేదీ స్వామివారి నిత్యపూజ నివేదన, - 24న అగ్నిగుండం ఏర్పాటు, - 25న కుళ్లాయిస్వామి పీర్లను చావిడిలో నిలుపుట, - 26న నిత్యపూజ నివేదన, - 27న ఐదవ సరిగెత్తు, - 28న నిత్యపూజ నివేదన, - 29న ఏడవ చిన్నసరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, - 30న నిత్యపూజ నివేదన, విడిదినం ప్రత్యేక పూజలు, - అక్టోబర్ నెల 1వ తేదీన పెద్ద సరిగెత్తు, రాత్రికి గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం, - 2న పీర్లు జలధి కార్యక్రమం - 3న సాయంకాలం కుళ్లాయిస్వామి మూలవిరాట్ చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎల్ మోహన్రెడ్డి తెలిపారు. గూగూడు ఉత్సవాలను తిలకించడానికి రాష్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున రానుండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
నేటి నుంచి ఎస్కేయూ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల గ్రూప్(బి) క్రీడా పోటీలు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్బాబు హాజరుకానున్నారని అన్నారు. -
నేటి నుంచి ‘ఐద్వా’ ఆధ్వర్యంలో జీపుజాతా
అనంతపురం అర్బన్: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరుకు సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో జీపు జాతా ద్వారా ప్రజలను చైతన్యపరచనుంది. మంగళవారం నగరంలోని కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు లక్ష్మీదేవి, సావిత్రి మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా జనావాసాల మధ్యనున్న దుకాణాలను తొలగించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. నేడు నగరంలోని శ్రీశ్రీ నగర్లో జీపుజాతా ప్రారంభమవుతుందన్నారు. 7, 8 తేదీల్లో మునిసిపాలిటీల్లో జీపు జాతా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలనే డిమాండ్తో ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, 15న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. సమావేశంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు యమున, చంద్రిక, నాయకురాలు రామాంజినమ్మ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
తప్పక చదవండి
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement