-
ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళా భక్తులు మృతి..
జైపూర్: రాజస్థాన్ సీకర్లోని కాటుశ్యామ్జీ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయం గేట్లు తెరవగానే భారీగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జైపూర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళా భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. सीकर में खाटूश्याम जी के मंदिर में भगदड़ होने से 3 दर्शनार्थी महिलाओं की मृत्यु बेहद दुखद एवं दुर्भाग्यपूर्ण है। मेरी गहरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं, ईश्वर उन्हें यह आघात सहने की शक्ति प्रदान करें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें। — Ashok Gehlot (@ashokgehlot51) August 8, 2022 ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషద ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest. — Narendra Modi (@narendramodi) August 8, 2022 చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్ను చితకబాదిన గ్యాంగ్ -
రతన్గడ్ ఘటనలో కలెక్టర్, ఎస్పీ సహా 19 మంది సస్పెన్షన్
రతన్గడ్ దేవాలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగి 117 మంది మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. అ ఘటనకు బాధ్యులు భావిస్తూ దతియా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతోపాటు మరో 19 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వచ్చే నెల 25 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వారందరిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సస్పెన్షన్ చేశారు. అలాగే ఆ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేపట్టిన విచారణ మంగళవారం నుండి ప్రారంభం అవుతుందని సోమవారం సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేస్తారని తెలిపారు. తొక్కిసలాటకు ముందు భక్తులతో, ఘటన అనంతరం మృతదేహలతో పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అన్ని అంశాలపై జడ్జి విచారణ జరిపి నివేదిక అందజేస్తారని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని రతన్గడ్ దేవాలయం సమీపంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 117 మంది మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
నవరాత్రి వేడుకల్లో విషాదం: 115 మంది మృతి
దాతియా: మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో దసరా నవరాత్రి వేడుకల వేళ విషాదం చోటు చేసుకుంది. రతన్గఢ్లోని దుర్గాదేవి ఆలయం వద్ద సింధు నదిపై ఉన్న వంతెనపై ఆదివారం ఉదయం సుమారు 8.30 గంటలకు జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 30 మంది చిన్నారులు ఉన్నారు. వంతెన కూలిపోనుందనే వదంతి ప్రచారం కావడంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆలయం వద్ద క్యూలో భక్తులు నిలుచుని ఉండగా, కొందరు క్యూ దాటుకుని దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. ఈ గందరగోళంలో వంతెన రెయిలింగ్ విరిగింది. ట్రాక్టరు ఢీకొనడంతో రెయిలింగ్ విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈలోగా వంతెన కూలిపోతోందంటూ వదంతి ప్రచారం కావడంతో జనం కకావికలమై పరుగులు తీశారు. కొందరు వంతెన పైనుంచి నదిలోకి దూకేశారు. దాతియా జిల్లాతో పాటు పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ప్రాణనష్టం తీవ్రస్థాయిలో సంభవించినట్లు తెలుస్తోంది. వదంతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఎంపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేసీ డే చెప్పారు. అయితే, ట్రాక్టరు ఢీకొనడంతో వంతెన రెయిలింగ్ దెబ్బతిన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ధ్రువీకరించలేదు. సంఘటన జరిగిన సమయంలో ఆలయం వద్ద దాదాపు 25 వేల మంది భక్తులు ఉన్నారు. ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో నదిపై ఉన్న వంతెనను నాలుగేళ్ల కిందటే నిర్మించారు. కేవలం ఏడు మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెనపై జనం కిక్కిరిసి పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తర్వాత సహాయక కార్యక్రమాల్లో జాప్యం చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన జనం పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో డీఎస్పీ బీఎన్ బసవే సహా కొందరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జి కారణంగానే తొక్కిసలాట జరిగిందనే వార్తలను చంబల్ రేంజ్ డీఐజీ దిలీప్ ఆర్య తోసిపుచ్చారు. నదిలోకి దూకేయడంతో కొందరు మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. తొక్కిసలాట కారణంగానే మరణాలు సంభవించాయని చెప్పారు. వదంతుల కారణంగానే తొక్కిసలాట జరిగిందని, వదంతులను ప్రచారం చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే, ప్రస్తుతం సహాయక చర్యలకు తొలి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట తర్వాత ఆలయం వద్ద, వంతెనపైన బీభత్స పరిస్థితులు కనిపించాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్లో తమ వారిని వెదుక్కుంటున్న బంధువుల రోదనలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆలయ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఆలయం నుంచి బయటకు వెళ్లే ఏకైక రోడ్డుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక కార్యక్రమాలు కష్టతరంగా మారాయి. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి రావడంతో మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించగలిగారు. సహాయక కార్యక్రమాల్లో మూడు కంపెనీల బలగాలు పాల్గొంటున్నట్లు శాంతిభద్రతల విభాగం ఐజీ డి.శ్రీనివాసరావు చెప్పారు. మరోవైపు, పరిస్థితిని సమీక్షించేందుకు డీజీపీ నందన్ దూబే, ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రాలు భోపాల్ నుంచి హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. త్వరలోనే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పరిహారం ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రధాని, రాష్ట్రపతి, సోనియా సంతాపం... తొక్కిసలాట సంఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్రపతి అధికారులకు సూచించారు. మధ్యప్రదేశ్ సీఎల్పీ నేత జరిగిన విషాదంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యంత్రాంగం తీరును ఆయన తప్పుపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేయడం వల్లనే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు బలైపోయాయని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు ఎన్నికల విధుల్లో తలమునకలై ఆలయం వద్ద శాంతిభద్రతల పరిస్థితిని గాలికొదిలేశారని బీఎస్పీ నేత రాజేంద్ర భారతి ఆరోపించారు. లోగడ 2006లోనూ ఇదే వంతెనపై తొక్కిసలాట జరిగినా, ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాన్నీ నేర్చుకోలేదని దుయ్యబట్టారు. గడచిన దశాబ్దంలో జరిగిన భారీ తొక్కిసలాటలు... 2013 ఫిబ్రవరి 11: ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమవుతున్న 37 మంది భక్తులు మృతి చెందారు. 2012 నవంబర్ 19: బీహార్ రాజధాని పాట్నాలో గంగానది ఒడ్డున ఛత్ పూజ వేడుకల సమయంలో వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 2011 జనవరి 14: కేరళలోని అయ్యప్ప క్షేత్రమైన శబరిమలైలో మకరజ్యోతి సందర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మృతి చెందారు. 2010 మార్చి 4: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు. 2008 సెప్టెంబర్ 30: రాజస్థాన్లోని జోధ్పూర్ చాముండా దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 224 మంది భక్తులు మరణించారు. 2005 జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లా మంధర్ దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 304 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 2003 ఆగస్టు 27: మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది యాత్రికులు మరణించారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement