-
ఉపాధ్యాయ విద్యకు చికిత్స
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ విద్యను బోధించే డైట్, సీటీఈ, ఐఏఎస్ఈలను బలోపేతం చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయడంతోపాటు అక్రమ ప్రవేశాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను డిప్యుటేషన్పై నియమించనున్నారు. డీసెట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే డీఈడీలో ప్రవేశాలు కల్పించనున్నారు. కరిక్యులమ్లో పలు మార్పులు చేసినా టీచర్ అభ్యర్థులకు సరైన శిక్షణ లేనందున ఫలితాలు సాధించడం కష్టంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం.. పోస్టులు ఖాళీగా ► జిల్లా ఉపాధ్యాయ విద్యా బోధనా సంస్థలు (డైట్లు), కాలేజ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైట్స్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినా అందుకు తగ్గట్టుగా గత ప్రభుత్వం బోధనా సిబ్బందిని నియమించలేదు. డైట్స్లో పలు చోట్ల విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పేరుకు మాత్రమే కాలేజీలు.. ► ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో అర్హులైన టీచర్లు లేరు. కాలేజీలు పేరుకు మాత్రమే ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు. తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ► బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయడం ద్వారా ఈ కాలేజీల్లో అక్రమాలకు కొంతవరకు తెరపడనుంది. పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి డీఎడ్ కాలేజీలను కూడా ప్రభుత్వం చేర్చింది. ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి బీఈడీ కాలేజీలను తెచ్చింది. ► అక్రమాలు జరిగినట్లు తేలిన 180 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. 2018–20 బ్యాచ్కు సంబంధించి అక్రమంగా చేపట్టిన ప్రవేశాలకు అనుమతులు నిరాకరించింది. డైట్ కాలేజీల్లో సీట్లు ఇలా... కేటగిరీ ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం ఇంగ్లీషు మెథడాలజీ 650 8,800 9,450 తమిళ మెథడాలజీ 50 –– 50 తెలుగు మెథడాలజీ 700 54,730 55,430 ఉర్దూ మెథడాలజీ 250 170 420 మొత్తం 1,650 63,700 65,350 డీఈడీ ఇలా ప్రభుత్వ డీఈడీ కాలేజీలు 22 ప్రైవేట్ డీఈడీ కాలేజీలు 754 డీఎడ్ సీట్లు 65 వేలకు పైగా ఇటీవల డీసెట్కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 10,810 పరీక్షకు హాజరైన వారు: 9,014 అర్హత సాధించిన వారు: 8,175 డీసెట్ రాయకపోయినా సీటు...! – 2018–20 నిర్వహించిన డీఈఈసెట్లో 65 వేలకు పైగా సీట్లకు 24వేల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2 వేల మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అయితే టీడీపీ హయాంలో మంత్రి, ఉన్నతాధికారులను మేనేజ్ చేయడం ద్వారా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఓసీ, బీసీలకు అర్హత మార్కులను తగ్గించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో సంబంధం లేకుండా సీట్లు భర్తీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. – అర్హత మార్కులను తగ్గించినా 20 వేల మంది మాత్రమే అర్హత పొందడంతో యాజమాన్యాలు మిగతా సీట్లను డీఈఈ సెట్ రాయని వారితోనూ భర్తీ చేశాయి. –దీనికి సంబంధించి ఆయా కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వాటి వాదనలను తోసిపుచ్చింది. డీసెట్లో అర్హత సాధించని వారిని, డీసెట్ రాయని వారిని అనుమతించడం సరికాదంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. బీఈడీలోనూ.... – బీఈడీ కాలేజీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 430కిపైగా బీఈడీ కాలేజీల్లో 41,894 సీట్లున్నాయి. 2019–20లో బీఈడీలో కన్వీనర్ కోటాలో భర్తీ అయినవి 3,874 సీట్లు కాగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా 19,665 మందిని చేర్చుకున్నారు. ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా 7,849 మందిని చేర్చుకున్నారు. ఇలా మొత్తం 31,388 సీట్లు భర్తీ అయినట్లు చూపించారు. ఎడ్సెట్ రాసేవారు 13 వేల లోపే ఉండగా 8 వేల మంది కూడా అర్హత సాధించడం లేదు. చివరకు మాత్రం 80 శాతానికిపైగా సీట్ల భర్తీ అయినట్లు యాజమాన్యాలు చూపిస్తుండడం గమనార్హం. రాసి కాదు.. వాసి ముఖ్యం ‘ఉపాధ్యాయ విద్యలో రాసి కాదు వాసి కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాల కరిక్యులమ్ను పటిష్టం చేస్తున్న తరుణంలో ఉపాధ్యాయ విద్యను కూడా పటిష్టం చేస్తున్నాం. ప్రభుత్వ డైట్లు, ఇతర కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడుతున్న 180 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో పాటు వాటికి అనుమతులు ఇవ్వరాదని ఎన్సీటీఈకి లేఖ రాశాం. డీఎడ్ సిలబస్ను పునస్సమీక్షించేందుకు కమిటీతో అధ్యయనం చేస్తున్నాం. డీఎడ్ విద్యార్థి శిక్షణలో భాగంగా నెల రోజుల పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు సంబంధించి సిలబస్లో పొందుపరచాలని భావిస్తున్నాం. విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కూడా సిలబస్లో చేర్చే యోచన ఉంది’ – వాడ్రేవు చినవీరభద్రుడు (పాఠశాల విద్యాశాఖ కమిషనర్) -
డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లోనే నాలుగేళ్ల బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను పరిగణనలోకి తీసుకొని దేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త కోర్సులను 2020–21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. అందులో నాలుగేళ్ల బీఎడ్ కోర్సును, సైన్స్, హ్యుమానిటీస్లో డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టేందుకు వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఆ కోర్సులను నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని ఎన్సీటీఈ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఎన్సీటీఈ చైర్పర్సన్ డాక్టర్ సత్బిర్ బేడీ లేఖ రాశారు. ఈనెల 16వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని అందులో కోరారు. దీంతో ఆ దిశగా ఉన్నత విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అధికంగా కాలేజీలు.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కళాశాలలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, కొత్తగా కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ఎన్సీటీఈకి తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారని, కొత్త కాలేజీల నుంచి వచ్చే వారితో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రానికి కావాల్సిన మేరకు శిక్షణ పూర్తి చేసిన వారు ఉన్నారని, అయితే ఇకపై నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాల్సి ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని అప్పట్లో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలా? వద్దా? వాటిని నిర్వహిస్తామంటూ దరఖాస్తు చేసుకునే కాలేజీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలా? వద్దా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే.. ఉపాధ్యాయ విద్యా బోధనలో నాలుగేళ్ల బీఎడ్ ద్వారా మెరుగైన శిక్షణ, నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో వీటిని ప్రవేశ పెట్టేందుకు ఎన్సీటీఈ చర్యలు చేపట్టింది. వాటికోసం కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేస్తామంటే ఇవ్వమని పేర్కొంది. -
ఆగిపోయిన విద్యా ప్రణాళికలు!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కీలకమైన పలు విద్యా పథకాల ప్రణాళికలు ఆగిపోయాయి. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), టీచర్ ఎడ్యుకేషన్ పథకాల విలీన నిర్ణయం నేపథ్యంలో ఆయా పథకాల కింద రూపొందించాల్సిన 2018–19 విద్యా సంవత్సరం ప్రణాళికలను రాష్ట్ర విద్యా శాఖ నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి ఆయా పథకాలకు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మూడు విద్యా పథకాల విలీనం కారణంగా కేంద్రం ఆయా పీఏబీల సమావేశాలను రద్దు చేసింది. దీంతో విద్యా శాఖ సైతం వాటికి అవసరమైన ఆర్థిక సంవత్సరపు ప్రణాళికల రూపకల్పనను నిలిపివేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పథకాల విలీనం సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో కొత్త పథకం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యా పథకాలు, వాటికి అవసరమయ్యే ప్రణాళికలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. -
‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యం తర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొంది. -
ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం. 85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే.. ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ తరువాతే డీఎడ్ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు. టెట్లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement