breaking news
Tata steel masters chess tournment
-
సంయుక్త ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్త ఆధిక్యంలో ఉన్నాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను గుకేశ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిక్బెక్ (ఉజ్బెకిస్తాన్), ప్రజ్ఞానంద కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. పెంటేల హరికృష్ణ (భారత్)ృఅనీశ్ గిరి (నెదర్లాండ్స్) మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అలెక్సీ సరానా (సెర్బియా), ఇరిగేశి అర్జున్ (భారత్) మధ్య గేమ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. మొత్తం 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
Tata Steel Chess Tournament: ప్రజ్ఞానంద అద్భుతం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): గత ఏడాది గొప్పగా రాణించిన భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద కొత్త సంవత్సరంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగో రౌండ్ గేమ్లో సంచలనం సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ డింగ్ లిరెన్ (చైనా)పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఈ గేమ్లో నల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో డింగ్ లిరెన్ను ఓడించాడు. తాజా ఫలితంతో ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్లో 2748.3 పాయింట్లకు చేరుకున్నాడు. దాంతో 2748 పాయింట్లతో భారత నంబర్వన్గా కొనసాగుతున్న దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను రెండో స్థానానికి పంపించి భారత కొత్త నంబర్వన్గా ప్రజ్ఞానంద అవతరించాడు. అంతేకాకుండా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ను ఓడించిన రెండో భారతీయ ప్లేయర్గానూ ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. వాస్తవానికి ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వరల్డ్ రేటింగ్స్ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్ రేటింగ్స్ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ టోరీ్నలోని తదుపరి రౌండ్లలో ప్రజ్ఞానంద తడబడితే మళ్లీ ఆనంద్ నంబర్వన్ అయ్యే అవకాశాలున్నాయి. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీని నిర్వహిస్తున్నారు. నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్కే చెందిన విదిత్ 2 పాయింట్లతో ఏడో ర్యాంక్లో, గుకేశ్ 1.5 పాయింట్లతో పదో ర్యాంక్లో ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీలో డింగ్ లిరెన్పై ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్లో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో రష్యా గ్రాండ్మాస్టర్ నెపోమ్నిíÙని ఓడించి డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. -
హరికృష్ణ సంచలనం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు. 12 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణకిది రెండో విజయం. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్లో నైదిశ్ (జర్మనీ)తో హరికృష్ణ తలపడతాడు.