-
ముంబైసే ఆయా మేరా దోస్త్
సాక్షి, హైదరాబాద్: వారిద్దరు బాల్యమిత్రులు. పుట్టింది మొదలు 20 ఏళ్ల వయసు వరకు ఇరువురు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం రావడంతో బాల్యమిత్రుల్లో ఒకరు కుటుంబంతో సహా మకాం మార్చారు. అప్పట్లో ఫోన్ల సదుపాయం లేని కారణంగా స్నేహబంధం దూరమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరిని తిరిగి ఫేస్బుక్ దగ్గర చేసింది. సోమవారం రాత్రి ఇరువురు మిత్రులు శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇందులో ఒకరు రిటైర్డు ఎయిర్ఫోర్స్ ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. మోండాలోని టకారాబస్తీలో మంత్రి పద్మారావు పుట్టి పెరిగారు. ముంబై నుంచి కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్టియన్ కుటుంబం నగరానికి వలస వచ్చింది. మోండా మార్కెట్లో స్థిరపడిన ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జాకబ్ విక్టర్. పద్మారావుగౌడ్, జాకబ్విక్టర్ ఇరువురు బాల్యమిత్రులు. 20 ఏళ్ల వయసులో జాకబ్ విక్టర్కు ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం రావడంతో కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. నాలుగు దశాబ్దాలుగా ఇరువురు కలుసుకోలేకపోయారు. ఫేస్బుక్ చూస్తుండగా... ఎయిర్ఫోర్స్లో పదవీ విరమణ చేసిన జాకబ్ విక్టర్ కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ పరిశీలిస్తుండగా మంత్రి పద్మారావు ఫొటోలు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావుగౌడ్ తన బాల్యమిత్రుడేనని గుర్తించిన జాకబ్విక్టర్ అందులోని ఫోన్నెంబర్కు కాల్చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న మంత్రి పీఆర్ఓ కలకోట వెంకటేశ్ జాకబ్ ముంబై నుంచి ఫోన్ చేసిన విషయాన్ని మంత్రికి చేరవేశారు. బాల్యమిత్రుడి ఆచూకీ లభించడంతో హర్షం వ్యక్తం చేసిన పద్మారావుగౌడ్ హైదరాబాద్ రావాల్సిందిగా జాకబ్ విక్టర్ను ఆహ్వానించారు. స్వయంగా మంత్రి స్వాగతం... సోమవారం రాత్రి ముంబై నుంచి నగరానికి చేరుకున్న జాకబ్ విక్టర్కు మంత్రి పద్మారావు స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. టకారాబస్తీలోని మంత్రి నివాసంలో బసచేసిన జాకబ్ విక్టర్ మంగళవారం మంత్రి పద్మారావుతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో బాల్యం నాటి ముచ్చట్లను ఇరువురు పంచుకున్నారు. -
అమెరికాలో మద్యం విక్రయాలపై మంత్రి పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ గురువారం న్యూయార్క్లోని మద్యం దుకాణాలను పరిశీలించారు. మద్యం తయారీ, విక్రయాలు జరిగే తీరును ఆయన తెలుసుకున్నారు. అమెరికాలో మద్యం ధరలు, మన రాష్ట్రంలో ధరలకు మధ్య తేడాలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రత్యేకాధికారి రాజేశ్వర్రావు ఉన్నారు. -
గుడుంబాపై ఉక్కుపాదం
♦ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ♦ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. ఎనిమిది జిల్లా ల్లో గుడుంబా విక్రయాలను పూర్తిగా అరికట్టామని, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా గుడుంబా తయారీ, అమ్మకాలు లేకుండా చేసి తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొం దించిన 2016 డైరీ, క్యాలెండర్లను సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు గుడుంబా తయారీ, అమ్మకాలే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయినట్లుగా తన దృష్టికి వచ్చిం దని అన్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకొని వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఇతర నాయకులు డి.అరుణ్కుమార్, సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు, కృష్ణయాదవ్, వెంకటయ్య, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి...
హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపు 40 వేల మంది హాజరవుతారని వెల్లడించారు. ఈ ప్లీనరీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి గ్రేటర్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని పద్మారావు స్పష్టం చేశారు. -
ఎమ్మార్పీ రేట్లకే మద్యం: పద్మారావు
హైదరాబాద్: దసరాకల్లా హైదరాబాద్లో కల్లు దుకాణాలు తెరిపిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో మంళగవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్లో 107 వైన్స్ షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫునే ఆ షాపులను నిర్వహిస్తామని వెల్లడించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా చర్యలు చేపడతామని పద్మారావు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement