breaking news
Street dogs attacked
-
కుక్కలు వెంటపడుతున్నాయన్నా టెన్షన్లో.. స్పీడ్ పెంచిందంతే..
ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..) -
ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పాప అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు. చదవండి: స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్పై గ్యాంగ్ రేప్ -
ఎండ దెబ్బ.. వీధి కుక్కల వింత ప్రవర్తన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలుమండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలుఅత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరాల నిమిత్తం బయటకు వెళ్తున్న సిటీజనులు వడదెబ్బకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యాచకులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో చాలామంది తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎండలకు తోడు సరైన నీరు, ఆహారం లభించకపోవడంతో వీధి కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేవారిపై దాడి చేస్తూ కాటేస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 40–50 మంది కుక్కకాటు బాధితులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతుండడంతో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఎండలకు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ అనివార్యమైతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సొమ్మసిల్లితే... సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలి. కానీ చాలామంది పని ఒత్తిడితో 2–3లీటర్లు కూడా తాగడం లేదు. ఇదిలా ఉంటే నగరానికి రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వచ్చి పోతున్నట్లు అంచనా. వివిధ పనులతో జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, రోజంతా ఎండలో తిరగడం వల్ల అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన వాటర్, కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యనిపుణుడు చిన్నారుల విషయంలో... సెలవుల నేపథ్యంలో పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. ఎండలకు త్వరగా దాహం వేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు చన్నీటి స్నానం చేయించడంతో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో పిల్లలకు చికెన్ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలి.– డాక్టర్ రమేశ్ దంపురి, నిలోఫర్ ఆస్పత్రి మంచినీరు తాగాలి... నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్పై ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్కెంటింగ్ వారు రోజుకు ఐదారు గంటలు రోడ్డుపైనే తిరగాల్సి ఉంటుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోతాయి. దాహం వేస్తే రోడ్డు పక్కనున్న చలివేంద్రాలు, హోటళ్లు తదితర ఎక్కడి నీరైనా తాగుతున్నారు. అయితే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి వీధి కుక్కలతో జాగ్రత్త... ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండాకుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
వనస్థలిపురంలో రెచ్చిపోయిన కుక్కలు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధిలోని వైదేహినగర్లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న రోహిత్(7) అనే చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రగాయాలైన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రెచ్చిపోయిన కుక్కలు
52 మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం నాగర్కర్నూల్: వీధికుక్కలు రెచ్చి పోయాయి. ఏకంగా 52 మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలులో బుధవారం చోటుచేసుకుంది. మొదట మూడు కుక్కలు సంజయ్నగర్ కాలనీవాసులపై దాడిచేశాయి. రాఘవేంద్రనగర్ కాలనీ, ఎర్రగడ్డ కాలనీ, పోస్టాఫీసు, గోదాం ఏరియా తదితర ప్రాంతాల్లోనూ కొందరిపై దాడి చేశాయి. గాయపడిన వారిని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఐశ్వర్య, సీఎన్ఆర్లో మూడో తరగతి చదువుతున్న ముఖేష్, సంజయ్నగర్కు చెందిన బుచ్చమ్మ, రసూల్బీ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్కు తరలించారు.