-
బాబు.. చెత్త పొలిటీషియన్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ (చెత్త రాజకీయ నేత) దేశంలోనే ఎవరూ లేరని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదని.. అక్కడి ప్రజలు ఆయన్ను దారుణంగా ఓడిస్తారని కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ వైఖరి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. హోదా విషయంపై అవసరమైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనల్లో వివరాలను తెలిపేందుకు శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఐదేండ్లవుతోంది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ సీఎం అయినా ప్రజలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలి. చంద్రబాబుకు మెదడు ఉందా? అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. డిసెంబర్ నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్రానికి తరలించకున్నా హైదరాబాద్లోనే వేరుగా ఉంటే సరిపోతుందని మేం సుప్రీంకోర్టుకు విన్నవించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు మనుగడలోకి వస్తాయని సుప్రీంకోర్టు నెలన్నర క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టుకు చెప్పిన ప్రకారం ఏపీ ప్రభుత్వం డిసెంబర్ వరకు అమరావతిలో ఎందుకు హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయలేదు. ఉమ్మడి హైకోర్టును సుప్రీంకోర్టు విభజిస్తే కేంద్రం నోటిఫై చేసింది. ఈ విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఎలా విమర్శలు చేస్తాడు. ఆయనంత చెత్త రాజకీయ నేత దేశంలోనే ఎవరూ లేరు. నవీన్ పట్నాయక్ను ఎందుకు కలిసినవు. మల్లయ్యను, ఎల్లయ్యను ఎందుకు కలిసినవు అని అడుగుతడు. నేను ఎవరిని కలిస్తే నీకెందుకు? నువ్వు (చంద్రబాబు) మోదీ సంకనాకుతావు. సంకల కూచుంటవు. అకస్మాత్తుగా ఓ రోజు రాహుల్గాంధీ సంకనాకుతావు’అని కేసీఆర్ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ‘చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లేదు. ఇలాంటి నేతను భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తదని ఆయనే వాదించిండు. అప్పట్లో రాహుల్గాంధీ విజయవాడకు వస్తుంటే.. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించిండు. ఇప్పుడు నరేంద్రమోదీ వస్తుంటే ఇదే మాట అంటున్నాడు. నీకో పాలసీ, పద్ధతి ఉందా. మనిషిలాగా మాట్లాడుతున్నావా? మీడియా ఇలాంటి డర్టీ లీడర్లను చీల్చి చెండాడాలి’అని టీఆర్ఎస్ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చి అబద్దాలతో.. ‘ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని రాఫ్ట్ ఫౌండేషన్తో నిర్మిస్తున్నారని.. దేశంలోనే ఇదే మొదటిది అని పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు గొప్పగా చెప్పారు. రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీ కొత్తదేం కాదు. హైదరాబాద్లో వెయ్యికిపైగా ఇళ్లు ఇలాగే కట్టారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు ఇలాగే నిర్మిస్తారు. మిషన్ భగీరథ కింద నిర్మిస్తున్న 18 వేల ట్యాంకులు ఇలాగే నిర్మించాం. రేగడి నేలలో ఏ నిర్మాణమైనా ఈ విధానంలోనే నిర్మిస్తారు. హుస్సేన్సాగర్ చుట్టు ఉన్న అన్ని భవనాలను ఇలాగే కట్టారు. ఏపీ సచివాలయం 56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీ 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సైతం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉంది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చింది. హైకోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్ల వేరుగా ఇచ్చింది. ఇవన్నీ ఏం చేశావు. నాకేశావా? ఇన్ని అబద్దాలా? ఇంత మోసమా? చంద్రబాబు అనే వ్యక్తి వాడుకుని వదిలేసే రకం. హరికృష్ణ శవంపై పేలాలు ఎరుకునే ప్రయత్నం చేశాడు. ఆయన చావును సొమ్ము చేసుకునేందుకు హరికృష్ణ కూతురును బలవంతంగా పోటీకి పెట్టారు. ఆ అమ్మాయికి ఇప్పుడైనా ఏమైనా ఇస్తరా. చంద్రబాబు నీచంగా, రాక్షసంగా వ్యవహరిస్తడు’అని కేసీఆర్ మండిపడ్డారు. హోదాకు టీఆర్ఎస్ అనుకూలం ‘చంద్రబాబు కేంద్రం ఏమీ ఇవ్వలేదని అంటడు. మళ్లీ అభివృద్ధి పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేస్తడు. జనం ఏది నమ్మాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నేను వద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నడు. దీనిపై మా వైఖరి సుస్పష్టం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభలో మా ఎంపీ కవిత స్పష్టంగా చెప్పారు. నేనెందుకు వద్దంట. అవసరమైతే దీనిపై ప్రధానమంత్రి లేఖ రాస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 94 సెక్షన్లో 1, 2 సెక్షన్లలో దీనిపై స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలకు పరిశ్రమల రాయితీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. చంద్రబాబు వట్టి అబద్ధాల కోరు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చి రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై అంచనాతో ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ను వదులుకుంటున్నందుకు ఏపీకి పదేళ్లపాటు లోటు బడ్జెట్ ఉంటుందని ఆ మేరకు రూ.24 వేల కోట్లను కేంద్రం ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ›ప్రతిపాదించారు. కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. మళ్లీ లోటు బడ్జెట్ ఎక్కడ ఉంది. ఇది వాస్తవం కాదా? ఆ డబ్బులు లేవా? నీకు చేతకాదు. ప్రజా సంక్షేమం తెలియదు. అంతా అవినీతిమయం. నీకున్న ఈ జాఢ్యాల వల్లే ఇలా అయ్యింది. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నావు. అలా అంటే జైళ్లో వేస్తానన్నావు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతావు. నువ్వు దుర్మార్గుడివి. ఏమీ తెలియదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం. మామ పెట్టిన పార్టీని లాక్కుని మేనేజ్ చేస్తున్నావు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు పొలిటికల్ మేనేజర్. మేం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ వచ్చేదాక విశ్రమించేదిలేదని అప్పటిదాకా పోరాడాం. నీలాగా చిల్లర రాజకీయాలు రావు. కేంద్రంలో బాబు చక్రాలు తిప్పలేదు. తిప్పితే ఆ అభివృద్ధి ఎక్కడ. మేనేజ్ చేసి పేపర్లలో ఏదో తిప్పినట్లుగా పత్రికల్లో ఫొటోలు వేసుకున్నారు. చంద్రబాబువి నకిలీ పనులు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని కాపీ కొట్టారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని అక్కడా అమలు చేస్తున్నారు. ఈవోడీపీ ర్యాంకుల ప్రతిపాదనలతో మేం పొరపాటున ఒక పదాన్ని తప్పుగా పెడితే దాన్ని కూడా ఒక్క అక్షరం మార్చకుండా అలాగే కేంద్రానికి సమర్పించారు. దీనిపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేశాం. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. చంద్రబాబుకు సిగ్గు లేదు. నోటికొచ్చింది మాట్లాడటమే. నీతిఅయోగ్ సమావేశంలో ఒకసారి మోదీని పొడిగేందుకు ఏదేదో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినందుకే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని అన్నాడు. అదేంటని అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో అన్నారు. పీవీ నర్సింహారావు, చరణ్సింగ్, దేవేగౌడ అలాగే అయ్యారు కదా అని అఖిలేష్యాదవ్ నాతో అన్నారు. చంద్రబాబు లాంటి వారిని ఇన్నాళ్లు ఎలా భరించావని నన్ను అడిగారు. ఇలా ఉంటుంది చంద్రబాబు తీరు. తెలంగాణ ఎన్నికలలోకి వచ్చిన చంద్రబాబుకు కచ్చితంగా గిఫ్ట్ తిరికి ఇస్తాం. జాగ్రత్త ! ఆంధ్రప్రదేశ్లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదు. అక్కడి ప్రజలు ఆయనను దారుణంగా ఓడిస్తారు’అని కేసీఆర్ పేర్కొన్నారు. రెండు బాకా పేపర్లు చంద్రబాబు నాయుడు ఏం చేయకున్నా ఏదో చేసినట్లుగా రెండు పత్రికలు, కొన్ని టీవీలు ప్రజలను నమ్మిస్తుంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘చంద్రబాబు దగ్గర రెండు, మూడు బాకా పేపర్లు ఉన్నాయి. రెండు బాకా పేపర్లు డప్పు కొట్టుడు. ఏది మాట్లాడినా ఈస్ట్మన్ కలర్ ఫొటోలతో కథలు వేస్తారు. చక్రం తిప్పుడు లేదు. చంద్రబాబుకు రెండు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడం రాదు. కనీసం రెండు లైన్లు హిందీ కూడా రాదు. కేసీఆర్ యజ్ఞాలు చేస్తాడని మోదీ అన్నాడు. నాకు నమ్మకం ఉంది వస్తే నీకు కూడా ప్రసాదం పెడతా అన్నా. యజ్ఞ, యాగాలపై నాకు నమ్మకం ఉంది. దేవుడిపై నాకు విశ్వాసం ఉంది. యజ్ఞాలు చేస్తే నాకు మంచే అవుతోంది. నేను రాజశ్యామల యాగం చేశా. రాజశ్యామల అమ్మవారి ఆలయం విశాఖపట్నంలోనే ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం భువనేశ్వర్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. శారదాపీఠం స్వామి వారికి ఇదే విషయం చెప్పా. విశాఖపట్నానికి రండి పూజలు చేసి భోజనం చేసి వెళ్దురు అన్నారు. నేను వెళ్లా. నేను ఊహించలేదు. అక్కడ విమానాశ్రయానికి చాలా మంది వచ్చారు. శారదాపీఠం వరకు 18 కిలోమీటర్ల దారి పొడవునా స్థానికులు నాకు ఉత్సాహంగా అభివాదం చేశారు. అభిమానంతో వచ్చారు. నేను అభివాదం చేశా. ఆ దారి పొడవునా కొందరు ఫెక్సీలు కట్టారు. ఆ రెండు బాకా పేపర్లు వైఎస్సార్సీపీ వాళ్లు, వెలమలు వచ్చారు అని రాశాయి. వాళ్లు ఆంధ్ర ప్రజలు కాదా. వాళ్లు ఎందుకు వచ్చారు. చంద్రబాబును తెలంగాణలో పొల్లుపొల్లు కొట్టినందుకు, తన్ని పంపించినందుకు ప్రజలలో కనిపించిన ఉత్సాహం అది. ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు. ప్రజలను అయోమానికి గురి చేయడానికా? తెలంగాణ ప్రాంతంగా ఉండే పేపర్లకు సహరించేలా నిర్ణయాలు తీసుకుంటాం’అని ఆయన స్పష్టం చేశారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
చంద్రబాబు బూటకపు మాటలు నమ్మి...
బెళుగుప్ప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 610 హామీలను ఇచ్చి గత నాలుగు సంవత్సరాల్లో పది హామీలను కూడా అమలు చేయలేదని, ప్రస్తుతం మరోసారి బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీరంగయ్యలు విమర్శించారు. శనివారం బెళుగుప్పలో పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే మరియు అనంతపురం సమన్వయకర్తలు ముఖ్య అథితుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం వరకు రాష్ట్రానికి రూ. 90 వేల కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం రూ.2.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50,000 పైగా అప్పులు మోపిందన్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేవలం రూ.14 వేల కోట్లు అది వడ్డీకి సరిపోయే విధంగా రుణమాఫీ చేసి రైతుకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో రాకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లో పడేశారన్నారు. రుణమాఫీ చేయకుండా 6 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనుల్లో నాలుగేళ్లుగా గంప మట్టిని కూడా తీయని పాలకులు రూ.50 కోట్లతో పూర్తి అయ్యే 36వ ప్యాకేజీ పనులను ప్రస్తుతం రూ. 250 కోట్లకు పెంచుకుని రూ. 200 కోట్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని తలారి పీడీ రంగయ్య అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనుగోలులో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడన్నారు. ఉమ్మడి రాజధానిలో దాదాపుగా 85 రోజుల పాటు హైదరాబాద్లో సెక్రటేరియట్కు సీఎం వెళ్లకుండా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి మొగ్గు చూపి అసెంబ్లీ తీర్మానం చేశాడన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో వ్యాపారులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సీఎం చంద్రబాబునాయుడు యుటర్న్గా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు. బెళుగుప్ప : రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పోరాడుదామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీ రంగయ్యలు పిలుపునిచ్చారు. శనివారం బెళుగుప్పలో శ్రీనివాస్ తోటలోని హాల్ నందు పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ముఖ్య అథితులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, బెళుగుప్ప సింగిల్ విండో అధ్యక్షుడు శివలింగప్ప, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, దుద్దేకుంట సర్పంచ్ ఎర్రిస్వామి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోధమ్మ, నాయకులు మరియు బూత్ కమిటీల కన్వీనర్లు ఓబిరెడ్డి కేశవరెడ్డి, చౌదరి, అంగడి ఎర్రిస్వామి, నరిగన్న, తిమ్మారెడ్డి, మచ్చన్న, నరిగన్న, దొడగట్ట క్రిష్టప్ప, రమనేపల్లి రమేష్, శ్రీరంగాపురం శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, మోహన్రెడ్డి, అంకంపల్లి శ్రీనివాసరెడ్డి, రుద్రానంద, గురుమూర్తిరెడ్డి, బాబురెడ్డి, పూలప్రసాద్, వినోద్, తిప్పేస్వామి, నరసింహ, బ్రహ్మయ్య, తిమ్మారెడ్డి, రమనేపల్లి రమేష్, హనుమంతురాయుడు, దొడగట్ట క్రిష్టప్ప, నరిగన్న అక్కులన్న,రమేష్, మల్లి, ధనుంజయ, నాగరాజు, తాతెప్ప, తగ్గుపర్తి క్రిష్ణ, గంగవరం రమేష్, రవి, వెంకటనరసు, కాలువపల్లి ఫకృద్దీన్, మదు, తిమ్మన్న, రాము, యలగలవంక తిమ్మారెడ్డి, లేపాక్షి, శీనప్ప, తిప్పేస్వామినాయక్, లక్ష్మానాయక్, రామునాయక్, తగ్గుపర్తి నరేంద్ర, హనిమరెడ్డిపల్లి గోపాల్, గోవిందు, ఆనంత్రెడ్డి పాల్గొన్నారు. -
ఉప ఎన్నికలు అనగానే చంద్రబాబు భయపడుతున్నారు?
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్థత, పాలనతో గత నాలుగు సంవత్సరాలు నుంచి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి తీవ్రంగా మడిపడ్డారు. ఆయన గురువవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... శుక్రవారం రోజు బ్లాక్ డేగా గంట స్తంభం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రజల ఆంకాంక్ష మేరకు ప్రత్యేకహాదా కోసమే వైఎస్సార్ సీసీ ఎంపీలు ఒక సంవత్సరం పదవి కాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల శ్రేయసు కోసం తమ పదవులకు రాజీనామా చేశారని అన్నారు. తమ ఎంపీలు రాజీనామాలు స్పీకర్ ఆమోదించిన తర్వాత కూడా ఉప ఎన్నికలు రావని చంద్రబాబు అనడంలోనే ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని అర్థం అవుతోందన్నారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టీడీపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలలో పది శాతం కూడా టీడీపీ అమలు చేయలేదని కోలగట్ల ధ్వజమెత్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement