breaking news
Sonam Wangchuk
-
ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్చుక్
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ భారత్ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.విద్య వెనుకబడితే.. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.THIS INDIPENDENCE DAY, I NEED YOUR HELP...This country needs a peaceful revolution, at least in how we chose our leaders... if we are to remain even a respectable nation by 2047.Close to half of our MPs have criminal cases and a third have serious charges like murder, rape &… pic.twitter.com/10byPuzwtX— Sonam Wangchuk (@Wangchuk66) August 13, 2026అదే నాకు బహుమతి.. అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
నమ్మకం పోయింది.. వాంగ్చుక్ సంచలన ఆరోపణలు
ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కేంద్రం సమక్షంలోనే దీక్ష విరమించాలన్నది తన ఉద్దేశం ఏమాత్రం కాదని.. ఆ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారాయన. అయితే ఆ ఘటన తర్వాత ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన అర్ధరాత్రి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీక్ష విరమణ సమయంలో తీసిన ఫొటోలను వెంటనే విడుదల చేయబోమని మంత్రులు తనకు హామీ ఇచ్చారని, అయితే ఆ మాటను తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.“అందరి సమక్షంలో ప్రకటించాలని కోరా”దీక్ష విరమణను కేవలం అధికార పార్టీ కార్యక్రమంలా చూపించకూడదని తాను భావించినట్లు వాంగ్చుక్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి ప్రతినిధులు కూడా పాల్గొన్న తర్వాతే ఈ విషయాన్ని ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. “విపక్ష నేతలు, విద్యార్థి నాయకులతో కలిసి ఉమ్మడిగా ప్రకటన చేద్దామని చెప్పాను. ఫొటోలు కూడా అందరి భాగస్వామ్యంతోనే విడుదల చేయాలని కోరాను. దీనికి వారు అంగీకరించారు” అని వాంగ్చుక్ పేర్కొన్నారు. ఈ అంగీకారానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా సాక్షులుగా ఉన్నారని ఆయన తెలిపారు.“కొన్ని నిమిషాల్లోనే ఫొటోలు బయటకు వచ్చాయి”అయితే తనతో జరిగిన అంగీకారం కొద్ది నిమిషాల్లోనే తనకు షాక్ తగిలిందని అన్నారు. “కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫొటోలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయనితో ఐబీ అధికారి వచ్చి నాకు చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యా. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం.. నమ్మకాన్ని దెబ్బతీసింది అని ఆయన అన్నారు.రాహుల్ గాంధీతోనూ సంప్రదింపులు..తన భార్య గీతాంజలి అంగ్మో.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడి, ఆయన చేతుల మీదుగా దీక్షను ముగించే అవకాశం ఉందా అని ప్రయత్నించారని వెల్లడించారు. అయితే అందుకు రాహుల్ గాంధీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తన భార్యపై కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయని, వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని వాంగ్చుక్ పేర్కొన్నారు.డీల్ చేసుకోవాలనుకుంటే..తన దీక్ష ముగింపు విషయంలో ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు. “నాకు ఏదైనా ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే 26 రోజుల పాటు దీక్ష చేసే అవసరం లేదు. అంతకంటే పెద్ద అవకాశాలు నాకు ఉండేవి” అని అన్నారు. తనకు పదవులు లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యమని స్పష్టం చేశారు.26 రోజుల దీక్ష.. 10 కేజీల బరువునీట్ వ్యవహారంలో అవకతవకలు, పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికే నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన సంఘీభావం తెలపగా.. ఆయన దీక్షకు ఆ సంస్థ కూడా మద్దతు తెలిపింది. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం, కోర్టు జోక్యంతో బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. నిరసనకారులెవరూ ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల అంశంపై వీడియో సందేశం ఇచ్చిన తర్వాత జూలై 24న వాంగ్చుక్ తన 26 రోజుల దీక్షను విరమించారు. అయితే దీక్ష విరమణ సమయంలో కేంద్ర మంత్రులు ఆయనకు సూప్ అందిస్తున్న ఫొటోలు బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఆయన కేంద్రంతో డీల్ కుదుర్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు దిగారు కొందరు ఆందోళనకారులు. ఈ వ్యవహారంపై వాంగ్చుక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. -
ఉధృతమవుతున్న ఉద్యమం
రాంచీ/ఛత్రపతి శంభాజీనగర్: జార్ఖండ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడి పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న డిమాండ్తో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగార్థులు, ఉద్యమకారులకు మద్దతుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. మరో ఐదుగురు ఉద్యమకారులు మంగళవారం రాత్రి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ఉద్యమానికి నైతిక బలాన్నిస్తూ ఇద్దరు మహిళలు సహా ఐదుగురు కొత్తగా దీక్షలో భాగస్వాములయ్యారు. డిమాండ్లను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు’’అని జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి జీవన్ కుమార్ ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకే నిరాహార దీక్షలో కూర్చున్నానని నాయకురాలు సబితా కుమారి తెలిపారు. బుధవారం ఉద్యమకారుల దీక్షాస్థలిలో జాతీయజెండాలతో ‘తిరంగా యాత్ర’కార్యక్రమం చేపట్టారు. ‘జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్ ్స మంచ్’పేరుతో ఉద్యోగార్థులు జూలై 25వ తేదీన ఈ నిరసనను మొదలెట్టిన విషయం తెల్సిందే. చర్చలకు ఆహ్వానించిన సర్కార్ చర్చలకు సిద్ధమని హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాంచీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కుమార్ రజత్, అదనపు జిల్లా మేజి్రస్టేట్(శాంతిభద్రతలు) ధనంజయ్ కుమార్లు దీక్షా స్థలికి వచ్చారు. సీఎం అధికార నివాసంలో చర్చలకు రావాలని ఐదుగురు ఉద్యమనేతలను అధికారులు ఆహ్వానించారు. కనీసం నీరైనా తాగండి: వాంగ్చుక్ లద్దాఖ్ సామాజిక వేత్త, ఇటీవల జంతర్మంతర్లో రోజులతరబడి నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్చుక్ బుధవారం రాంచీలో దీక్ష చేస్తున్న వారిని విజ్ఞప్తిచేశారు. దీక్షచేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతోతో వాంగ్చుక్ బుధవారం మాట్లాడారు. ‘‘మీ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతున్నాయి. ఆరోగ్యం విషమించకుండా ఉండాలంటే కనీసం నీళ్లు అయినా తాగండి. అప్పుడు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష సాధ్యం’’అని సూచించారు. వాంగ్చుక్ విజ్ఞప్తిమేరకు మహతో తర్వాత కొద్దిగా నీళ్లు తాగారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నారు. అంతటా పేపర్ లీకేజీలు: సీఎం చర్చలకు సిద్ధమని సీఎం సోరెన్ ప్రకటించారు. ఉద్యమంపై ఆయన ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘‘యువత లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మా రాష్ట్రానికే పరిమితంకాలేదు. ఇది దేశవ్యాప్తంగా యువతకు సమస్యగా తయారైంది. రాత్రిపగలు రాష్ట్రంలో దర్యాప్తు కొనసాగుతోంది. నేరస్తులను జైలుకు పంపిస్తాం. దర్యాప్తుతో మేం ఆగిపోం. యువత సమస్యలకు పరిష్కారం చూపిస్తాం’’అని సోరెన్ అన్నారు.జవాబుదారీగా ఉండాల్సిందే: దీప్కే ఉద్యమిస్తున్న వందలాది మంది విద్యార్థులకు తమ సహాయసహకారాలు, తోడ్పాటు ఎప్పుడూ ఉంటాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజీత్ దీప్కే స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలో సీజేపీ కీలక భేటీకి ముందు దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘‘జార్ఖండ్లో పోటీపరీక్షల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదాకా మేం ఊరుకోం. జవాబుదారీగా ఉంటామని ప్రకటించేదాకా ఒత్తిడిచేస్తూనే ఉంటాం. మేం జార్ఖండ్కు వెళ్తాం. ఆ విద్యార్తుల ప్రతి డిమాండ్ సాధనకు కలిసి పోరాడతాం’’అని దీప్కే ప్రకటించారు. -
CJP సంబరాలపై వాంగ్చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్గా మారిన వేళ.. వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ డిశ్చార్జ్.. నేరుగా అక్కడకు..
గురుగ్రామ్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ సోమవారం గురుగ్రామ్లోని మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సోనమ్ వాంగ్చుక్ తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్ఘాట్లో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే వచ్చానని వాంగ్చుక్ అన్నారు. అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమని చెప్పారు. ఇంతకు ముందు వాంగ్చుక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేస్తూ.. "ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా శరీరం నెమ్మదిగా బలాన్ని తిరిగి పొందుతోంది" అని చెప్పారు. లద్ధాక్కు తిరిగి వెళ్లే ముందు మహాత్మా గాంధీకి నివాళి అర్పించేందుకు రాజ్ఘాట్కు వెళ్తానని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సాగిన విద్యార్థుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మెదాంతా ఆస్పత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. "డిశ్చార్జ్ చేసే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయన పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఔట్ పేషెంగ్లా వచ్చి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించాం" అని మెదాంతా ది మెడిసిటీ వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ దురాణి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.వాంగ్చుక్ జూలై 21న ఢిల్లీలో జరిగిన 'సంసద్ చలో' ర్యాలీ తర్వాత ప్రైవేట్ ఆసుత్రిలో చేరారు. జూలై 18న జంతర్ మంతర్ నుంచి ఆయనను తీసుకెళ్లి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందారు. నీట్ ప్రశ్నపత్రం లీక్కు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్షకు నాయకత్వం వహించారు. ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు ముందు, జూలై 24న ఆయన నిరాహార దీక్షను ముగించారు. -
డిశ్చార్జ్ తర్వాత వాంగ్చుక్ ప్రణాళిక ఇదే..
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష విరమించిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ సోమవారం గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం ఆయన రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పిస్తారని, ఆ తర్వాత లడఖ్కు పయనమవుతారని ఆయన బృందం వెల్లడించింది.గత శుక్రవారం అర్ధరాత్రి తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించిన వాంగ్చుక్, ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు, జూన్ 28న కూడా ఆయన రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.జూన్ 28న విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళనలో చేరిన వాంగ్చుక్ 26 రోజుల పాటు నిరవధిక దీక్ష కొనసాగించారు. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనను ఖైదీలా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై బాధ్యుల నుంచి జవాబుదారీతనం కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శనివారం ముగిసింది.ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు థన్బర్గ్ ఎందుకు మద్దతు పలికారు? -
ఆరోపణలను ఖండించిన వాంగ్చుక్
న్యూఢిల్లీ: కేంద్రంతో కుదిరిన ‘‘ఒప్పందం’’మేరకే తాను 26 రోజుల ఆమరణ నిరాహారదీక్షను ఉపసంహరించానన్న వార్తలను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఖండించారు. జంతర్మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చినందుకే విరమించినట్లు స్పష్టం చేశారు. గత ఏడాది సెపె్టంబర్ 24న లద్దాఖ్లో యువతపై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుంటూ, ఢిల్లీలో కూడా అలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షను ఉపసంహరించుకుని శాంతి కోసం పిలుపునిస్తే పరిస్థితి సర్దుకుంటుందని భావించానని చెప్పారు. శుక్రవారం ఆర్ధరాత్రి యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసిన సోనమ్ నిరాహార దీక్ష విరమణకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదాన్ని కూడా ఆయన ఈ వీడియోలో పోస్ట్ చేశారు. తనను అరెస్ట్ అయినా చేయాలని, లేదంటే స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం కలి్పంచాలని వాంగ్చుక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కేంద్ర మంత్రుల చర్చల సందర్భంగా తాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టబట్టలేదని, విద్యార్థులు కేసుల్లో చిక్కుకో కూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నానని చెప్పారు. లోపాయికారి ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే 26 రోజులపాటు ఆకలితో ఎలా ఉండేవాడినని ప్రశ్నించారు. ఏసీ గదిలో కూర్చొని ఒప్పందం చేసుకునే వాడినని అన్నారు. మంత్రులు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంతోపాటు, పార్లమెంటులో చర్చకు అంగీకరించారని, కేసుల విషయంలో మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఆందోళన చెందాననన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల సమక్షంలోనే నిరాహార దీక్ష ఉపసంహరించాలని అనుకున్నా మంత్రులు రాకముందు నుంచే తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని అన్నారు. వారు లేకుండానే దీక్ష విరమించడంపై దుఃఖం వ్యక్తం చేశారు. -
'కాక్రోచ్' గెలిచింది
న్యూఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్ దాస్ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు. శనివారం జంతర్మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జంతర్మంతర్ వద్ద సంబరాల హోరు కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్మంతర్ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్మంతర్ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్ వాంగ్చుక్ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్ జెడ్కి అభినందనలు తెలియజేశారు. అవినీతికి ప్రతీక ప్రధాన్ ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్ ట్రూత్’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్ గన్లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
వాంగ్చుక్కు కనీసం థ్యాంక్స్ చెప్పని అభిజీత్ దీప్కే..
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వేదికపై.. తాము విజయం సాధించామని ప్రకటించారు. అయితే, 26 రోజుల నిరాహార దీక్షతో ఈ నిరసనను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ పేరును తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.శనివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికపై దీప్కే మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు నన్ను హీరోగా చూడొద్దు. ఆ తప్పు చేయకండి. ఒక వ్యక్తిని హీరోగా మార్చడం వల్లే ఈ దేశం నష్టపోయింది. ప్రభుత్వానికి తలవంచకపోతే ఎవరినైనా రాజీనామా చేయించగలమని ఈ విజయం నిరూపించింది. ఇది ప్రజాస్వామ్యం" అని పేర్కొన్నారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన సోనం వాంగ్చుక్ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఉద్యమానికి బలం ఇచ్చిన వాంగ్చుక్అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి జూన్ 6న భారత్కు వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రారంభించారు. తొలి రోజుల్లో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. సౌరభ్ దాస్, ఆశుతోష్ రంకా, ఉద్యోగం కోల్పోయిన విజయతా దహియా వంటి కొద్దిమంది సహచరులు మాత్రమే ఆయనతో ఉన్నారు. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతకు మద్దతు ప్రకటించారు.ప్రారంభంలో నిరసనకు పెద్దగా స్పందన లేకపోవడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, జూన్ 28న వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగి, నిరసనకు భారీగా మద్దతు రావడం ప్రారంభమైంది. జంతర్ మంతర్కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఆసుపత్రికి తరలింపు.. ఉద్యమానికి మరింత ఊపుపరిస్థితి విషమించడంతో జూలై 18న ప్రభుత్వం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. అనంతరం ఆయనను గురుగ్రామ్లోని మెదంతా ఆసుపత్రికి మార్చారు. ఆసుపత్రిలోనే ఆయన నిరాహార దీక్ష కొనసాగించడంతో, అది ఉద్యమానికి కేంద్ర బిందువైంది. లక్షలాది మంది తమ వాట్సాప్ డీపీగా "ఐ సపోర్ట్ సోమ్" అనే సందేశంతో వాంగ్చుక్ ఫొటోను పెట్టుకున్నారు.ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా, పంపిన సందేశాలు నిరసనకారులకు స్ఫూర్తినిచ్చాయి. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి భారీగా హాజరుకావాలని కూడా వాంగ్చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్గొనకపోతే "దెయ్యంలా తిరిగి వస్తాను" అంటూ భావోద్వేగ వ్యాఖ్య కూడా చేశారు.పోలీసుల చర్యలతో మరింత ఉద్ధృతంజూలై 20న వేలాది మంది పార్లమెంట్ వైపు కదిలారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలప్రయోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, వేలల్లో ప్రజలు జంతర్ మంతర్కు చేరుకున్నారు. దీంతో ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది.నిరాహార దీక్ష విరమణపై విమర్శలుజూలై 22న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీల నేపథ్యంలో వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ఆయన తన వైఖరిని సడలించారని విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేయగా, వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, విమర్శకులు మానవీయ కోణంలో ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఉద్యమం సీజేపీని దాటి..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. "ఇది ఇప్పుడు సీజేపీకి మాత్రమే సంబంధించిన ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ప్రజలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ ఉద్యమం సీజేపీ కంటే చాలా పెద్దదిగా మారింది. వాంగ్చుక్ సర్ నిరాహార దీక్ష విరమించడం మాకు సంతోషమే. ఆయన ఆరోగ్యం గురించి మేము చాలా ఆందోళన చెందాం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చింది ఆయనే" అని పేర్కొన్నారు.విజయ ప్రసంగంలో మౌనంఉద్యమం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థను దాటి ప్రజల ఉద్యమంగా మారినప్పటికీ.. ఉద్యమానికి బలం, విశ్వసనీయత, పోరాట స్ఫూర్తి అందించిన సోనం వాంగ్చుక్ పేరును విజయ ప్రసంగంలో అభిజీత్ దీప్కే ప్రస్తావించకపోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన 26 రోజుల నిరాహార దీక్షే యువత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వాంగ్చుక్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ: ఇది ప్రజాస్వామ్య విజయం అని ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలన్నారు. ఇకపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీజేపీ,జెన్జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విజయానికి సంకేతంగా 'వి' గుర్తును చూపుతున్న దృశ్యాన్ని ఆయన పంచుకున్నారు.నీట్ లీకేజ్లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.అయితే, ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం(జులై, 18) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిన ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన దీక్ష విరమించారు. ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
నా నిజాయితీని నిరూపించాలా? విమర్శలకు వాంగ్ చుక్ ఘాటు రియాక్షన్
-
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్చుక్ గురుగ్రామ్లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
దీక్షను విరమించిన వాంగ్ చుంగ్
-
మోదీ వీడియో.. వాంగ్చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్కుమార్ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
జంతర్ మంతర్కు వేలాది మంది.. ఇది వాంగ్చుక్, దిప్కే వల్ల కాదు..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలకు వేలాది మంది తరలివస్తున్నారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేతృత్వం వహిస్తుండగా, లడఖ్కు చెందిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. అయితే, ఇంతమంది జనం స్వచ్ఛందంగా తరలివస్తుండటానికి అసలు కారణం ఈ ఇద్దరు నేతల ఆకర్షణ మాత్రమే కాదని, 2026 నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పేరుకుపోయిన తీవ్ర ఆగ్రహమేనని క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి. పరీక్ష ఒత్తిడితో తోబుట్టువులను, స్నేహితులను కోల్పోయిన అనేకమంది యువకులు, పాఠశాల విద్యార్థులు సైతం తల్లిదండ్రులకు తెలియకుండా ఇక్కడికి చేరుకుంటున్నారు.జంతర్ మంతర్కు ఇప్పుడు వేలాదిగా చేరుతున్న వారిని నడిపిస్తున్నది ఒక్క నాయకుడు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం తర్వాత విద్యార్థులు, యువతలో ఆగ్రహం మరింత పెరిగిందని అంటున్నారు. అదే దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఢిల్లీకి రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అందుకే ఈ ఉద్యమం వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజల ఆవేదన చుట్టూ విస్తరిస్తోందని వివరిస్తున్నారు.ఇలా మొదలైంది సీజేపీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఐఎస్ఏ వంటి విద్యార్థి సంఘాలు 2026 జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 28న వాంగ్చుక్ దీక్ష ప్రారంభించగా, జులై మధ్యలో బారికేడ్లు తొలగించి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం, దిప్కేపై సిరా దాడి ఘటన మీడియా దృష్టిని మరింత పెంచాయి.జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు 'సంసద్ చలో' పేరిట వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపు కవాతు చేపట్టగా, భద్రతా బారికేడ్లను దాటే యత్నం చేయడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో నిరసనకారులు, పోలీసులు స్వల్పంగా గాయపడగా, 10-15 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయలేదని అధికారులు తెలిపారు.రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలు పరీక్షల సమస్యలకు మించి రాజకీయ లక్ష్యాలతో సాగుతున్నాయని ఆరోపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ స్పందన, వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి, మరిన్ని విద్యార్థి బృందాల భాగస్వామ్యంపైనే ఈ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల ఆగ్రహమే కారణంనీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకల వల్ల జీవితాలు నాశనమైన సాధారణ విద్యార్థులు, కుటుంబాలే ఈ జనప్రవాహానికి నిజమైన కారణం. నాయకుల పిలుపు కంటే మించి, వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన సామాన్యుల ఆగ్రహమే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. -
నిరసనకారులపై చర్యలు నిలిపేస్తే దీక్ష ఆపేస్తా
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పోలీసులతో ప్రతిఘటనకు దిగిన ఉద్యమకారులైన విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులను కేసుల పేరిట వేధించకుండా వదిలేస్తే తాను ఆస్పత్రిలో నిరాహార దీక్షను విరమిస్తానని సోనమ్ వాంగ్చుక్ బుధవారం ప్రకటించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను మంగళవారం రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఐసీయూలో ఉన్న వాంగ్చుక్ను మంత్రులు యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. గంటపాటు మంత్రులు వాంగ్చుక్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల చర్చల వివరాలు వెల్లడికాలేదు. మంత్రులు పరామర్శించాక వాంగ్చుక్ బుధవారం ఒక లేఖ రాశారు. లేఖలో వాంగ్చుక్ ప్రస్తావించిన షరతులు... 1. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపంతో చనిపోయిన నీట్ పరీక్షార్థుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలి 2. పరీక్షల్లో అక్రమాలపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి 3. విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 4. ఉద్యమంలో పాల్గొన్న సీజేపీ మద్దతుదారులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయకూడదు ఉద్యమకారులను ఒప్పిస్తా ‘‘ఈ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటే దీక్షాస్థలిని వీడాలని, ప్రభుత్వప్రతినిధులతో చర్చలకు ముందుకు రావాలని నిరసనకారులను ఒప్పిస్తా. ఆ మేరకు వాళ్లతో మాట్లాడతా. నిరాహార దీక్ష ఆపేయాలని నన్ను ఇప్పటికే 65 మంది ఎంపీలు స్వయంగా, లేఖల రూపంలో కోరారు. నేనింకా ఎంతో దేశసేవ చేయాల్సి ఉంది. అందుకోసమైనా బతుకుతా. విద్యారంగానికి సేవచేసేందుకు విద్యార్థుల కోసం తిరిగి నా వృత్తిజీవితంలోకి వెళ్తా. అయితే ఎవరి కోసమైతే ఈ ఉద్యమం, దీక్ష ఆరంభించానో వాళ్ల త్యాగాలను పణంగా పెట్టి మధ్యలోనే దీక్షను విరమించలేను’’అని వాంగ్చుక్ అన్నారు. -
నిరాహారదీక్ష విరమణపై కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని స్పష్టమైన హామీ ఇస్తే నిరాహారదీక్ష విరమిస్తానని తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్కు లేఖ రాసి సోనమ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘నిన్న రాత్రి ఆసుపత్రికి వచ్చి నన్ను కలిసినందుకు, నా నిరాహార దీక్షను విరమించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసినందుకు ధన్యవాదాలు. మన చర్చ సందర్భంగా ఈ కింది అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మీరు నాకు హామీ ఇచ్చారు.ప్రశ్నపత్రం లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా పరిశీలిస్తూ, జవాబుదారీతనం నిర్ధారించేలా పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరపాలి. 2026 జులై 20న జరిగిన "చలో సంసద్" ర్యాలీ.. పోలీసులు అమానుషంగా వ్యవహరించినా, అధిక బలప్రయోగం చేసినా ప్రశాంతంగానే సాగింది. నిరసనకారుల సహనం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలన్న అంకితభావాన్ని దేశం, ప్రపంచం చూసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, ప్రతీకార చర్యలకు దిగడం వంటివి చేయొద్దు. ప్రజాస్వామ్య సంస్థలపై వారి నమ్మకం దెబ్బతినకూడదని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.మీరు నన్ను కలిసిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది పార్లమెంట్ సభ్యులు నాకు లేఖలు రాశారు. కొందరు ఇప్పటికే వచ్చి కలిశారు. మరికొందరు ఈ సాయంత్రం రానున్నారు. దేశ సేవలో నేను ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని గుర్తుచేస్తూ, నిరాహార దీక్షను విరమించాలని వారంతా కోరారు. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నేను జీవించాలనుకుంటున్నాను. నా విద్యార్థుల వద్దకు, విద్యా రంగంలోకి, నా జీవితాన్ని అంకితం చేసిన పనిలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. అయితే, ఈ ఉద్యమం ప్రారంభానికి కారణమైన యువత ప్రయోజనాలను పక్కనపెట్టి అలా చేయలేను.అందువల్ల, ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు, ప్రతీకార చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. న్యాయమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతూ తమ గొంతు వినిపించడమే వారు చేసిన ఏకైక "తప్పు".అలాంటి హామీ వస్తే, ప్రభుత్వం నా విజ్ఞప్తినే కాదు, లక్షలాది మంది భారత యువత ఆకాంక్షలను కూడా ఆలకించిందన్న నమ్మకంతో నా నిరాహార దీక్షను విరమిస్తాను. అలాంటి హామీ రాకపోతే, నిరవధికంగా నా నిరాహార దీక్షను కొనసాగించక తప్పదు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఇకపై పోలీసులు అధిక బలప్రయోగం చేయరని కూడా ఆశిస్తున్నాను.మన ప్రజాస్వామ్య భవిష్యత్తు, తనతో ఏకీభవించే వారితో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఆధారపడదు. ధైర్యం, ఆశ, దృఢ విశ్వాసంతో మాట్లాడే యువ పౌరులతో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. -
కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయాలు
న్యూఢిల్లీ: కాక్రోచ్లు కొనసాగిస్తున్న ఉద్యమం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బుధవారం తెలిపింది. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేసింది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే బుధవారం మాట్లాడుతూ.. 25 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను వాంగ్చుక్ ఇక విరమించాలని కోరారు. పరీక్షల సంస్కరణల కోసం చేస్తున్న ఈ ఉద్యమం ఏ మాత్రమూ బలహీనపడబోదని చెప్పారు."వాంగ్చుక్ సర్ నిరాహార దీక్షను విరమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి ఆయన అవసరం. ఆయన జీవితం ఎంతో విలువైనది. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన మా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుంది" అని దిప్కే తెలిపారు.ఎక్స్లో చేసిన పోస్టులో సీజేపీ తన విజ్ఞప్తిని మరోసారి వెల్లడించింది. "సోనం సర్కు సీజేపీ విజ్ఞప్తి. మీ త్యాగం ఒక తరం యువతకు స్ఫూర్తినిచ్చింది. దయచేసి మీ నిరాహార దీక్షను విరమించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పరీక్షల్లో న్యాయం జరిగే వరకు, మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం" అని పేర్కొంది.మెదాంత ఆసుపత్రికి ఎంపీలు! వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించేలా ఒప్పించేందుకు ప్రతిపక్ష ఎంపీల బృందం గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన వేళ ఈ విజ్ఞప్తి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ వాంగ్చుక్ను కలిసి, పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, విద్యా రంగంలో జవాబుదారీతనం అంశాలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వనున్నారు.పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇస్తే తాను నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్చుక్ ఇప్పటికే చెప్పారు. అయితే, సీజేపీ చేపట్టిన "సంసద్ చలో" ర్యాలీపై ఢిల్లీలో పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత, హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జవాబుదారీతనం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వాంగ్చుక్ జూన్ 28న జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలో చేరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల తర్వాత ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నపత్రం లీక్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మరింత పెంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించింది. విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను కూడా పార్టీ ఖండించింది. పరీక్షల సంస్కరణలు కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపింది.జేపీ నడ్డా నివాసానికి మేము రాముసీజేపీ బుధవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లి సమావేశం కావడానికి నిరాకరించింది. విద్యార్థులు, నిరసనకారులు లేవనెత్తిన అంశాలపై చర్చించాలంటే మంత్రులే ప్రజా న్యాయస్థానానికి రావాలని పార్టీ తెలిపింది.సీజేపీ కార్యకర్త సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ఎలాంటి చర్చ అయినా జంతర్ మంతర్లోని "ప్రజల న్యాయస్థానం"లోనే జరగాలని స్పష్టం చేశారు. బీజేపీ నేత జేపీ నడ్డా నివాసంలో చర్చలు జరపాలన్న ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, "మళ్లీ తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. మేము నేరుగా తిరస్కరించాం. ప్రజల న్యాయస్థానం ఇక్కడే ఉంది. మంత్రులే ప్రజల మధ్యకు రావాలి" అని దాస్ చెప్పారు.We request @Wangchuk66 sir to end his hunger strike. The country needs him, and his life is far too precious to be put at further risk.The peaceful protest at Jantar Mantar will continue until our demands are met. pic.twitter.com/rCfygpuCH6— Abhijeet Dipke (@abhijeet_dipke) July 22, 2026 -
గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు..
దేశంలో ఆహార నిరాకరణ అనేది కేవలం ఒక నిరసన కానే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచే ఒక చరిత్రక మార్గం. అధికార పీఠాల ముందు న్యాయం కోసం గళమెత్తిన గొంతులు విస్మరణకు గురైనప్పుడల్లా, అహింసాత్మక ఆయుధమైన ‘నిరాహార దీక్ష’ వ్యవస్థల పునాదులను కదిలించింది. నాటి మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షలనుంచి నేటి సోనమ్ వాంగ్చుక్ పోరాటం వరకు.. ఆహార పానీయాలను త్యాగం చేయడం అనేది నైతిక బలానికి నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో చర్చనీయాంశంగా నిలిచిన చారిత్రక నిరాహార దీక్షలు..ఇరోమ్ షర్మిల: అత్యంత సుదీర్ఘ పోరాటం మణిపూర్ ‘ఐరన్ లేడీ’గా పేరొందిన ఇరోమ్ చాను షర్మిల.. 2000లో మాలోమ్లో జరిగిన మారణహోమం తర్వాత సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, చరిత్రాత్మక దీక్ష చేపట్టారు. ప్రపంచ చరిత్రలోనే ఇది సుదీర్ఘ నిరాహార దీక్షగా నమోదైంది. ఈ సమయంలో ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుని, ద్రవ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలు నిలిపింది. ఆగస్టు 2016లో ఆమె రాజకీయ మార్గంలో పోరాడేందుకు దీక్ష విరమించారు. ఈ పోరాటం వృథా పోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. దీని ప్రభావంతో తదంతర కాలంలో ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పాక్షికంగా తొలగించింది.స్వామి నిగమానంద్: గంగానది రక్షణ కోసంహరిద్వార్ వద్ద గంగానది ఉనికిని కాపాడేందుకు, అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్లకు వ్యతిరేకంగా మాతృసదన్కు చెందిన సంత్ స్వామి నిగమానంద్ 2011 ఫిబ్రవరి 19న దీక్ష ప్రారంభించారు. దాదాపు 115 రోజుల పాటు ఆహారం లేకుండా పోరాడిన ఆయన, 2011 జూన్ 13న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అత్యున్నత త్యాగం దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, పౌరులను కదిలించింది. ఇది సమాజంలో పర్యావరణ పరిరక్షణ భావనను బలంగా నాటింది.జీడీ అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సానంద్)ఐఐటీ కాన్పూర్ పూర్వ ప్రొఫెసర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మౌలిక విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగానది నిర్మలత్వం, నిరంతర ప్రవాహం కోసం ‘గంగా సంరక్షణ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ 2018 జూన్ 22న దీక్ష చేపట్టారు. 111 రోజుల కఠిన ఉపవాసం తర్వాత 2018 అక్టోబర్ 11న రుషీకేశ్లో ఆయన కన్నుమూశారు. ఒక విద్యావంతుడైన శాస్త్రవేత్త పర్యావరణం కోసం ప్రాణాలర్పించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి వినాశనంపై పెద్ద ప్రశ్నగా మారింది.జతిన్ దాస్, భగత్ సింగ్: లాహోర్ జైలులో..1929లో లాహోర్ సెంట్రల్ జైలులో స్వాతంత్య్ర సమరయోధులు జతిన్ దాస్, భగత్ సింగ్ వారి సహచరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. జైలులోని భారతీయ ఖైదీలపై జరుగుతున్న జాత్యహంకారం, అమానుష ప్రవర్తన, నాసిరకం ఆహారానికి నిరసనగా ఈ దీక్ష సాగింది. 63 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా పోరాడి, 1929 సెప్టెంబర్ 13న జతిన్ దాస్ ప్రాణాలర్పించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ఖైదీలకు రాజకీయ ఖైదీల హోదా ఇచ్చేందుకు, జైలు నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు దిగివచ్చింది.మహాత్మా గాంధీ: సబర్మతి, యరవాడల నుంచి..జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితకాలంలో 17 సార్లు నిరాహారదీక్షలు చేశారు. అందులో 1933లో అస్పృశ్యతా నివారణ, దళితుల ఉద్ధరణకు మద్దతుగా చేసిన 21 రోజుల ఆత్మశుద్ధి ఉపవాసం అత్యంత ప్రధానమైనది. గాంధీజీకి నిరాహార దీక్ష కేవలం రాజకీయ ఒత్తిడి సాధనం కాదు. అది ఆత్మపరిశీలన, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అంతరాత్మ పిలుపు. ఆయన ఉపవాసాలు కుల అహంకారాన్ని దెబ్బతీసి, స్వాతంత్య్ర సంగ్రామంలో సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశాయి.అన్నా హజారే: అవినీతికి వ్యతిరేకంగా..2011లో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే చేసిన నిరాహార దీక్ష దేశంలోని యువతను, మధ్యతరగతిని రోడ్లపైకి తెచ్చింది. దేశంలో అవినీతి నిరోధానికి బలమైన ‘జన్ లోక్పాల్ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ ఆయన 12 రోజులు చారిత్రక దీక్ష చేశారు. ఈ పోరాట ధాటికి పార్లమెంట్ ప్రత్యేక తీర్మానం చేయాల్సి వచ్చింది.సోనమ్ వాంగ్చుక్లద్ధాఖ్ పర్యావరణ వ్యవస్థ, స్థానికులకు ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ హక్కుల కల్పన కోసం సోనమ్ వాంగ్చుక్ చేసిన పోరాటం మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా సాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, యువతకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రారంభించిన ఈ ఉద్యమంలో సోనమ్ వాంగ్చుక్ చేరారు.చట్టం ఏం చెబుతోంది?భారత రాజ్యాంగం శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పిస్తుంది. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. నిరసన వల్ల ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే పరిపాలనా యంత్రాంగం జోక్యం చేసుకోవచ్చు. దీక్ష చేపట్టినవారి ఆరోగ్యం క్షీణించిన సందర్భాల్లో వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. భారత్లోనే కాకుండా ఐర్లాండ్, బ్రిటన్, అమెరికా, టర్కీ వంటి అనేక దేశాల్లోనూ ఖైదీలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ సంస్థలు నిరాహార దీక్షలను ఆశ్రయించాయి.ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం! -
సోనమ్ వాంగ్చుక్కు బిగ్ రిలీఫ్?!
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తమవుతున్న ఆందోళనలను విస్మరించలేమని స్పష్టం చేసిన కోర్టు.. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం ఆయన ప్రాణాలను కాపాడటమేనని పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించే ప్రతిపాదనను పరిశీలించింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షా విధానంలో మార్పులు కోరుతూ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన అనుమతి లేకుండా ఆసుపత్రికి తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపై నమ్మకం లేదని ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను కుటుంబం కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా కోర్టు.. వాంగ్చుక్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆందోళనలు, మెరుగైన వైద్య సదుపాయాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ సందర్భంగా హైకోర్టు.. “ఆయన ప్రాణాలను కాపాడటమే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత” అని పేర్కొంది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించిన కోర్టు.. అందుతున్న చికిత్స వివరాలను కూడా కోరింది.వాంగ్చుక్ తన తరలింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను కలిసేందుకు పరిమితులు విధించారని, తన పరికరాలను తీసుకున్నారని, కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.కాగా.. విద్యార్థుల సమస్యలు, పరీక్షా వ్యవస్థలో లోపాలు, విద్యా రంగ సంస్కరణల డిమాండ్లతో వాంగ్చుక్ జంతర్ మంతర్లో 20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అయింది. దీంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.వాంగ్చుక్ ఆసుపత్రికి తరలింపు అంశం నేపథ్యంలో కాక్రోచ్ జంతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్టీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వైద్యుల సూచనలు, భద్రతా కారణాల దృష్ట్యానే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం వాంగ్చుక్ను మెదాంత ఆసుపత్రికి తరలించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం తరఫున న్యాయవాది కూడా మెదాంతకు తరలింపుపై అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా తరలింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు జోక్యంతో వాంగ్చుక్ ఆరోగ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి.. మరోవైపు ఆయన డిమాండ్లపై కొనసాగుతున్న ఆందోళనలు ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. -
‘వాంగ్చుక్కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సొనమ్ వాంగ్చుక్ విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా సంచలన ప్రకటన చేశారు. వాంగ్చుక్కు ఎలాంటి హాని జరిగినా తాను ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. వాంగ్చుక్ నిరసన దీక్షను ముగిసేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలపై ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఏ చిన్న నష్టం జరిగినా అది మన అందరి వైఫల్యమే అవుతుందని, ఒకవేళ అదే జరిగితే తాను ఎంపీగా ఉండలేనని తేల్చిచెప్పారు. वांगचुक जी का अनिश्चितकालीन उपवास खत्म हो, यह सुनिश्चित करना संसद, सरकार और न्यायपालिका—सभी की सामूहिक ज़िम्मेदारी है। अगर उन्हें कोई नुकसान पहुँचता है, तो यह हम सबकी सामूहिक विफलता होगी। अगर ऐसा होता है, तो कम से कम मैं तो सांसद बने रहना बिल्कुल पसंद नहीं करूँगा।#SonamWangchuk— Vivek Tankha (@VTankha) July 21, 2026గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సొనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ న్యాయవాది అయిన వివేక్ తన్ఖా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ప్రాణాపాయ స్థితిలో సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరడంతో వాంగ్చుక్ అంగీకరించినప్పటికీ, అంతకుముందు రోజు జరిగిన పోలీసుల లాఠీఛార్జీని చూసి మనస్తాపం చెంది దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని, పొటాషియం స్థాయి 3.2 mEq/L గా నమోదైందని తెలిపారు. అంతేకాకుండా, ఆయన రక్తహీనత, తెల్ల రక్తకణాల లోపంతో కూడిన ‘పాన్ సైటోపీనియా’ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఎంత చెప్పినా ఆయన ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, కేవలం ఓఆర్ఎస్, పొటాషియం సప్లిమెంట్లను మాత్రమే తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘ కాలం పాటు ఆహారం మానివేయడం వల్ల ఆయన శరీరం తీవ్ర ఒత్తిడికి గురైందని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలుస్తోంది. -
అప్పటివరకు నా నిరాహార దీక్ష కొనసాగుతుంది: వాంగ్చుక్
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని ఆయన ఎక్స్లో తెలిపారు. "శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై క్రూరత్వాన్ని చూపుతున్నారు. యువ నాయకులకు సంసత్ భవన్లో పార్లమెంట్ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చే వరకు, లేక ఇక్కడ ఆసుపత్రిలో నేను వారిని కలిసే అవకాశం వచ్చే వరకు నా నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అంతకంటే ముందే విద్యాశాఖ మంత్రిని బాధ్యుడిగా నిర్ధారిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించేందుకు, విద్యార్థులు తమ ఫిర్యాదులు, డిమాండ్లు పార్లమెంట్ సభ్యుల ముందు ఈ రోజు లేదా రేపు చెప్పే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసు బలగాలను కోరుతున్నాను. ఈ రోజు చూపిన ఓర్పు, సహనాన్నే యువ నిరసనకారులు రేపూ చూపుతారని నా నమ్మకం" అని చెప్పారు. జులై 20 ఉదయం సోనం వాంగ్చుక్ ఒక ప్రకటన విడుదల చేసి, ఈ రోజు 3 షరతుల్లో ఏదైనా నెరవేరితే తన నిరాహార దీక్షను విరమిస్తానని తెలిపారు. పరిస్థితులు మారకపోవడంతో దీక్ష ముగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.కేరళ హౌస్ సమీపంలో నిరసనసెంట్రల్ ఢిల్లీలోని కేరళ హౌస్ సమీపంలో ధర్నా కొనసాగుతోందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. "అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, గీతాంజలి జంతర్ మంతర్లో ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు కేరళ హౌస్ ముందు ఉన్నారు" అని సీజేపీ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
‘నన్ను వదిలేయండి.. సీజేపీ ఆందోళనకు వెళ్తా’
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంట్ మార్చ్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సఫ్దర్జంగ్ ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పారామీటర్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కోరారు. గత 21 రోజులుగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, కార్యకర్తలు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసురుతూ ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. -
ఆమరణ దీక్షను విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్
విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను విరమించేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సిద్ధమయ్యారు. ఆయన పిలుపు మేరకు మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే మూడు షరతులు నెరవేరిస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్చుక్ స్పష్టం చేశారు. జూన్ 28న ప్రారంభమైన వాంగ్చుక్ ఆమరణ దీక్ష 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు ఇటీవల తొలగించి ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి చేతిరాతతో విడుదల చేసిన ఓ ప్రకటనలో వాంగ్చుక్.. దీక్ష ముగించేందుకు మూడు షరతులను వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇవ్వాలని కోరారు. అలాకాకుంటే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దీక్ష కొనసాగించడం సాధ్యం కాకపోతే.. ఎంపీలు, రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను ఉపవాస దీక్షను విరమిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన కదలికలు, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్పై ఆంక్షలు ఉన్నాయని వాంగ్చుక్ ఆరోపించారు.Activist Sonam Wangchuk tweets, "... I will end my fast on 20th July if:a. If the govt takes accountability of the recent failures in Education system, Paper leaks etc orb. If I and the leadership of CJP reach the doorsteps of Parliament where MPs and leaders of various… pic.twitter.com/XBAgvbkvkw— ANI (@ANI) July 20, 2026భార్య ప్రకటనలో రెండే!ఇదే సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన దీక్ష విరమణపై స్పందించారు. రాజకీయ నేతలు ఆయనను కలసి.. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చకు హామీ ఇస్తే దీక్ష ముగిస్తారని ఆమె తెలిపారు.ఆమె వెల్లడించిన రెండు అంశాల్లో.. ఒకటి రాజకీయ నేతలు వాంగ్చుక్ను కలవడం, రెండోది విద్యా వ్యవస్థలో బాధ్యతపై పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇవ్వడం. అయితే ఆ తర్వాత వాంగ్చుక్ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను కలిపి మూడు షరతులుగా వివరించారు.ప్రైవేటు ఆసుపత్రికి తరలింపుపై కోర్టు నిరాకరణవాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతరంగా తరలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పర్యవేక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ప్రాథమికంగా భావించలేమని పేర్కొంది. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.నేడు ‘చలో సంసద్’.. ఢిల్లీలో భారీ భద్రతమరోవైపు వాంగ్చుక్ మద్దతుదారులు సోమవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఈ కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఎలాంటి మార్చ్కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రాంతంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. జంతర్మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.వైద్యుల పర్యవేక్షణలో వాంగ్చుక్దాదాపు మూడు వారాలుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్చుక్ 10 కేజీల బరువు కోల్పోయారు. బలహీనత, డీహైడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సూచికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని వాంగ్చుక్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ ప్రకటన, ‘చలో సంసద్’ కార్యక్రమం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. -
ఆస్పత్రికి తరలింపు సరైందే
సాక్షి, న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఆగమేఘాల మీద పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం సమరి్థంచింది. తరలింపు నిర్ణయంలో ప్రభుత్వ ఏకపక్ష ధోరణి కన్పించట్లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ వ్యాఖ్యానించారు. సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో వాంగ్చుక్కు అందిస్తున్న వైద్య చికిత్సలో జోక్యం చేసుకునేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. ఆయన్ను ఆస్పత్రిలో చికిత్సపేరిట అక్రమంగా నిర్బంధించారన్న వాదనను కోర్టు తోసిపుచి్చంది. ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేసి, కుటుంబం కోరుకున్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. వాంగ్చుక్ ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని, ఎలక్ట్రోలైట్లను తీసుకునేందుకు ఆయన సమ్మతించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన శారీరక స్వేచ్ఛ హక్కుకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు. వాంగ్చుక్ కుటుంబ సభ్యులకు రోజంతా ఆయనను కలిసే అవకాశం కల్పించామని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. వాంగ్చుక్ వైద్య నివేదికలను కుటుంబ సభ్యులకు అందజేయాలని కోర్టు ఆదేశించారు. అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేశారు. కాగా పరీక్ష పత్రాల లీకేజీలను నిరసిస్తూ 20వ తేదీన సీజేపీ పిలుపునిచి్చన ‘చలో పార్లమెంట్ ర్యాలీ’ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా ఉద్యమకారుడు వాంగ్చుక్ అభివర్ణించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న వాంగ్చుక్ సొంతంగా రాసి, సంతకం చేసిన లేఖను భార్య గీతాంజలి ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. -
ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం: వాంగ్చుక్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తొలిసారిగా ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. జూలై 20న జరగనున్న ‘చలో పార్లమెంట్’ మార్చ్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఆయన ‘భారతదేశపు రెండో స్వాతంత్ర్య పోరాటం’గా అభివర్ణించారు. అన్యాయం, భయం, పేపర్ లీకులు, అక్రమ నిర్బంధం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసనను విజయవంతం చేసి, న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.ఆదివారం (జూలై 19) ఉదయం 8:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని విఎంఎంసి, సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగ్చుక్కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన నాడి, రక్తపోటు,ఇతర కీలక ఆరోగ్య సూచికలు సాధారణంగా ఉన్నాయి. అయితే, సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన రక్త పరీక్షల నివేదికలలో కొన్ని మార్పులు కనిపించాయి. ఆయన శరీరంపై ఉపవాస ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకే నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్యమరోవైపు, సోనమ్ వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. తన భర్తను ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, అక్కడ అందుతున్న చికిత్సపై తమకు నమ్మకం లేదని ఆమె ఆరోపించారు. అనేకసార్లు అభ్యర్థించినా, ఆసుపత్రి యాజమాన్యం ఆయనను డిశ్చార్జ్ చేయడం లేదని లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
సోనమ్ వాంగ్చుక్కు కొండంత అండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో నిన్న (శనివారం) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.. ఆయన నిరసనలో గీతాంజలి జె ఆంగ్మో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు వారాలుగా నిరాహార దీక్ష చేసిన వాంగ్చుక్కు ఆమె నిరంతరం అండగా నిలిచారు. వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆశయాల కోసం ఆమె ముందుండి పోరాడుతున్నారు.గీతాంజలి జె ఆంగ్మో ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సోనమ్ వాంగ్చుక్ గతంలో రెబెక్కా నార్మన్ అనే అమెరికన్ మహిళను వివాహం చేసుకోగా.. గీతాంజలి ఆయనకు రెండవ భార్య. ఆమె సామాజిక పారిశ్రామికవేత్త, విద్యావేత్త. సోనమ్ వాంగ్చుక్తో కలిసి ఆమె స్థాపించిన 'హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్' కో-ఫౌండర్గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె హెచ్ఐఏఎల్ సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణ అనుకూల క్యాంపస్ల నిర్మాణం, సోలార్ హీటెడ్ భవనాల రూపకల్పన వంటి వాటిపై ఈ సంస్థ పనిచేస్తుంది. 2021లో భారత సైన్యం కోసం ప్రత్యేకంగా సోలార్ హీటెడ్ టెంట్లను కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది.ఒడిశాలోని బాలాసోర్లోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించిన గీతాంజలి.. ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్, భువనేశ్వర్లోని ప్రముఖ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. డెన్మార్క్తో పాటు విదేశాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత భారత్కి తిరిగి వచ్చి పారిశ్రామికవేత్తగా మారారు. పూషన్, షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హెలియోస్ బుక్స్ వంటి పలు సంస్థలను స్థాపించారు.గీతాంజలి కేవలం విద్యావేత్త మాత్రమే కాదు.. వేదాంతం, భగవద్గీత బోధించే ఆధ్యాత్మిక అన్వేషకురాలు. ప్రతిష్టాత్మక 'చెవెనింగ్ ఫెలో' అయిన ఆమె, భారత ప్రభుత్వం నుండి 'వుమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా' జాతీయ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒడిస్సీ, రష్యన్ బ్యాలెట్ నృత్యాలలో ప్రవేశం ఉంది. నాకంటూ ఒక స్వార్థ జీవితం కాకుండా.. సమాజం కోసం ఒక గొప్ప ఆశయంతో బతకాలని అనుకున్నాను. ఒక విద్యా సదస్సులో సోనమ్ వాంగ్చుక్ను కలిసినప్పుడు నా ఆలోచనలకు తగ్గ తోడు దొరికిందనిపించిందంటూ ఆమె గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే గీతాంజలి.. భర్తకు కష్టం వచ్చిన ప్రతిసారీ కొండంత అండగా నిలబడ్డారు. గత ఏడాది లడఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో జరిగిన నిరసనల సమయంలో నలుగురు మరణించగా.. వాంగ్చుక్ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించిన సంగతి తెలిసిందే.ఆ కష్టకాలంలో గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ లేఖ రాశారు. దాదాపు 170 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత వాంగ్చుక్ విడుదలయ్యారు. ఐదు నెలల పాటు వారానికి రెండు సార్లు కేవలం 60 నిమిషాల ములాఖత్ కోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో కూడా ఆమె భర్త ఆశయాన్ని భుజానకెత్తుకున్నారు.ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన భర్త దీక్షను విరమించలేదని.. కేవలం ఉప్పు, నీరు మినహా మరేమీ తీసుకోవడం లేదని గీతాంజలి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు లేదా ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి ద్రవాలను ఇవ్వకూడదని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం చేపట్టే పార్లమెంట్ మార్చ్కు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ వాంగ్చుక్ ఈ మార్చ్లో పాల్గొనలేకపోతే.. ఆయనకు ప్రతినిధిగా నేనే ముందుండి దీనిని నడిపిస్తానంటూ ఆమె తేల్చి చెప్పారు. -
వాంగ్చుక్ దీక్ష భగ్నం!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలన్న డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్చుక్తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్లోకి చేర్చి, వెంటనే సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ చికిత్సకు వాంగ్చుక్ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్చుక్ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్చుక్ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు. అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్ వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ను, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్మంతర్ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. ఖండించిన విపక్ష నేతలు వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్ దీప్కే పాకిస్తాన్ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే ప్రశ్నించారు. జంతర్మంతర్ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు. వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్కు లేఖ రాశారు. వాంగ్చుక్ మెడికల్ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్చుక్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్జంగ్ ఆసుపత్రి నిరాకరించింది. అభిజిత్ దీప్కేపై సిరాతో దాడి మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్మంతర్ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్మంతర్ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. -
ఓవర్ టు ఢిల్లీ!
భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్ వాంగ్చుక్.లదాఖ్ పర్వత ప్రాంతీయుడైన సోనమ్ ఒక ఇంజినీర్. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్ వాంగ్చుక్ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్ వాంగ్ చుక్ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్మంతర్లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్తో సోనమ్కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్ మొండిగా నిరాకరించింది. సోనమ్ వాంగ్చుక్ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్ల పెంపుడు మీడియాగా మారిపోయింది. వాంగ్చుక్ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్మంతర్లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్మంతర్ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్చుక్ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్’ అనే సూపర్ హిట్ సినిమాకు వాంగ్చుక్ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. అమీర్ ఖాన్ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్చుక్ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్ లాకప్ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ మరణిస్తే యావత్ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మణిపూర్ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్మంతర్లో వాంగ్చుక్ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్ ఎస్టేట్ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్మంతర్ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. బెంగాల్లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమం నడుస్తున్నది.హైదరాబాద్లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘టార్గెటెడ్’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్పోర్ట్తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. సరికొత్త ఓటర్ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అభిజిత్ దీప్కేకు రాజ్ ఠాక్రే వారసుడి మద్దతు
న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరాహారదీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించడంపై పౌర సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరదాలు అడ్డుపెట్టి ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతానికి పోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాంగ్చుక్ దీక్షను అడ్డుకున్నా ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. తాను నిరాహారదీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. సీజేపీ పోరాటానికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు అమిత్ ఠాక్రే శనివారం ఢిల్లీలోని జంతర్మంతర్ చేరుకుని సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నిరాహారదీక్ష చేపట్టిన అభిజిత్ దీప్కేను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్చుక్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఇలాంటి అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. విద్యార్థుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు. ప్రజలంతా సీజేపీ పోరాటానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.ప్రభుత్వం బాధ్యత వహించదా?నీట్ అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. "నీట్ పరీక్షల్లో అవకతవకల కారణంగా దేశంలో 20 మందికి పైగా యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత వహించదా? దేశంలో జవాబుదారీతనం లేదు. ఇలాంటి సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాంట్లు వస్తున్నాయి. కచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందేనని అమిత్ ఠాక్రే అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని సీజేపీతో చర్చలు జరపాలని సూచించారు.చదవండి: ఆమిర్ఖాన్కు ఆదిత్య ఠాక్రే కౌంటర్ రాజ్ ఠాక్రే వారసుడుమహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే. ఎమ్మెన్నెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2020లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల అమిత్ ఠాక్రే.. ఎమ్మెన్నెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ముంబైలోని మహిం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మిథాలి బొరుడేను ఆయన వివాహం చేసుకున్నారు. తాజాగా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలిపి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. MNS leader @amitrthackeray met Abhijeet Dipke today to extend his support to the protest, conveying solidarity on behalf of MNS chief @RajThackeray He expressed deep anguish over the Delhi Police’s actions against Sonam Wangchuk Sir this morning. pic.twitter.com/Y6jWF1AuLq— Cockroach is Back (@Cockroachisback) July 18, 2026 -
వాంగ్చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్ చేశారు.The core tenets of the Modi government are Asatya and Hinsa.The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future. No…— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు. रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ, ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు, కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది. పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్చుక్ను కోరారు.కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.ఇదీ చదవండి: వాంగ్చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీమరోవైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాంగ్ చుక్ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
ఆమిర్ఖాన్కు ఆదిత్య ఠాక్రే కౌంటర్
ముంబై: పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్పై బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఘాటుగా స్పందించారు. సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా త్రీ ఇడియట్స్ సినిమాలో తాను పోషించిన పాత్రకు రూపకల్పన చేశారన్న ప్రచారాన్ని ఆమిర్ఖాన్ ఖండించారు. అసలు తమ సినిమాకు, వాంగ్చుక్కు సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆమిర్ఖాన్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.ఆమిర్ఖాన్ వ్యాఖ్యలపై తాజాగా ఆదిత్య ఠాక్రే స్పందించారు. విద్యార్థుల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి నిరాహారదీక్ష చేస్తున్న వారికి మద్దతు తెలపడం కనీస బాధ్యత అని అన్నారు. ''మీరు ప్రముఖులైనా కాకపోయినా.. దేశంలో యువత, విద్యార్థుల కోసం ఎవరైనా నిరాహార దీక్ష చేస్తుంటే, వారు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వం వారి మాట ఎందుకు వినడం లేదని అడగడం మన బాధ్యత''ని ఆదిత్య ఠాక్రే అన్నారు. కాగా, సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.వాంగ్చుక్కు హృతిక్ రోషన్ మద్దతువిద్యార్థుల కోసం నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్కు బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్ సంఘీభావం ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో వాంగ్చుక్ వీడియో షేర్ చేసి, తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ''ఇది నిజమే అనిపిస్తోంది. నా సినిమాల్లో ఒకదాంట్లో ఉపాధ్యాయుడి పాత్ర పోషించినప్పుడు, విద్యార్థులు ఎదుర్కొనే మానసిక వేదన గురించి నేను తెలుసుకున్నాను'' అని కామెంట్ పెట్టాడు. వాంగ్చుక్కు మద్దతు తెలిపిన హృతిక్ రోషన్ను 'వెన్నెముక కలిగిన స్టార్' అని అభిమానులు కొనియాడుతున్నారు.బాలీవుడ్ ప్రముఖుల మద్దతుసోనమ్ వాంగ్చుక్కు ఇప్పటికే పలువురు నటీనటులు సంఘీభావం తెలిపారు. జీనత్ అమన్, కిరణ్రావు, అదితిరావు హైదరీ, ఫతిమా సనా షేక్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య, అతుల్ కులకర్ణి, షాయాజీ షిండే తదితరులు సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటించారు. బాలీవుడ్ అగ్రహీరోలైన ఖాన్ త్రయం మాత్రం స్పందించలేదు.చదవండి: కూతురి వీడియోను ప్రధానికి ట్యాగ్ చేసిన శత్రుఘ్న సిన్హా -
ఆయన ప్రాణం కాపాడండి!
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్చుక్ లద్ధాఖ్లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్మోల్’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్ వాంగ్చుక్ దీక్షను మొదలెట్టారు.‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్లోని పట్నా, జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్ రాకెట్! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్చుక్ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.– నన్నూరి వేణుగోపాల్, పౌర హక్కుల కార్యకర్త -
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగాడు. “మా ఉద్యమం ఆగదు.. పోరాటం కొనసాగుతుంది” అంటూ ఆయన ప్రకటించారు.నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20వ తేదీ నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శనివారం నాటికి 21వ రోజుకు చేరుకుంది.దీక్ష కొనసాగిస్తున్న వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై CJP నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు.‘ఉద్యమం ఆగదు’.. దీక్షకు దిగిన అభిజిత్వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా ఉద్యమం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరతాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం’’ అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, నీట్ వివాదంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశాడు.పోలీసులపై ఆరోపణలుఇంతకుముందు కూడా అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “నన్ను కొట్టారు.. సోనం సర్ను బలవంతంగా తీసుకెళ్లారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు.పోలీసుల వివరణమరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వాంగ్చుక్ ప్రస్తుతం స్పృహలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.జంతర్ మంతర్ వద్ద..వాంగ్చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం నిరసనకారులను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో కొంతసేపు అక్కడ వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.నీట్ పరీక్షలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై న్యాయ విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష, పోలీసుల చర్య, అభిజిత్ దీప్కే తాజా నిరసనతో జంతర్ మంతర్ పరిణామాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. -
నన్ను కొట్టారు.. సోనం సర్ను ఈడ్చుకెళ్లారు!
సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం అయిన వేళ.. జంతర్ మంతర్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా వాంగ్చుక్ను తరలించారని ఆరోపించారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెప్పారు. ‘‘నన్ను కొట్టి అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్లో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలను కొడుతున్నారు. సోనం సర్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు’’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే పోలీసులపై చేసిన ఈ ఆరోపణలను అధికారులు ధ్రువీకరించలేదు.21వ రోజు దీక్ష.. ఆస్పత్రికి వాంగ్చుక్నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.దీక్ష 21వ రోజుకు చేరుకోవడంతో వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన స్పృహలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.కోర్టు ఆదేశాల మేరకే చర్యలు: పోలీసులువాంగ్చుక్ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని.. మరీ అవసరమైతే బలవంతంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించింది.#BREAKING: The Delhi Police has stopped Abhijeet Dipke where he was staying. People are telling me that Sonam Wangchuk is being picked up from the protest site. Students are being lathicharged! pic.twitter.com/kkKtSI83hO— Saurav Das (@SauravDassss) July 18, 2026హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకే వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడిందని, అయితే పోలీసులు సంయమనం పాటించారని న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం వెల్లడించింది.అభిజిత్ దీప్కే అదుపులో.. CJP ఆగ్రహంసీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. అయితే తమ నేతను అక్రమంగా అడ్డుకున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. వాంగ్చుక్ చేస్తున్న నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, శాంతియుత ఆందోళనకు ఆటంకాలు కల్పిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు.ఇంతకు ముందు దాడి!ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్పై గతంలో కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని కూడా అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఒక వస్తువు విసిరినా ఆయనకు ఎలాంటి గాయం కాలేదని తెలిపారు. నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.జంతర్ మంతర్ వద్ద టెన్షన్వాంగ్చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం.. నిరసనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. అందుకు వాళ్లు నిరాకరించడంతో.. తీవ్ర వాగ్వాదం నడుమ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నాం లోపు ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్చుక్ తండ్రి పోరాటం!
న్యూఢిల్లీ: 1984లో లడఖ్ ప్రజల రాజ్యాంగ గుర్తింపు, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం సోనమ్ వాంగ్చూక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ చేపట్టిన నిరాహార దీక్షా ఉదంతం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వాంగ్యాల్ దీక్ష చేస్తున్న సమయాన, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా లేహ్ వెళ్లి ఆయనకు హామీ ఇచ్చారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత, ఇప్పుడు సోనమ్ వాంగ్చూక్ కూడా అదే బాటలో నిలిచారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్చూక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే సామాజిక బాధ్యతతో ఆయన ఈ నిరసనను కొనసాగిస్తున్నారు. లడఖ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వాంగ్చూక్, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాగా, 1984లో వాంగ్యాల్ డిమాండ్ చేసిన విధంగానే, 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం లడఖ్కు ఎస్టీ హోదా కల్పించింది. తండ్రి పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న వాంగ్చూక్, ప్రస్తుతం తన దీక్షతో సంచలనం సృష్టిస్తున్నారు.ఇది కూడా చదవండి: లిఫ్ట్లో శశిథరూర్ విలవిల.. -
సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం..
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిరసనకారుల అడ్డగింత.. నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. విద్యా వ్యవస్థలో పటిష్టమైన సంస్కరణలు కోరడంతో పాటు ఇటీవలి పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 21 రోజులుగా వాంగ్చుక్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 9 కేజీల బరువు తగ్గగా.. ఆయన పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే.. #WATCH | Delhi: Activist Sonam Wangchuk, who was sitting on a hunger strike from last 20 days at Jantar Mantar, taken to the hospital by the police. More details awaited. pic.twitter.com/81DTO3cyh4— ANI (@ANI) July 18, 2026ఈ ఉదయం ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు.సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. “ప్రతి పౌరుడి జీవితం విలువైనది” అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకు సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించాం. ఈ చర్యను పోలీసులు పూర్తి సంయమనంతో, సురక్షితంగా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అని స్థానిక డీసీపీ ఓ ట్వీట్ చేశారు.చకచకా పరిణామాలునీట్ అవకతవకల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ రంగంలోకి దిగారు. అయితే తొలుత ఆయన దీక్షకు పెద్దగా స్పందన రాలేదు. పోను పోను సినీ, రాజకీయ నేతలు వాంగ్చుక్కు సంఘీభావం ప్రకటించడంతో మద్దతు పెరుగుతూ వచ్చింది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన (20న) ఛలో పార్లమెంట్ నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలంటూ ఇటు దీక్షా వేదికగానే వాంగ్చుక్ కూడా పిలుపు ఇచ్చారు. సుమారు లక్షన్నర మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అనురాగ్ కుమార్ ఢిల్లీ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వాంగ్చుక్ దీక్ష భగ్నం కావడం గమనార్హం. -
ర్యాలీ సక్సెస్ కాకపోతే దెయ్యమై వస్తా
న్యూఢిల్లీ: పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే దాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నెల 20వ తేదీ వరకు ప్రాణాలతో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నెల 20న జరిగే ర్యాలీని విజయవంతం చేద్దామని అన్నారు. ఆయన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద దీక్షా స్థలంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. తన శారీరక పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. ‘‘నేను పైకి బలహీనంగా కనిపించినా, అంతర్గతంగా చాలా దృఢంగా ఉన్నాను. మీరందరూ కూడా అంతర్గతంగా, బాహ్యంగానూ దృఢంగా ఉన్నారని నాకు నమ్మకం ఉంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నాం. మనమంతా కలిసి వెళ్లి, ప్రజాస్వామ్య దేవాలయం వంటి పార్లమెంట్లో మన విజ్ఞాపనను సమర్పిద్దాం’’అని వాంగ్చుక్ పిలుపునిచ్చారు. ఆ రోజు ప్రజలు రాకపోయినా, ర్యాలీ విజయవంతం కాకపోయినా దెయ్యమై తిరిగివస్తానని తేల్చిచెప్పారు. 9.5 కిలోల బరువు తగ్గిన వాంగ్చుక్ వాంగ్చుక్ గత 24 గంటల వ్యవధిలో 350 గ్రాముల బరువు తగ్గారు. దీక్ష మొదలైనప్పటి నుంచి ఆయన బరువు 9.5 కిలోలు తగ్గిపోయింది. ఆయనలో స్వల్పంగా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినప్పటికీ మానసికంగా చురుగ్గానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. దీర్ఘకాలిక నిరాహార దీక్ష కారణంగా వాంగ్చుక్ ఆరోగ్యం విషమ దశకు చేరుకుందని, దీక్ష ఇంకా కొనసాగితే అవయవాలు దెబ్బతినే ప్రమాదంతో పాటు తదుపరి దశ ఆందోళనకరంగా మారవచ్చని గురువారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కూతురి వీడియోను ప్రధానికి ట్యాగ్ చేసిన శత్రుఘ్న సిన్హా
న్యూఢిల్లీ: తన కూతురు సోనాక్షి సిన్హా సరైన సమయంలో స్పందించి తనను తలెత్తుకునేలా చేసిందని బాలీవుడ్ సీనియర్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. విద్యార్థుల కోసం నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా ఆమె గళం విన్పించిందని గుర్తు చేశారు. అంతేకాదు వాంగ్చుక్కు సంఘీభావంగా తన కుమార్తె చేసిన వీడియోను ప్రధాని మోదీకి, ఆయన కార్యాలయానికి సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారాయన. వాంగ్చుక్ ఆరోగ్యం బాగా క్షీణించిందని, ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. వాంగ్చుక్ ప్రాణాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.''నీట్ యూజీ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో యువతకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త అయిన సోనమ్ వాంగ్చుక్ శాంతియుతంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక న్యాయమైన డిమాండ్తో ఆయన దాదాపు మూడు వారాలుగా ఆమరణ దీక్షలో ఉన్నారు. దీనివల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. గత కొన్ని రోజులుగా, దేశ విదేశాలకు చెందిన అనేక రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత క్లిష్ట దశలో ఉన్నందున, ప్రభుత్వం, సంబంధిత అధికారులు, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆయన డిమాండ్లను నెరవేర్చి, ఈ నిరసనను వీలైనంత త్వరగా ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాంగ్చుక్ను కాపాడండి! సరైన సమయంలో ధైర్యంగా, బహిరంగంగా స్పందించి, నా కుటుంబానికి గర్వకారణమైన నా ప్రియమైన కుమార్తె సోనాక్షి సిన్హా ఈ రోజు నన్ను మరింత గర్వపడేలా చేసింది. మీ సమాచారం కోసం ఈ విషయంపై ఆమె అభిప్రాయాలను కూడా ఇక్కడ పంచుకుంటున్నాను! వాంగ్చుక్ను కాపాడండి! జై హింద్!'' అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు.చదవండి: వాంగ్చుక్ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?Climate activist, education reformer @Wangchuk66 has been peacefully protesting on an indefinite hunger strike, at Jantar Mantar, New Delhi in support of the younger generation, Gen Z/'Cockroach Janta Party' over the NEET UG Exam Paper Leak. He has been on a fast unto death for…— Shatrughan Sinha (@ShatruganSinha) July 17, 2026 -
వాంగ్చుక్కు మద్దతు తెలిపిన హీరోయిన్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన మద్దతుగా మాట్లాడేందుకు సినిమా ప్రముఖులు జంకుతున్న వేళ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ధైర్యంగా ముందడుగు వేసింది. నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా గళం విన్పించింది. నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించించింది. సోనమ్ వాంగ్చుక్తో కేంద్ర ప్రభుత్వం చర్యలు జరపాలని డిమాండ్ చేసింది. అంతేకాదు అందరి కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తుంటే జనమంతా మౌనంగా ఉండడం సమంజసం కాదని చురకలు అంటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది."నేను ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ రోజు మనం ఆయనను విస్మరించలేం. సోనమ్ వాంగ్చుక్. మనందరికీ ఆయన తెలుసు. మన దేశం కోసం ఆయన చేసిన కృషి, ఆయన సాధించిన విజయాలు, ఆయనకు లభించిన అనేక పురస్కారాల గురించి మనకు తెలుసు. ఆయనకు ఆకలిగా ఉంది. ఆయన ఏమీ తినలేదు. ఆయన ఎవరి కోసం ఇలా చేస్తున్నాడు? ప్రాణాలు కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇలా చేస్తున్నాడు. సరిగ్గా పనిచేయని ఒక వ్యవస్థతో ఆయన పోరాడుతున్నాడు. ఇది నాకు తెలుసు. ఇది మీకు తెలుసు. ఇది మనందరికీ తెలుసు. చాలా మంది ఇంకా మౌనంగానే ఉన్నారు.విద్యార్థుల కోసం సోనమ్ వాంగ్చుక్ 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే అందరూ మౌనంగా ఉన్నారు. కానీ నేను మాత్రం మౌనంగా ఉండలేను. ఏమవుతుందో జరగనివ్వండి, పర్వాలేదు. నేను మాత్రం మౌనంగా ఉండలేను. ఎవరూ ఎందుకు వినడం లేదు? ఎవరికీ పట్టడం లేదు. చర్చకు ఎవరూ సిద్ధంగా లేరు. మనం మాట్లాడితే దేశ వ్యతిరేకులం అయిపోము నేను దేశ వ్యతిరేకిని కాదు. ప్రభుత్వం ఎందుకు ఆయనతో చర్చలు జరపడం లేదు. నిరాహారదీక్ష చేస్తూ ఆయన చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?'' అని సోనాక్షి సిన్హా ప్రశ్నించారు.పలువురు ప్రముఖుల మద్దతుసోనమ్ వాంగ్చుక్, సీజేపీకి మద్దతుగా ఇప్పటికే పలువురు నటీనటులు గళం వినిపించారు. జీనత్ అమాన్, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య, అతుల్ కులకర్ణి, షాయాజీ షిండే తదితరులు వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బడా నటులెవరూ వాంగ్చుక్కు మద్దతు తెలిపేందుకు ముందుకు రాలేదు. చదవండి: సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?నీళ్లు నమిలిన వివేక్ ఒబెరాయ్సోనాక్షి సిన్హా ధైరంగా సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటిస్తే నటుడు వివేక్ ఒబెరాయ్ మాత్రం నీళ్లు నమిలాడు. బీజేపీకి వ్యతిరేకంగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరసన గురించి మీరేమంటారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. "నేను ఒక నటుడిని, ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు రాజకీయ నాయకుడిని కాదు. నేను కేవలం విషయాలను గమనిస్తుంటాను అంతే అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా, పీఎం నరేంద్ర మోదీ సినిమాలో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
20వ రోజుకు వాంగ్చుక్ దీక్ష.. వైద్యుల హెచ్చరిక!
దేశ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, అలాగే లడఖ్ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. ఆయన దీక్ష నేటితో(శుక్రవారం)20వ రోజుకు చేరుకోగా.. వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ రిలీజ్ చేశారు. శరీరంలో కీలక మార్పులు మొదలయ్యాయని.. పరిస్థితి మరింత దిగజారితే అవయవాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తాజా వైద్య నివేదిక ప్రకారం.. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్చుక్ 9 కిలోలకు పైగా బరువు తగ్గి ప్రస్తుతం 56.9 కిలోలకు చేరుకున్నారు. దీర్ఘకాల ఉపవాసంలో శరీరం మొదట గ్లూకోజ్ నిల్వలను ఉపయోగించుకుంటుందని, ఆ తర్వాత కొవ్వు, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుందని వైద్యులు తెలిపారు. ఆయనలో కీటోన్ స్థాయి పెరగడం, యూరిక్ యాసిడ్ పెరిగిన స్థాయిలో నమోదవడం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే తదుపరి దశలో గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. పరీక్షల పేపర్ లీకులు, నీట్ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించడంతో.. వ్యవహారం కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించింది. వాంగ్చుక్కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ఆయన ప్రాణం విలువైనదని, అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఫోర్స్ ఫీడింగ్(బలవంతంగా ఆహారం అందించాలని) కోర్టు సూచించింది.తగ్గేదే లే అంటున్న వాంగ్చుక్తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి వాంగ్చుక్ భరోసా ఇచ్చారు. తనకు బాగానే ఉందంటూ ప్రకటించారు. వైద్య పరీక్షల్లో పెద్ద సమస్యలు బయటపడలేదని.. మద్దతుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా దీక్ష విరమిస్తే తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.పెరుగుతున్న మద్దతు.. వాంగ్చుక్ ఆరోగ్యంపై రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్కు వెళ్లి వాంగ్చుక్కు సంఘీభావం తెలిపారు. ప్రతి ఏడాది పేపర్ లీక్లతో యువత నష్టపోతున్నారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వినాలని కేజ్రీవాల్ కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా వాంగ్చుక్ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసింది.సినీ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. జూలై 20న చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్లో సుమారు 1.5 లక్షల మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. -
సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు
కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్నిరోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తోంది. వీళ్లతో మద్ధతిచ్చిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏకంగా 9 కిలోలకు పైగా బరువు తగ్గిపోవడంతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే చాలామందికి వాంగ్ చుక్ పేరు చెప్పగానే 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తొస్తుంది. ఈయన జీవితం ఆధారంగానే ఆమిర్ పోషించిన పాత్రని తెరకెక్కించారని ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. కానీ వాంగ్ చుక్కి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పారు.(ఇదీ చదవండి: విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!)బ్రిటన్లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆమిర్ ఖాన్.. సోనమ్ వాంగ్ చుక్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆయన సురక్షితంగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం త్రీ ఇడియట్స్' మూవీలో నటించిన ఓమి వైద్య.. సోనంకు మద్ధతు ప్రకటిస్తూ.. పున్సుఖ్ వాంగ్డూ పాత్ర ఈయన జీవితం ఆధారంగా తీశారని అన్నాడు.ఇప్పుడీ విషయం పైనా స్పందించిన ఆమిర్ ఖాన్.. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గానీ, రచయిత అభిజిత్ జోషి గానీ సినిమా తీసే టైంలో సోనం వాంగ్ చుక్ గురించి వ్యక్తిగతంగా ఏం తెలుసుకోలేదు. ఈ మూవీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆరోగ్యం పట్ల అందరం ఆందోళన చెందుతున్నాం. త్వరగా దీక్ష విరమించి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.సోనం వాంగ్చుక్ గతంలో ఇదే విషయమై ఓసారి స్పందిస్తూ, తన జీవితం ఆధారంగా ఆ పాత్ర తీయలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పనితీరు, ఆలోచనల నుంచి కొంతమేర ప్రేరణ పొంది ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్)🚨 REPORTER : Your film was inspired by Sonam Wangchuk. He is on fast. AAMIR KHAN 🔥🔥 : No, the character in 3 Idiots had nothing to do with Sonam Wangchuk. We didn't even know about him when we were shooting the film.Aamir stuns CJP 😭😂🔥pic.twitter.com/QaLS5AIf6p— News Algebra (@NewsAlgebraIND) July 16, 2026 -
ప్రతి ప్రాణం అమూల్యమే
సాక్షి, న్యూఢిల్లీ: నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతని ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. వాంగ్చుక్కు ప్రతిరోజూ వైద్యపరీక్షలు చేయాలని, అవసరమైన చికిత్సను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాల హైకోర్టు ధర్మాసనం సూచనలుచేసింది. వాంగ్చుక్కు తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ న్యాయవాది రాకేష్ సైనీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుని ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత’అని కోర్టు వ్యాఖ్యానించిది. బలవంతంగా ఆస్పత్రికి తరలించాలివాంగ్చుక్ను తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే ద్రవ ఆహారం, విటమిన్లు, ఖనిజ లవణాలు బలవంతంగా అందించేలా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును పిటిషనర్ రాకేష్ కోరారు. వాంగ్చుక్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల బృందం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స అందిస్తాం’అని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’అని «న్యాయస్థానం వ్యాఖ్యానించింది.సంక్లిష్టంగా మారుతున్న వాంగ్చుక్ ఆరోగ్యం న్యూఢిల్లీ: గత నెల 28వ తేదీనుంచి ఎలాంటి ఆహారం తీసుకోని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి ఇకపై మరింత విషమంగా మారే ప్రమాదముందని వైద్యులు తేలి్చచెప్పారు. దాదాపు 20 రోజులుగా ఆహారం తీసుకోని కారణంగా ఆయన అంతర్గత అవయవాలు దు్రష్పభావాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ సతీశ్ లాంబా గురువారం విడుదలచేసిన ఒక హెల్త్ బులెటెన్లో అభిప్రాయపడ్డారు. తాజా బులెటెన్ ప్రకారం నిరాహార దీక్ష కారణంగా వాంగ్చుక్ 9 కేజీలకుపైగా బరువు కోల్పోయి ప్రస్తుతం 56.9 కేజీలకు తగ్గారు. ‘‘ఆయనలో గ్లూకోజ్ నిల్వలు అయిపోయాక శరీరం కొవ్వును కరిగిస్తోంది. కొవ్వూ కరిగాక ఇప్పుడు కండరాలను కరిగించడం ఆరంభించింది. దీంతో కీటోన్ స్థాయిలు 3ప్లస్కు పడిపోయాయి. నీరు తాగడంతో కాస్తంత మెరుగుపడి 2ప్లస్కు వచ్చింది. ఇప్పటికీ యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే అంతర్గత అవయావాలు దెబ్బతినడం మొదలవుతుంది’అని డాక్టర్ సతీశ్ లాంబా వివరించారు. దీక్ష విరమించబోను: వాంగ్చుక్ ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నాపత్రల లీకేజీ ఉదంతంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా డిమాండ్పై మోదీ సర్కార్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా నిరాహార దీక్షను విరమిస్తే ఈ నిరసకు అర్థంలేకుండా పోతుందని బుధవారం అర్ధరాత్రి విడుదలచేసిన ఒక వీడియో సందేశంలో వాంగ్చుక్ పేర్కొన్నారు. ‘‘రాజకీయనేతలు, మద్దతుదారులు ఎంత చెప్పినా నేను నిరాహారదీక్ష విరమించబోను. నేనేం నాలుగురోజులకే చనిపోను. నీరసం, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతున్నా హృదయంలోని ఉక్కు సంకల్పంతో ఇంకొన్నాళ్లు దీక్ష కొనసాగించగలను. నన్ను ప్రశ్నించేబదులు ఇంకా ఎందుకు దిగిరావట్లేదో ప్రభుత్వాన్ని నిలదీయండి’’అని వాంగ్చుక్ అన్నారు. -
ఉపేక్షించడం సరికాదు!
సమస్యలనూ, సంక్షోభాలనూ ఉపేక్షిస్తేనో, నిర్లక్ష్యం చేస్తేనో ముగిసిపోవు. మాయంకావు. వాటిని పట్టించుకుని, పరిష్కరించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గత నెల 6న మొదలుకొని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తోంది. గత 19 రోజులుగా విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదనీ, మరో రెండురోజులు దీక్ష కొనసాగితే ఆయన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నదనీ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వాంగ్చుక్ను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయిస్తూ, ఆ నివేదికల్నిబట్టి వైద్యపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని గురువారం కేంద్రానికి సూచించింది. ఉద్యమకారులు ఒక్కరోజు నిరసనకు అనుమతి తీసుకుని అక్కడినుంచి కదలక పోవటం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అంశమే. అలాగని ఆ నిరసనపై పాలకులు కన్నెర్ర చేయలేదు. ఈ సంయమనాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుశా సామాజిక మాధ్యమాల్లో సీజేపీ స్వల్పకాలంలోనే అనూహ్యంగా రెండుకోట్ల మందికిమించి మద్దతును సాధించటం ఇందుకొక కారణం కావొచ్చు. సరిగ్గా ఈ కారణంతోనే సీజేపీ దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధపడింది. అయితే నిరశనలతో వచ్చే సమస్యేమంటే... ఒక స్థాయికెళ్లాక జరగరానిది జరిగితే ఉద్యమం కాస్తా చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది. ‘జాతీయ మీడియా’ ఈ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనంతమాత్రాన ఇలాంటివి జరగబోవని చెప్పలేం. అందువల్లే ప్రతిష్ఠకు పోకుండా ప్రభుత్వం చర్చకు ఆహ్వానిస్తే పరిష్కారం సంగతి తర్వాత... ముందు తమ స్వరాన్ని విన్నారన్న సంకేతం వెళ్తుంది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, మారిన పరిస్థితుల్లో ఏ సమస్యనైనా ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనీ నక్సలైట్లకు అనేకులు హితవు పలికారు. ఇప్పుడు సీజేపీ ఉద్యమాన్ని ఉపేక్షించటంవల్ల వారిలో ఏ కొందరైనా తమ అభిప్రాయం తప్పన్న భావన కొచ్చే అవకాశం ఉండదా? ఉద్యమాలు వెల్లడించే సమస్యల తీవ్రతను గ్రహించటం పాలకులు చేయాల్సిన పని. ఇటు ఉద్యమకారులు కూడా ప్రభుత్వానికీ, ప్రజలకూ సమస్య తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించమని కోరడం తప్ప అందుకోసం తీవ్ర చర్యలకు పాల్పడటం సరికాదని గుర్తించాల్సివుంది. నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమంలో కొందరికి ఇప్పటికే ఈ అవగాహన ఏర్పడి ఉండొచ్చు. తనను నిరాహారదీక్ష విరమించుకోమంటున్నవారి కోసం వాంగ్చుక్ విడుదల చేసిన సందేశంలో ఒకచోట... ‘నేను దీక్ష విరమిస్తే ప్రభుత్వాలకు జవాబుదారీతనం అవసరం లేదన్న అభిప్రాయం కలగదా?’ అని ప్రశ్నించారు. జరిగిందేమిటో, విరమణ ఎందుకవసరమైందో ప్రజలు గ్రహించలేరనుకోవటం సరికాదు.ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టు ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదే. కానీ వాంగ్చుక్ లాంటి అంకితభావంగల సామాజిక ఉద్యమకారులూ, భిన్నంగా ఆలోచించి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగినవారూ ఈ దేశానికి చాలా అవసరం. లద్దాఖ్ వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతానికి అనువైన వైవిధ్యభరిత ఆవిష్కరణలు చేసి ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. శీతాకాలంలో నీరు వృథా పోతూ, సాగు కాలంలో నీటి ఎద్దడివుండే ఆ ప్రాంతంలో ఆ సమస్యకు తన మేధస్సుతో శాశ్వత పరిష్కారం చూపారు. సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్ల ఆలోచన కూడా ఆయనదే. సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో విధులు నిర్వహించే జవాన్లకోసం రూపొందించిన సౌరశక్తి టెంట్లు అపూర్వం. తన తండ్రి, జమ్మూ–కశ్మీర్ మాజీ మంత్రి అయిన సోనమ్ వాంగ్యాల్ ఒరవడిలో ఆయన ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్కు రాష్ట్రప్రతిపత్తి, దాన్ని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజకీయ రక్షణ కల్పించడంవంటి డిమాండ్లతో ఈ మూడేళ్లలో పలుమార్లు ఆయన నిరశనలు చేశారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అదే రీతిలో ముగియాలని, పట్టుదలకు పోకుండా చర్చలకు ఉపక్రమించాలని అనేకమంది కోరుకుంటున్నారు. అటు సోనమ్ వాంగ్చుక్, ఇటు ప్రభుత్వం వినాలి. -
ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలాంటి డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది.ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్చుక్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.I’m Not in good shape but not so bad either...Rather than asking me to break my fast please join me on 20th July... Peaceful March to the Parliament.#cockroachjanataparty #jantarmantar #cjpprotest #chalosansad pic.twitter.com/QZ6VyxVMAR— Sonam Wangchuk (@Wangchuk66) July 15, 2026సోనమ్ భావోద్వేగ వీడియోమరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలనే డిమాండ్స్తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
వాంగ్చుక్ దీక్షపై రాహుల్ మౌనం వెనుక..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దాదాపు మూడు వారాలుగా చేపట్టిన నిరాహార దీక్షకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ తన సొంత ప్రచార కార్యక్రమం ‘ఛాత్రోన్ కి గూంజ్’ (విద్యార్థుల గళం)పై దృష్టి సారించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న డెహ్రాడూన్లోని బన్ను స్కూల్ మైదానంలో ఆయన బహిరంగ సభ నిర్వహించనున్నారు. मोदी जी.. थोड़ा सा घबरा गए क्या? pic.twitter.com/tWNHCkVlte— Congress (@INCIndia) July 15, 2026ఈ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్ను ఎంచుకోగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘మోదీజీ, మీరు కంగారు పడుతున్నారా? ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. నిరుద్యోగం దేశంలోని అతిపెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు వాంగ్చుక్ దీక్షకు కాంగ్రెస్ దూరంగా ఉందనే విమర్శలను ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం పోరాడుతున్నాయని, రాహుల్ గాంధీ గతంలోనే లడఖ్ ప్రజల గళాన్ని వినిపించారని వారు గుర్తు చేశారు. కాగా, సీజేపీ (సీజేపీ) తన నిరసనను జూలై 20న పార్లమెంటు సమావేశాల ప్రారంభం వరకు కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇది కూడా చదవండి: ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి -
Wangchuk: ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత!
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 9 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర హెచ్చరిక చేసింది.రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బహిరంగ లేఖ రాస్తూ.. వెంటనే వాంగ్చుక్తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్కు రాజకీయ మద్దతు క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్ జంతర్మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వాంగ్చుక్కు బహిరంగ లేఖ రాస్తూ.. దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ), సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఈ దీక్ష ఎందుకు?జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని కేంద్రం రాజకీయ ప్రేరేపితమని అభివర్ణిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారులను "అశాంతి సృష్టించే శక్తులు"గా వ్యాఖ్యానించారు. ఎవరీ సోనమ్ వాంగ్చుక్?లడఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసిన ఆయనకు 2018లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన 'ఐస్ స్తూపాలు' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్ర(అమీర్ ఖాన్ పోషించిన పాత్ర) రూపుదిద్దుకుంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లడఖ్లో గతంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పటికీ అక్కడి చల్లటి వాతావరణం కారణంగా ఇంతగా బలహీనపడలేదని, ఢిల్లీలోని వేడి, తేమ వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తున్నారని.. వైద్యుల సూచనలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా బలవంతంగా ఆహారం అందించాలని, దీక్ష విరమింపజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. అయితే తాను స్వచ్ఛందంగా చేపట్టిన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్చుక్ స్పష్టం చేస్తున్నారు. -
8 కిలోలు తగ్గిన సోనమ్.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!
విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు ప్రకటిస్తూ, జూన్ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!ఇంతలా వాంగ్చుక్ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్స్థాయిలో 67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. అదీగాక వాంగ్చుక్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..దీర్ఘకాలిక ఉపవాస సమయంలో ఏం జరుగుతుందంటే..శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..అలసట, తీవ్రమైన బలహీనతతల తిరగడం, స్పృహ కోల్పోవడంఏకాగ్రత లోపంనిరంతర తలనొప్పిచిరాకు, మానసిక స్థితిలో మార్పులుకండరాల నొప్పులుడీహైడ్రేషన్ (నిర్జలీకరణం)వాంగ్చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు..వాంగ్చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా, ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయితక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయికండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహావిటమిన్, ఖనిజ లోపాలురోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుందిడీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలుదీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడితప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!) -
సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యంపై హైకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయనను ఆస్పత్రికి తరలించాలని, బలవంతంగానైనా పోషకాహారం అందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.న్యాయవాది రాకేష్ కుమార్ సైనీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వాంగ్చుక్ కండరాల క్షీణతతో తీవ్రమైన బాధలో ఉన్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనకు తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, ద్రవ రూపంలో పోషకాలను అందించాలని కోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది.మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు దీక్ష విరమించాలని వాంగ్చుక్ను కోరారు. ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి వాంగ్చుక్ మద్దతు ప్రకటిస్తూ, దీక్షకు దిగారు. -
సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనకు యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం జంతర్ మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. లోక్సభలో అతి వయస్కులైన ఎంపీల్లో ఒకరైన ఆమె సీజేపీ ఆందోళనకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ తరపున మచ్లిశహర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రింకు సింగ్తో గేతడాది జూన్లో నిశ్చితార్థం జరగడంతో ప్రియా సరోజ్ పేరు దేశమంతా తెలిసింది.ఎవరీ ప్రియా సరోజ్?ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 1998లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో మచ్లిశహర్ లోక్సభ నియోజక వర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.8.5 కిలోల బరువు తగ్గిన వాంగ్చుక్దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన మంగళవారం 25వ రోజుకు చేరుకుంది. సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. ఆయన 8.5 కేజీల బరువు తగ్గారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.రాజకీయ, సినీ ప్రముఖుల మద్దతు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా, నటి స్వరభాస్కర్ మంగళవారం జంతర్ మంతర్ చేరుకుని సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. బీకేయూ చారుణి ప్రెసిడెంట్ గుర్నామ్ సింగ్ చారునీ తదితరులు కూడా సీజేపీ ధర్నాలో పాల్గొన్నారు.చలో పార్లమెంట్కు మిస్డ్ కాల్ ఇవ్వండిఈనెల 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చింది. కార్యక్రమానికి హాజరయ్యే వారు 70116 70115 నంబరు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరింది. CHALO SANSAD!!Give a missed call and mark your attendance for 20th July70116 70115 pic.twitter.com/c3AQHAd2ut— Cockroach is Back (@Cockroachisback) July 14, 2026 -
‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం
నీట్ (NEET) పరీక్ష లీక్, ఇతర పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షకుడు సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీనిపై '3 ఇడియట్స్' సినిమాలో 'చతుర్' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఓమి వైద్య తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.ఓమి వైద్య భావోద్వేగ విజ్ఞప్తి‘ఫున్సుఖ్ వాంగ్దూ’( వాంగ్ చుక్) చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షపై ఎవరూ స్పందించడం లేదంటూ సోషల్మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తన మద్దతును ప్రకటించిన ఓమి బాలీవుడ్ ఐకానిక్ సినిమాతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ పోషించిన 'ఫున్సుఖ్ వాంగ్డూ' పాత్ర నిజ జీవితంలో సోనమ్ వాంగ్చుక్ స్ఫూర్తితో రూపొందించిందేనని సినీ ప్రేమికులకు గుర్తు చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక భావోద్వేగ వీడియోలో ఓమి వైద్య మాట్లాడుతూ, "నాకు ఫున్సుఖ్ వాంగ్దూ చనిపోవడం ఇష్టం లేదు" అంటూ ఆవేదనవ్యక్తం చేశారు. గతంలో తాను వాంగ్చుక్ను కలిశానని, ఇంజనీర్గా, ఆవిష్కర్తగా, విద్యా సంస్కర్తగా ఆయన చేసిన కృషి ఎంతో అద్భుత మైందని కొనియాడారు. View this post on Instagram A post shared by Omi Vaidya (@omivaidya_official)ప్రస్తుతం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన చాలా రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు, దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్షీణిస్తుండటం చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా ప్రజలు దీనిని చూడాలన్నారు. ఆయనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఒక మేధావి చనిపోవడం తనకు అస్సలు ఇష్టం లేదని వైద్య పేర్కొన్నారు. వాంగ్చుక్ చేసిన పనుల గురించి చదివి, ఆయన సందేశాన్ని అందరికీ షేర్ చేస్తూ అవగాహన పెంచాలని ఆయన ప్రజలను కోరారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్క్షీణిస్తున్న వాంగ్చుక్ ఆరోగ్యంవాంగ్చుక్ దీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. తాజా హెల్త్ అప్డేట్స్ ప్రకారం, వాంగ్చుక్ 8 కేజీలకు పైగా బరువు తగ్గారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన దీక్షను విరమించడానికి నిరాకరించారు "నా దీక్షను విరమించమని నన్ను అడగకండి. కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో వారిని అడగండి" అని వాంగ్చుక్ అన్నట్లు దిప్కే పేర్కొన్నారు.ఆమీర్పై విమర్శలుమరోవైపు బాలీవుడ్లో 3 ఇడియట్స్ మూవీ ద్వారా కోట్లు రూపాయలు దండుకున్న ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతూ, రియల్ ‘ఫున్సుఖ్ వాంగ్దూ’ గురించి పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.కాగా 59 ఏళ్ల సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలో చేరారు. అప్పటి నుండి ఆయన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలో ఉన్న వాంగ్చుక్ను నటులు ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, రచయిత్రి అరుంధతీ రాయ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఆయన పోరాటానికి మద్దతు పలికారు. -
ప్రాణాపాయంలో సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 17వ రోజుకు చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన 25వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కండరాల క్షీణతతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని, బరువు 8.5 కేజీలు తగ్గి, రక్తపోటు (బీపీ) 109/70కి పడిపోయిందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ద్వారా వెల్లడించారు.దీక్ష విరమించాలని తాను సోనమ్ వాంగ్చుక్ను కోరగా, ‘ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపడం లేదో ప్రశ్నించండి’ అని బదులిచ్చినట్లు తెలిపారు. మనిషి ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం పంతం పట్టినట్లు తీసుకోకూడదని దిప్కే హితవు పలికారు. మరోవైపు రాజకీయాలకతీతంగా వాంగ్చుక్కు మద్దతు పెరుగుతోంది. నిరాహార దీక్షను విరమించి పోరాటాన్ని కొనసాగించాలని టీఎంసీ నేత మహువా మోయిత్రా ఆయనను కోరారు. ‘ప్రభుత్వానికి యువత ప్రాణాలపై పట్టింపు లేదు, కానీ మీ ప్రాణాలు మాకు ముఖ్యం’ అని ఆమె పేర్కొన్నారు.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సైతం ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే, దీక్ష విరమించాలని సోనమ్ వాంగ్చుక్కు విజ్ఞప్తి చేశారు. ఆప్ నేత అతిశి బృందం, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ సహా పలువురు నేతలు నిరసన ప్రదేశాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జూన్ 28న వాంగ్చుక్ ఈ దీక్షలో చేరారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు, పరీక్షల అక్రమాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి పరిహారం ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. జూలై 20న పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజున జంతర్ మంతర్ నుండి పార్లమెంట్కు శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. -
‘కాక్రోచ్’ ఉద్యమానికి ప్రకాశ్ రాజ్ మద్దతు
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం 22వ రోజుకు చేరుకుంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జంతర్ మంతర్ వద్దకు చేరుకొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. తాను ఆధునిక గాంధీనో లేదా హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని వాంగ్చుక్ ఈ సందర్భంగా అన్నారు. కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి కూడా జంతర్మంతర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్, ఐజాక్, జితేంద్ర చౌదరి నిరసనకారులతో మాట్లాడారు. పరీక్షల్లో పదే పదే జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాత మైన, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ ని ప్రకటించారు. వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని వెల్లడించారు. సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ను వైద్యులు విడుదల చేశారు. నిద్రించినప్పుడు రక్తపోటు 109/72 ఎంఎం హెచ్జీ గాను, కూర్చున్నప్పుడు 106/74 ఎంఎం హెచ్జీ గాను నమోదైంది. హృదయ స్పందన నిమిషానికి 81 సార్లు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి 78 ఎంజీ/డీఎల్ గాను రికార్డయ్యింది. ఆయన బరువు 58.45 కిలోలకు చేరుకుంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్చుక్ శరీరంలో నీటి శాతం బాగానే ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని బులెటిన్లో పేర్కొన్నారు. జీవితానికి మీరే హీరో కావాలి దీక్ష కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు వాంగ్చుక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత బలహీనంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ తన సంకల్పంలో మార్పు రాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది తనను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారని, మరికొందరు తనను హీరో అంటున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెల్లడించారు. తాను గాంధీని కాదు, హీరోని కూడా కాదని వివరణ ఇచ్చారు. బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టంచేశారు. ఇతరుల్లో హీరోల కోసం వెతకడం మానేసి, పౌరులుగా బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’’అని పిలుపునిచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ‘‘మీరు ప్రతిరోజూ ఇక్కడికి రాలేకపోతే, కనీసం ఒక్క రోజైనా జంతర్ మంతర్ వద్ద మాతో చేరండి. మీరు ఢిల్లీకి రాలేకపోతే, ఎక్కడ ఉన్నా ఉపవాసం పాటించి మీ సందేశాన్ని పంచుకోండి’’అని వాంగ్చుక్ కోరారు. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించేలా ఒత్తిడి పెంచడానికి జూలై 20న పార్లమెంటు వరకు ప్రతిపాదించిన యాత్రలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
ఆరు కిలోలు తగ్గిన వాంగ్చుక్
న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఢిల్లీలోని జంతర్మంతర్లో చేపట్టిన నిరసనలు సోమవారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఇదే డి మాండ్తో ఇదే వేదికపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆయన ఆరు కిలోల బరువు తగ్గారు.వాంగ్చుక్ రక్తపోటు 112/70కు, హృదయ స్పందన నిమిషానికి 72, బ్లడ్ షుగర్ స్థాయి 67గా నమోదైందని ఆరోగ్య బులెటిన్ పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనతో రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుందని, ఆర్మీ రిటైర్డు ఉద్యోగి ఆమె తండ్రి ఆదివారం నిరసనలో పాలుపంచుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్లో పేర్కొన్నారు. తమ ఆవేదన మరే కుటుంబానికి రాకూడదని ఆయన కోరుకుంటున్నారని, కేంద్రమే దీనిపై భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా దీప్కే పేర్కొన్నారు. Hunger strike Day 9Health update of Sonam Wangchuk sirBP- 107/67Blood Glucose- 72Total weight loss- 6.9 kg pic.twitter.com/c4byLZtqj6— Cockroach is Back (@Cockroachisback) July 6, 2026చదవండి: అయోధ్య విరాళాల దుర్వినియోగంపై వినూత్న నిరసన -
విషమంగా వాంగ్చుక్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్లో వారం రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం విషమిస్తోంది. ఆయన ఐదు కిలోల మేర బరువు తగ్గారని, ఆరోగ్యం క్షీణిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)శనివారం ఆదోళన వెలిబుచ్చింది. పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్తో సీజేపీ నిరసనలు చేపట్టిన విషయం తెల్సిందే. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఎక్స్లో..‘దీక్ష కారణంగా సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం రోజురోజుకీ విషమిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మంత్రి ప్రధాన్ను తొలగించలేదు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారు?’అని ప్రశ్నించారు. కనీసం 20 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. వాంగ్చుక్కు జరగరానిదేమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దీప్కే హెచ్చరించారు.ఆరోగ్యం విషమించినా సరే, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకునేదాకా దీక్ష విరమించేది లేదని సోనమ్ గట్టిగా చెబుతున్నారని దీప్కే మరో పోస్టులో తెలిపారు. ‘ఎగ్జామ్ పేపర్’అని రాసి ఉన్న కాగితాలను ఓ వ్యక్తి తినేందుకు ప్రయత్నిస్తుండగా రెండు కాక్రోచ్లు అడ్డుకుంటున్నట్లుగా ఉన్న వ్యంగ్యాత్మక కార్టూన్, గో బ్యాక్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యాఖ్యతో ఆయన షేర్ చేశారు. కాగా, తమ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న డిమాండ్లపై కేంద్రం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతిని సోనమ్ వాంగ్చుక్ శుక్రవారం రాత్రి ఎక్స్లో స్వాగతించారు.అదేవిధంగా, విద్యా శాఖ జవాబుదారీతనం విషయంలోనూ ప్రభుత్వం స్పందించాలని కోరారు. జంతర్మంతర్లోనే మరో వేదికపై ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన ఆరుగురు నేతలు చేపట్టిన నిరాహార దీక్ష కూడా వారం రోజులు పూర్తి చేసుకుంది. దీక్షలో కూర్చున్న జేఎన్యూ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి దానిష్ అలీ తీవ్ర అస్వస్థతగకు గురవడంతో శనివారం సాయంత్రం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆమె బ్లడ్ సుగర్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని విద్యార్థి నేతలు తెలిపారు. మిగతా ఐదుగురు నిరశన కొనసాగిస్తున్నారన్నారు.నీట్, తదితర పరీక్షల్లో అకవతవకలపై జూన్ 20వ తేదీ నుంచి, 15 రోజులుగా జంతర్మంతర్లో నిరసనలు కొనసాగిస్తుండటం తెల్సిందే. మమ్మల్ని నిజంగానే కాక్రోచ్లుగానే భావిస్తున్నారా? ప్రధాని మోదీకి సీజేపీ లేఖ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో జంతర్మంతర్ వద్ద 15 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడంపై సీజేపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదే వేదికపై వారం రోజులుగా సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని సీజేపీ పేర్కొంది. ఇకనైనా మౌనం వీడాలని ప్రధాని మోదీని కోరింది.‘ఇది మానవత్వానికి సంబంధించిన ప్రశ్న: జంతర్ మంతర్ నిరసనలను మీరు ఇంకెన్నాళ్లు విస్మరిస్తారు?’పేరుతో రాసిన రెండు పేజీల లేఖను శనివారం సీజేపీ విడుదల చేసింది. లేఖపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, మరో ఏడుగురు ప్రతినిధుల సంతకాలున్నాయి. ’మీ మౌనం మమ్మల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది..మేమంతా కేవలం బొద్దింకలం(కాక్రోచ్) మాత్రమేనని మీరు నిజంగానే భావిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. ’ప్రధానిగా మీరు సీజేపీ నిరాహార దీక్షపై స్పందించడం లేదు.మీ మౌనం ఈ దేశ యువతను పట్టించుకోవాల్సిన అవసరం లేని కేవలం పురుగులుగా భావిస్తున్నారనేందుకు పరోక్ష అంగీకారం’అని వ్యాఖ్యానించింది. ‘పాలకులపై నైతికపరమైన ఒత్తిడిని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిందే నిరాహార దీక్ష. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన సోనమ్ వాంగ్చుక్ వంటి వ్యక్తి ఆహారం తీసుకోవడానికి నిరాకరించడంపై ప్రభుత్వం నుంచి నైతిక, రాజకీయ పరమైన స్పందన వస్తుందని ఆశించడం సహజం. అయినప్పటికీ, మీరు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు’అని సీజేపీ ఆ లేఖలో పేర్కొంది.కోట్లాది మంది యువత నమ్మకాన్ని, భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసిన పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం పదేపదే విఫలమైనందుకే దీక్ష చేపట్టినట్లు వివరించింది. జూన్ 20న నిరసన ప్రారంభం కావడానికి ముందు 11గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు ఇప్పుడు 29కి చేరాయని సీజేపీ తెలిపింది. ’ఏ ప్రభుత్వమూ ప్రశ్నించడానికి అతీతం కాదు. ఏ మంత్రి కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. సమాధానాలు డిమాండ్ చేస్తున్న పౌరుల గొంతును ఏ యంత్రాంగమూ నొక్కేయలేదు’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది. -
ఢిల్లీలో వాంగ్చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాంగ్చుక్ దీక్షకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్మంతర్లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్చుక్ దీక్షకు మద్దతు ప్రకటించారు. -
28 నుంచి జంతర్మంతర్లో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు. విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. -
సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.ఈ నిరసనలో వినిపించిన డిమాండ్ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. Sonam Wangchuk arrives at Jantar Mantar to join the protest.There are more press reporters then cockroachs 🪳#cjp_पार्टी pic.twitter.com/nbYShqORbD— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) June 6, 2026కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది. -
ఎట్టకేలకు వాంగ్చుక్ విడుదల
లేహ్/న్యూఢిల్లీ/జోద్పూర్: లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్చుక్పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.వాంగ్చుక్ను అరెస్ట్ను సవాల్చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే. మిగతా వారినీ విడుదలచేయండి వాంగ్చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్చుక్తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్చేశారు.‘‘వాంగ్చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. హింసను ఆపేయాలి: ఎల్జీ ‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్చుక్ను తక్షణం విడుదలచేయాలని ఎల్ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే. -
యువతను రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు. మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే. -
శాంతికాముకుడిని,30 నేషన్-బిల్డింగ్ అవార్డులు : కావాలనే నేరగాడిగా
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఆంగ్మో పిటిషన్ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు వాదించారు. హింసకు వ్యతిరేకంగా మాట్లాడి, జాతి నిర్మాణంలో 30 అవార్డులు అందుకున్న సోనమ్ వాంగ్చుక్ను ఇప్పుడు నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన భార్య సుప్రీంకోర్టుముందు వాపోయారు. సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సిబల్, ఆయన నిర్బంధానికి సంబంధించి పూర్తి కారణాలు అందించలేదనీ దీనికి వ్యతిరేకంగా వాదించేందుకు సరైన అవకాశం కూడా ఎప్పుడూ ఇవ్వలేదని వాదించారు. నిర్బంధానికి కారణాలు నిర్బంధించబడిన వ్యక్తికి అందించకపోతే, ఆదేశం (నిర్బంధం) "విటియేటెడ్" అని చట్టం నిర్దేశిస్తుందని నొక్కి చెబుతూ, సిబల్ నిర్బంధం మరియు ఆధారాల సరఫరాపై చట్టాన్ని ప్రస్తావించారుకాగా ప్రభుత్వాలకు ప్రజా శాంతి లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై ముందస్తు చర్య తీసుకునే అధికారం ఇచ్చే NSA చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయనను జోధ్పూర్కు తరలించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద రాష్ట్ర హోదా మరియు రక్షణలను డిమాండ్ చేస్తూ లడఖ్లోని లేహ్లో జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగడంతో ఆయనపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.దీనిపై అతని భార్య , విద్యావేత్త గీతాంజలి ఆంగ్మో అతని నిర్బంధాన్ని సవాలు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంగ్మో తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ కేసువిచారణ జనవరి 12న వాయిదా పడింది.ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!వాంగ్ చుక్ వాదన"నిర్బంధానికి గల అన్ని కారణాలను అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 22 (5) ఏకపక్ష అరెస్టు , నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుందని వాంగ్ చుక్ తెలిపారు. సెప్టెంబర్ 10న నేను నిరాహార దీక్షకు దిగాను. దీక్ష 15వ రోజున, హింసాత్మక సంఘటనలు జరిగాయి, దానితో నేను చాలా కలత చెంది24న నా నిరాహార దీక్షను విరమించాను , హింస ఆపాలని ఒక ప్రసంగం ఇచ్చాను.. 26న అదుపులోకి తీసుకున్నారు. 1922లో ఫిబ్రవరి 4న చౌరీ చౌరా సంఘటన తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయంతో వాంగ్ చుక్ పోల్చుకున్నారు. అలాగే తనను నేరస్థుడిగా చూపించడానికే వాస్తవాలను తారుమారు చేస్తున్నారన్న వాంగ్చుక్ వాదనను సిబల్ కోర్టుకు తెలిపారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్ పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది -
వాంగ్చుక్ నిర్బంధంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడం అక్రమం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఏకపక్షంగా తీసుకున్న చర్యగా గీతాంజలి పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలంటూ కేంద్రం, లద్దాఖ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో సుప్రీం ఓకే చెప్పింది. దీనిపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. లద్దాఖ్ను రాజ్యాంగం ఆరో షెడ్యూల్లో చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లతో సెప్టెంబర్లో చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. పలు ఘటనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయప డ్డారు. హింసను ప్రేరేపించారనే ఆరోప ణలపై వాంగ్చుక్ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. -
వాంగ్చుక్ అరెస్ట్పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: లద్దాఖ్కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాంగ్చుక్ అరెస్ట్కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్చుక్కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ను కోరింది. అదే సమయంలో, వాంగ్చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్లోని జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. -
లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్ధాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారటంతో నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసి రాజస్తాన్లోని జో«ద్పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్చుక్ సోదరుడు క సెతన్ దోర్జీ లేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్ధాఖ్ ప్రజలకు వాంగ్చుక్ సందేశం పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకోసం ప్రారి్థంచినవారందరికీ ధన్యవాదాలు. లేహ్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అరెస్టయినవారు ధైర్యంగా ఉండాలని ప్రారి్థస్తున్నాను. గత నెల 24న జరిగిన ఘర్షణపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. అలా విచారణ జరగని పక్షంలో నేను జైల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. లద్దాఖ్కు రాష్ట్రహోదా ఇచ్చి ఆరో షెడ్యూల్ చేర్చాలన్న లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. డిమాండ్ల సాధన కోసం ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో సంపూర్ణంగా గాంధీ మార్గంలో పోరాటం చేయండి’అని వాంగ్చుక్ ఇచ్చిన సందేశాన్ని ముస్తఫా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేహ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిరసనకారులను సోమవారం చర్చలకు ఆహా్వనించింది. అయితే, వాంగ్చుక్తోపాటు పోలీసులు అరెస్టు చేసినవారందరినీ విడుదల చేసి, లేహ్ ఘటనపై జ్యుడీíÙయల్ విచారణకు ఆదేశించేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని ఎల్ఏబీ, కేడీఏ తేల్చి చెప్పాయి. -
వాంగ్చుక్ నిర్బంధం అక్రమం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్చుక్ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్లోని జోథ్పూర్ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్ లాయర్ వివేక్ తన్ఖా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ చేపట్టి, వాంగ్చుక్ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్ యంత్రాంగం, లేహ్ డిప్యూటీ కమిషనర్, జోథ్పూర్ జైలు సూపరిటెండెంట్లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్చుక్, లద్దాఖ్లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్చుక్ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. వాంగ్చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్ (హెచ్ఐఏఎల్) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్చుక్కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్చుక్కు వెంటనే డాక్టర్తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు. -
సోనమ్ను వేటాడుతున్నారు
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న తన భర్తను కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని, అందులో భాగంగానే ఆయనపై దేశద్రోహ చట్టం (ఎన్ఎస్ఏ) కింద తప్పుడు కేసులు పెట్టారని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్పై నమోదుచేసిన కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రభుత్వ అధికారులకు సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వాంగ్చుక్తో ఇప్పటివరకు నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు నాకు ఇవ్వలేదు. నన్ను కూడా దాదాపు గృహనిర్బంధంలో పెట్టినట్లుగా పరిస్థితులు కల్పించారు. వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ ప్రయోగించాల్సిన అవసరం లేదు. అధికారులు ఒకేవైపు మాట్లాడుతున్నారు. ఒకరకంగా ఆయనను వేటాడుతున్నారు. ఆయన దేశద్రోహి అయితే భారత ప్రభుత్వం ఆయనకు ఎందుకు అనేక అవార్డులు ఇచ్చింది? లడక్కు రాష్ట్రహోదా ఇవ్వాలని, దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే ఇదంతా చేస్తున్నారు’అని గీతాంజలి ఆరోపించారు. లద్దాఖ్కు రాష్ట్రహోదా కోసం ఈ నెల 24న లేహ్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యమకారులను వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి రాజస్థాన్లోని జో«ద్పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్చుక్ చుట్టూ కుట్ర సోనమ్వాంగ్చుక్ కార్యకలాపాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా పనిగట్టుకొని కొందరు ప్రచారం చేస్తున్నారని గీతాంజలి ఆరోపించారు. ‘మా సంస్థ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్ఐఏఎల్)కు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందించాం. అయినా ఆయన కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం జరుగుతోంది. వాంగ్చుక్కు మెగసెసె అవార్డు రావటంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ అవార్డును తీసుకోవటం తప్పు అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపు 60 మంది భారతీయులకు మెగసెసె వచ్చింది. వారిలో 20 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు కూడా ఇచ్చింది. అంటే భారత ప్రభుత్వం దేశద్రోహులకు పద్మ అవార్డులు ఇచ్చిందా?’అని నిలదీశారు. లద్దాఖ్లో పాకిస్తాన్ జాతీయులు ప్రవేశించటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు. ‘లద్దాఖ్లో పాకిస్తానీలు ఉన్నట్లు వాళ్లు (అధికారులు) గుర్తిస్తే.. పొరుగు దేశం వాళ్లను మనదేశంలోకి అక్రమంగా ఎందుకు రానిచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది వాంగ్చుక్ కాదు. కేంద్ర హోంశాఖ. 24న హింస జరుగుతున్నప్పుడు వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఆ ఘటనకు లద్దాఖ్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి’అని స్పష్టంచేశారు. గత ఏడేళ్లలో వాంగ్చుక్ పరిశోధనల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గీతాంజలి తెలిపారు. ‘హెచ్ఐఏఎల్ పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన సౌరశక్తితో వెచ్చగా ఉండే భవనాలు, ఐస్ స్తూపం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. గత ఏడేళ్లలో 1,80,000 చదరపు అడుగుల సోలార్ హీటెడ్ భవనాలు నిర్మించారు. వాటివల్ల నెలకు 4,000 టన్నుల కార్బన్ ఆదా అవుతోంది. ఈ సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి పనులను మెచ్చుకోకపోతే దేశం విశ్వగురు ఎలా అవుతుంది?’అని ప్రశ్నించారు. -
సీఆర్పిఎఫ్ వల్లే లేహ్లో హింస
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్రహోదాతోపాటు దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్చేస్తూ ఐదేళ్లుగా శాంతియుత పోరాటం చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలు అంటగట్టడం దారుణమని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో (Gitanjali J Angmo) మండిపడ్డారు. లేహ్లో ఈ నెల 24న చోటుచేసుకున్న హింసకు సీఆర్పిఎఫ్ బలగాలే కారణమని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపైకి సీఆర్పిఎఫ్ బలగాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించటంతో ఆగ్రహించిన యువత రాళ్లు రువ్విందని తెలిపారు. సోనమ్ వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందన్న పోలీసుల వాదనను ఆమె తోసిపుచ్చారు. నాటి హింస, తర్వాతి పరిణామాలపై గీతాంజలి ఆంగ్మో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వాంగ్చుక్ కలలో కూడా హింసాత్మక ఉద్యమాన్ని ఊహించలేదని తెలిపారు. ఈ నెల 24న చెలరేగిన హింసలో నలుగురు మరణించగా, 90 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగమే కారణమని లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం.. వాంగ్చుక్ను అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేసి రాజస్తాన్లోని జోధ్పూర్ జైలుకు పంపింది. వారి స్వచ్ఛంద సంస్థ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్ఐఏఎల్) లైసెన్స్ను కూడా రద్దుచేసింది. ఎన్ఎస్ఏ (NIA) కింద అరెస్టు చేస్తే ఎలాంటి విచారణ లేకుండా 12 నెలలపాటు జైల్లో నిర్బంధించవచ్చు. నా భర్తతో మాట్లాడనివ్వటం లేదు వాంగ్చుక్ను అరెస్టు చేసిన నాటి నుంచి ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పోలీసులు తనకు అనుమతి ఇవ్వటం లేదని గీతాంజలి ఆరోపించారు. ‘సోనమ్ వాంగ్చుక్ నిర్బంధ ఆదేశాల కాపీని శుక్రవారం నాకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇవ్వలేదు. దీనిపై మేము న్యాయపోరాటం చేస్తాం. పాకిస్తాన్లో ఇటీవలి మా పర్యటన పూర్తిగా వృత్తిగతమైనది, పర్యావరణ పరమైనది. వాంగ్చుక్ విదేశీ పర్యటనలన్నీ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన యూనివర్సిటీలు, సంస్థలు పంపిన ఆహ్వానాల మేరకే జరిగాయి. వాతావరణ మార్పులపై పాకిస్తాన్లో ఐక్యరాజ్యసమితి (United Nations) విభాగం నిర్వహించిన సమావేశానికి మేం హాజరయ్యాం. ఆ సదస్సును నిర్వహించిన సంస్థలు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంఓడీ) సంస్థకు సంబంధించినవే. ఈ సంస్థలో హిందూకుష్ పర్వతాలతో ముడిపడి ఉన్న 8 దేశాలైన భారత్, నేపాల్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, భూటాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ సభ్యులుగా ఉన్నాయి. పర్యావరణ మార్పులలో మహిళల పాత్రపై పరిశోధన పత్రం సమఆర్పించేందుకు నేను ఆ సదస్సుకు వెళ్లాను. ఆ సదస్సులో ప్రధాని మోదీని వాంగ్చుక్ ఎంతో పొడిగారు. సోనమ్ వాంగ్చుక్పై ఎన్ఎస్ఏను ప్రయోగించటం దారుణం. ఆయన ఎన్నడూ శాంతిభద్రతలకు విఘాగం కలిగించే పని చేయలేదు. ఆయన ఎప్పుడూ గాంధీ మార్గంలోనే ఉద్యమం నడిపారు. 24న హింస చెలరేగటానికి ముందు విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వీడియోలు మా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో సీఆర్పిఎఫ్ (CRPF) కాల్పులు జరపటానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మీ సొంత ప్రజలపై, యువతపై కాల్పులు ఎందుకు జరిపారు? ఆ రోజు ఆయన ఎవరినీ రెచ్చగొట్టలేదు. మార్పు అనేది ఒక వ్యక్తితోనో, ఒకరి మరణం వల్లనో ప్రారంభమవుతుంది.బహుషా ప్రాణాలు అర్పించే ఆ ఒక్క వ్యక్తిని నేనే కావచ్చు. ఈ ఉద్యమం కోసం సంతోషంగా నా ప్రాణాలఆర్పిస్తాను అని వాంగ్చుక్ చెప్పారు. కానీ, ఆయన మాటలను వక్రీకరించారు. అయినా, భారత సైన్యానికి షెల్టర్ల కోసం, చైనా వస్తువుల బహిష్కరణకు ఉద్యమిస్తున్న వ్యక్తిని దేశద్రోహి అని ఎలా అంటారు?’ అని గీతాంజలి ప్రశ్నించారు. ఎహెచ్ఐఏఎల్ సంస్థ అక్రమంగా విదేశీ విరాళాలు స్వీకరిస్తోందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) అనుమతి మేరకే విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. -
వాంగ్చుక్కు పాక్తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్చుక్కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.కాగా, లద్దాఖ్లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. -
సోనమ్ వాంగ్చుక్ అరెస్టు
లేహ్/శ్రీనగర్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్(59)ను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అరెస్టు చేశారు. లద్దాఖ్ రాజధాని లేహ్లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. లేహ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. వాంగ్చుక్ను లద్దాఖ్ నుంచి రాజస్థాన్లోని జో«థ్పూర్కు తరలించారు. ఆయనపై ఏయే అభియోగాలు మోపారన్న దానిపై పోలీసుల ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ఉన్న లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నెల 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమకారులు బుధవారం ఇచి్చన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. లేహ్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. హింస నేపథ్యంలో వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించారు. లద్దాఖ్లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్చుక్ కారణమని కేంద్ర హోంశాఖ గురువారం ఆరోపించింది. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. నన్ను బలిపశువును చేయడానికి కుట్ర: వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్చుక్ గురువారం ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికే తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కనపెట్టి జనం ఆకాంక్షలు నెరవేర్చాలని హితవు పలికారు. మరోవైపు వాంగుచుక్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆరోపణలు నిరూపించగలరా?: గీతాంజలిసోనమ్ వాంగ్చుక్ను నేరçస్తుడిలా పరిగణిస్తున్నారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో మండిపడ్డారు. వాంగ్చుక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్రం తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పోలీసులు తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తన భర్తను జాతివ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. ఎలాంటి విచారణ గానీ, కారణంగా గానీ లేకుండా ఆయనను బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా జరడం దారుణమని అన్నారు. తన భర్త ఐదేళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నారని, ఏనాడూ హింసను ప్రేరేపించలేదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తూ ఎన్నో పురస్కారాలు పొందారని గుర్తుచేశారు. మేధావులకు, విద్యావేత్తలకు ఇచ్చే మర్యాద అదేనా? అని ప్రశ్నించారు. తన భర్తపై చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా? టీవీలో చర్చకు సిద్ధమా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గీతాంజలి అంగ్మో సవాలు విసిరారు. అరెస్టు దురదృష్టకరంసోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. లద్దాఖ్ ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అందుకే ప్రజలు పోరుబాట పట్టారని చెప్పారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచి్చందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్
ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్చుక్గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్చుక్ ఎన్జీవో లైసెన్స్ను సైతం కేంద్రం రద్దు చేసింది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్చుక్ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.లద్దాఖ్కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
సోనమ్ వాంగ్చుక్పై సీబీఐ ఉచ్చు.. విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు
లేహ్: లడఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.వాంగ్చుక్ నిరాహార దీక్ష అనంతరం..కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్గ్యాస్ షెల్స్ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలుసీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
లేహ్ పరిణామాలు.. కేంద్రం సంచలన ఆరోపణలు
రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు కోరుతూ గత కొంతకాలంగా కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో జరుగుతున్న ఆందోళనలు.. ఒక్కసారిగా హింసాత్మక మలుపు తిరిగాయి. సోమవారం లేహ్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను బాధ్యుడిగా చేస్తూ కేంద్రం సంచలన ఆరోపణలకు దిగింది. ఎంతో మంది నేతలు సోనమ్ వాంగ్చుక్ను(Sonam Wangchuk) కలిసి నిరాహార దీక్షను విరమించమని కోరారు. అయినా ఆయన మొండిగా ముందుకు వెళ్లారు. అరబ్ స్ప్రింగ్ ఉద్యమం, నేపాల్లో తాజాగా జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఆయన ప్రసంగాల వల్లే రెచ్చిపోయిన కొందరు యువకులు బీజేపీ కార్యాలయంపై దాడి సహా పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. లడాఖ్ యువతను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని, సంకుచిత రాజకీయాలకు.. వ్యక్తిగత లబ్ధికి వాళ్లు బలయ్యారని, కేంద్రం మాత్రం అక్కడి యువత సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఈ హింస సహజంగా జరగలేదని.. కావాలని ప్రేరేపించారని, ఒక వ్యూహం ప్రకారం పక్కా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని సంచలన ఆరోపణలు చేసింది కేంద్రం. ఈ ఘటనలపై ఇప్పటికే కొన్ని కీలక వర్గాలు సేకరించినట్లు చెబుతున్న కేంద్ర హోం శాఖ వర్గాలు.. అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశాయి. 👉బుధవారం సాయంత్రం కల్లా లేహ్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. లడాఖ్లో ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే.. .. ‘ఇది లడాఖ్కు, నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖదాయకమైన రోజు. గత ఐదేళ్లుగా మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. కానీ ఈ రోజు హింస జరిగింది, ఇది మా శాంతి సందేశాన్ని విఫలమయ్యేలా చేసింది. మా యువత ప్రాణాలు కోల్పోతే దీక్షకు అర్థం ఉండదు. అందుకే దీక్షను వెంటనే విరమిస్తున్నాను’ అని సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు. అదే సమయంలో.. కేంద్రం చేసిన ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.👉తన ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, లడాఖ్ ప్రజల హక్కుల కోసం మాత్రమేనని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేశారు. నేపాల్ Gen Z ఉద్యమాన్ని ప్రస్తావించడం.. కేవలం ఇక్కడి జనాల్లో చైతన్యాన్ని పెంచేందుకు మాత్రమేనని, అది హింసకు ప్రేరణ ఇవ్వడం ఏమాత్రం కాదని అన్నారాయన. ఇప్పటిదాకా ఈ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే సాగిందని గుర్తు చేశారు. లడాఖ్ హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ యూటర్న్, నిరుద్యోగ సమస్య.. ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ‘‘ప్రభుత్వం ఇకనైనా మా శాంతి సందేశాన్ని వినాలి. పోలీసులు నిరసకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం ఆపాలి. శాంతి నిరసనలే మా మార్గం. హింస వల్ల మా లక్ష్యం దూరమవుతుంది. యువత కూడా కవ్వింపు చర్యలను మానాలి. ఇది మన ఉద్యమానికి హాని చేస్తుంది’’ అని పిలుపు ఇచ్చారాయన.సోనం వాంగ్చుక్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త & పర్యావరణ పరిరక్షకుడు. ఆయన సెక్మోల్ (Students' Educational and Cultural Movement of Ladakh) అనే సంస్థను స్థాపించి సంప్రదాయ విద్యా విధానాలకు భిన్నంగా పిల్లలకు అనుభవాధారిత(ప్రాక్టికల్స్) విద్యను బోధించేవారాయన. తద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ విధానాల నుంచి ఇన్స్పిరేషన్తో.. 2009లో దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ ‘రాంచో’ పాత్రను రూపొందించారు. అంతేకాదు.. వినూత్న విద్యా విధానాలు, పర్యావరణ పరిరక్షణ, లడాఖ్ ప్రజల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆసియా ప్రతిష్టాత్మక అవార్డు రామన్ మెగసెసే ఆయనకు దక్కింది కూడా.👉అయితే.. లడాఖ్కు రాష్ట్రహోదా కల్పించాలని, అలాగే ఆరవ షెడ్యూల్ (Sixth Schedule) అమలు చేయాలని సోనమ్ వాంగ్చ్క్ తన దీక్షను సెప్టెంబర్ 10, 2025న ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత.. లడాఖ్లోని లేహ్ జిల్లా కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరవ షెడ్యూల్.. అనేది త్రిపుర, మేఘాలయ, మిజోరం మరియు అస్సాం రాష్ట్రాల్లోని గిరిజనుల పాలనకు ప్రత్యేకంగా రూపొందించబడిన రాజ్యాంగ అధికార పరిమితులు(Provision). ఆరవ షెడ్యూల్ అమలుతో గిరిజన ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భారత రాజ్యాంగంలోని Article 244 ప్రకారం.. స్థానిక స్వయం పాలన, భాష.. సంస్కృతి.. సంప్రదాయల రక్షణ, ప్రత్యేక న్యాయవ్యవస్థ, ఆర్థిక స్వాతంత్రం, విద్యా..ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి. దీంతో లడాఖ్లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎపెక్స్ బాడీ లేహ్(LAB.. రాజకీయ సంఘాల సమ్మేళనం), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(KDA) గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నాయి. సోమవారం లేహ్లో చోటు చేసుసున్న హింసాత్మక ఘటనల్లో 50 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. కేంద్రం ఇప్పటికే అక్టోబర్ 6న లాబ్, కేడీఏ ప్రతినిధులతో హై పవర్డ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో కూడా చర్చలకు ప్రయత్నించినప్పటికీ, సానుకూల స్పందన రాలేదని బుధవారం రాత్రి వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: 'ఐ లవ్ మహ్మద్'పై కశ్మీర్ సీఎం స్పందన


