breaking news
sivannarayana
-
‘ఎంసెట్’ నిందితులు సీఐడీ కస్టడీకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో అరెస్టయి న శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. లీకైన ప్రశ్నపత్రంపై క్యాంపులో శిక్షణ పొందిన 136 మంది విద్యార్థుల వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటివరకు సేకరించింది. వారిలో 80 శాతం మంది ఈ రెండు కాలేజీలకు చెంది న వారే ఉండటంతో వాసుబాబు, శివనారాయణ కస్టడీ విచారణ కీలకం కానుందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే విద్యార్థులను క్యాంపులకు పంపించామంటూ వాసుబాబు, శివనారాయణ చెబుతుండగా కమీషన్ల కోసమే అయితే ఇంత మంది ఒకే గ్యాంగుతో ఎలా క్యాంపులకు వెళ్తారని సీఐడీ అనుమానిస్తోంది. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివి, ప్రస్తుతం మెడికోలుగా ఉన్న ఆరుగురు బ్రోకర్లు సైతం మాఫియా తో చేతులు కలపడం వెనుకున్న రహ స్యాన్ని బయటపెట్టేందుకు వాసుబాబు, శివనారాయణ కస్టడీ కీలకమని అధికారులు తెలిపారు. శ్రీచైతన్యలోనే చదివిన బ్రోకర్, మెడికో గణేష్ప్రసాద్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు వాసుబాబు, శివనారాయణ మెడకు ఉచ్చు బిగేంచేలా ఉన్నట్లు తెలిసింది. ఏటా ఎంసెట్ సమయంలో వీరిద్దరూ గణేష్, ఇతర నిందితులైన డాకర్లు ధనుంజయ్, సందీప్లతోనూ వ్యవహారం నడిపినట్లు తేలింది. దీంతో కేవలం ఆరుగురు విద్యార్థులనే కాకుండా వాసుబాబు, శివనారాయణ ఈ రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరికొందరిని క్యాంపులకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ లింకు ఛేదించేందుకు శుక్రవారం నుంచి ఆరురోజులపాటు ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. -
పరస్పర సహకారంతో పని చేద్దాం
ఏపీపీఎస్సీ ఇన్ఛార్జి ఛైర్మన్తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: ఒకే భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరస్పర సహకారం, సోదరభావంతో పని చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆకాక్షించారు. కమిషన్ కార్యాలయంలో సోమవారం ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్ శివన్నారాయణను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీపీఎస్సీ కార్యాలయ భవనం, సిబ్బంది విభజన పూర్తికి రాష్ట్ర విభజన విభాగం తెలంగాణ కార్యదర్శి రామకృష్ణారావు హామీ ఇచ్చినట్టు ఘంటా తెలిపారు. అనంతరం సీఎస్ డాక్టర్ రాజీవ్శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావులతో చర్చించారు. -
మావోయిస్టు నేత శివన్నారాయణ అరెస్టు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివన్నారాయణ అలియాస్ శివప్రసాద్ను పోలీసులు మెదక్ జిల్లా గజ్వేల్లో సోమవారం అరెస్టు చేశారు. వాస్తవానికి మూడు రోజుల క్రితమే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోనే కాక, జాతీయస్థాయిలో కూడా మావోయిస్టు కార్యకలాపాలలో శివన్నారాయణ కీలక పాత్ర పోషించేవారు. ఆయనపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రభుత్వం ప్రకటించింది.