-
బిగ్బాస్లో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు
ప్రాంతీయ భాషల్లో బిగ్బాస్ షో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్బాస్ రెండో సీజన్ నడుస్తుండగా.. మళయాళంలో బిగ్బాస్ తొలి సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా మళయాళ సూపర్స్టార్ మోహన్లాల్ వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా సాధారణ ప్రజల్లో నెలకొంది. మళయాళం బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన 16మంది సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు అందుతున్నాయని టాక్. బిగ్బాస్ నిర్వహకులు ప్రముఖ నటి శ్వేతా మీనన్కు హౌస్లో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె బిగ్బాస్ హౌస్లో కొనసాగినన్ని రోజులు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. మాజీ మిస్ కేరళ, ప్రముఖ యాంకర్ రంజిని హరిదాస్, శ్వేతా మీనన్ తర్వాతి స్థానంలో నిలిచారు. రంజినికి రోజుకు 80వేల రూపాయలు అందజేస్తున్నారు. మిగత కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్(రోజుకు) ప్రముఖ హాస్యనటుడు అనూప్ చంద్రన్- 71,000 నటి పర్ల్ మానే- 50,000 టీవీ నటి ఆర్చన సుశీలన్- 30,000 నటి హిమా శంకర్- 20,000 మిగతా కంటెస్టెంట్లు దీపన్, సాబు, మనోజ్ వర్మలు రోజుకు 10వేల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా మిగతా హౌస్ సభ్యులు శ్రీ లక్ష్మీ, దివ్య సన, సురేశ్, అదితి రాయ్, శ్రీనిష్ ఆరవింద్, బషీర్లు ఎంత తీసుకుంటున్నరనేది తెలియలేదు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
శ్వేతామీనన్ నిరీక్షణ
హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. శ్వేతామీనన్ ముఖ్య పాత్రలో పర్స రమేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బసంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: అనిత్, సంగీతం: భోలే. -
షీ ఈజ్ వెయిటింగ్
మలయాళ నటి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో పర్స మహేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ిహీరో, ఇతర తారాగణం. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. -
నాపై ఎటువంటి ఒత్తిడి లేదు:శ్వేతా మీనన్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73) పై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ తెలిపింది. కేసును వెనక్కి తీసుకోవడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని శ్వేతా తెలిపింది. గత కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఎంపీ కురుప్ అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మెట్టుదిగి వచ్చిన శ్వేతా మీనన్ గురువారం ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కేసును వెనక్కి తీసుకోబోతున్నట్లు తెలిపింది. తనకు తానుగానే ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నానని, ఈ అంశంలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదని తెలిపింది. కాగా, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఆ రోజు జరిగిన పబ్లిక్ ఫంక్షన్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, వివాదాలను స్పష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని తాను ఎప్పుడూ కోరుకోనని తెలిపింది. అతని వయసుకు గౌరవమిచ్చి కేసును వెనక్కు తీసుకుంటున్నాని తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement