-
భారీగా పతనమైన యస్ బ్యాంక్ షేరు
సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంక్కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్ క్యాప్ అని గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. క్యూ1 ఫలితాలు బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్ బ్యాంక్ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. -
ఆర్బీఐ, సీబీఐ షాక్: ఐసీఐసీఐ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐకు వరుస షాక్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్కు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కేసు నమోదు, సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఐసీఐసీఐ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు 6శాతం (5.6) పతనాన్ని నమోదు చేసింది. దీనికితోడు సెక్యూరిటీ విక్రయాల అంశంలో నియమాలను పాటించని కారణంగా ఆర్బీఐ విధించిన 58.9 కోట్ల రూపాయల జరిమానా కూడా ఐసీఐసీఐసీ బ్యాంకు నెత్తిన పిడుగులా పడింది. మరోవైపు దివాళా బాటలో వీడియోకాన్ షేరు సైతం 5 శాతంనష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకడం గమనార్హం. కాగా వీడియోకాన్కు రుణాలు మంజూరు చేసిన అంశంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టింది. వీడియోకాన్ గ్రూప్నకు వేలకోట్ల రుణాలిచ్చినందుకు గాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది. వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు విడుదల చేయడంలో క్విడ్ప్రో కో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
డామినోస్ పిజ్జా ఆపరేటర్కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ సంచలన ప్రకటనతో ఐటీ ఢమాల్
ఐటీ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంచలన వ్యాఖ్యలు ఐటీ రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. క్యూ 2 లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో ప్రతికూలతలు నమోదవుతున్నట్టు ముంబై కి చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో కనిపించనున్నట్లు హెచ్చరించింది. దీంతో మదుపర్లు భారీ అమ్మకాలతో గురువారం నాటి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ ఐటీ రంగ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 6.4 శాతం పతనమై ఆరునెలల కనిష్టానికి చేరింది. మరో ఐటీ మేజర్ విప్రో షేర్ కూడా ఇదే కోవలోకి చేరింది. భారీ అమ్మకాల ఒత్తిడితో 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఆగష్టు 2016 డేటా ఆధారంగా వరున నష్టాలు ఊపందుకుంటున్నాయనీ, ఆర్థిక సేవలు, బీమా (బిఎఫ్ఎస్ఐ) సేవల పరిణామల కారణంగా ప్రధానంగా కంపెనీ కస్టమర్ల వృద్ధిలో ఒక హెచ్చరిక గుర్తించబడిందని బీఎస్ కి అందించిన ఒక ప్రకటనలో తెలిపింది . అమెరికా ప్రాజెక్టులపై ఈ ప్రభావం కనిపిస్తోదని టీసీఎస్ పేర్కొంది. ఈ ప్రకటన స్టాక్ ప్రతికూల ప్రభావం చూపించిందనీ, తదుపరి 2-3 త్రైమాసికాల్లో టీసీఎస్ అండర్ ఫెర్ ఫార్మర్ గా ఉండనుందనీ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరాష్కర్ వ్యాఖ్యానించారు. ఇది ఊహించిన పరిణామమేని, మొత్తానికి ఐటీ రంగానికి ప్రతికూలమేనన్నారు. మరోవైపు బ్రెగ్జిట్ ఉదంతం నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, ఆలస్యంకావడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, మెండ్ ట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు క్యూ 1 ఆర్థిక ఫలితాలు కూడా ఐటీ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఒరాకిల్ ఫైనాన్షియల్ నేలచూపులు చూస్తున్నాయి. -
మిస్ అయిన జస్ట్ డయల్
ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు 3శాతం నష్టాల్లో ఉంది ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో, ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement