-
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డ్రెస్ ఫర్ సక్సెస్..: విజయానికి కావాలి ఓ డ్రెస్!
వివిధ రంగాలలో ‘ఆమె’ స్థానం మహోన్నతంగా ఎదుగుతోంది. దానికి తగినట్టు ‘ఆమె’ ఆహార్యం మారుతోంది. స్థానిక, భాష, సంస్కృతులకు భిన్నంగా ఉద్యోగిగా ‘ఆమె’కు సరైన డ్రెస్ ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వృత్తిపరమైన వస్త్రధారణ ‘ఆమె’కు తప్పనిసరి అవసరం అంటోంది ‘డ్రెస్ ఫర్ సక్సెస్’. లాభాపేక్షలేని ఈ సంస్థ పుట్టింది అమెరికాలోనే అయినా ప్రపంచంలోని పాతిక దేశాలకుపైగా విస్తరించింది. ఎదుగుతున్న మహిళకు ‘డ్రెస్’ అవసరం కొత్తగా పరిచయం చేస్తోంది. వృత్తి, ఉద్యోగాలలో సరైన వస్త్రధారణ మహిల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. ‘ఇంటర్వ్యూల సమయంలో వస్త్రధారణ కారణంగా పెరిగే ఆత్మవిశ్వాసాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. పనికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మన ఆహార్యం ద్వారా తెలిజేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫీసు పనిలో మరిన్ని విజయాలు, అవకాశాలను సొంతం చేసుకోగలరు’ అంటున్నారు ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ నిర్వాహకులు. మిలియన్లకు పైగా మహిళలు డ్రెస్ ఫర్ సక్సెస్ సంస్థ కార్యకలాపాలను న్యూయార్క్ నగరంలో 1997లో ప్రారంభించారు. ఆస్త్రేలియా, ఇటలీ, మెక్సికో, నెదర్లాండ్స్, పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్, నేపాల్, నైజీరియా, సింగపూర్... మొదలైన 25 దేశాలలో దాదాపు 150 నగరాలకు విస్తరించి, 1.2 మిలియన్లకు పైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడింది. ‘మీ దుస్తులు ఎలా విరాళంగా ఇవ్వచ్చు. సంస్థకు ఎలా మద్దతు ఇవ్వవచ్చు, వాలంటీర్గా పాల్గొనడం లేదా ఇతర మార్గాల్లో సహాయం ఇవ్వచ్చు’ అనే విషయాల్లోనూ సంస్థ వెబ్సైట్ ద్వారానూ స్పష్టం చేస్తుంది. ఘన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మహిళ విజయం కోసం పనిచేసే ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ ప్రధాన కేంద్రం న్యూయార్క్లో ఉంది. ఇది గ్లోబల్ అనుబంధ నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది. నాన్సీ లుబ్లిన్ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని 1996లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన 5 వేల డాలర్లను వేలాది మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంది. మన్హట్టన్లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ని స్థాపించింది. ఆ బేస్మెంట్ బోటిక్ నుంచి ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ మిషన్ ఉత్తర అమెరికా అంతటా కొద్ది కాలంలోనే వ్యాపించి, ఆపై ప్రపంచమంతటా విస్తరించింది. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో మహిళలందరూ వారి స్థానం, భాష, ఆచారాలు లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ఎదుర్కొనే సవాలు ఇది అని డ్రెస్ ఫర్ సక్సెస్ నిరూపిస్తుంది. ‘ప్రతి యేటా 14,000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు, పురుషులు తమ సమయాన్ని, ప్రతిభను మా అనుబంధ సంస్థలకు ఉదారంగా విరాళంగా ఇస్తున్నారు’ అంటున్నారు నిర్వాహకులు. రెజ్యూమ్లతోనూ సాయం చాలా మంది మహిళలు పేదరిక స్థాయి లేదా దిగువ స్థాయిలోనే జీవిస్తున్నారు. ‘ఆమె’ తన జీవితంలో కొత్త పునాదిని నిర్మించుకోవడానికి సంస్థ చేదోడుగా ఉంటుంది. బాధిత మనస్తత్వాన్ని విజయంగా మార్చడంలో సహాయపడుతుంది. రెజ్యూమ్ను ఎలా తయారు చేసుకోవాలో, ఇంటర్వ్యూలలో ఎలా పాల్గొనాలో కూడా సహాయం చేస్తుంది. ‘నా జీవితం నిజంగా అద్భుతమైనది. వాళ్లు నా కోసం చాలా చేశారు. సక్సెస్ కోసం డ్రెస్, షూస్, మంచి సూట్ ధరిస్తే నేను చాలా అందంగా కనిపిస్తానని తెలియజేశారు. ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నాననే నమ్మకం నాకు కలిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది’ అంటారు ఈ సంస్థ నుంచి సాయం పొందిన మహిళ సోని. ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి ఒక కొత్త అవకాశాన్ని జోడిస్తుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘యువర్ అవర్, హర్ పవర్’ క్యాంపెయిన్తో ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి వేతనంలో ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయంలో పొందే మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చని కూడా సూచిస్తోంది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అనే ఆలోచనతో అన్ని దేశాల్లోనూ మహిళలకు ప్రియమైన నేస్తంగా మారుతోంది డ్రెస్ ఫర్ సక్సెస్. మహిళాభ్యుదయానికి పాటు పడే ఇలాంటి సంస్థలు మన ముంగిట్లోకీ రావాలని కోరుకుందాం. మతాలకు అతీతంగా ‘బొటిక్కు వచ్చిన క్లయింట్ తన వృత్తికి తగిన దుస్తులను ఎంచుకోవడం అనేది కష్టమైన ప్రక్రియ. ఆమె అభిరుచికి అనుగుణంగా సరైన ఎంపిక ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెబుతున్నారు వాలంటీర్ జైనాబ్. ‘ఆన్లైన్ ద్వారాను వారికి సరైన గైడెన్స్ ఇస్తుంటాం. ఇంటర్వ్యూ లేదా కొత్త ఉద్యోగానికి తగిన దుస్తులను ఎంచుకోవడంలో మహిళలకు సహాయం చేస్తుంటాను. మా అనుబంధ సంస్థల ఈవెంట్లలో కూడా పాల్గొంటుంటాను’ అని వివరిస్తారు జైనాబ్. గృహహింస కారణంగా బాధపడుతున్న మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని, వారు కొత్త జీవితాన్ని పొందడానికి సహాయం చేయడంలోనూ, వారి విజయానికి పాటు పడటంలోనూ ఈ ప్రోగ్రామ్లు ఉపయోగపడతాయని వివరిస్తారామె. లాభాపేక్షలేకుండా.. పురుషాధిక్యత అధికంగా ఉన్న దేశాలపైన దృష్టి పెట్టింది డ్రెస్ ఫర్ సక్సెస్. అక్కడి అనుబంధ సంస్థల ద్వారా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ఇమిగ్రేషన్ సేవలు, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు, విద్యా సంస్థలు, గృహ హింసతో బాధపడేవారికి షెల్టర్లతో సహా అనేక ఇతర లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఘనతను సొంతం చేసుకుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘మహిళలందరూ ఉన్నతంగా మారడానికి పెద్ద కలలు కనాలని కోరుకుంటున్నాను. ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి పొందాలి. మా ప్రాథమిక దృష్టి మహిళలకు శిక్షణ ఇవ్వడం మీదనే. దాని వల్ల వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం’ అంటున్నారు ఖాట్మండూలోని డ్రెస్ ఫర్ సక్సెస్ ఫౌండర్ అమృత. -
టెక్నాలజీలో స్వయం సమృద్ధి కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగాలలో దేశం స్వయంసమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. చివరి అంచెవరకూ సర్వీసుల అందజేత, భారీ ఉపాధి కల్పనలో ఇవి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విడివడి ఉండదని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో దగ్గరగా కనెక్టయి ఉండే రంగమని ‘సాంకేతిక ఆధార అభివృద్ధి’పై నిర్వహించిన వెబినార్లో ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేగవంత డెలివరీ, పౌరులకు సాధికారత కల్పిస్తున్న డిజిటల్ ఎకానమీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారితమై ఉన్నట్లు వివరించారు. సాధారణంగా టెలికమ్యూనికేషన్, అందులోనూ 5జీ టెక్నాలజీ ప్రధానంగా వృద్ధికి ఊతమివ్వడమేకాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 5జీ మొబైల్ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు వీలుగా అవసరమైన స్పెక్ట్రమ్ వేలాన్ని 2022లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వెబినార్లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని వివిధ శాఖల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. మెడికల్ పరికరాలపై టెక్నాలజీ కీలక పాత్ర పోషించే మెడికల్ పరికరాలను తయారు చేయడంపై దృష్టిపెట్టవలసి ఉన్నదని మోదీ వెబినార్లో గట్టిగా చెప్పారు. తద్వారా డిమాండుకు అనుగుణంగా పరికరాలను సరఫరా చేయగలమని తెలియజేశారు. దేశీ స్టార్టప్ పరిశ్రమకు ప్రభుత్వం వివిధ దశలలో సహకరిస్తుందని అభయమిచ్చారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాభివృద్ధి దగ్గర నుంచి తయారీ వరకూ అవాంతరాలు లేని పురోగతికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సైతం కాంగ్రెస్ నుద్దేశించి చేసిన తన ప్రసంగంలో స్వయం సమృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న ప్రపంచ వ్యవస్థలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం ద్వారా ముందుకుసాగడం కీలకమని వ్యాఖ్యానించారు. దేశంలో తయారీ రంగానికి దన్నునిచ్చే బాటలో 14 కీలక రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రస్తావించారు. పౌర సేవలలో ఆప్టికల్ ఫైబర్ వినియోగం, ఈవేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంశాలలో ఆచరణసాధ్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల పురోగమనం టెక్నాలజీ ఆధారితమని, ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం డిజిటల్ ప్లాట్ఫామ్స్తో కనెక్టయి ఉన్నదని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement