-
కారులో వెళ్లి ఆటోలో వచ్చాం!
ఎట్టకేలకు కారు కొనేశాను. థర్డ్ హ్యాండు. మొదట... డాక్టర్గారు ఇంటికీ, క్లినిక్కీ అయిదేళ్లు తిరిగి రాజుగారికి అమ్మేశారు. ఆ రాజుగారు ఇంటికి తోటకి రెండేళ్లు తిరిగి కొత్త మోజు పెరగడంతో కారు బేరం పెట్టారు.నా ఫ్రెండ్ కుమార్ దృష్టి దాని మీద పడితే అది నా వరకు చేరింది. అవకాశం వచ్చేసిందని కొనేశాను. ముద్దుగా, బొద్దుగా, నీటుగా ఉంది మారుతి 800.1988 మోడల్. వయసెక్కువేగాని మా పిల్లలు దాన్ని పాపా అని పిలిచేవారు.తొలిరోజుల్లో ఎవరు నా కారు ఎక్కుతారా అని ఎదురు చూసేవాడిని. అడిగిందే తడవు కారు ఎక్కించి ఊరంతా తిప్పేద్దామన్న ఆత్రుత నాది. మా ఆవిడ, పిల్లలు మాత్రం నా కారెక్కేవారు కాదు. వారికి నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదు. అందుకని నన్ను కారు ఎక్కనిచ్చేవారు కాదు. వారు ఎక్కేవారు కూడా కాదు.ఆరోజు మా చిన్నాన్న కూతురు గృహప్రవేశం. సత్యనారాయణవ్రతం, వెంకటేశ్వర దీపారాధన కార్యక్రమాలున్నాయి. ముందురోజే మా మరదలు వచ్చింది. ఆమె కూడా ఫంక్షన్కు బయలుదేరింది. బయలుదేరుతున్నామనగా మా బావమరిది భార్య వచ్చింది. నేనూ వస్తానంది. మరింకేం? మా ఆవిడ, మరదలు, బావమరిది భార్య ముగ్గురూ పవర్ఫుల్లే. వారిని నా కారులో, నేను డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాలనే తపన నాది. మా ఆవిడకు ఇష్టం లేదుగానీ మరదలూ, బావమరిది భార్య తెగ ముచ్చట పడ్డారు నా కారులో రావడానికి. బాబామెట్ట నుంచి జమ్మునారాయణపురం వెళ్లడానికి పది నిమిషాలు లేదా పావుగంట పడుతుంది. అందుకని పదిగంటలకు బయలుదేరాం. కారు తీసాను.బాబామెట్ట, రైతుబజారు, రింగురోడ్డు, దాసన్నపేట మీదుగా జమ్మునారాయణపురం మామూలు రూటు. బాబామెట్ట రెండు లైన్లు దాటాం. కారు 30 కి.మీ వేగంతో తోలుతున్నాను.‘‘అదంతా చుట్టూ తిరగడమెందుకు? ఇలా అడ్డంగా తోలండి’’ అంది బావమరిది భార్య.కారు దారి మళ్లింది.అడ్డదారి గతుకుల రోడ్డు. మధ్యమధ్యలో కొళాయి పైపుల కోసం రోడ్డు తవ్వేసి కప్పకుండా వదిలేసిన గోతులు. రెండు,మూడు రోజుల క్రితం వర్షం పడడం వల్ల అక్కడక్కడ నీటిగుంతలు, మధ్యలో బురద, రాళ్లు తేలిపోయి అస్తవ్యస్తంగా ఉంది. కారు ఇటు కోస్తే అటు ఊగిపోతోంది.మధ్యలో కూర్చున్న మరదలు ఇటు మా ఆవిడ మీద అటు బావమరిది భార్య మీద పడిపోతోంది.చివర ఉన్న ఇద్దరూ మరదలి మీద పడిపోతున్నారు. నాకు ఒకవైపు నవ్వు, మరొకవైపు ఏ గోతిలో దిగిపోతానోనన్న భయం. ఉయ్యాలూగుతున్నట్లుగా కారు ఊగుతోంది.‘‘ఇదేమిటి ఇలా పడిపోతున్నాం ఒకరి మీద ఒకరం’’ అంటుంది మరదలు.‘‘నువ్వే చేశావు, తిన్నగా వెళ్లేవారిని అడ్డంగా వెళ్లమన్నావ్’’ అంది ఆవిడ.‘‘నేనేం చేశాను? ఇలా అయితే వేగిరం వెళ్లొచ్చని చెప్పాను. రోడ్డు ఇలా ఉంటుందని నాకేం తెలుసు?’’ అంది బావమరిది భార్య.ఇలా ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటుండగా కారు దాసన్నపేట రింగ్రోడ్డు దాటి శ్రీకాకుళం రూట్లోకెళ్లింది. తారురోడ్డు మీద బాగానే వెళ్తుంది. వెనుక సీట్లో వారు స్థిమితపడ్డారు. కారు జమ్మునారాయణపురం కోళ్లఫారం దగ్గరకు వెళ్లింది. అక్కడ భరింపరాని కంపు. ఆ రోడ్డున నడిచివెళ్లడమే ఇబ్బందిగా ఉంటుంది. కారు వేగానికి గాలి రై రై మంటుంటే కంపు మరీ భరింపరానిదిగా ఉంది.‘‘కంపు కంపు’’ అంటూ మరదలు ఒకటే సణుగుడు.కోళ్లఫారానికి కుడివైపున అయిదు సమాంతర వీధులున్నాయి. ఎటు వెళ్లాలో తెలియలేదు. మొదటి వీధిలోకి కారు తిప్పాను. పదిగజాలు వెళ్లిందో లేదో కారు ఆగిపోయింది. ఎందుకో తెలీదు. స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిందిగానీ ముందుకు కదలడం లేదు. గేరు పడడం లేదు.మళ్లీ ప్రయత్నించాను. కారు కదిలింది. ఆపితే మళ్లీ కదులుతుందో లేదో అనే భయంతో ముందుకి వేగంగా పరుగెత్తించాను.ఒక్క వుదుటున వీధి చివరికి వెళ్లిపోయింది. మరి ముందుకి మార్గం లేదు. కటింగ్ వీలేకాదు. ఇంతదూరం రివర్స్ చేయలేము. దిక్కుతోచక ముందుకీ, వెనక్కీ, రైట్ కి, లెఫ్ట్ కి ఊగిసలాటలో మళ్లీ కారాగిపోయింది.ముగ్గురినీ దిగమన్నాను.‘‘కొంచెం సాయం చెయ్యండి’’‘‘ఏం సాయం?’’‘‘కారు కొంచెం తొయ్యండి’’‘‘సరదా తీరిపోయింది’’ అనుకుంటూ ముగ్గురు దిగి తోశారు.కారు కదిలింది. మరి ఆపకుండా అక్కడున్నవారిని అడిగి మూడో వీధిలో చివర సాయిబాబా గుడి దగ్గర ఇంటి ముందు దించి ఇక లోనికి పదండని వారిని పంపి, నేను మెకానిక్కి ఫోన్ చేసి, కారుని షెడ్డుకి పంపించేసి వారిని కలుసుకున్నాను. ఫంక్షన్ అయిపోయింది. విందుభోజనాలయ్యాయి.బయటికొచ్చాం. నేను ముందు వారు వెనక నడుసున్నారు.‘‘కారేది?’’ మరదలి ప్రశ్న.‘‘అక్కడెక్కడో పెట్టుంటారు’’ మా ఆవిడ జవాబు.ముందుకు నడుస్తున్నాం. కారు కనపడదు? మరదలికి ఓపిక నశించింది.‘‘కారు కనబడదు. ఇలా నడిచివెళితే నవ్వుకుంటారు’’ అంది. కారు షెడ్డుకెళ్లిందని వారికి తెలియదు.‘‘ఏమనుకుంటారు లెద్దూ’’ అంది ఆవిడ.మరదలు చిరాకు పడింది. అందరూ నడుస్తున్నారు. ఎందుకో ఎక్కడికో తెలీదు. ఇంతలో మెయిన్రోడ్డు చేరుకున్నాం. రోడ్డు పక్కన నిల్చున్నాం. నేను వచ్చే ఆటోలను ఆపుతున్నాను. అవి ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ఇది గమనించిన మరదలు ‘‘ఆటోలెందుకు ఆపుతున్నారు?’’ అంది.‘‘కారు షెడ్కెళ్లింది.మెకానిక్ తీసుకెళ్లాడు’’ఇంతలో ఆటో ఆగింది. బాబామెట్ట అని చెప్పి ఆటో ఎక్కాం. ఆటోలో జోకులే జోకులు. ఆటోవాలా నాలానే అడ్డదారినే పోతున్నాడు. మళ్లీ అవేగోతులు. మళ్లీ అవే గుంతలు.ఒకరిపై ఒకరు జోగడాలు. నేను బేబీ సీట్లో కూర్చున్నా. తేలిక మనిషిని కాబట్టి మాటిమాటికి జారిపోయి మా ఆవిడ మీద పడుతున్నాను. కుదుపులకి అందరి ఒళ్లు హూనమైపోయింది. ఇంకా ఎన్నని చెప్పమంటారు ఆనాటి ఆటో కష్టాలు! – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
పెళ్లి అయిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేయిస్తారెందుకు?
వ్రతాలలో సత్యనారాయణస్వామి వ్రతానికి ఎంతో విశిష్టత వుంది. అనేక కష్టాల నుంచి ... నష్టాల నుంచి ... బాధల నుంచి బయటపడేసే శక్తి ఈ వ్రతానికి వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, జీవితమనే సముద్రంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్లని క్షేమంగా తీరానికి చేర్చే నావలా సత్యనారాయణస్వామి వ్రత ఫలితం పనిచేస్తుంది.తొలిసారిగా కొత్తకోడలు తమ ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా, అత్తగారింటి వాళ్లు నూతన దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతం చేయించడం ఆచారంగా వస్తోంది. ఎక్కడో కొంతమంది తప్ప చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తూ వుంటారు. సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషంగా భావిస్తుంటారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి ఈ భూమిపై ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.అసాధారణమైన శక్తిని కలిగిన ఈ స్వామిని పూజించడం వలన త్రిమూర్తులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తుంటారు. పెళ్లితో ఒక్కటైన నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. వాళ్ల జీవన ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగేలా ఆశీస్సులు అందజేయమని, త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ ఈ వ్రతాన్ని చేయిస్తూ వుంటారు.ఇక ఈ వ్రతానికి తమ గ్రామస్తులను ఎక్కువగా పిలుస్తూ వుంటారు. తమ గ్రామానికి కొత్తగా వచ్చిన కోడలు పిల్లను చూడాలని అక్కడి స్త్రీలు ఆతృత పడుతుంటారు. సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చిన వాళ్లు ఆ కోడలు పిల్లను చూడటం జరుగుతుంది. ఈ కారణంగా వాళ్లందరితో ఆ కోడలికి పరిచయం ఏర్పడటం వలన, ఆ తరువాత చాలా తొందరగా వాళ్లతో కలిసిపోతుంది. తనకి ఆ ఊరు కొత్త అనే విషయాన్ని కొద్ది రోజుల్లోనే మరిచిపోతుంది... ఓం నమో సత్యదేవాయ నమః -
సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..
చెన్నూర్ : సత్యనారాణయ వ్రతం కోసం వెళ్లిన అన్నాతమ్ముడు గోదావరిలో నీట మునిగి చనిపోయిన సంఘటన చెన్నూర్లో విషాదాన్ని నింపింది. ఓ చిన్నారిని కాపాడి తన కొడుకులను రక్షించుకుకోలేకపోయిన ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ‘స్వామి వత్రం కోసం వస్తే మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పేరాల రామారావు స్థానిక అభయాంజనేయ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. రామారావు ప్రజావైన్స్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావు ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న ఆర్యవైశ్యులు పట్టణ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతానికి వీరిని ఆహ్వానించడంతో రామారావు, భార్య లావణ్యతోపాటు ఇద్దరు కుమారులు సాయికృష్ణ (11), సాయి వర్షిత్ (6) వెళ్లారు. అక్కడి వెళ్లిన రామారావు పిల్లలతో గోదావరి స్నానాలు చేస్తున్నారు. వీరికి కొంత దూరంలో కొంత మంది చిన్నారులు స్నానాలు చేస్తున్నారు. అందులోంచి ఓ చిన్నారి గోదావరిలో మునిగిపోతుండగా రామారావు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు వచ్చి చూసే సరికి తన కొడుకులు ఇద్దరు కన్పించలేదు. తండ్రి వెంటనే వెళ్లిన సాయికృష్ణ (11), సాయివర్షిత్(6) గోదావరి నదిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతైన ప్రదేశం లోతుగా ఉండడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. సత్యనారాయణ స్వామి వత్రాలను చూసేందుకు వస్తే ఆ స్వామి మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా అంటూ తల్లి లావణ్య రోధించిన తీరు పలువురిని కలచివేసింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్రావు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సాయికృష్ణ స్థానిక ఎస్జీబీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి, సాయివర్షిత్ ఎల్కేజీ చదువుతున్నారు. బంధువుల ఆందోళన సత్యనారాయణ వత్రాలు నిర్వహించే సమీపంలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెంది బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తుంటే పూజలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని మృతుల బంధువులు గోదావరి తీరం వద్ద ఆందోళన చేశారు. వెంటనే పూజలు నిలిపివేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement