breaking news
Saina naihval
-
మీ ప్రతిభతో భారత్ ఉప్పొంగిపోయింది
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పతక విజేతలు సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను కలిశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ పతకాలు గెలిచిన క్రీడాకారులందరితో కరచాలనం చేసి అభినందించారు. భవిష్యత్తులోనూ రాణించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు ప్రధాని నివాసంలో మోదీని కలువగా ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. ‘అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటిన మీరు అందరికీ ప్రేరణగా నిలిచారు. మీ ప్రతిభతో భారత్ ఉప్పొంగిపోయింది. మీ పతకంతో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు’ అని ప్రధాని మోదీ వారిని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ను ప్రత్యేకంగా అభినందించారు. గోపీనుద్దేశించి ఓ విజయవంతమైన ప్లేయర్గా కెరీర్ ముగించుకున్నప్పటికీ అంతటితో సంతృప్తి చెందక... కోచ్గా విరామమెరుగని కృషితో యువ క్రీడాకారులను అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో విజేతలుగా నిలుపుతున్నారని అభినందించారు. దశాబ్దాలపాటు విజేతగా నిలవొచ్చని మేరీకోమ్ చాటిందన్నారు. ఎంపీ అయ్యాక కూడా ఆమె పతకం గెలిచిందన్నారు. అథ్లెట్లతో పాటు భారత క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా వారితో పాటు ఉన్నారు. గోల్డ్కోస్ట్లో జరిగిన మెగా ఈవెంట్లో భారత్ 26 స్వర్ణాలు, 20 చొప్పున రజత, కాంస్యాలతో మొత్తం 66 పతకాలు సాధించింది. స్వర్ణ విజేతకు భారత క్రీడాశాఖ తరఫున రూ. 30 లక్షలు, రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ. 10 లక్షలు నజరానా అందజేశారు. ఈ కార్యక్రమంలో పతక విజేతలు మేరీకోమ్ (బాక్సింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), మీరాబాయి చాను, రాగాల వెంకట్ రాహుల్ (వెయిట్లిఫ్టింగ్), హుసాముద్దీన్ (బాక్సింగ్) తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం కాన్ఫిడెన్స్తో దూసుకెళ్లగలగాలి!
ప్రస్తుతం ‘వైశాఖం’ చిత్రం డెరైక్ట్ చేస్తున్నా. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీ డెరైక్టర్స్ బాగానే వస్తున్నా, నిలదొక్కుకుంటున్నవాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. దానికి కారణం ‘సర్వైవల్’. వరుసగా సినిమాలొస్తే ఫరవాలేదు. రాకపోవడంతో ఎక్కణ్ణుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లిపోతున్నారు. మనుగడ కోసం మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్స్గా చేయడమో, టీవీకి వెళ్లిపోవడమే చేస్తున్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగకపోవ డానికి ఇదో కారణం. మరో కారణం - ప్రోత్సాహం లేకపోవడమే! బేసిక్గా ఆడవాళ్ల ప్రతిభపై చాలా మందికి అపనమ్మకం ఉంటుంది. అందుకని, కథ వినడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ విని బాగున్నా, ‘బాగుంది’ అని ఒప్పుకునేవాళ్లు పరిశ్రమలో తక్కువ. అదే క్రీడా రంగాన్ని తీసుకుంటే, సానియా మీర్జా, సైనా నైహ్వాల్, కోనేరు హంపిలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. అంతెందుకు? హిందీ రంగాన్ని తీసుకుంటే దర్శకురాలు ఫరా ఖాన్ని అక్కడివాళ్లు ఎంకరేజ్ చేస్తారు. జయాపజయాలనేవి మగ దర్శకు లకూ ఉంటాయి. కానీ, లేడీ డెరైక్టర్ నుంచి ఒక్క ఫ్లాప్ వచ్చినా, పక్కన పెట్టేస్తారు. పోనీ మంచి కథ తయారు చేసుకున్నా ‘హ్యాండిల్ చేయగలుగుతుందా?’ అని అనుమానిస్తారు. కానీ, నిరుత్సాహపడి పోకూడదు. ఎంకరేజ్ సున్నా అయినా వంద శాతం కాన్ఫిడెన్స్తో దూసుకెళ్లగలగాలి. డెరైక్టర్లుగా రావాలనుకునే వాళ్లకి నేనిచ్చే సలహా ఇదే! - బి. జయ, సినీ దర్శకురాలు (‘చంటిగాడు’, ‘లవ్లీ’ ఫేమ్)