-
‘ఓటు వేయాలంటూ.. సెలబ్రిటీల ప్రచారం’
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లులో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ, క్రీడా సెలబ్రిటీలతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో..‘తప్పకుండా ఓటు వేయండి.. ఓటు వేయటం మీ కర్తవ్యం’అని సెలబ్రిటీలంతా కోరుతారు. ఈ షార్ట్ ఫిల్మ్ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించటం గమనార్హం. క్రీడా రంగం నుంచి సచిన్ టెండుల్కర్, సినిమా రంగం నుంచి పలువురు బాలీవుడ్, కోలివుడ్ ప్రముఖలు ఉన్నారు. వారివారి శైలీలో ఓటు వేయాలని కోరారు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి.. -
సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే?
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్ 'సచిన్ టెండూల్కర్' (Sachin Tendulkar) హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్లో పెట్టిన పెట్టుబడులు గురువారం భారీ వృద్ధిని సాధించడంతో ఏకంగా రూ.27 కోట్లు సంపాదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆజాద్ ఇంజినీరింగ్లో సచిన్ 2023 మార్చిలో రూ.5 కోట్లు ఇన్వెస్ట్ చేసి రూ. 114.10 ప్రైజ్ పాయింట్లో 4,38,210 షేర్లు కొనుగోలు చేశారు. వాటి విలువ నిన్న (డిసెంబర్ 28) ఏకంగా 7 రెట్లు పెరిగి స్టాక్ వ్యాల్యూ రూ. 720కి చేరింది. దీంతో షేర్స్ విలువ సుమారు రూ.32 కోట్లకు చేరాయి. సచిన్ టెండూల్కర్ మాత్రమే కాకుండా.. ఆజాద్ ఇంజినీరింగ్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పీవీ సింధు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నిఖిత్ జరీన్ కూడా పెట్టుబడులు పెట్టారు, ఇందులో వారికి కూడా వాటాలున్నాయి. ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ రక్షణ, ఏరోస్పేస్, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. అంతే కాకుండా మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, హనీవెల్ ఇంటర్నేషనల్, జనరల్ ఎలక్ట్రిక్, ఈటన్ ఏరోస్పేస్, ఎంఏఎన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్ ఇంజినీరింగ్కు వినియోగదారులుగా ఉన్నట్లు సమాచారం. మిచెల్ కంటే ఎక్కువ ఆజాద్ ఇంజినీరింగ్లో ఒకే సారి రూ. 27 కోట్లు రావడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఆస్ట్రేలియా పేసర్ 'మిచెల్ స్టార్క్'ను మించిపోయాడు. డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్2024 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మిచెల్ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పోలిస్తే సచిన్కు వచ్చిన లాభాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. -
'సచిన్, కోహ్లి కాదు.. అతడే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్'
భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే మనకు టక్కున గుర్తు వచ్చేది లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రస్తుత తరంలో అయితే చాలా మంది విరాట్ కోహ్లి పేరు చెబుతారు. ఎందుకంటే సచిన్ సాధించిన ఆల్టైమ్ రికార్డులను ఒక్కొక్కటిగా విరాట్ బ్రేక్ చేస్తాడు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతుంటే.. టీ20ల్లో లీడింగ్ రన్ స్కోరర్గా కోహ్లి ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ జునైద్ ఖాన్కు ఓ ఇంటర్వ్యూలో సచిన్, కోహ్లిలలో గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా అతడు సచిన్,కోహ్లిలను కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. "విరాట కోహ్లి గొప్ప ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు వరల్డ్ క్రికెట్లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో సచిన్ ఆడివుంటే 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ నా వరకు అయితే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే వీరిద్దరు కాకుండా రోహిత్ శర్మ పేరునే చెబుతాను. రోహిత్ అన్ని రకాల షాట్లు ఆడగలడు. రోహిత్ శర్మను అందరూ ది హిట్మ్యాన్ అని పిలుస్తారు. అతడు వన్డేల్లో సాధించిన 264 పరుగుల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. వన్డేల్లో అతడు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒక క్రికెటర్ వైట్బాల్ ఫార్మాట్లో ఇన్ని డబుల్ సెంచరీలు సాధించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా హిట్మ్యాన్ పేరిటే ఉంది. అందుకే రోహిత్ను అత్యుత్తమ భారత క్రికెటర్గా ఎంచుకున్నాను" అని నాదిర్ అలీ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జునైద్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'టీమిండియాకు మరో ఫినిషర్ దొరికేశాడు.. భయం లేకుండా దుమ్మురేపుతున్నాడు' -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ!
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్లో రోహిత్ మరో 175 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్గా నిలుస్తాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ,రికీ పాంటింగ్, జాక్వాస్ కల్లిస్, ధోని వంటి దిగ్గజ క్రికెటర్లను రోహిత్ అధిగమిస్తాడు. ఇప్పటి వరకు 236 వన్డే ఇన్నింగ్స్లు ఆడిన హిట్మ్యాన్ 9825 పరుగులు చేశాడు. రోహిత్ వన్డే కెరీర్లో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి కేవలం 205 ఇన్నింగ్స్లలోనే అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి తర్వాత స్ధానంలో సచిన్ టెండూల్కర్(259 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. ఇక మూడు వన్డే సిరీస్లో భాగంగా విండీస్-భారత్ మధ్య తొలి వన్డే గురువారం బార్బడస్ వేదికగా జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే బార్బడస్లో గురువారం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతవారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా భారత్-విండీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. విరాట్ కోహ్లి: (205 ఇన్నింగ్స్లు) సచిన్ టెండూల్కర్:(259 ఇన్నింగ్స్లు) సౌరవ్ గంగూలీ: (263 ఇన్నింగ్స్లు) రికీ పాంటింగ్: (266 ఇన్నింగ్స్లు) జాక్వెస్ కల్లిస్: (272 ఇన్నింగ్స్లు) ఎంఎస్ ధోని: (273 ఇన్నింగ్స్లు) రాహుల్ ద్రవిడ్: (287 ఇన్నింగ్స్లు) తొలి వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , సిరాజ్ విండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్ చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
సచిన్ ఆస్తుల విలువ ఎంతంటే..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement