breaking news
rushi
-
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెస్ చాంప్స్ సారుు రుషి, శ్రీశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా చెస్ టోర్నమెంట్కు హైదరాబాద్ చిన్నారులు సారుురుషి, శ్రీశాంతి ఎంపికయ్యారు. వీరిరువురూ హైదరాబాద్ జిల్లా అండర్-7 చెస్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచారు. హైదరబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ఓపెన్ కేటగిరీ చివరి రౌండ్ గేమ్లో సారుు రుషి (4)... ప్రణషు గుప్తా (2.5)పై, కృష్ణచరణ్ (3)... సూర్య అఖిల్ (2)పై గెలుపొంది తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల కేటగిరీలో శ్రీశాంతి (3.5)... రిమితా రెడ్డి (2.5)పై, అభిజ్ఞ (2.5)... దుర్గ కార్తీక (2)పై విజయం సాధించారు. అగ్రస్థానంలో నిలిచిన సారుు రుషి, శ్రీశాంతి సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే రాష్ట్ర స్థారుు చెస్ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ దోమలగూడలోని ఏవీ కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది. -
రియాక్టర్లో పేలుడు కార్మికులకు గాయాలు
మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.ఓ కంపెనీలో రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని యగ్మగ్ పరిశ్రమలో ఎప్పటిలాగే కార్మికులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద వశాత్తు రియాక్టర్లో ఉండే రసాయనాల వత్తిడి ఎక్కువ అవ్వటంతో రియాక్టర పైకప్పుడు భారీ శభ్దంతో ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఋషీ, కిషోర్ల ఒంటిపై రసాయనాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని షాపూర్ నగర్లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
డెంగీతో ముగ్గురి మృతి
వేములవాడ: డెంగీ తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ముగ్గురు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శంకర్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు డెంగీతో బుధవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన మల్లేశం (30), కాశం లావణ్య (37) తీవ్ర జ్వరంతో ఐదు రోజులుగా బాధపడుతున్నారు. మల్లేశంను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, లావణ్యను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఇరువురు మృతి చెందారు. మరో ఘటనలో వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన రుషి (6) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుడూ హన్మకొండలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందాడు. డెంగీతోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. -
ఆ తల్లికి ఏమైందీ..?
కంబదూరు : నవమాసాలు మోసి, కనీ కంటికి రెప్పలా పెంచుతున్న చిన్నారులకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే చూసి తట్టుకోలేని ఆ తల్లి ఇంతటి కిరాతానికి ఎలా పాల్పడింది. అసలు ఆ తల్లీకి ఏమైందీ అనే ప్రశ్న స్థానికులను కలచివేస్తోంది. నూతి మడుగు గ్రామంలో సోమవారం సునీత అనే ఓ తల్లీ కిరాతకంగా కన్న బిడ్డలు కుస్మా, రుషిల గొంతులు కోసి చంపేసిన ఘటన విధితమే. ఆ తల్లీకి అసలు ఏం జరిగింది..? కసాయి తల్లీగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. సోమవారం గ్రామంలో జరిగిన ఘటనతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. మే 16న గొల్ల సోమశేఖర్ అనే వ్యక్తి సైకోగా మారి కన్న తల్లీ, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలను అతి దారుణంగా నరికి చంపిన ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన గ్రామంలో జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గ్రామానికి ఏమైంది. మంచి వ్యక్తులే ఎందుకు మతిస్థిమితం కోల్పోయి ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్నారు.. అన్న అనుమానాలు గ్రామస్తుల్లో నెలకొన్నాయి. మృతి చెందిన చిన్నారులను చూసి అయ్యో పాపం, అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా... అంటూ కన్నీరు పెడుతున్నారు. తండ్రి మారుతీ కన్న బిడ్డలను చూసి డాడిను వదిలిపెటి ్ట వెళ్లి పోయారా అంటూ బోరున విలపించారు. ఈ హత్య ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. అసలు ఆ తల్లీ నోరు విప్పితే కానీ నిజాలు తెలిసే పరిస్థితులు లేవు. అయితే బంధువులు మత్రం మతిస్థిమితం లేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గ్రామంలో చిన్నారులకు అంతక్రియలు నిర్వహించారు. -
రజనీ జీవితంపై సినిమా
సూపర్స్టార్ రజనీకాంత్ నిజ జీవితం పలు ఆసక్తికర, అనూహ్య సంఘటనల మయం. ఆయన జీవితంలో కొంత భాగం అంటే యుక్త వయసులో స్నేహమయ జీవితం వెండితెర కెక్కనుంది. ఇందులో రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు రాజ్ బహుదూర్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. నటుడు కాక ముందు రజనీకాంత్ బస్ కండక్టర్గా పని చేశారన్న విషయం తెలిసిందే. అదే బస్సులో డ్రైవర్గా పని చేసిన రాజ్ బహుదూర్ రజనీలో నటనాసక్తిని చూసి ఆయన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించడానికి సాయం చేశారు. రజనీ సూపర్స్టార్ అయిన తర్వాత కూడా రాజ్ బహుదూర్తో స్నేహం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆ స్నేహమే ప్రస్తుతం సినిమాగా రూపొందనుంది. ఒరువళి శాలై పేరుతో తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రుషి దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి రజనీకాంత్ చిరకాల మిత్రుడు రాజ్బహుదూర్ మాట్లాడుతూ ఈ చిత్రం రజనీతో తనకు గల స్నేహమే ఇతివృత్తంగా రూపొందనున్నట్లు తెలిపారు. రజనీ, తాను నాటకాల్లో కలిసి నటించామని గుర్తు చేశారు. అప్పుడు తమ మధ్య స్నేహం ఎలా మొగ్గ తొడిగింది, అది నేటికీ ఏ మాత్రం తగ్గకుండా ఎలా కొనసాగుతోంది అనేది ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఈ చిత్రంలో రజనీగా ఎవరు నటించనున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. స్నేహం గొప్పతనాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ చిత్ర రూపకల్పన గురించి రజనీకి చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని అదే విధంగా చిత్రం పూర్తి అయిన తరువాత కలిసి చూద్దాం అని అన్నారని రాజ్ బహుదూర్ తెలిపారు. -
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
-
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు