breaking news
Runner-Rup trophy
-
రన్నరప్ భారత్
తౌరంగ (న్యూజిలాండ్): టైటిల్ పోరులో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. బెల్జియంతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్తో ఓడిపోయింది. దీంతో నాలుగు దేశాల ఇన్విటేషనల్ తొలి అంచె టోర్నీలో భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మన్దీప్ సింగ్ 19వ నిమిషంలో సాధించగా... టామ్ బూన్ (4వ ని.),డాకియెర్ (36వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను గెలిపించారు. నాలుగో నిమిషంలోనే బెల్జియం సఫలమైంది. బూన్ చేసిన గోల్తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండో క్వార్టర్లో భారత్కు మన్దీప్ గోల్ సాధించిపెట్టాడు. దీంతో 1–1తో స్కోరు సమమైంది. అయితే మూడో క్వార్టర్ మొదలైన ఆరు నిమిషాలకే డాకియెర్ చేసిన గోల్తో మళ్లీ బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకుంది. రెండో అంచె టోర్నీ ఈనెల 24న మొదలవుతుంది. -
రన్నరప్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్లు రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాయి. మంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల, జూనియర్ బాలబాలికల విభాగాల ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ జట్లు ఓటమి పాలయ్యాయి. ‘చద్దా కప్’ కోసం జరిగిన మహిళల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 0-2తో కేరళ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలి సింగిల్స్లో ఆర్తీ సారా 21-18, 21-12తో వృశాలిపై... డబుల్స్లో ఆర్తీ సారా-శ్రుతి 21-12, 21-12తో పూజ-సోనికా సాయిలపై గెలిచారు. ‘నారంగ్ కప్’ కోసం జరిగిన బాలుర ఫైనల్స్లో కేరళ 2-0తో ఆంధ్రప్రదేశ్ను ఓడించింది. తొలి సింగిల్స్లో అరుణ్ జార్జి 21-6, 21-17తో బాలూ మహేంద్రపై; డబుల్స్లో అరుణ్ జార్జి-శ్యామ్ ప్రసాద్ 21-17, 21-15తో కేపీ చైతన్య-గంగాధర రావులపై నెగ్గారు. ‘షఫీ ఖురేషీ కప్’ కోసం జరిగిన బాలికల ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ 1-2తో కర్ణాటక చేతిలో ఓడింది. తొలి సింగిల్స్లో వృశాలి 21-16, 21-14తో శిఖా గౌతమ్పై నెగ్గి ఆంధ్రప్రదేశ్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అయితే డబుల్స్ మ్యాచ్లో పూజ-సోనికా సాయి జోడి 13-21, 18-21తో శిఖా గౌతమ్-మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1-1వద్ద సమమైంది. నిర్ణాయక రెండో సింగిల్స్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కె.శ్రీ కృష్ణప్రియ 21-15, 22-24, 16-21తో మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో రాష్ట్ర జట్టు ఓటమి ఖాయమైంది.