breaking news
RTC bus - lorry
-
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు!
మానకొండూర్: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం వేములవాడ నుంచి సూర్యాపేట వెళ్తోంది. మార్గమధ్యలో మానకొండూర్ పోలీస్స్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జి.కమలమ్మ, భిక్షం, రమణ, బండపెల్లి పద్మతో సహా 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహా యక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మల్లయ్య బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నిశీ..నిద్ర..ముంచింది..!
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజాము మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ప్రత్యక్షసాక్షి బస్ కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గడ్చిరౌలీ జిల్లాలోని ఐరీ బస్ డిపోకు చెందిన ఎమ్హెచ్ 29 బీఈ 1039 నంబర్ గల ఆర్టీసీ హైర్డ్ బస్సు గురువారం సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరింది. రెబ్బెన దగ్గర టైర్ పంక్చర్ కావడంతో, అక్కడే రిపేరు చేయించుకొని మంచిర్యాల వైపు వస్తోంది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ దగ్గరికి రాగానే, మంచిర్యాల నుంచి పేపర్ లోడ్తో చంద్రాపూర్ వెళ్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన సీజీ 07 బీఎఫ్ 9216 నంబర్ గల లారీ ఎదరురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ బల్లార్షకు చెందిన కమర్అమర్ చౌస్ (37)తోపాటు ఆయన వెనుక సీట్లో కూరున్న పెద్దపెల్లి జిల్లా, పెద్దకల్వలకు చెందిన ప్రయాణికుడు కారంగుల ఎల్లయ్య (54) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు కండక్టర్ సూర్యకాంత్ భగవన్మోరేతోపాటు మరో తోమ్మిది మంది మహారాష్ట్ర ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు. లారీ డ్రైవర్ బిహార్ రాష్ట్రంలోని జమ్ముకు చెందిన డంబ్లు వక్లవ్, అదే రాష్ట్రంలోని అత్యవార్జుమ్లికి చెందిన లారీ క్లీనర్ సుధీర్ కుమార్ కూడా క్షతగాత్రుల్లో ఉన్నారు. క్రేన్తో మృతదేహాల వెలికితీత.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్, కండక్టర్లతో కలిపి 10 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ కమర్అమర్ చౌస్తోపాటు అతని వెనుక సీట్లో కూర్చున్న ఎల్లన్న అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంపై స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో మంచిర్యాల ఎస్సైలు ఓంకార్యాదవ్, మారుతి, బ్లూ కోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు క్యాబిన్లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, ప్రయాణికుడి మృతదేహాలను బయటికి తీసేందు కు క్రేన్, జేసీబీని రప్పించాల్సి వచ్చింది. మృతదేహాలను వెలికితీతకు దాదాపు రెండు గంటలు పట్టింది. ప్రమాద వాహనాలు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన బస్ డ్రైవర్ కమర్అమర్ చౌస్ బంధువులను చూసేందుకు వెళ్లి.. పెద్దపెల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన కారంగుల ఎల్లయ్య మహారాష్ట్ర చంద్రపూర్లోని ఓ ప్రైవేటు కంపనిలో మెకానిక్గా పని చేస్తూ కొన్నేళ్ల కిందటే అక్కడ స్థిరపడ్డాడు. సొంత గ్రామంలోని బందువులకు చూసేందుకు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాతపడ్డాడు. ఎల్లయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ రోడ్డు ప్రమాదం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో జరగడంతో అతి నిద్రే ప్రమాద కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వాహనాల అతివేగం, ఇరుకు రోడ్డు కూడా కారణం కావొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుడు ఎల్లయ్య -
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి.
-
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు (బస్సు నెంబర్ : ఏపీ16 జెడ్ 0216) ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీ బస్సు మునగాల సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్సు ఒక వైపు మొత్తం బలంగా లారీని దూసుకుంటూ వెళ్లింది. దీంతో బస్సు సగభాగం ధ్వంసమైంది. తెల్లవారుజామున 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ, సూర్యాపేట వైద్యశాలలకు చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన 14మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఏడుకొండలు(లారీ డ్రైవర్), రాణి(సూర్యపేట), సత్తయ్య (కోదాడ), ఎన్.వి.ప్రసాద్ (అవనిగడ్డ), ఎం.ఎం.ప్రసాదరావు (అవనిగడ్డ)లుగా గుర్తించారు. కృష్ణాజిల్లా కోసూరుకు చెందిన మునగాల రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన రాణిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోదాడ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పి ప్రకాష్ జాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి
కొరవలకోట: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 25 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కొరవలకోట మండలం రాణిగానిపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.