-
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
మాఫియా డాన్ ఇంట్లోనూ చోరీ..
సాక్షి, సిటీబ్యూరో: సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ బాంబే సలీం పూణే క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. గతంలో ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లోనే చోరీ సంచలనం సృష్టించిన ఈ ఘరానా నేరస్తుడిపై దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. పలు నగరాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఇతడికి హైదరాబాద్తో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. తాజాగా 127 చోరీ కేసుల్లో వాంటెడ్గా ఉన్న అతడిని పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని గతంలో 2012 ఫిబ్రవరి 28న రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇద్దరూ కలిసి దొంగతనాలు... అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వివిధ నగరాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ ఇంటిని టార్గెట్ చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన ఉపకరణాలతో తాళాలు, డోర్లు పగులకొట్టి ఖరేషీ లోపలకు వెళ్తాడు. ఇషావర్ పెప్పర్ స్ప్రే చేత పట్టుకుని బయట కాపుకాసేవాడు, ఎవరైనా ఇంటిలోకి కానీ, తమ సమీపంలోకి కానీ రావడానికి ప్రయత్నిస్తే వారి ముఖంపై స్ప్రే చేయడంతో పాటు ఖురేషీని అప్రమత్తం చేస్తాడు. ఆపై ఎదుటి వారు తేరుకునే లోపు ఇద్దరూ కలిసి పరారయ్యేవారు. పుణేలో మొత్తం 30 పోలీసుస్టేషన్లు ఉండగా... వాటిలోని 27 ఠాణాల పరిధిలో ఖురేషీ ద్వయం పంజా విసిరింది. దీంతో అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలల పాటు శ్రమించిన పోలీసులకు గత వారం ఖురేషీ పుణే విమానాశ్రయం వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన అధికారులు నల్లరంగు లాన్సర్ కారులో తిరుగుతున్న అతడితో పాటు అతడి సహాయకుడు ఇషావర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్లోనూ నేరాలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఈ వివరాలు రాబట్టడానికి కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్ప టి వరకు ఖురేషీ, ఇషావర్లు 127 చోరీలు చేసినట్లు అంగీకరించడంతో పూణే క్రైంబ్రాంచ్ ఆయా నగరాలకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా పీటీవారెంట్లు వేసుకుని అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పొరపాటున చోటా రాజన్ ఇంట్లో... ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్లోని డియోనార్ బుచ్చర్ హౌస్కు చెందిన సలీం అలీ హుస్సేన్ ఖాన్ ఆరో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఇతడికి బాంబే సలీం, మున్న ఖురేషీ, మహ్మద్ హమీద్ హబీబ్ ఖురేషీ తదితర మారుపేర్లు ఉన్నాయి. ముంబైలో చిన్న చిన్న చోరీలకు శ్రీకారం చుట్టిన అతను 2000 నుంచి ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన బాంబే సలీం గ్యాంగ్ అదే రోజు రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించి తమ ‘పని’ పూర్తి చేసుకుంది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీం షాక్కు గురయ్యాడు. తాను చోరీ చేసింది మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలుసుకుని ఖంగుతిన్నాడు. కొన్నాళ్ల తర్వాత ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడం, వారు తన అనుచరులపై దాడి చేయడంతో భయపడిన సలీం జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే రాజన్ అనుచరులను కలిసి జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. అనంతరం అతను తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ గ్యాంగ్ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరులో విక్రయించేవాడు. ఇతడి కోసం గాలింపు చేపట్టిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు. ‘నేను పుణేలో తప్ప బెంగళూరులో ఎలాంటి నేరాలు చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా పట్టుకుంటారు?’ అంటూ బెంగళూరు పోలీసులను ప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. అలా బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన సలీం ఆ తర్వాత అక్కడా పంజా విసిరాడు. కొన్నాళ్లకు అతను మరో పెళ్లి చేసుకున్నాడు. సిటీలో ఫాస్ట్ఫుడ్ సెంటర్... కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబై పోలీసుల కళ్లు కప్పేందుకు హైదరాబాద్కు మకాం మార్చిన సలీం ఇక్కడా చేతులకు పని చెప్పి పోలీసులకు దొరికిపోయాడు. ఈ రకంగా సిటీతో పరిచయం ఏర్పడిన సలీం 2010లో తన ఇద్దరు భార్యలతో హైదారాబాద్కు వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. కొన్నాళ్ల పాటు టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. అందులో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాటపట్టిన అతను చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సరూర్నగర్, శివరామ్పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్పేట్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబైలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చేవాడు. ఈ రకంగా రెండు రాష్ట్రాల్లోనూ 20 వరకు నేరాలు చేశాడు. అతడిపై సుదీర్ఘకాలం నిఘా ఉంచిన రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 2012లో అతడిని పట్టుకున్నారు. అప్పట్లో ఇతడి నుంచి రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. కాగా బాంబే సలీంకు ముంబైతో పాటు హైదరాబాద్లోని రాఘవకాలనీలోని షాదత్ రెసిడెన్సీలోనూ ఇళ్లు ఉన్నాయి. ఇద్దరు భార్యల్లో ఒకరు ముంబైలో, మరొకరు సిటీలో ఉంటున్నారు. 2018 ఆగస్టు నుంచి ముంబైతో పాటు పుణె, నాసిక్, నాగ్పూర్, నవీ ముంబై, థానేల్లో 127 చోరీలు చేశాడు. హైదరాబాద్లోనూ కొన్నిచోట్ల పంజా విసిరినట్లు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో వచ్చే ఖురేషీ ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఖరీదైన కారును కొనుగోలు చేసే ఇతను రిజిస్ట్రేషన్ను తన పేరుతో మార్చుకోకుండానే అదే కారులో తిరుగుతూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇంటికి కన్నం వేస్తాడు. పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఖురేషీని అక్కడి పోలీసులు 2018 జూలైలో అరెస్టు చేసి యరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన ఖురేషీ జైల్లో తనకు పరిచయమైన యరవాడలోని షామీఅలీ ప్రాంతానికి చెందిన ఇషావర్ అలియాస్ చింత్యా షిండేవాల్ అనే దొంగకు బెయిల్ ఇప్పించాడు. -
కశ్మీర్పై జోక్యాన్ని సహించం
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతి పత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో మంగళవారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల సంఘంలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు మానవ హక్కులు లేవంటూ మాట్లాడుతున్న వారు సొంత దేశంలో మైనారిటీలను అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ‘కశ్మీర్కు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులు భారత రాజ్యాంగానికి లోబడి జరిగాయి. భారత పార్లమెంట్ కూలంకషంగా చర్చించి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అంతరంగిక విషయం’అని పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యాన్ని భారత్ అంగీకరించబోదన్నారు. ఇదే విషయాన్ని ఆయన మానవహక్కుల సంఘం చీఫ్ మిఛెల్ బాచెలెట్కు వివరించారు. సీమాంతర ఉగ్రవాదం బెడద కారణంగానే ఆంక్షలు విధించినట్లు వివరించారు. 130 కోట్ల జనాభా కలిగిన తమ దేశంలో మానవ హక్కులకు అత్యుత్తమ రక్షణ ఉందన్నారు. చైనా–పాక్ ప్రకటనపై భారత్ మండిపాటు పాకిస్తాన్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై రెండు దేశాల సంయుక్త ప్రకటనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ మాట్లాడుతూ..‘కశ్మీర్కు సంబంధించి రెండు దేశాల సంయుక్త ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూకశ్మీర్ భారత్లో విడదీయరాని అంతర్భాగం’అని పేర్కొన్నారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) పేరుతో తీసుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని 1947 నుంచి చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది’అని పేర్కొన్నారు. ‘భారత్లోని కశ్మీర్ రాష్ట్రం’ పాక్ విదేశాంగ మంత్రి భారత్లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపైనా పాక్ నేతలు మామూలుగా కశ్మీర్ అంటూ ప్రస్తావిస్తుంటారు. కానీ, ఖురేషి మంగళవారం యూఎన్హెచ్చార్సీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థలను అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? మీడియాపై ఆంక్షలెందుకు? స్వచ్ఛంద, పౌర సంస్థలను కశ్మీర్లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఆయన యూఎన్హెచ్చార్సీ భేటీలో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. కశ్మీర్ ప్రజలకు న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. యూఎన్హెచ్చార్సీ మౌనంగా ఉండటం ఇబ్బందికర పరిణామం’ అని అన్నారు. -
భారత్పై కొత్త రాగం అందుకున్న పాక్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితిలు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై పాక్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలా వద్ద అంశంపై రోజుకో కొత్తపాట పాడుతోంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్పై పాక్ ప్రభుత్వం కత్తులుదూస్తోన్న విషయం తెలిసిందే. ఇకపై ఏ విషయంలోనూ భారత్తో చర్చించేది లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘంటాపథంగా తేల్చిచెప్పారు. అవసరమైతే భారత్తో యుద్ధానికి కూడా దిగడానికి వెనుకాడబోమని చెప్పకనే చెప్పారు. ఇదిలావుండగా.. భారత్తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తాజాగా ప్రకటించారు. భారత్తో చర్చలను తామెప్పుడూ నిషేధించలేమని, రెండు దేశాల మధ్య సుధీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరముందని ఖురేషి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుతం గృహ నిర్భందంలో ఉన్న కశ్మీర్ నేతలను విడుదల చేయాలని, వారు బయటకు వచ్చిన అనంతరం వారితో కూడా చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఇస్లామాబాద్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయం చాలా సున్నితమైనదని, దీనిపై పాక్, భారత్, కశ్మరీ ప్రజల మధ్య చర్చలు జరగాలన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
భారత్ మాపై దాడి చేయొచ్చు: పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్య నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు భారత్ తమపై దాడిచేసే అవకాశముందని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదన్న విధానానికి కట్టుబడి ఉన్నామనీ, అయితే భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఈ మేరకు స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి, ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ శనివారం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ..‘భారత్ ఎలాంటి దాడిచేసినా తిప్పికొట్టేందుకు ఎల్వోసీ వెంట పాక్ బలగాలను సిద్ధంగా ఉంచాం’అని తెలిపారు. ‘కశ్మీర్ సెల్’ ఏర్పాటు అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ విమర్శించారు. ‘భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాజ్నాథ్ ఈ ప్రకటన చేయడం నిజంగా దురదృష్టకరం. భారత్ యుద్ధోన్మాదంతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. పాక్ విదేశాంగ శాఖలో కశ్మీర్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, సమాచారాన్ని చేరవేసేందుకు రాయబారుల్ని నియమిస్తాం’అని ఖురేషీ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement