-
విటమిన్–‘డి’తో ఉబ్బసానికి చెక్
శరీరంలో తగు మోతాదుల్లో విటమిన్ ‘డి’ ఉండటం వల్ల ఉబ్బస వ్యాధి నుంచి కొంత రక్షణ పొందొచ్చని లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది ఉబ్బస వ్యాధితో బాధపడుతుంటే ఏటా దాదాపు 4 లక్షల మంది మరణిస్తున్నారు. వైరస్ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడటం వల్ల ఉబ్బసానికి గురై మరణించే వారు ఎక్కువగా ఉంటున్నారు. దీన్ని విటమిన్ ‘డి’ద్వారా తగ్గించుకోవచ్చని క్వీన్ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. విటమిన్ ‘డి’తీసుకోవడం వల్ల ఉబ్బసం 30 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉబ్బసానికి తీసుకునే మందులకు అదనంగా ఈ విటమిన్ను తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ అడ్రియన్ మార్టిన్యూ వివరించారు. విటమిన్ ‘డి’తీసుకున్న వారిలో అధిక క్యాల్షియం నిల్వలు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడలేదని స్పష్టం చేశారు. -
ఆడవారి చూపు ఎటువైపు!
లండన్: మీరు ఎదురుగా నిల్చున్న వారి ముఖంలోకి చూస్తూ మాట్లాడుతున్నారా? అయితే ఆ ముఖంలో మీరు ఎటువైపు చూస్తున్నారు? అనే విషయాన్ని ఓసారి గమనించండి. అంటే కుడివైపు చూస్తున్నారా..? ఎడమవైపు చూస్తున్నారా ? ఎటు చూస్తే ఏంటి ? ఇవేం ప్రశ్నలు అనుకోకండి. స్త్రీ, పురుషులు తమ ఎదురుగా ఉన్నవారి ముఖాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. లింగపరమైన బేధాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధన సందర్భంగా మహిళలు, పురుషులు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్ డివైస్’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంపై వారి దృష్టి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. -
మీరు మొహంలో ఎటువైపు చూస్తున్నారు?
లండన్: మీరు ఎదురుగా నిల్చున్న వారి మొహం లోకి చూస్తూ మాట్లాడుతున్నారా. అయితే ఆ మొహంలో మీరు ఎటువైపు చూస్తున్నారు. అంటే కుడివైపు చూస్తున్నారా.. ఎడమవైపు చూస్తున్నారా. ఎటు చూస్తే ఏంటి.. ఇవేం ప్రశ్నలు అనుకోకండి. పురుషులు, స్త్రీలు తమ ఎదురుగా ఉన్నవారి మొహాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. లింగపరమైన భేదాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధనలో.. పురుషులు, స్త్రీలు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్ డివైస్’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంలో వారి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. వేరువేరు కల్చర్లు దీనిపై ప్రభావం చూపుతున్నాయా అనేది తెలుసుకోవడానికి సుమారు 60 దేశాలకు చెందిన వారిని తీసుకొని పరిక్షించినా ఇవే ఫలితాలు వచ్చాయి. ఎదురుగా ఉన్న స్క్రీన్పై చూసే విధానాన్ని బట్టి.. ఆ వ్యక్తి జెండర్ను చెప్పడానికి 80 శాతం అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆంటోని కౌట్రోట్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement