breaking news
pushing
-
షాకింగ్ ఘటన: మూడేళ్ల చిన్నారిని కర్కశంగా.. రైలు పట్టాలపైకి తోసేసి..
మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. దీంతో సదరు బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన అమెరికాలో ఒరెగాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ర్వైలే స్టేషన్లో ఫ్లాట్ఫాంపై తన తల్లితో ఉన్న మూడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి తోసేసింది. ఈ మేరకు ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం...మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్మెన్ అనే మహిళ తోసేసినట్లు పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిల్లాడిందని తెలిపారు. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న మిగత వ్యక్తులు వెంటనే స్పందించి...సదరు చిన్నారిని రక్షించారు. ఆ చిన్నారి పోర్ట్ల్యాండ్లో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఈ షాకింగ్ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు ఒడిగడుతుంటారో అర్థం కాదంటూ.. ప్రయాణికులలో ఒకరు ఆవేదనగా అన్నారు. ఈ మేరకు ఈ దారుణానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక బెయిల్ లేకుండా కస్టడీలోనే ఉంచనున్నట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఎయిర్పోర్ట్లో మానవ పుర్రెల కలకలం.. షాక్లో అధికారులు) -
అత్యవసరంలో 'ఆర్వీవరం'
‘‘అమ్మకి హెల్త్ బాగోలేదు. ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వచ్చాను. ఎలా ఉందో ఏమిటో...’’ ఇలా దిగులు పడే నగరవాసులు ఎందరో. పేరెంట్స్ మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా...పరుగుల ప్రపంచంలో...వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండడం కష్టమే. ఈ సమస్యలకు ఇప్పటికే మార్కెట్లో చలామణీలో ఉన్న పరిష్కారాలకు భిన్నంగా వినూత్న శైలి పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు నగరానికి చెందిన యువ బృందం. సాక్షి, సిటీబ్యూరో: టీవీ చూస్తూ ఇంట్లోనే కుప్పకూలిపోయిన మహిళ, బాత్రూమ్లో గుండెపోటు... ఇలాంటి వార్తలు, విషయాలు వింటూనే ఉన్నాం. ఒంటరి జీవితాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రాణాపాయం ఎటువైపు నుంచి ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని దుస్థితి. మరోవైపు వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ‘‘ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా తమ తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉంటున్నారు. అలా ఉన్న ప్రతి ఒక్కరికీ తమ తల్లిదండ్రుల ఆరోగ్యం, ఎమర్జన్సీ కేర్ గురించిన ఒత్తిడిì కి గురయ్యేవీరికి సీనియర్ సిటిజన్స్కు 24/7 వైద్యసేవలను అందించే మార్గం తెలిస్తే అంతకు మించిన ప్రశాంతత ఏదీ ఉండదు’’అని చెప్పారు నగరానికి చెందిన సుశాంత్రెడ్డి. తమ స్టార్టప్ ఆర్వీ (్చటఠిజీ.జీn)గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే... పిచ్చాపాటినుంచి పుట్టినఆలోచన.. ముంబయ్లో ఐఐటీ చదివి సింగపూర్, అమెరికాలో ఎంబీఏ చేశాను. ఆ సమయంలో నా మిత్రులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఇండియాలో ఉన్న పేరెంట్స్ వైద్య సేవల గురించి ప్రస్తావన వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ వృద్ధులకు అత్యవసర వైద్య సేవలను అందించడం అనేది మన దేశంలో ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడం ద్వారా పెద్దలకు అత్యంత వేగవంతమైన విశ్వసనీయమైన వైద్య సేవల్ని అందించాలని మిత్రుడు అవినాష్, డాక్టర్ చందనలతో కలిసి ఆర్వీ స్టార్టప్కు శ్రీకారం చుట్టాం. బటన్నొక్కితే చాలు... అర్వీ అనేది ఒక స్మార్ట్ మెడికల్ సిస్టమ్. ఇంట్లోని వాష్రూమ్, బెడ్రూమ్, హాల్, కిచెన్ పలు కీలక ప్రదేశాల్లో డివైజ్ అమరుస్తాం. ఈ పరికరానికి రెడ్, గ్రీన్ రంగుల్లో రెండె బటన్స్ ఉంటాయి. అత్యవసర సమయాల్లో డివైజ్ మీద ఉన్న రెడ్ బటన్ను నొక్కితే సైరన్ వస్తుంది. ఆటోమేటిగ్గా ఆర్వీ టీమ్ అప్రమత్తమవుతుంది. ఇరుగు పొరుగువారికి ఎస్సెమ్మెస్లు వెళతాయి. బాధితునికి, ఎమర్జన్సీ డాక్టర్కు మధ్య హాట్లైన్ ఏర్పాటవుతుంది. కనీసం నలుగురు కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసి ఉంచుతాం కాబట్టి వారికి కాల్స్ వెళతాయి. అలాగే మా కాల్ సెంటర్కి కాల్ వస్తుంది. ఏ ప్లేస్లో ఎటువంటి స్థితిలో ఉండి బటన్ పుష్ చేశారో తెలిసిపోతుంది కాబట్టి దాని ప్రకారం ఎమర్జన్సీని అంచనా వేస్తాం. మా కాల్కి రెస్పాండ్ కాకపోయినా సరే జీపీఎస్ సాంకేతికత సహయంతో వారుండే ప్రదేశానికి అంబులెన్స్తో సహా చేరుకుంటాం. ఈ డివైజ్ 100 మీటర్ల వరకూ పనిచేస్తుంది. అలాగే నాన్ ఎమర్జన్సీ సమయంలో గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మెడికల్ డెలివరీ, డాక్టర్ అపాయింట్ మెంట్, ఇంటి దగ్గరే హెల్త్ చెకప్స్ వంటి సేవలు లభిస్తాయి. ఒప్పందాలతో సేవల విస్తరణ.. ప్రస్తుతం ఆర్వీ సంస్థ 350 మంది డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది, అంబులెన్స్, ఫిజియోథెరఫి, ఫార్మసీ ఇలా అన్ని రకాల వైద్యసదుపాయాలతో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. మా కాల్ సెంటర్లలో కూడా ఫిజియోథెరపిస్ట్స, నర్సింగ్, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ...బ్యాగ్రవుండ్ ఉన్నవారినే కాల్ సపోర్ట్కి తీసుకుంటున్నాం. ప్రస్తుతం వృద్ధుల అత్యవసర సేవల గురించి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఉపయోగించడం అందరికీ రాకపోవచ్చు. కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి . ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్నారు అక్కడి నుంచి బాగా ఎంక్వయిరీలు వస్తున్నాయి. త్వరలో ఈ రెండు నగరాలకు విస్తరిస్తున్నాం. డిమెన్షియా వంటి సమస్యలున్న వృద్ధుల కోసం సెన్సర్లు డెవలప్ చేస్తున్నాం.. తద్వారా వీరు మతిమరపుతో జియో ఫెన్సింగ్ దాటి బయటకు వెళితే సంబంధీకులకు హెచ్చరికలు పంపుతాం. -
మైనర్ బాలికల అమ్మకాల్లో ఇద్దరు అరెస్ట్!
థానెః బాలికలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెడుతున్న ఇద్దరు వ్యక్తులను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను వ్యభిచార వృత్తిలోకి నెట్టే ప్రయత్నం చేసిన నిందితులను థానే మీరారోడ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సంజయ్ సింగ్, సరోజ్ దేవీ లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ సైడోల్ జిల్లా ఛిపాయ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మైనర్ బాలికలను ఆగ్రాకు చెందిన పింకి సింగ్ ద్వారా నిందితులు మార్చి నెలలో అమ్మకానికి పెట్టినట్లు మీరారోడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇనస్పెక్టర్ జగదీష్ షిండే తెలిపారు. బాధిత బాలికలు సైడోల్ జిల్లా భివారీ తెహసిల్ కు చెందినవారుగా వెల్లడించారు. బాలికల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 372 కింద (వ్యభిచారం కోసం బాలికల అమ్మకం), వ్యభిచార నిరోధానికి సంబంధించిన ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా), ప్రొటెకక్షన్ ఆఫ్ ఛిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.