breaking news
Pulichintala reservoir
-
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
రబీకి సెలవు!
ఖరీఫ్కే అందని నీరు తాగునీటికే కష్టమంటున్న అధికారులు పులిచింతల జలాశయం ఖాళీ ఆందోళనలో అన్నదాత విజయవాడ : కృష్ణాడెల్టా గత వందేళ్లలో లేని నీటిఎద్దడిని ఈ ఏడాది ఎదుర్కొంటోందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ పంటలకు నీరివ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు బోర్లు, మోటార్లను ఆశ్రయించి సాగు చేశారు. వాస్తవానికి 13.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంట వేయాల్సి ఉండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 లక్షల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ కొంత భాగం నీరందక ఎండిపోవడంతో రైతులు ఆ పంటను దున్నేశారు. ఎలాగోలా ఖరీఫ్ను పూర్తిచేస్తున్న రైతన్నలు రబీపై దృష్టి సారిస్తున్నారు. రబీకి నీరు రావడం కష్టమే వాస్తవంగా నవంబర్ 10 నాటికే రబీ పంట వేయాల్సి ఉంది. గత ఏడాది కృష్ణాడెల్టాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో రబీ పంట వేశారు. ఇందులో 90 వేల ఎకరాలు కృష్ణా జిల్లాలోనే ఉంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోపాటు కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఇప్పటివరకు జిల్లాలో రబీ పంట వేయలేదు. ఖరీఫ్లోనే నీరివ్వలేని ప్రభుత్వం రబీకి ఏ మేరకు ఇస్తుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రబీలో రైతులకు నీరివ్వడం కష్టమేనని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు బహిరంగంగానే చెబుతున్నారు. పట్టిసీమ వట్టిసీమే పట్టిసీమ నుంచి రబీకి నీరు వస్తుందని రైతులు భావిస్తే అత్యాశే అవుతుందని ఇరిగేషన్ పరిశీలకులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు రబీ పంటకే నీరిచ్చేందుకు సరిపోతుందని, అందులోంచి నీటిని కృష్ణానదికి తరలించడం కష్టమంటున్నారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల కంటే తక్కువ నీరు వస్తుంది. మరోవైపు రబీ సీజన్ ప్రారంభమయింది. రాబోయే నెల రోజుల్లో ప్రభుత్వం ఏదో అద్భుతం చేసి పట్టిసీమ ద్వారా రబీకి కావాల్సిన నీరు తెస్తుందనుకోవడం భ్రమేనని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనికంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందంటున్నారు. సముద్రం నీరు పైకి వచ్చే అవకాశం..... రబీ పంట వేసి తడులు పెట్టకపోతే బందరు, కలిదిండి, బంటుమిల్లి, పెడన తదితర ప్రాంతాల్లో భూముల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చి పైకి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదో విధంగా ప్రభుత్వం తమకు రబీకి నీరిచ్చి తమ భూముల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కంటే దారుణం గత ఏడాది రబీ సీజన్ ప్రారంభం అయ్యేనాటికి పులిచింతల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో అర టీఎంసీ కంటే తక్కువ ఉంది. ఈ నీటిని సాగుకోసం విడుదల చేసేందుకు నీటిపారుదల అధికారులు సిద్ధంగా లేరు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా అడుగంటిపోవడంతో అక్కడ నుంచి రబీకి నీరు వదిలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రతి ఏడాది వేసవిలో తీవ్ర నీటిఎద్దడి వస్తుంది. గ్రామాల్లో చెరువులు ఎండిపోతే సాగర్, శ్రీశైలం నుంచి అత్యవసరంగా నీటిని వదిలి తాగునీటి కోసం చెరువులను నింపుతారు. ఈ ఏడాది తాగునీటి కోసం చెరువులు నింపడానికి కూడా నీరుండకపోవచ్చని సమాచారం. తాగడానికే నీరు లేనప్పుడు రబీకి ఏ విధంగా సాగునీరిస్తారని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.