-
పథకాల పబ్లిసిటీ ఖర్చు అక్షరాల రూ.3800 కోట్లు..!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడేళ్లకాలంలో అక్షరాల రూ.3800 కోట్లు ఖర్చుచేసినట్టు సమాచార ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. లోక్సభలో శుక్రవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 2016-17 ఏడాదికి గాను రూ.1280.07 కోట్లు, 2017-18కి గాను 1328.06 కోట్లు, 2018-19 గాను 1195.94 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ప్రింట్ మీడియా, ఆడియో విజువల్, ఔట్డోర్ పబ్లిసిటీ, ప్రింటెడ్ విధానాల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. -
ఆ ఖర్చులో ఎన్డీఏ టాప్..
సాక్షి, న్యూఢిల్లీః గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలపై రోజుకు సగటున వెచ్చించిన వ్యయం యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే రెండింతలుగా ఉంది. గత మూడేళ్లలో ఎన్డీఏ సర్కార్ ప్రకటనల కోసం రూ 3214 కోట్లు ఖర్చు చేసింది. ఇది సగటున రోజుకు రూ 3.21 కోట్లుగా నమోదైంది. అయితే పదేళ్ల కాలంలో యూపీఏ సర్కార్ ప్రకటనలపై రూ 2658 కోట్లు ఖర్చు చేసి రోజుకు సగటున రూ 1.45 కోట్లు వెచ్చించింది. సమాచార హక్కు కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తన తొలి వేయి రోజుల పాలనలో రూ 3529 కోట్లు ప్రచారంపై ఖర్చు చేసిందని ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త అర్జున్ పర్మార్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాపై గత మూడేళ్లలో రూ 1585 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ సర్కార్తో పోలిస్తే 80 శాతం అధికం కావడం గమనార్హం. ప్రింట్ మీడియాపై కేంద్రం గడిచిన మూడేళ్లలో రూ 1630 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ పదేళ్ల పాలనలో చేసిన ఖర్చుపై 50 శాతం అధికం. ఇక అవుట్డోర్ పబ్లిసిటీ లోనూ ఎన్డీఏ ప్రభుత్వం భారీగానే వెచ్చించింది. యూపీఏ పదేళ్ల హయాంలో అవుట్డోర్ ప్రచారంపై రూ 202 కోట్లు ఖర్చు చేయగా, ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ 315 కోట్లు ఖర్చు చేసింది. -
మూడు నెలల్లో రూ. 15 కోట్ల ఖర్చు!
సామాన్యుడి ప్రభుత్వం తన ప్రచార కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెడుతోంది. గడిచిన మూడు నెలల్లో ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఏకంగా రూ. 15 కోట్లు వెచ్చించింది. ఈ విషయం సమాచార హక్కు దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో తేలింది. అయితే.. కేవలం ఢిల్లీలో వెలువడే పత్రికలు, ఇతర జాతీయ పత్రికలకే కాకుండా.. కేరళ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన స్థానిక పత్రికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మే 11 వరకు టీవీ ప్రకటనలు కాకుండా మిగిలిన ప్రకటనలకు మాత్రమే రూ. 14.56 కోట్లు ఖర్చుపెట్టిందని ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఉంది. అమన్ పన్వర్ అనే న్యాయవాది ఈ దరఖాస్తు చేశారు. ఆప్ సర్కారు ప్రచారకండూతిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూనే మరోవైపు సొంత ప్రచారం కోసం ఇంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టడం ఏంటని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ప్రశ్నించారు. రెండు దశలుగా అమలుచేసిన సరి-బేసి విధానంపై ప్రచారం కోసమే ఢిల్లీ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చుపెట్టింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement