breaking news
Psych Siddhartha Movie
-
సినిమా నచ్చకపోతే మందుబాటిల్ ఇప్పిస్తా: దర్శకుడు
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సక్సెస్ మీట్పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. మందు తాగి లొల్లి పెడదాంకానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో నందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అఖండ 2 రిలీజ్ అవ్వడంతో చివరి నిమిషంలో జనవరి 1కి వాయిదా వేశారు. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ ట్రైలర్లో బూతు పదాలు పెట్టడం..అవి కాస్త వైరల్ అవ్వడంతో సైక్ సిద్ధార్థ్పై హైప్ క్రియేట్ అయింది. యూత్ టార్గెట్గా నేడు (జనవరి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నందు ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.(Psych Siddhartha Telugu Movie Review)కథేంటంటే..హైదరాబాద్కి చెందిన యువకుడు సిద్ధార్థ (శ్రీ నందు), పబ్లో పరిచయం అయిన త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్) అనే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. ఆమె కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. బిజినెస్ పార్ట్నర్స్గా మన్సూర్(సుఖేష్ రెడ్డి)తో పాటు ప్రియురాలు త్రిష కూడా ఉంటారు. చివరకు మన్సూర్, త్రిష కలిసి సిద్ధార్థను మోసం చేస్తారు. వాళ్లిద్దరూ రిలేషన్షిప్లో పడి సిద్ధార్థను కంపెనీ నుంచి బయటకు గెంటేస్తారు. ఉన్న డబ్బంతా వాళ్లే దోచుకోవడంతో అద్దె కూడా సరిగా కట్టలేక.. బస్తీలో ఓ చిన్న ఇంట్లోకి అద్దెకు దిగుతాడు సిద్ధార్థ. అదే బిల్డింగులోకి భర్త చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తున్న శ్రావ్య(యామిని భాస్కర్) కూడా రెంట్కి దిగుతుంది. శ్రావ్యతో పరిచయం సిద్ధార్థ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(Psych Siddhartha Movie Story)విశ్లేషణకొన్ని సినిమాలకు కథ ఉండదు కానీ కథనంతో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అలాంటి మ్యాజికే సైక్ సిద్ధార్థ్ సినిమాలో చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. రొటీన్ కథనే తెరపై డిఫరెంట్గా చూపించాలకున్నాడు. అయితే ఆ ప్రయత్నం దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కథనం కొత్తగా ఉన్నా..కథలో బలం లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా రెండు ప్రధాన పాత్రల పరిచయం తర్వాత కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్. అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం యువతను..ముఖ్యంగా జెన్ జీ బ్యాచ్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అదే సమయంలో అవసరానికి మించిన అడల్ట్ సీన్లు పెట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేశారు. (Psych Siddhartha Strengths And Weaknesses)అమ్మాయి కోసం అర్థ నగ్నంగా పరుగెడుతున్న సిద్ధార్థ్ పాత్ర పరిచయ సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పరుగు ఎవరి కోసం అనేది చివరిలో చూపించారు. ఫస్టాఫ్ అంతా సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుంది. త్రిషతో పరిచయం.. మన్సూర్ మోసం.. బస్తీలో రెంట్కి దిగడం.. ఇలా రొటీన్గా సాగుతుంది. అయితే ఇక్కడ స్క్రీన్ప్లేతోనే మ్యాజిక్ చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కథనాన్ని నడిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ సీన్తో క్లైమాక్స్ కథను ఊహించొచ్చు. ఉన్నంతలో సెకండాఫ్ కాస్త బెటర్. ఒకటి రెండు ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాకు ప్రధాన బలమైన సిద్ధార్థ పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో.. ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయారు. ముందుగా చెప్పినట్లుగా జెన్ జీ బ్యాచ్ మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నటీనటులు విషయానికొస్తే... సిద్ధార్థ్ పాత్రలో నందు జీవించేశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నందు అలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపై కనిపించింది. టైటిల్కి తగ్గట్లుగానే ఆయన చేసే సైకో చేష్టలు.. ఓ వర్గాన్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. సింపుల్ సీన్స్ కూడా తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. శ్రావ్య పాత్రకు యామిని భాస్కర్ పూర్తి న్యాయం చేసింది. సెకండాఫ్లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరో ప్రియురాలు త్రిషగా ప్రియాంక రెబెకా బాగా నటించింది. డబ్బులంటే పిచ్చి ఉన్న మోడ్రన్ అమ్మాయి పాత్ర తనది. నందు ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నటించిన వ్యక్తితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్మరన్ సాయి నేపథ్య సంగీతం డిఫెరెంట్గా ఉంది. ఎడిటింగ్ కొత్తగా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
18ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా.. డబ్బు కంటే గౌరవం ముఖ్యం: నందు
శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ నందు మాట్లాడుతూ–‘‘ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మోసం చేస్తుంది. అదే అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో, ఆ అబ్బాయి జీవితం ఎలా బాగుపడింది? అన్నదే కథ. 18ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం. ఈ క్రమంలో నా జడ్జ్మెంట్ ఎంతమేరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి నిర్మాతగా మారాను. నిర్మాత డి. సురేశ్బాబుగారు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడే నా జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించింది. అలాగే రానాగారి సపోర్ట్ను మర్చిపోలేను. నేను నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అలాగే నేను, వెన్నెల కిషోర్, ‘వైవా’ హర్ష కలిసి ఓ సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పారు. -
ఇకపై మంచి పాత్రలు చేస్తా
-
ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు: నటి యామిని భాస్కర్
సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య చాలా మంది బహిరంగంగా మాట్లాడుతున్నారు. పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన వేధింపుల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. అంతేకాదు అలాంటి వేధింపులు వస్తే..ఎలా డీల్ చేయాలో కూడా సలహాలు ఇస్తూ.. నూతన నటీనటులుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా నటి యామిని భాస్కర్(yamini Bhaskar) కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిచింది. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉంటారని.. ధైర్యంగా ఎదురుతిరిగితేనే కెరీర్లో రాణిస్తామని చెబుతోంది.రభస(2014) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, భలే మంచి చౌకబేరమ్, కొత్తగా మా ప్రయాణం ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా నటిస్తూ వచ్చింది. నర్తనశాల రిలీజ్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన యామిని.. ఇప్పుడు ‘సైక్ సిద్ధార్థ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. నా కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఆనీ.. మధ్యలో కొంతమంది తగిలారు. వాళ్లని ఎలా డీల్ చేయాలో అర్థం కాక.. సినిమాలనే వదులుకున్నాను. కొన్నిసార్లు మనల్ని డ్యామినేట్ చేసేవాళ్లు ఉంటారు. మేల్ ఈగో చూపిస్తూ.. అమ్మాయిలను ఇబ్బంది చేస్తుంటారు. అప్పట్లో నాకు కాస్త భయం ఉండేది. వాళ్ల గురించి మాట్లాడలేకపోయా. సైలెంట్గా ఉండేదాన్ని. దీంతో అందరూ నాకు యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ అలాంటి వాళ్లకు దూరంగా ఉండడం బెటరనీ నేను భావించా. అయితే ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అయితే లేరు. కొంతమంది మంచి వాళ్లు కూడా ఉన్నారు. అమ్మాయిలను గౌరవిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక కేవలం మగవాళ్లు మాత్రమే ఇబ్బంది పెడతారని నేను చెప్పట్లేదు. ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రంగంలోనే కాదు ఎక్కడైనా ఇలాంటి వాళ్లు ఉంటారు. మన ప్రవర్తనను బట్టి..మనమేంటో తెలుసుకుంటారు’ అని యామిని చెప్పుకొచ్చారు. అలాగే తనకు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆర్ఎక్స్ 100 చాన్స్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తదిరల విషయాలను కూడా సాక్షితో పంచుకుంది. అవి తెలుసుకునేందుకు ఈ వీడియోని చూసేయండి -
గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు
టాలీవుడ్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి? (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఆ పోస్టర్ వద్ద ఫొటోలు తీసుకున్నాం: యామినీ భాస్కర్
‘‘సైక్ సిద్ధార్థ’ చిత్రంలో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి శ్రావ్య పాత్ర చేశాను. విడాకులు తీసుకున్న అమ్మాయి... తనకు ఒక పిల్లాడు ఉంటాడు. తన బిడ్డ భవిష్యత్ కోసం భర్త నుంచి విడిపోయి ఎలాంటి జీవితాన్ని లీడ్ చేసింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. శ్రావ్య పాత్రలో నటనకి చాలా స్కోప్ ఉంది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని యామినీ భాస్కర్ తెలిపారు.శ్రీ నందు హీరోగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా యామినీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏ సినిమా చేయాలి? ఎలాంటి పాత్ర చేయాలని ఆలోచిస్తున్నప్పుడు... ఓ ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ వరుణ్ని కలిశాను.శ్రావ్య పాత్ర గురించి ఆయన చెప్పగానే ఓకే అన్నాను. సహజమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. సురేష్బాబు, రానాగార్లకు మా సినిమా నచ్చడంతో విడుదల చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో మా ‘సైక్ సిద్ధార్థ’ పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ పోస్టర్ వద్ద డైరెక్టర్ వరుణ్, నేను ఫొటోలు కూడా తీసుకున్నాం. ఈ సినిమా చూసిన డైరెక్టర్ సాయి రాజేశ్గారు.. ‘ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఇప్పటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయండి’ అని చెప్పడం హ్యాపీగా అనిపించింది. మంచి పాత్రలు వస్తే ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తాను’’ అని చెప్పారు. -
18 కిలోలు తగ్గాను.. నచ్చకపోతే క్షమాపణలు చెబుతా: నందు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు అయింది. నా నటన గురించి ఇప్పటివరకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ‘సైక్ సిద్ధార్థ’ సినిమా నచ్చకపోతే ప్రెస్మీట్ పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తాను. గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు శ్రీ నందు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ నందు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకులు రాఘవేంద్రరావు, సాయిరాజేశ్, అనుదీప్గార్లు మా సినిమా చూసి, అభినందించారు. ఈ చిత్రం కోసం నేను పద్దెనిమిది కిలోలు తగ్గాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు వరుణ్ రెడ్డి. ‘‘చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు యామినీ భాస్కర్.


