-
లేడీ కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. వ్యభిచారం కూల్ అంటూ!
ఒకప్పుడు కామెడీ అంటే నవ్వుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడేమో కామెడీ అంటే ప్రతిదీ డబుల్ మీనింగ్ లేదంటే బూతు అన్నట్లు మారిపోయింది. టీవీ షోల్లోనూ మహిళల్ని కించపరిచేలా కామెడీ పేరుతో పంచులు వేస్తూనే ఉండటం మీరు చూసే ఉంటారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ కూడా వ్యభిచారంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కూల్ ప్రొఫెషన్ అని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) సోషల్ మీడియా పుణ్యమా అని గత కొన్నాళ్ల నుంచి స్టాండప్ కమెడియన్స్ డిమాండ్ పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో ఆయా కమెడియన్స్ ఫేమస్ అయిపోతున్నారు. అయితే తమకు వస్తున్న ఆదరణ చూసి కొన్నిసార్లు నోరు జారేస్తున్నారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ అలానే అనేసింది. 'వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్. వేరు చూసి చూడటం లాంటి ఏం ఉండవు. ఫ్రెషర్స్ కి కూడా అందులో జాబ్స్ దొరుకుతాయి' అని చెప్పుకొచ్చింది. అయితే ఈమె వ్యాఖ్యలపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని విదూషిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) View this post on Instagram A post shared by Vidushi Swaroop (@vidushiswaroop) -
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు..
కర్ణాటక: జిల్లాలోని ముళబాగిలు తాలూకా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు వద్ద హైటెక్ వేశ్యావాటికపై ముళబాగిలు పోలీసులు దాడి జరిపి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కార్యాచరణలో 6 మంది మహిళలను రక్షించారు. కార్యాచరణపై కోలారు జిల్లా ఎస్పీ ఎం నారాయణ వివరాలు అందించారు. ఈ మహిళలను హైదరాబాద్కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రెస్టారెంట్ యజమానులతో కలిసి వేశ్యావాటికను నడుపుతున్నాడని తెలిపారు. ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ యజమాని, మేనేజర్, సప్లయర్, రిసెప్షనిస్ట్, మహిళలను తీసుకొచ్చిన ఏజెంట్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏజెంట్ విజయ్, మంజునాథ్, అంజప్ప, సతీష్లను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని చంద్రహాస్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాడి సమయంలో రూ.5,56,300 నగదు, రూ.2 కోట్ల విలువ చేసే 10 కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ వేశ్యావాటికతో పాటు డ్యాన్స్ కూడా ఆడించేవారని తెలిపారు. విజయవాడ, చిత్తూరు, విశాఖ పట్టణం నుంచి మహిళలను తీసుకువచ్చే వారని తెలిసిందన్నారు. సతీష్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశాడని, మహిళలంతా 20, 21, 23, 24 ఏళ్ల వయసు వారేనని, వారిని సఖి సాంత్వన కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముళబాగిలు తాలూకా హెచ్.బయప్పనహళ్లి సమీపంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్టులో రాక్ వ్యాలీ బార్ అండ్ రెస్టారెంట్ గదుల్లో మహిళలను ఉంచి వేశ్యావాటికను నిర్వహిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని రచించి దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. -
క్షుద్రపూజల పేరుతో మహిళలను.. వ్యభిచార కూపంలోకి
ప్రొద్దుటూరు క్రైం : క్షుద్రపూజల పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. తిరుపతికి చెందిన బాధిత మహిళ ఫిర్యాదుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ముఠాలోని ఏడుగురు సభ్యులను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారుడు అయిన బాబా కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన ఒక మహిళ ఆర్థిక సమస్యలతో బాధపడేది. తన కుమార్తెలకు వయసు వచ్చినా ఇంకా పెళ్లిళ్లు కాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఓ బాబా క్షుద్రపూజలు చేస్తే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబంలోని ఇతర సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయని ఒక మహిళ ద్వారా తెలుసుకున్న ఆమె.. సదరు ముఠా సభ్యులను ఆశ్రయించింది. తిరుపతి మహిళను ఫోన్లో సంప్రదించిన మోసగాళ్లు ఆమెను కడపకు రమ్మని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ముఠా సభ్యులు కొందరు ఆమెతో కడపలో సమావేశం అయ్యారు. అయితే వారు పెట్టిన కొన్ని షరతులకు ఆమె అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం తిరిగి వారు ప్రొద్దుటూరులో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పూజలు చేస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితుల అరెస్ట్ ఏఎస్పీ ప్రేరణాకుమార్ ఆదేశాల మేరకు సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్లు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యులు అమృతానగర్లో ఉన్నారని తెలియడంతో దాడులు నిర్వహించారు. దాడిలో అనంతపురం జిల్లాకు చెందిన వసారింటి నాగరాజు, కంబగిరి రాముడు, వడ్డే వెంకటేష్, కర్నూలు జిల్లాకు చెందిన మార్కె కంబగిరి రాముడు, మొట్టే కాంతమ్మ, నంద్యాల జిల్లాకు చెందిన జిట్టా రవికుమార్, తిరుపతికి చెందిన పొలిచెర్ల ప్రియను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపిస్తునట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన సూత్రధారి బాబా, మరి కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలను ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం ముఠాలోని మహిళలను ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారి ద్వారానే అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నారు. కుద్ర పూజలకు అంగీకరించిన మహిళలను లొంగదీసుకొని వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల వ్యభిచార నిర్వాహకులతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ఉచ్చులో పడి ఎంత మంది మహిళలు మోసపోయారనే దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ ప్రేరణాకుమార్ అభినందించారు. -
ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్కుమార్ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ మామునూరు పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్ఫోన్లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్పాషా, రోజాలను ఈస్ట్జోన్ డీసీపీ అభినందించారు. -
అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
అల్లిపురం(విశాఖ దక్షిణం): గుట్టుగా లాడ్జీ రూంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించి మహిళా రక్షణ గృహానికి తరలించారు. టూటౌన్ పోలీసులు, టాస్క్పోర్సు ఏసీపీ ఎ.త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి లాడ్జీలలో గదులు బుక్ చేసి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ఫోర్సుకు సమాచారం అందింది. చదవండి: మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే.. ఈ మేరకు అల్లిపురంలోని సప్తగిరి లాడ్జీపై ఏసీపీ ఎ.త్రినాథరావు, టూటౌన్ పోలీసులు దాడి చేశారు. గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, 7 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement