-
టీడీపీ పాలన కుంభకోణాలమయం
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉపాధి హామీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, చివరకు కార్పొరేట్ కాలేజీల్లో కుంభకోణం ఇలా వరుసగా ప్రతిదానిలో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉచితంగా లభించే ఇసుకను కూడా అధికారపార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించకుండా వారి కడుపులు కొడుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1600కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో రూ.406 కోట్ల పనులు చేస్తే కేవలం రూ.75 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. రేవంత్రెడ్డి వాఖ్యలపై సీఎం నోరుమెదపరే.. ‘రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్ల లబ్ధిచేకూర్చే కాంట్రాక్టు ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత కుమారుడికి, అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పయ్యావుల కేశవులు అల్లుడుకు తెలంగాణ ప్రభుత్వం మద్యం, పరిశ్రమలకు సంబంధించిన లైసెన్స్లు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్తో అంటకాగుతోంది’ అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్రెడ్డి ఘాటైన వ్యాఖ్యలుచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదన్నారు రిలయన్స్కు రూ. 3వేల కోట్ల బిజినెస్ రాష్ట్రంలోని రేషన్షాపులను రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మధు గుర్తుచేశారు. 26 వేల రేషన్దుకాణాలను రిలయన్స్ విలేజ్ మాల్స్ పేరుతో ఆ కంపెనీకి అప్పగించి ఏటా రూ.3వేల కోట్ల బిజినెస్ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రేషన్ దుకాణాలను రిలయన్స్కు అప్పగిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రిలయన్స్ విలేజ్ మాల్స్ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు అన్ని రేషన్ షాపుల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వాటా 70టీఎంసీలు రావాలి – పూనాటి జిల్లాకు 70 టీఎంసీల వాటా నీరు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా..జిల్లాకు మాత్రం సరిగా ఇవ్వడం లేదన్నారు. సాగర్ జలాలపై ఆధారపడి జిల్లాలో 4 లక్షల ఎకరాల వరికి అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6వ తేదీ లోగా ప్రకటన చేయకుంటే అదేరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ వల్ల 400 నుంచి 500 మంది చనిపోయారన్నారు. డెంగీ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య పాల్గొన్నారు. -
హవాలా మోసాలపై బాబు స్పందించాలి
-
హవాలా మోసాలపై బాబు స్పందించాలి: మధు
విజయవాడ : రాష్ట్రంలో వెలుగుచూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖ, నేడు విజయవాడలో వెలుగు చూసిన హవాలా కుంబకోణాలపై చిత్తశుద్ది వుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే హవాలా మాఫియా చెలరేగి పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపడం అంటే ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నీ ఉల్లగించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం నెటిజెన్ల పై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నదీ, సముద్రతీర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనం నెత్తిన ఆక్వా పిడుగు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవిష్కరించారు. -
బందరు పోర్టు భూసమీకరణ జీవోను ఉపసంహరించుకోవాలి
బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు. నిత్యం పారదర్శకత జపం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోనున్నదీ ఆ జీవోలో పేర్కొనలేదని, భూసమీకరణ వలన నష్టపోయే మత్స్యకారులు, ఇతర వృత్తిదారులకు ఎంత నష్టపరిహారం చెల్లించనున్నదో ఆ జీవోలో ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ పరిశ్రమ వస్తుంది, దానికి ఎంత భూమి అవసరమో ప్రకటించని ప్రభుత్వం ముందస్తుగా రైతుల నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం భూమితో భూమితో వ్యాపారం చేయడానికేనని స్పష్టమవుతోందన్నారు. -
'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి'
కడప: ఓటుకు కోట్లు కేసులో అసలైన ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో మధు విలేకర్లతో మాట్లాడారు. బాబు ప్రమేయంతోనే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపారనేందుకు అనేక ఆధారాలున్నప్పటికీ బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు సెక్షన్ -8ను తెరమీదకు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామికంగా గెలవాలనుకుంటోందని మధు విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement