-
అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!
దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..? బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..) -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్ పాయింట్–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఆయన ప్రశ్నకు రాజ్నాథ్ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్నాథ్æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది. భారత భూభాగాన్ని ఆక్రమించింది లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్నాథ్ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పంజాబ్కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. సాయుధ సంపత్తికి బిలియన్ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించాయి. ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్ తయారీ క్షిపణులు, హెరోన్ డ్రోన్లు, ఎస్ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్ చేయడం ద్వారా భారత్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ నరవాణే గురువారం శ్రీనగర్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కశ్మీర్లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే -
తిరుపతిలో పోలీసుల భారీ పెట్రోలింగ్
-
కొత్వాల్ కొరడా..!
‘రాత్రి 12 గంటలు. కోతిరాంపూర్లోని ఓ గల్లీలో కొందరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. చౌరస్తాలో అప్పటికే సిద్ధం చేసిన టేబుల్, దానిపై ఓ కేక్, క్యాండిల్స్... పుట్టినరోజు జరుపుకుంటున్న తమ మిత్రుడికి శుభాకాం క్షలు చెబుతూ కేక్ కట్ చేయించారు. కేరింతలు కొడుతూ బీర్ల మూతలు తెరిచారు. యువకుల సందడిని చూసిన ఓ వ్యక్తి 100 నెంబర్కు ఫోన్ చేయడంతో వెంటనే పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరింది. పోలీసు వాహనం హారన్ వినగానే ఎక్కడి వారు అక్కడ పరార్’ – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించడం, మహిళలు, బాలికల రక్షణ, యువకుల విచ్చలవిడి తనానికి పుల్స్టాప్ పెట్టడం, అక్రమ దందాలను అరికట్టడం... తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్రెడ్డి గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలకు మరింత పదును పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు బ్లూకోట్స్, పెట్రోలింగ్ స్టాఫ్, క్రైం పార్టీలు, ఈ కాప్స్, అడ్మినిస్ట్రేషన్, రిసిప్షన్ తదితర 10 విభాగాల సిబ్బందికి ఇచ్చే శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీంలతో పాటు క్రైంపార్టీ పోలీసులతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి వారి నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీమ్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రార్థనా స్థలాల వద్ద తెల్లవారు జామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తరచూ ఈవ్టీజింగ్ జరిగే బస్టాండ్స్, పార్కులు, కాలేజీ అడ్డాలు వంటి ‘హాట్స్పాట్స్’ను గుర్తించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని వారిని ఆదేశించారు. వ్యవస్థీకృత భూదందాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా ఉన్నప్పటికీ... పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత కరీంనగర్ లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, విచ్చలవిడి తనాన్ని రూపు మాపడం, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం ధ్యేయంగా పనిచేయాలని అధికారులు, క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు ఇచ్చారు. మనోళ్ల పనితీరు ఎలా ఉంది..? సోమవారం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులతో కమిషనర్ కమలాసన్రెడ్డి సమావేశం అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లు, సీఐ, ఎస్సైల తీరుపై ఆరా తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్హెచ్ఓలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న పోలీసు అధికారుల వివరాలతోపాటు సామాన్యులు పోలీసుల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎస్బీ మీటింగ్లో సూచనలు, సలహాలు చేసిన అనంతరం ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. వడ్డీ దందాలు, ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఒక్కొక్కరు ఒక్క నేరాన్నైనా ఛేదించాలి: క్రైంపార్టీల్లో పనిచేస్తున్న పోలీసులు మెదడుకు పనిచెప్పాలని, వ్యూహాత్మకంగా నేరాలను ఛేదించాలని మంగళవారం జరిగిన క్రైంపార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి కేసైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఛేదన కష్టం కాదని, ప్రతీ నేరానికి ఎక్కడో ఒకచోట క్లూ లభిస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో నేరగాళ్లు పట్టుబడే విధానాలను పరిశీలించాలని సూచించారు. సైబర్ ల్యాబ్తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రైంపార్టీలలో పనిచేసే పోలీసులు ఒక్క నేరాన్ని అయినా స్వయంగా ఛేదించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 31లోగా అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 31లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థినులు, మహిళలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, లేడీస్ హాస్టళ్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి వంద మంది గుమిగూడే ఏ ప్రాంతమైనా సీసీ కెమెరా తప్పనిసరని, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తే ఎలాంటి సంఘటననైనా రికార్డు చేయవచ్చని అన్నారు. పాఠశాలల్లో చదివే ఎదిగిన పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలోని ప్రతి ఆవరణ నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయని ఓ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement