-
హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రైతులను మభ్యపెట్టడానికే రుణమాఫీపై కమిటీ బాబు వచ్చె.. ఉన్న ఉద్యోగాలు పోయే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి పర్యటించారు. తలపులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి సంతకం రుణమాఫీపైనే అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికి కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులకు సరైన సమయంలో విత్తనాలు అందక, మరోవైపు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరం అన్ని రకాల రుణాలను ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బాబొస్తారు..జాబొస్తుందని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓ విధంగా, అధికారం వచ్చాక మరోవిధంగా ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్రెడ్డి, కంభం సతీష్రెడ్డి, చక్రపాణిరెడ్డి, చంద్రకుమార్రెడ్డి, ఏటీ.రత్నశేఖర్రెడ్డి, వివేకానందరెడ్డి, కేశవరెడ్డి, ఆనంద్, మస్తాన్, మదనమోహన్నాయుడు, ఉదయ్కుమార్, స్టాంపుల మస్తాన్, ఎస్.హబీబ్బాషా, మస్తాన్, సర్పంచ్లు రజియాబేగం, రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మల్లికార్జునగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పీలేరులో భూ సంతర్పణపై విచారణ
సబ్కలెక్టర్ ఆదేశాలు జారీ ఖాదర్షరీఫ్ హయాంలో ఇచ్చిన పట్టాలపై విచారణ పీలేరు తహశీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం స్థానికేతరులకు ఖరీదైన స్థలాలు ఎలా ఇస్తారు? అధికారికంగా వెయ్యి, అనధికారికంగా వందల్లో పట్టాలు పంపిణీ ఆక్రమణదారులు, దళారుల్లో ఆందోళన భూ సంతర్పణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ పీలేరు, న్యూస్లైన్: నిబంధనలకు వ్యతిరేకంగా అధికారం మాటున కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల సంతర్పణపై మదనపల్లె సబ్కలెక్టర్ భరత్ నారాయణగుప్త విచారణకు ఆదేశించారు. శుక్రవారం సబ్కలెక్టర్ పీలేరు తహశీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అనర్హులు, స్థానికేతరులకు ఎలా పంపిణీ చేశారని నిలదీశారు. నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ఇప్పటి వరకూ పంపిణీచేసిన పట్టాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పీలేరు మండలంలో దాదాపు వంద కోట్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట ఎంపీగా గెలుపొందిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు గతంలో ఆరోపించారు. పీలేరులో జరిగిన భూ సంతర్పణపైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు లోకాయుక్తలో కేసువేశారు. ఇళ్ల స్థలాలు. భూ పంపిణీలపై పూర్తి స్తాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మదనపల్లె సబ్కలెక్టర్ భరత్ నారాయణగుప్త అధికారులను ఆదేశించారు. పీలేరుకు వచ్చిన సబ్కలెక్టర్ను పంచాయతీ కార్మికులు, పలువురు బాధితులు కలిశారు. తమకు కాకుండా వేరేవారికి పట్టాలు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఇవే.. మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి హయాంలో పీలేరు తహశీల్దార్గా ఎం ఖాదర్షరీఫ్ జూలై 16, 2012 నుంచి ఫిబ్రవరి 20, 2014 వరకు పనిచేశారు. ఈ కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కర్పూర హారతిలా కరిగిపోయాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పీలేరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా మొక్కుబడి చర్యలతో సరిపెట్టారు. పీలేరు పట్టణంతో పాటు, పట్టణ శివారు ప్రాంతమైన నాగిరెడ్డి కాలనీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే అప్పటి అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆక్రమించుకున్నారు. మరోవైపు మండలస్థాయిలో అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట బినామీ పట్టాలు మంజూరు చేశారని ఆరోపణలు ఉన్నాయి. క ళ్లముందు అక్రమ కట్టడాలు వెలుస్తున్నా అధికారుల చేతివాటంతో ఏమీచేయలేక మిన్నకుండిపోయారు. అలాగే తిరుపతి మార్గంలో జాతీయ రహదారికిరువైపులా ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు మార్గంలో ఆటోనగర్, కోళ్లఫారం మిట్టన వెలసిన ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదు. మదనపల్లె మార్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో అడ్డూ అదుపులేకుండా స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. పలువురు నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను సైతం ఇక్కడ ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పట్టణానికి సమీపంలో ఖరీదైన ప్రభుత్వ భూములకు బినామీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కుల సంఘాలు పేరిట మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో స్థానికేతరులకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అధికారికంగా దాదాపు వెయ్యి పట్టాలు పంపిణీ చేయగా, అనధికారికంగా వందల సంఖ్యలో అక్రమంగా పట్టాలు పుట్టుకొచ్చాయని ఆరోపణలు లేకపోలేదు. వీవర్స్, రజకులు, నాయిబ్రాహ్మణులు, వెలుగు, ఐకేపీ, ఎమ్మార్పీఎస్, పంచాయతీ వర్కర్లు, ఆటో వర్కర్లు, తదితరులకు మంజూరు చేసిన పట్టాల్లో అర్హులైన స్థానికులకు కాదని, స్థానికేతరులు ఎక్కువగా ఇచ్చారని ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి
ఓబులవారిపల్లె, న్యూస్లైన్: ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ మండల కన్వీనర్ సాయికిషోర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మంగళంపల్లె దళితవాడలో పార్టీ నాయకులు శశికుమార్రెడ్డి, సీ.గంగిరెడ్డి, రాజమోహన్, వెంకటరెడ్డి, నాగేశ్వర్, బత్యాల వెంకటసుబ్బయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మంగంపేట కాపుపల్లె దలితవాడలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు తల్లెం వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి సాయికిషోర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మంగంపేట పంచాయతీని అభివృద్ధి చేస్తామని, గృహాలకు ఏపీఎండీసీ ద్వారా ఉచితంగా 24గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపీఎండీసీ గనుల విస్తరణలో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, తాత్కాళికంగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పులపత్తూరు సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్స్టీరింగ్ కమిటీ మెంబర్ భరత్కుమార్రెడ్డి, గజ్జెల శ్రీనివాసులురెడ్డి, పులపత్తూరు సుదర్శన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, పాపిరెడ్డి, కౌలూరు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. చెన్నరాజుపోడు గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరా రు. చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ రఫీ, నేతలు దశరధరామరాజు, ఆనందబాబు, శంకర, మనోహర్, చలపతి, కదిరుల్లా, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
చంద్రబాబుతో కిరణ్ చీకటి ఒప్పందం
బీజేపీకి ఓట్లేయండంటున్న కిరణ్ అనుచరులు వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకే ఈ పన్నాగం ముస్లిం మైనారిటీల ద్రోహి చంద్రబాబు జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పీలేరు, న్యూస్లైన్: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేక టీడీపీ అధినేత చంద్రబాబు, జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఆరోపించారు. పీలేరులో కిరణ్కుమార్రెడ్డి అనుచరులు కమలం గుర్తుకు ఓటెయ్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని, ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గురువారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎంతటికైనా దిగజారే నైజం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు కేంద్రబిందువులైన నారా, నల్లారిలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.9 లక్షల కోట్లు అవసరమన్నారు. ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 2004లో ఇచ్చిన హామీలను 2009 ఇవ్వలేదని, 2009లో చెప్పినవి ఇప్పుడు పేర్కొనకపోవడం ఆయన అబద్ధాల కోరు అనడానికి నిదర్శనమన్నారు. అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న దురాశతో ఓ వైపు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని, మరో వైపు జై సమైక్యాంధ్రతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, బీజేపీ కుమ్మకు కుట్రలను ముస్లిం మైనారిటీలు తిప్పికొట్టాలన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. అదే తరహాలో మైనారిటీలకు జగన్మోహన్రెడ్డి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. సమైక్య ద్రోహులైన కిరణ్, చంద్రబాబు, బీజేపీలకు ఇవే చివరి ఎన్నికలన్నారు. సీమాంధ్రలో ఓటుహక్కు లేని చంద్రబాబుకు మనం ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని పురందేశ్వరి స్థానికురాలు కాదన్నారు. ఆమెను చూడాలంటే హైదరాబాద్ లేదా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండిగ్లో ఉన్న హంద్రీ-నీవా, సుజల-స్రవంతి ప్రాజెక్టులను పూర్తిచేసి తాగునీటితోపాటు రైతులకు సాగునీరందిస్తామన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135కు పైగా సీట్లు వస్తాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. జగనన్న తమ్ముడిగా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలి పారు. పార్టీ నాయకులు ఎం.వెంకట్రమణారెడ్డి, కడప గిరిధర్రెడ్డి, కంభం సతీష్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, వినయ్రెడ్డి, ఎస్.హబీబ్బాషా, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, ఉదయ్కుమార్, ఆనంద్, నాగరాజనాయక్ పాల్గొన్నారు. -
కిరణ్కుమార్రెడ్డికి షాక్
వైఎస్సార్ సీపీలో బరకం రవికుమార్రెడ్డి చేరిక తుడుచుకుపెట్టుకుపోయిన జేఎస్పీ కలకడ, న్యూస్లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్కుమార్రెడ్డికి సొంత నియోజకవర్గమైన పీలేరులో పెద్ద షాక్ తగిలింది. ఐదు దశాబ్దాలకు పైగా, రెండు తరాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉన్న బరకం రవికుమార్రెడ్డి బుధవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన చేరికను వైఎస్సార్ సీపీ సీనియుర్ నాయకులు వంగి మళ్ల మాధుసూదన్రెడ్డి, జెల్లా రాజగోపాల్రెడ్డి స్వాగతించారు. అలాగే కోన సర్పంచ్ పుల్లమ్మ, టీడీపీ నాయకులు రెడ్డెప్ప తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. నల్లారి కిరణ్కుమార్రెడ్డి సోదరుడు కిషోర్కుమార్రెడ్డి జేఎస్పీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే బరకం రవికుమార్రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడంతో జే ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముడేళ్ల క్రితం మాజీ మండలాధ్యక్షులు వంగివుళ్ల మధుసూదన్రెడ్డి ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డిని విభేదించి పక్కకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి బరకం రవికుమార్రెడ్డి రాకతో కలకడ మండలంలో నల్లారి వర్గం దాదాపుగా తుడుచుపెట్టుకు పోయినట్టు అయింది. అదే సమయంలో పీలేరు నియోజకవర్గంలో వంగిమళ్ల మాధుసూదన్రెడ్డి వర్గం బలపడడం, వైఎస్సార్ సీపీకి మంచి పట్టు లభించినట్టు అయింది. బరకం నేపథ్యం ఇదీ క్లాస్-1 కాంట్రాక్టరుగా ఉన్న బరకం రవికుమార్రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి అమర్నాథరెడ్డిలు దశాబ్దాల కాలం కలిసి ఉన్నారు. నరసిం హారెడ్డి వాయల్పాడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా, పీలేరు సమితి సభ్యులుగా, జిల్లా బోర్డు సభ్యులుగా ఉండి మండలంలో, నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి వర్గంలోని ఆంతరంగికుల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో రవికుమార్రెడ్డి ఒకరు. రవికుమార్రెడ్డి వైఎస్సార్ సీపీ చేరికలో కడప డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతలరావుచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయుకు లు వంగిమళ్ల మాధుసూదన్రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి జెల్లారాజగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement