breaking news
patriotic
-
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్పై షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన దేశభక్తి గీతం పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియోని కైరోలోని భారత రాయబార కార్యాలయం నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ జిప్ట్కి చెందిన కరీమాన్ అనే అమ్మాయి దేశభక్తి గీతం "దేశ్ రంగీలా" పాటను ఎంతో చక్కగా ఆలపించింది. ఈ వీడియోని చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నానికి ఆమెను అభినందిస్తున్నాను. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కాగా, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీమాన్ పాడిన పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడి రాయబార కార్యాలయంలో కరీమాన్ గానం అటు భారతీయులను, ఈజిప్షియన్లను ఎంతగానో ఆకట్టుకోవడం విశేషం. A young Egyptian girl Kariman presented a patriotic song "Desh Rangeela" during 75th #RepublicDay celebrations at 'India House'. Her melodious singing and correct intonation impressed the large gathering of Indians and Egyptians. @MEAIndia @IndianDiplomacy @MinOfCultureGoI pic.twitter.com/7mQiZY4Q77 — India in Egypt (@indembcairo) January 28, 2024 (చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?) -
నవతరం యువత దేశభక్తిని ఎలా చాటుకుంటున్నారంటే..
కొన్ని తరాల వెనక్కి వెళితే...యువతలో దేశభక్తి వ్యక్తీకరణ పద్యం, పాట, కవిత, నినాదాల రూపంలో కనిపించేది. ఇక నేటి యువత విషయానికి వస్తే... సోషల్ మీడియా క్యాంపెయిన్స్, డిజిటల్ ఎంగేజ్మెంట్, వర్చువల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ద్వారా తమలోని దేశభక్తిని చాటుకుంటున్నారు... దేశభక్తి భావాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది యువత. ఒకప్పుడు మన దేశానికి మాత్రమే పరిమితమైన దేశాభిమాన భావాలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ వీరోచిత పోరాటగాథలను సోషల్ మీడియా వేదికగా యువత గుర్తు తెచ్చుకుంటుంది. కంటెంట్ క్రియేషన్ ద్వారా కూడా తమలోని దేశభక్తి భావాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. ‘జెన్–జెడ్ ఆర్టిస్టులు తమలోని దేశభక్తి భావాలను పాటలు, చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచ ధోరణులను గమనిస్తూ, విశ్లేషిస్తూనే కంటెంట్ క్రియేషన్కు సంబంధించి దేశీయతకు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటుంది కంటెంట్ క్రియేటర్ జాహ్నవి తివారి. బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల ప్రణవ్ స్కూల్ రోజుల్లో ‘హిస్టరీ రొస్టు కంటే రెస్టు మేలు’ అన్నట్లుగా ఉండేవాడు. బోర్గా ఫీలయ్యేవాడు. అయితే ఇప్పుడు హిస్టరీ అనేది అతడి ఫెవరెట్ సబ్జెక్ట్. హిస్టరీ పుస్తకాలను ఇష్టంగా చదువుతుంటాడు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్, ది లాస్ట్ మొఘల్, ది వండర్ దట్ వాజ్ ఇండియా...మొదలైనవి అతడి అభిమాన పుస్తకాలు. ‘ఒక దేశ గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే ఆ దేశచరిత్ర తెలుసుకోవాలి అనే మాట విని చరిత్ర పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. బుక్లెట్లాంటి చిన్న పుస్తకాలతో మొదలు పెట్టి ఇప్పుడు వందల పేజీలు ఉన్న పెద్ద పుస్తకాలు కూడా చదువుతున్నాను’ అంటున్నాడు ప్రణవ్. ‘దేశాన్ని ముందుకు నడిపించే ప్రతి మంచిపని దేశభక్తిగానే పరిగణించాలి. పర్యావరణ స్పృహ నుంచి స్టార్టప్ల వరకు ఏదైనా కావచ్చు’ అంటున్న ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ తేజస్వీ పర్యావరణ హిత, సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక సినిమాలకు సంబంధించి ‘యే జో దేశ్ హై తేరా, స్వదేశ్ హై తేరా’ (స్వదేశ్), ఆప్నీ అజాదీ కో (లీడర్–1964), యే మేరా ఇండియా–ఐ లవ్ మై ఇండియా (పర్దేశ్)...మొదలైన పాటలను ఎక్కువగా షేర్ చేస్తుంటారు. జీ మ్యూజిక్ కంపెనీ ‘సలామ్ ఇండియా’ ‘భారత్ సలామ్’ టీ–సీరిస్ ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్’ టిప్స్ ‘ఇండిపెండెన్స్ డే సాంగ్స్’ సారేగామా మ్యూజిక్ ‘రిపబ్లిక్ డే స్పెషల్’ నైంటీస్ గానే ‘ఐ లవ్ మై ఇండియా–రిపబ్లిక్ డే సాంగ్స్’ ఆల్బమ్లకు యూట్యూబ్లో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సింగర్–సాంగ్ రైటర్ వినీత్ సింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డ్లు బ్రేక్ చేయడంలో ఘనాపాఠీ. ‘యూరోపియన్ టాప్ 100 రేడియా చార్ట్స్’లో అతడి పాటలు టాప్లో నిలిచాయి. కొత్త దేశభక్తి గీతం ‘బార్న్ ఇన్ భారత్, బార్న్ ఫర్ ఇండియా’తో ముందుకు వచ్చాడు వినిత్. డైనమిక్ వోకల్స్, ఎనర్జిటిక్ బేస్లైన్తో కూడిన ఈ పాట నవభారతాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ‘దేశభక్తి పాటలు స్ఫూర్తిని ఇస్తాయి. దేశానికి నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ఇస్తాయి’ అంటున్న దిల్లీకి చెందిన అద్విక్ దేశభక్తి పాటలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘దేశభక్తి గీతాలు కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైనవి కావు. అన్ని రోజుల్లో వినాల్సిన విలువైన గీతాలు’ అంటాడు 24 సంవత్సరాల అద్విక్. (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
ఈ ‘దేశభక్తుల’కు సరిలేరు వేరెవ్వరు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మన దేశానికి అందరికన్నా ఎక్కువ మేధావులు, లౌకికవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. నేనే కనుక హోం మంత్రిని అయితే వారందరినీ కాల్చి పారేయమంటూ ఆదేశాలిచ్చేవాణ్ని’, అని కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నల్ ‘కార్గిల్’ దినోత్సవం నాడు బీజీపీ అనుచర వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కంటే కూడా భారత సెక్యులర్ వాదులే ఎక్కువ ప్రమాదకారులని కూడా అన్నారు. ఇలాంటి నయా జాతీయవాద దేశ భక్తులు దేశంలో రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ముస్లింలెవరు తన కార్యాలయంలో కనిపించకూడదంటూ గత నెలలో కసరుకున్నప్పుడే యత్నల్ దేశభక్తిని అందరు గుర్తించి ఉండాల్సింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు యత్నల్ తన దేశభక్తి భయటపడకుండా ఎంతగా దాచుకున్నారో పాపం! ‘దేశంలో నేడు టెర్రరిజం, నేరాలు, గోరక్షణ హత్యలు పెరిగి పోవడానికి అసలు కారణం జనాభా పెరుగుదల. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే నేడు జనాభా విపరీతంగా పెరిగింది. అది కూడా ఒక్క ముస్లింల వల్లనే’ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు హరి హోం పాండే వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న ముస్లింల హత్యలకు ముస్లింలనే నిందించాలన్న మాట. కొంచెం అటుఇటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే మాట్లాడారు. ‘అనవసరంగా మూక హత్యలను హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా గోవుల స్మగ్లింగ్ను, కబేళాలకు తరలించడాన్ని ఆపేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు. 2014 నుంచి 2017 మధ్య జరిగిన 87 సంఘటనల్లో 34 మంది ముస్లింలు మరణించడం పెరుగుతున్న వారి జనాభాలో ఎంతపాటి! ఇలాంటి వ్యక్తులు మాటల్లో తమ దేశభక్తిని చాటుకుంటే కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తన దేశభక్తిని చేతల్లో చూపించారు. 2016లో ఓ ముస్లిం యువకుడిని గోరక్షణ పేరిట హత్య చేసిన కేసులో నిందితుడు అనారోగ్యం కారణంగా మరణిస్తే ఆయన మతదేహంపై జాతీయ జెండాను కప్పి అమరవీరుడిని చేశారు. ముస్లిం మూక హత్య కేసులో శిక్ష పడిన ఆరుగురు దోషులు జైలు నుంచి బెయిల్పై విడుదలయితే కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి సత్కరించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు తాను చింతిస్తున్నానంటూ ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా అనవసరంగా నొచ్చుకున్నారు. ఆయన వాజపేయి హయాంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినది ఎవరికి గుర్తుందీ, కొడుకు ప్రవర్తనను పొగిడి ఉంటే ‘తనయుడికి తగ్గ తండ్రి’ అంటూ ఈ దేశం జీవితాంతం గుర్తుంచుకునేది కదా! ‘దేశంలో శాంతి కోసం ఇస్లాంను పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. చర్చి మతమార్పిడి యంత్రం. భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఇక భారత లౌకికవాదులు తల్లిదండ్రుల రక్తం పంచుకోని వివాహేతర సంబంధానికి పుట్టిన బిడ్డలు (బాస్టర్ట్స్)’ అంటూ తన భాషా నైపుణ్యాన్నంతా ప్రదర్శించి నైపుణ్య శాఖకు తగిన వ్యక్తినని నిరూపించుకున్నారు ఆ శాఖ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. హిందూత్వాన్ని ఐక్యంగా ఉంచేందుకు, భారత్ను మరింత బలోపేతం చేసేందుకు హిందువులు కనీసం ఐదుగురిని కనాలని యూపీకి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా పిలుపునిచ్చారు. ఇలాంటి మేథావులే చెప్పిన ‘హమ్ పాంచ్ హమారా పచ్చీస్’ నినాదాన్ని ముస్లింలు వీడనంతకాలం హిందువులు ఎంత మందిని కంటే మాత్రం హిందూత్వం బలపడుతుంది. ప్రస్తుత రాజ్యాంగానికి అంతో ఇంతో కట్టుబడి పనిచేసే కోర్టులు ఉన్నంతకాలం గౌరీ లంకేష్ లాంటి మేధావులను, లౌకికవాదులను ఎంత మందిని చంపితే మాత్రం ఏం ప్రయోజనం? టర్కీలో, రష్యాలో, హంగరీలోలాగా మేధావులు, లౌకికవాదులతో నయా జాతీయవాదులు, దేశభక్తులు యుద్ధం చేసి ‘తాడో పేడో’ తేల్చుకుంటే పోలా! -ఓ సెక్యూలరిస్ట్ కామెంట్ -
ఆ శునకాల నుంచైనా నేర్చుకోండి!
సాక్షి, చిత్రదుర్గ/రాయ్చూర్/బాగల్కోట్/హుబ్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ.. వాగ్బాణాల వాడి పెరుగుతోంది. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్ శునకాల నుంచైనా దేశభక్తి నేర్చుకోండంటూ కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుబ్లీలో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనే మాట వినపడగానే ఇబ్బందిపడేవారికి, దేశభక్తిని విమర్శించేవారికి, దేశభక్తి వల్లనే కష్టాలని భావించేవారికి నేనొకటే చెబుతున్నా. మీ పెద్దల నుంచి మీరేం నేర్చుకోలేదు.. కనీసం సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన శునకాల నుంచైనా కాస్త దేశభక్తి నేర్చుకోండి. అలా నేర్చుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసిన వారికి మద్దతిచ్చిన పార్టీ మీది’ అని మండిపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆందోళనల సమయంలో విద్యార్థులకు ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రధాని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ముధోల్ ప్రాంతానికి చెందిన జాతి కావడంతో ఇక్కడి శునకాలకు ఆ పేరు వచ్చింది. అవి భారతీయ ఆర్మీలో సేవలందిస్తున్న తొలి భారతీయ జాతి శునకాలు. పేదలకు పదవులు వారికిష్టంలేదు ‘వారు అంబేడ్కర్ను అవమానించారు. ఆయనను అంగీకరించలేదు. సమయాన్ని ఇవ్వలేదు’ అని బాగల్కోట్ బహిరంగ సభలో మోదీ పేర్కొన్నారు. దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్ను బీజేపీ రాష్ట్రపతిగా గెలిపించుకోవటం కూడా కాంగ్రెస్కే నచ్చలేదన్నారు. ‘దేశంలో ప్రస్తుతం ఉన్న పదవులను పేదలు, సామాన్యులు అందుకోవటం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది’ అని విమర్శించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలను ప్రశ్నించారని అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్పను కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తోందని చిత్రదుర్గ ర్యాలీలో మోదీ విమర్శించారు. ‘18వ శతాబ్దంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒణకె ఓబవ్వ చిత్రదుర్గ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం సుల్తాన్ వంశస్తుడైన మైసూరు హైదర్ అలీ సైన్యంతో పోరాడి.. కన్నడ తెగువను చూపారు. అలాంటి ఎందరో యోధులు, యోధురాళ్లను విస్మరించిన కాంగ్రెస్.. సుల్తాన్ల జయంతులు మాత్రం జరుపుతోంది’ అని మండిపడ్డారు. దోపిడీని అరికట్టినందుకే.. రాజకీయంగా తనను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. ‘నన్ను వ్యతిరేకించటం, విమర్శించటమే కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఎజెండా. అందుకే పార్లమెంటును కూడా జరగనీయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని మేం అరికట్టాం. అందుకే వారు నాపై, మా పార్టీ నేతలను దూషిస్తున్నారు’ అని తెలిపారు. తాము అధికారంలోకివస్తే రాయచూరు జిల్లాలో పండించే సోనామసూరి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు తెస్తామని, హట్టి బంగారు గనుల అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. -
మితిమీరిన దేశభక్తి ప్రమాదకారి
నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం. 1981 నుంచీ ఐక్యరాజ్యసమితి ప్రకటన ద్వారా నూట తొంభై మూడు దేశాల్లో పాటించే రోజు ఇది. భూమే మాతృదేశంగా తన దేశభక్తి గీతం రాసిన ఏకైక ప్రపంచ కవి గురజాడ పుట్టినరోజు కూడా. మోతాదు మించిన దేశభక్తి చెడుకు దారి తీస్తుంది అన్నది చరిత్ర ఎరిగిన సత్యం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలోని జర్మనీ, ఇటలీ దేశాల్లో, ఇటు ఆసియాలోని సైనిక జాతీయ మనస్తత్వం గల జపాన్లో ఒక్కసారి పెల్లుబికిన ఈ దేశభక్తి మహమ్మారి, కోట్లాదిమంది ప్రజల అకాల మృతికి, ప్రపంచ దుస్థితికీ దారితీసింది. అతిగా వాగి, అనర్థాలకు కారణం కావడం దేశభక్తి కన్నా హీనమైన పాపం అని సంచలన తెలుగు రచయిత చలం అన్నారు. ఒక మోతాదు దాటాక మాతృసీమలూ, పితృసీమలూ మనుషుల్ని చంపే ద్వేషకారకాలు అవుతాయి తప్ప, వాటికి వేరే మార్గం లేదు. దేశభక్తి అవధులు దాటిన సైనిక కార్యకలాపాలకు దారి తీస్తుందన్నారు ఠాగోర్. ‘‘దేశభక్తి మనకు అంతిమ విశ్రాంతి మందిరం కాలేదు. నేను జీవించి ఉండగా మానవత్వం మీద దేశభక్తిది పై చేయి కానివ్వను’’ అంటూ ఈ ముదిరిపోయే దేశభక్తి ఎంత నష్టకారకమో చెబుతూ తీవ్రంగా వ్యతిరేకించాడు టాగోర్. ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది అని గురజాడ అంటే, అలా చరిత్రను తిరగ రాసే ఆధునిక మహిళలను మేం కాల్చి చంపుతాం అనే కాల సందర్భంలో ఇరుక్కుని ఉన్నాం. దేశభక్తి ఇప్పుడు పశువుల పేరిట, పవిత్రతల పేరిట, సంకుచితమైన గోడల పేరిట, మీటర్ల ఎత్తు విగ్రహాల్లా పెరుగుతానని భయపెడుతూ, కొందరి చేతిలో గాఢగంధకంలా మారి, మనకు కళ్ళ మంటలు పుట్టిస్తూ, ఇతర పేలుడు సామాన్లుచేరి కూరినప్పుడల్లా విస్ఫోటించి మనిషి గురించి ఆలోచించే వారిని పూనకంతో బలి తీసుకుంటున్నది. ప్రపంచం ఎవరి సొంత పెరడూ కాదు. ఆయుధాల నిల్వ కొట్టు కాదని, ప్రపంచ బేహారులకు తెలియచెప్పడమే అంతర్జాతీయ శాంతి దినాన సామాన్య మానవుల కర్తవ్యం. (నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం) రామతీర్థ, ప్రముఖ కవి, రచయిత ‘ 9849200385 -
దేశభక్తిని నాటండి
దేశభక్తిని ఇలా వ్యక్తీకరించండి... ‘దేశమును ప్రేమించుమన్నా...’ అన్న మహాకవి అక్కడితో ఆగిపోలేదు. మంచి అన్నది పెంచమన్నాడు. వొట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టమన్నాడు. అందుకే మన దేశభక్తి మాటలకే పరిమితం కాకూ డదు. అది ఆచరణగా వికసించి నలుగురికి ఉపయోగపడాలి. మన దేశభక్తిని ఇలా కూడా వ్యక్తీకరించుకోవచ్చు... రక్తదానం అవయవదానం మొక్కలు నాటడం, వాటి సంరక్షణ క్యూలో పద్ధతి పాటించడం శబ్ధకాలుష్యాన్ని సృష్టించకుండా ఉండడం రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్న అంధులకు సహాయ పడడం వాహనాలను మితిమీరిన వేగంతో నడపకపోవడం పక్షులు, జంతువులను హింసించకపోవడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రకృతి విలయాలు ఏర్పడినప్పుడు... సంబంధిత ప్రాంతాలకు వెళ్లి మన వంతుగా సహాయ పడడం... ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు మీ దేశభక్తిని ఎలా వ్యక్తీకరించుకుంటారో నిర్ణయించుకోండి. మిలే సుర్ మేరా తుమ్హారా... ‘మిలే సుర్ మేరా తుమ్హారా’... దేశంలోని భాషా వైవిధ్యానికి మచ్చుతునక ఈ పాట. పద్దెనిమిదేళ్ల కిందట స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పాట మొట్టమొదటిసారిగా ‘దూరదర్శన్’లో ప్రసారమైంది. జాతీయ సమైక్యతను చాటేలా వైవిధ్యభరితమైన చిత్రీకరణతో రూపొందించిన ఈ పాటను ‘దూరదర్శన్’ అప్పట్లో చాలా తరచుగా ప్రసారం చేసేది. అద్భుతమైన స్వరకల్పనతో రూపొందించిన ఈ పాట ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పట్లో... అంటే 1988 నాటికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పొందుపరచిన పద్నాలుగు భాషలతో ఈ పాటను రూపొందించారు. పీయూష్ పాండే రచించిన ఈ పాటకు అశోక్ పాట్కీ స్వరకల్పన చేశారు. హిందీతో మొదలయ్యే ఈ పాటలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, మలయాళం, మరాఠీ, మార్వాడీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళ, తెలుగు, ఉర్దూ భాషలు వినిపిస్తాయి. పండిట్ భీమ్సేన్ జోషి, లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ వంటి సంగీత దిగ్గజాల గళమాధుర్యం ఈ పాటను అజరామరంగా నిలిపింది. గ్రామ స్వరాజ్యానికి ఊతం... గ్రామ రాజ్యం ద్వారా... రామరాజ్యం ఏర్పాటు చేయాలనే జాతిపిత కన్న కలకు ఆచరణ రూపం పంచాయతీరాజ్ వ్యవస్థ. గాంధీజీ దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటు పడే వీలు కలిగింది. గ్రామ పంచాయితీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చింది. వనరుల పంపిణీని మెరుగు పరచడానికి, ప్రభుత్వ పనుల్లో గ్రామ ప్రజలు పాల్గొనేలా చేయడానికి, స్థానికంగా ఎక్కువమందికి ఉపాధి కలిగించడానికి, పేదరిక నిర్మూలనకు ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందింది. నేను సైతం... సామాజిక విషయాలపై మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరింత పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రభుత్వ టూరిజమ్ క్యాంపెయిన్ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. కాలేజీ గ్రాడ్యుయేట్లు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ‘టెక్ ఇండియా’ ప్రచారం, ఓటు హక్కు విలువ తెలియజేయడానికి ‘నేషనల్ ఓటర్ మోటివేషన్’ క్యాంపెయిన్ నిర్వహించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘అతిథి దేవోభవ’ ప్రచారాన్ని నిర్వహించారు. పోషకాహార లోపంపై ‘మాల్ న్యూట్రిషన్ క్విట్ ఇండియా’ ప్రచారాన్ని నిర్వహించారు. సినిమా ప్రమోషన్ తప్ప దేశం గురించి పట్టని నటులకు అమీర్ఖాన్ కచ్చితంగా ఒక ఆదర్శ నమూనా. -
ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి
మరిపెడ : దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కార్గిల్ సోల్జర్స్ మొమోరియల్ చైర్మన్ గాదె రాంబాబు ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశం మనకు ఏమి ఇచ్చింది కాదని దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కార్గిల్ స్తూపాన్ని ఏర్పాటు చేసిన రాంబాబును మనందరం అభినందించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని కోరారు. గాదె రాంబాబు, గుడిపుడి నవీన్, ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు బాల్నే మాణిక్యం, కురవి సీఐ శ్రీనివాస్, మరిపెడ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మండల కో ఆప్షన్ సభ్యుడు అయూబ్పాషా, నాయకులు యాదగిరిరెడ్డి, వస్రాంనాయక్, రంగారెడ్డి, సర్పంచ్లు దుస్సా నర్సయ్య, భూక్య సేవ్యానాయక్, మక్సూద్, తోట సతీష్, లక్ష్మీనారాయణ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశభక్తి నిరూపించుకోమంటే ఏడుపొచ్చింది
న్యూఢిల్లీ: ‘నా దేశభక్తిని నిరూపించుకోమన్నప్పడు ఏడుపొచ్చినట్టయింది. దేశంలో నా కంటే గొప్ప దేశభక్తిపరుడు ఎవరూ లేరు’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ అన్నారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కున్న షారుక్ ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘నా సినిమా ‘ఫ్యాన్’ హిట్టయినా, కాకున్నా.. నా కంటే గొప్ప దేశభక్తుడు ఎవరూ ఉండరని నేను చివరిసారిగా చెప్పాలనుకుంటున్నా. ఈ విషయం మళ్లీ మళ్లీ చెప్పను’ అని భావోద్వేగంతో అన్నారు. తన కుటుంబమే మినీ ఇండియా అని తెలిపారు. దేశం మోదీని ప్రధానిగా ఎన్నుకుందని.. మనమంతా ఆయనకు మద్దతివ్వాలన్నారు. యువత సహనంతో ఉండాలని.. జాతి పురోగమనానికి బాటలు వేసేలా కృషి చేయాలని తెలిపారు. ‘మతం, కులం, వర్ణం, వర్గం, ప్రాంతం తదితర విషయాల్లో అసహనం వద్దు. నటనను వ్యాపారంగా తీసుకోను. సినిమాల హిట్టయితే వీలైనంత ఇవ్వమని నిర్మాతలకు చెబుతాను. ఒప్పందాలు, ఈవెంట్లు, షోలకే ఫీజు వసూలు చేస్తాను’ అని అన్నారు. అమితాబ్కంటే మంచి నటుడినని 22 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను గుర్తుచేయగా.. అది వయసులో చేసిన దురహంకార వ్యాఖ్యగా, బాల్యచేష్ట అని చెప్పారు. ఏది గొప్ప నటుడిని చేస్తుందన్నది తనకు తెలియదని.. 22 ఏళ్ల తర్వాత ఇప్పటికి తెలుసుకున్నానని చెప్పారు. 50 ఏళ్ల వయసులో ఇప్పటికీ కొన్నిసార్లు తనలోని చిన్నపిల్లాడి తత్వం బయటపడుతుందని షారుక్ తెలిపారు. -
జాతీయ పతాకాన్ని అవమానిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు
లీగల్ కౌన్సెలింగ్ అమ్మా, మేము రిటైర్డ్ ఉద్యోగస్తులం. మేము ఒక స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటు చేసుకున్నాము. సమాజసేవ దేశభక్తి మా సంస్థ ముఖ్యోద్దేశాలు. కొన్ని సందర్భాల్లో ‘జాతీయ పతాకాన్ని’ అవమానిస్తున్నారేమో అని బాధపడుతున్నాము. అలాంటప్పుడు ఏదైనా చట్టం ఉందా? దయచేసి తెలుపగలరు. - కాట్రగడ్డ వెంకటప్పయ్య, గుంటూరు సార్, మీ దేశభక్తికి, జిజ్ఞాసకు అభినందనలు. మనం తరచుగా పేపర్లలో చదువుతున్నాము. జెండా తలక్రిందులుగా వేలాడదీశారని, జెండా నేలను తాకిందనీ చింపివేయబడిందనీ... ఇలా రకరకాల వార్తలు. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు బాధ్యత గల పౌరులెవరైనా స్పందించవచ్చు. దీనిని సంబంధించి ‘జాతీయ పతాక గౌరవ పరిపరక్షణ చట్టం 1971’ ను అనుసరించి బహిరంగ ప్రదేశాల్లోగానీ, ప్రజలు వీక్షించటానికి అవకాశముండే ప్రదేశాల్లో కానీ, మరేదైనా ప్రదేశాల్లో కానీ జాతీయ పతాకాన్ని లేదా భారత రాజ్యాంగాన్ని తగులబెట్టిగా, చింపివేసినా, ధ్వంసం చేసినా, మాటల ద్వారా, చేతల ద్వారా, ఏవైనా ఇతర హావభావాల ద్వారా కించపరిచినా కానీ నేరం. అటువంటి చర్యలు పవిత్రమైన జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరచినట్లుగా పరిగణింపబడి శిక్షార్హమైన నేరాలవుతాయి. ఈ చట్టాన్ని అనుసరించి... ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయరాదు జాతీయ పతాకంపై ఏవిధమైన రాతలు రాయరాదు, చెక్కరాదు బుద్ధిపూర్వకంగా జాతీయ పతాకం నేలను తాకేలా చేయరాదు, నీట ముంచరాదు జాతీయ పతాకాన్ని బుద్ధిపూర్వకంగానే కాదు, పొరపాటుగా తలకిందులుగా ఎగుర వేయరాదు జాతీయ పతాకాన్ని అవమానించే లేదా అవహేళన చేసే వ్యాఖ్యలు చేసిన వారు కూడా శిక్షార్హులే జాతీయ పతాకాన్ని అవమాన పరిచినట్లైతే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, జాతీయ గీతాన్ని పాడకుండా నిరోధించినా, గలాభా చేసినా కూడా మూడేళ్ల వరకు జైలు, జరిమానా లేక రెండూ విధింపబడతాయి. ఒకవేళ జాతీయ పతాకం పాడయినట్లయితే దానిని చాటుగా తగులబెట్టాలి. అంతేకానీ, దానిని ఎగుర వేయడం కానీ, ఇతర విధాలుగా కానీ ఉపయోగించడం కూడా నేరమే. ఈ నియమాలకు, నిబంధనలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు కూడా అతీతులు కారు. వారికి కూడా శిక్షతప్పదు. మా అమ్మగారు ఇటీవలే మరణించారు. ఆమె పేరు మీద పది ఎకరాల పొలం ఉంది. మా తండ్రిగారు జీవించి ఉన్నారు. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నాకూ, అక్కకీ వివాహం అయింది. తమ్ముడు అవివాహితుడు. మా అమ్మగారు వీలునామా రాయలేదు. ఎవరికీ ఆస్తి పంపకాలు చేయలేదు. ఎవరికీ దాన పత్రాలు రాయలేదు. ఆ ఆస్తిని మేమెలా పంచుకోవాలి? అందరికీ సమాన వాటాలు వస్తాయా? తెలుపగలరు. -బి.ల క్ష్మి, చిలువూరు మరణించిన మీ తల్లిగారు వీలునామా రాయలేదు. ఆమె ఆస్తి ఇద్దరు కుమార్తెలకూ, కొడుకుకూ, మీ తండ్రికి సంక్రమిస్తాయి. మీకు సమాన వాటాలు వస్తాయి. సెక్షన్ 15 హిందూ వారసత్వ చట్టం సబ్సెక్షన్ (1), క్లాజ్ (ఎ) కింద కొడుకులూ, కూతుళ్లు వారితోపాటు భర్తకూ సమాన వాటాలు ఉంటాయి. కూతుళ్లకు వివాహాలు అయినా కాకపోయినా వారికి సమాన వాటా ఉంటుంది. మేడమ్, మాది ఉమ్మడి కుటుంబం. మా మామగారి తమ్ముళ్లూ, వారి కుటుంబాలు, మా కుటుంబం అంతా కలిసే ఉంటాం. అన్నదమ్ముల మధ్య కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఇక నేను ఆ ఇంటి కోడలిని. నాకు రాకరాక గర్భం వస్తే, మూడో నెలలోనే మావారి పిన్నిగారు ఏదో మందు తినిపించారు. బలానికని చెప్పారు. వెంటనే నాకు కడుపులో నొప్పి ప్రారంభమై అబార్షన్ అయింది. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. నన్నేం చేయమంటారు? - వి.ఆర్., కాకినాడ గర్భస్రావ నేరాలకు సంబంధించి విఫిసి చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 312 నుండి 316 వరకూ ఇలాంటి నేరాలు, వాటి శిక్షల గురించిన వివరణ ఉంది. ప్రసవానికి ముందే గర్భంలోని శిశువును చిదిమి వేయడాన్ని గర్భస్రావం అంటారు. అంటే కడుపులోని బిడ్డను చంపివేయడమే. మీ విషయంలో సెక్షన్ 312 అన్వయిస్తుంది. మెడికల్ రిపోర్ట్ తీసుకొని కేస్ వేయవచ్చు. 3 సం॥జైలు శిక్ష, జరిమానా పడతాయి. కేస్ స్టడీ కట్నం రూపేణా ఇచ్చిన ఆస్తిని మూడు నెలల్లోగా భార్యపేరిట బదలాయించాలి! సంథ్య సుభాష్ల వివాహమై ఆరు నెలలు అయింది. దాదాపు పది లక్షల కరకు రొక్కం కట్నం రూపేణా ఇచ్చారు సంధ్య తల్లిదండ్రులు. ఇది కాక వివాహం వియ్యాల వారి కోరిక మేరకు చాలా ఘనంగా జరిపించారు. ఘనమైన సారెతో అత్తింటికి పంపించారు. ఓ రెండు నెలలు హాయిగా ఉన్నారు దంపతులు. పల్లెటూర్లో ఉంటున్న అత్తామామల సంధ్య సుభాష్ల ఇంటికి వచ్చారు. అత్తమామల ఆరళ్లు ప్రారంభమైనాయి. సంధ్య ఒక్కతే కూతురు. పైగా బోలెడంత ఆస్తి ఉంది. ఇకనేం సుభాష్ మనసులో విషబీజాలు నాటారు అత్తమామలు. అత్తమామలు ఆరోగ్యంగా ఉండగానే ఆస్తి మొత్తం రాయించుకోమని సుభాష్పై ఒత్తిడి తెచ్చారు. డబ్బంటే చేదా? సుభాష్ కూడా సంధ్యను సతాయించడం ప్రారంభించాడు. చీటికి మాటికి పోట్లాటకు సిద్ధపడుతున్నాడు. పది లక్షలేం చేశారంటే బ్యాంక్లో వేసుకున్నానని సమాధానం. ఇంట్లో గొడవలు భరించలేక సుభాష్ కోరిక తీర్చడం కోసం పుట్టింటికి వెళ్లింది సంధ్య. ఆస్తి అంతా సుభాష్కు, సంధ్యకే ఇస్తామని, కానీ ఇప్పుడు కాదనీ, ఇప్పుడు ఇస్తే సంధ్యను అన్యాయం చేస్తారని ఆమె తల్లిదండ్రుల వాదన. అంతా కలసి వారి ఫ్యామిలీ లాయర్ దగ్గరకెళ్లారు. ఆమె కూడా సంధ్య పేరెంట్స్నే సపోర్ట్ చేసింది. ఏకైక వారసురాలైనంత మాత్రాన ఆస్తి మొత్తం ఇపుడే ఇవ్వడం కుదరదని తెలియజేసింది. అసలు, వివాహమైన 3 నెలలలోగా కట్నం రూపేణా ఇచ్చిన సొమ్మును భార్య పేరు మీద తప్పకుండా ట్రాన్ఫర్ చేయాలని, వరకట్నంగా ఇచ్చిన డబ్బు గృహిణికి స్వంత ఆస్తి అవుతుందని ‘వరకట్న నిషేధ చట్టం 1961’ ప్రకారం భార్య పేరున తప్పకుండా కట్నం డబ్బునుకాని, కట్న రూపేణా వచ్చిన ఆస్తిని కానీ ట్రాన్ఫర్ చేయాలని అలా చేయకుంటే నేరమని, జైలు శిక్షా, జరిమానా పడతాయనీ లాయర్ తెలియజేశారు. ముందు 10 లక్షలు తన పేరు మీద ట్రాన్ఫర్ చేయించుకోమని, అపుడు భర్త, అత్తగార్ల అసలు స్వరూపం బయట పడుతుందని సలహా ఇచ్చారు. భర్తను నిలదీయడానికి సిద్ధపడింది సంధ్య. వీలుంటే న్యాయపోరాటానికి కూడా. తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పి లాయర్గారికి ధన్యవాదాలు చెప్పి అత్తింటికి మరలింది సంధ్య. -
'కాశ్మీరీలను దేశభక్తి నిరూపించుకోమనడం సరికాదు'
హైదరాబాద్/ జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని ప్రొగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమర్థించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ సమాన భాగస్వామి కావడం దేశభద్రతకు మంచిదని, ఈ ప్రయోగం సఫలమైతే జాతీయవాదానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పీడీపీతో పొత్తు చర్చల్లో కీలక పాత్ర వహించిన రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ సంస్థ నిర్వహించిన సదస్సులో జాతీయ భద్రత - జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకూ అన్న అంశంపై ప్రసంగించారు. ఇరు పార్టీల మధ్య రాజకీయ అంశాల్లో వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమేనని, ఇది రాజకీయ పొత్తు కాదని, పీడీపీ- బీజేపీలది పరిపాలనాపరమైన పొత్తు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చినతీర్పును గౌరవించి తాము పీడీపీతో అధికారంలో పాలుపంచుకుంటున్నామని అన్నారు. దేశ భద్రతకు, దేశ సమైక్యతకు ఏ మాత్రం భంగం కలిగితే బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నంత వరకూ వేర్పాటు వాద శక్తులకు అంగుళం కూడా తావివ్వబోమని ఆయన ప్రకటించారు. సైన్య బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో ఎలాంటి రాజీకీ తావుండబోదని కూడా ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 67 శాతం మంది ప్రజలు కాశ్మీర్ లోయలో ఓటు వేసి, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయ ప్రజలను తమ దేశభక్తిని నిరూపించుకొమ్మని పదేపదే అడగడం సరైనది కాదని కూడా ఆయన అన్నారు. కాశ్మీరీ ప్రజలను కలుపుకుపోవాలే తప్ప వేరు చేయడం సరికాదని ఆయన అన్నారు. కాశ్మీరీ పండితులను తిరిగి కాశ్మీర్ కి సగౌరవంగా తీసుకువచ్చే విషయంలో, వారికి భద్రత, రక్షణ కల్పించే విషయంలో తొలి దఫా చర్చలు పూర్తయ్యాయని, కాశ్మీర్ లోని శరణార్థులకు పునరావాసం కల్పించే విషయంలో చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రస్తావిస్తూ దేశం సురక్షితమైన నాయకత్వం చేతుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేనంత మంచి పాలనను మోదీ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరాశ నుంచి ఆశ వైపు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని సూట్ బూట్ ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇచ్చింది లూట్ ఝూట్ (దోపిడీ, అబద్దాల పాలన) పాలన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి సంస్థ అధ్యక్షులు టీ హనుమాన్ చౌదరి, జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అధ్యక్షులు ప్రొ. తిరుపతి రావులు కూడా ప్రసంగించారు. -
మావోయిస్టు అగ్రనేత గణపతి ఇంటర్వ్యూ...
-
దేశాన్ని అమ్మేస్తున్నారు
(గణపతి ఇంటర్వ్యూ పూర్తిపాఠం...) మోదీ సర్కారుపై మావోయిస్టు దళపతి గణపతి ధ్వజం ఎన్డీఏ సర్కారు హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోంది గత దశాబ్ద కాలంలో మావోయిస్టు పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది ప్రపంచంలోనూ, దేశంలోనూ విప్లవ పురోగమనఅనుకూల పరిస్థితులు పెరుగుతున్నాయి మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి దశాబ్దమైన సందర్భంగా గణపతి ఇంటర్వ్యూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువా బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తోందని.. దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తున్నారని.. అదే సమయంలో వివిధ రూపాల్లో హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోందని.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనేత గణపతి ధ్వజమెత్తారు. ఇది ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వర్గాల ప్రజల కష్టాలను మరింత దుర్భరం చేస్తోందన్నారు. దేశంలోని వామపక్ష విప్లవ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందన్న వాదనలు.. దోపిడీదారులూ, ప్రగతి నిరోధక శక్తులూ చేస్తున్న దుష్ర్పచారమని తోసిపుచ్చారు. భారతదేశంలో మావోయిస్టు పార్టీ గత దశాబ్ద కాలంలో పలు విజయాలు సాధించినప్పటికీ.. ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని.. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడిందని గణపతి ఈ ఇంటర్వ్యూలో అంగీకరించారు. మోదీ సర్కారు అభివృద్ధి నిరోధక విధానాలను, ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టడానికి.. మొత్తం ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, దేశభక్తి శక్తులన్నీ ప్రజల పక్షాన నిలవాలని.. పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. గణపతి ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ... ప్రశ్న: మావోయిస్టు పార్టీ ఈ పదేళ్లలో సాధించిన ప్రత్యేక విజయాలు ఏవి? గణపతి: మన దేశ విప్లవోద్యమ చరిత్రలో గత దశాబ్దకాలం సాటిలేనిది. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఏకైక మార్గదర్శక కేంద్రంగా ముందు నడవడంలో.. ఈ విప్లవానికి మూడు మంత్రదండాలైన పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలు ముందుకన్నా మరింత బలోపేతం కావడంలో.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి వాస్తవమైన ప్రజా స్వభావాన్నివ్వడంలో.. సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను నిర్మించడంలో.. ‘జల్, జంగల్, జమీన్, ఇజ్జత్, అధికార్’ వంటి సమస్యలపై విశాల ప్రజా సమూహాలను, రైతాంగాన్ని సమీకరించడంలో విలువైన అనుభవాలను గడించడం జరిగింది. ప్రశ్న: ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? వాటిని అధిగమించేందుకు గల అవకాశాలేమిటి? గణపతి: కొత్త పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ గ్రామ స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకూ అనేక మంది నాయకత్వాన్ని కోల్పోయాము. శత్రు దాడుల నుంచి పార్టీ వ్యూహాత్మక నాయకత్వాన్ని కాపాడుకోవటం ప్రధాన కర్తవ్యాల్లో మొదటిది. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడింది. ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసి, విస్తరించడం ఒక సవాలు. అయితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువాజీ, బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తుండటం, హిందూ ఫాసిస్టు అజెండాను వివిధ రూపాల్లో ముందుకు తీసుకుపోతుండటం వల్ల.. ప్రజాస్వామిక, పురోగామి, లౌకిక, దేశభక్త శక్తులన్నీ పోరాటంలో ఏకమయ్యేందుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. విప్లవ పురోగమనానికి అనుకూలంగా పెరిగిపోతున్న ఈ పరిస్థితులను వినియోగించుకుని గడ్డు పరిస్థితిని అధిగమించగలం. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలం. ప్రశ్న: పార్టీల విలీనం తర్వాత పీఎల్జీఏలోనూ, గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంలోనూ విస్తరించడంలోనూ పరిణామాత్మక మార్పు ఉండగా.. ఇప్పుడు మందకొడితనం కనిపిస్తోంది. దీనిని మళ్లీ వేగవంతం చేయడానికి, పురోగమింపచేయడానికి పార్టీ ఏం చేయబోతోంది? గణపతి: గత దశాబ్ద కాలంలో కొన్ని అద్భుత విజయాలను గెలుచుకున్నాం. అయితే.. 2011 నుంచీ మందకొడితనం కనిపిస్తోంది. విప్లవ ప్రతీఘాతక యుద్ధాన్ని తిప్పికొట్టడంలో.. విప్లవ శక్తులకు - విప్లవ ప్రతీఘాతక శక్తుల బలాలకు ఉన్న తేడా చాలా పెద్దది. ఈ ఎదురెదురు బలగాల బలాలలో ఉన్న తేడా వలన పార్టీ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడానికి అననుకూల పరిస్థితులు తలెత్తాయి. ఇది పార్టీ స్వీయ బలహీనతల దుష్ఫలితమే. ఉద్యమంలో ఆటుపోట్లు ఒక కొత్త పరిస్థితి ఏర్పడేందుకు దారితీస్తాయి. దీనిని అర్థం చేసుకొని.. పార్టీని, పీఎల్జీఏని, ప్రజానీకాన్ని సిద్ధం చేయడంలో పార్టీ నుంచి కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయి. కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో పార్టీకున్న లోపాల వల్ల నష్టాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు.. తప్పులనూ, బలహీనతలనూ గుర్తించి, పార్టీ, పీఎల్జీఏ ప్రజా ఉద్యమాల బోల్షెవీకరణకు పూనుకుంది. ప్రశ్న: పార్టీ ప్రధాన కార్యకలాపాలన్నీ ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమైపోవటం.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అటువంటి ప్రాంతాలకే తప్ప మొత్తంగా దేశానికి వర్తించదని కొందరు వాదిస్తున్నారు. దీనికి మీ స్పందన ఏమిటి? ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరిస్తారు? గణపతి: భారతదేశం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమాన అభివృద్ధి కలిగిన విశాలమైన అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం. ఈ అభివృద్ధిలోని అసమానతే దేశవ్యాప్తంగా ఏక కాలంలో విప్లవాన్ని లేదా సాయుధ తిరుగుబాటును చేసే అవకాశం లేకుండా చేస్తోంది. పెపైచ్చు పాలక వర్గాల చేతిలో శక్తివంతమైన కేంద్రీకృత రాజ్యంతో పాటు సుశిక్షితమైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన సైన్యంతో.. బలమైన అణచివేత యంత్రాంగం ఉంది. అందుచేత.. శత్రువు పరిపాలన అమిత బలహీనంగా ఉండే గ్రామీణ ప్రాంతం నుంచి విప్లవ యుద్ధాన్ని సాగించాల్సి ఉంటుంది. గత దశాబ్ద కాలంగా దండకారణ్యం, బీహార్ - జార్ఖండ్ గెరిల్లా జోన్లను గుండెకాయగా చేసుకొని ఉద్యమం ముందడుగు వేసింది. (విప్లవ పార్టీల) విలీనం జరిగిన గత దశాబ్ద కాలంలో గడించిన నూతన అనుభవాలు.. పార్టీ వెనుకంజ వేసిన ప్రాంతాల్లో తిరిగి ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టడానికి, బలహీనమైన ప్రాంతాల్లో తిరిగి బలం పుంజుకోవడానికి, అసలు పార్టీ ఉనికే లేని ప్రాంతాలకు విస్తరించడానికి సహాయపడతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీడిత ప్రజానీకంపై సానుకూల ప్రభావం చూపిన.. కళింగనగర్, సింగూర్, నందిగ్రామ్, లాల్గఢ్, నారాయణపట్న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వంటి ప్రజా తిరుగుబాట్ల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ప్రశ్న: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని కొందరు అంటున్నారు. చావెజ్ 21వ శతాబ్దపు సోషలిజం గురించి కొందరు ప్రచారం చేస్తున్నారు. నేపాల్ మావోయిస్టు పార్టీ ప్రజాయుద్ధ పంథాని వదిలివేసి పార్లమెంటరీ బాట పట్టిందంటున్నారు. ఈ వాదనలకు పార్టీ జవాబేమిటి? గణపతి: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని ఎలా చెప్పగలరు? మావో మరణం తర్వాత, ప్రపంచంలోని విప్లవ పోరాటాలన్నీ - అవి నూతన ప్రజాస్వామిక విప్లవాలు గానీ, జాతి విముక్తి పోరాటాలు గానీ - దీర్ఘకాలికమయ్యాయి. ఒక వర్గ రహిత సమాజం వైపు వెళ్లాలనే దృష్టికోణం లేకుండా.. ఉనికిలో ఉన్న శిథిల వ్యవస్థనే సంస్కరించే ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం లేదు. చావెజ్ నమూనా కేవలం సంస్కరణ మాత్రమే.. విప్లవం కాదు. రూపంలో గానీ, వస్తురీత్యా గానీ అది సోషలిజమే కాదు. చావెజ్ శ్రామిక వర్గానికీ, రైతాంగానికీ ప్రయోజనకరంగా ఉండేలా కొన్ని చర్యలు చేపట్టాడు. చమురు, కొన్ని ఇతర పరిశ్రమలను అనేక పరిమితులతో జాతీయం చేసినా.. భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం రూపుమాసిపోలేదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థతో వారు వేరు పడలేదు కూడా. కాబట్టి చావెజ్ పాలనలో ఆ దేశ వ్యవస్థలో వచ్చిన మౌలిక మార్పేమీ లేదు. ఇక.. నేపాల్లో పార్లమెంటరీ వ్యవస్థ అర్ధభూస్వామ్య విధానంపై ఆధారపడినదీ, సామ్రాజ్యవాద కాడి కింద నలుగుతున్నదీ. అటువంటి వ్యవస్థలో చేరిన ఎవరైనా విప్లవాన్ని వదిలివేయాల్సిందే. నూతన ప్రజాస్వామిక విప్లవంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినప్పటికీ.. యునెటైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు చెందిన ప్రచండ - భట్టారాయ్ ఆధునిక రివిజనిస్టు ముఠా ఈ రివిజనిస్టు మార్గాన్నే ఎంచుకుంది. లక్షలాది మంది ప్రజలకూ, వేలాది మంది అమరులకూ వారు నమ్మక ద్రోహం చేశారు. ఎప్పటివరకూ వెనుకబడిన దేశాల అర్థభూస్వామ్య వ్యవస్థ రూపం మారకుండా ఉంటుందో, ఎంతకాలం సామ్రాజ్యవాదం మన దేశం లాంటి దేశాలను తన క్రూరమైన పట్టులో బిగించి ఉంచి వాటిని స్వతంత్రంగా అభివృద్ధి చెందనీయదో.. అంతవరకూ విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా తప్ప మరో మార్గమే లేదు. ప్రశ్న: ‘వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవానికి మరింత అనువుగా మలుపు తిరుగుతోంది’ అని పార్టీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? గణపతి: వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవ పురోగమనానికి అద్భుతంగా ఉంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ‘మహామాంద్యం’ నాటి నుండి తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. విచ్చలవిడి లే-ఆఫ్లు, ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడం, నిరుద్యోగం, దారిద్య్రం ఒకవైపున.. శ్రామిక ప్రజానీకంపై తీవ్రతరమైన దోపిడీ, అణగారిన దేశాలూ, ప్రజలపై నయా వలసవాద దోపిడీ మరోవైపున కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక తొత్తులకూ వ్యతిరేకంగా విప్లవ, ప్రజాస్వామిక, జాతి విముక్తి పోరాట శక్తులు ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతున్నాయి. అయితే.. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ శక్తులు ఈ పరిస్థితిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని కొనసాగించి ఈ బలహీనతను అధిగమించగలమని చారిత్రక పాఠాలు నేర్పాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రివిజనిస్టు, సంస్కరణవాద శక్తుల అసమర్థత రుజువవుతుండటంతో.. ప్రజలు మావోయిస్టు శక్తులతో కలిసి ముందుకు సాగే అవకాశాలు పెరుగుతున్నాయి. అనేక దేశాలలో మావోయిస్టు పార్టీలు, సంస్థలు బలం పుంజుకుంటున్నాయి. కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భావ క్రమంలో ఉన్నాయి. మావోయిస్టు పార్టీల, సంస్థల, శక్తుల మధ్య ఐక్యత కూడా పెరుగుతున్నది. ప్రశ్న: ఎన్డీఏ అనుసరిస్తున్న విధానాలను, ఆర్ఎస్ఎస్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు పార్టీ ప్రణాళిక ఏమిటి? గణపతి: ఉదారవాద, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను యూపీఏ ప్రభుత్వాల కంటే వేగంగా, మరింత దూకుడుగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే సామ్రాజ్యవాదులు, దళారీ బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు.. మోదీ, బీజేపీలను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మోదీ ప్రభుత్వ నయా ఉదారవాద దుర్మార్గ విధానాలు ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వివిధ వర్గాల ప్రజల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తాయి. ముస్లిములపైనా హిందూ ఫాసిస్టు దాడులు మరింతగా పెరిగిపోతాయి. భూస్వామ్య, అభివృద్ధి నిరోధక శక్తులు బలం పుంజుకోవడంతో దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అణగారిన జాతులు మరింత పీడనకు గురవుతున్నాయి. ఇటువంటి విషయాలలో పార్టీ జోక్యం చేసుకుని ప్రజలను పోరాటాలలోకి సమీకరించాలి. దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడానికి, ఎండగట్టటానికి విశాల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక, దేశభక్త సంస్థలనూ, శక్తులనూ, వ్యక్తులనూ, ప్రజా సమూహాలనూ ఏకంచేసి బలమైన విశాల పునాదిగల ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా.. దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. ప్రశ్న: మావోయిస్టులను ఇప్పటికీ భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పుగా భారత రాజ్యం పరిగణిస్తోందని హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నొక్కి చెప్తున్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్ మూడవ దశను ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధమవుతోంది? గణపతి: 2009 మధ్య కాలంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో ప్రజలపై యుద్ధాన్ని ప్రారంభించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనినే మరింత దూకుడుగా, మరింత నిర్దాక్షిణ్యంగా కొనసాగిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆపరేషన్ గ్రీన్హంట్ మూడో దశ ప్రారంభమయింది. దీనిద్వారా.. మధ్య, తూర్పు భారతదేశ ప్రాంతాల్లో విప్లవోద్యమానికి దృఢమైన దుర్గాలను నాశనం చేయాలని శత్రువు చూస్తున్నాడు. అయితే.. వారు ఒక్క మావోయిస్టులనే టార్గెట్ చేయడం లేదు. ఈ యుద్ధం మొత్తం అణగారిన ప్రజలకు విస్తరిస్తుంది. యుద్ధ రంగం విస్తారమవుతుంది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సిద్ధాంతం, దేశాన్ని తెగనమ్మే మోడీ ప్రభుత్వ విధానాల మేళవింపైన శ్రతుదాడిపై రాజకీయంగా, మిలటరీ పరంగా ఎదురు దాడి చేయాలి. వీటి ప్రభావానికి గురయ్యే అన్ని వర్గాల వారితో ఏకమై ఈ దాడిని దృఢంగా ఎదుర్కొని ఓడించాల్సి ఉంది. ఈ పోరాటంలో కలిసేందుకు పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నా. -
దేశం కోసం ‘పరుగు’
కవాడిగూడ/ ఖైరతాబాద్, న్యూస్లైన్: యువత, విద్యార్థి లోకం దేశభక్తితో పులకించింది. స్వామి వివేకానంద చికాగో సభలో ప్రసంగించిన రోజును పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ఉత్సాహంగా సాగింది. స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ పరుగులో భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అయితే పరుగుకు ట్యాంక్బండ్పై అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలు, వివేకానంద అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల్లో లుం బినీ పార్కు వద్దకు తరలించారు. అంతకుముందు బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ విశిష్టతను వివేకానందుడు ప్రపంచానికి చాటిన రోజిదని దత్తాత్రేయ కొనియాడారు. సీనియర్ న్యాయవాది రామచందర్రావు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా సాగిన పరుగు నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ అరవిందరావు, ఆర్ఎస్ఎస్ నాయకులు శ్యాంకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రామకృష్ణమఠం స్వామి జ్ఞానానందమయ పాల్గొన్నారు.