breaking news
paranormal investigator
-
ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?
అన్నాబెల్లె.. ది కంజూరింగ్ సిరీస్ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్లు చేయబోయి ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.అమెరికాలో కనెక్టికట్ స్టేట్లోని న్యూఇంగ్లండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్(NESPR) వాళ్లు.. డెవిల్స్ ఆన్ ది రన్ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్ బొమ్మతో డాన్ రివెరా(54) అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.పెన్సిల్వేనియా గెట్టిస్బర్గ్ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది. ఎన్ఈఎస్పీఆర్ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లారాయిన్ వారెన్లు స్థాపించారు. డాన్ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్ఈఎస్పీఆర్తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్ వారెన్కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్లో మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్ఫ్లిక్స్ ‘28 డేస్ హాంటెడ్’ అనే సిరీస్లోనూ కనిపించారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్టాక్లో ఆ బొమ్మ షార్ట్ వీడియోస్ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్ఈఎస్పీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్ ఆన్ ది రన్ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.కొన్నాళ్ల కిందట లూసియానా టూర్లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్మెంట్లోని కలెక్షన్లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది. మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్ స్టేట్లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్ హాంటెడ్ డాల్గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్ సినిమాలు తెరకెక్కాయి.Annabelle Handler Dan Rivera Dies Suddenly During Haunted Tour, RIP #annabelle #annabelledoll #edwarren #lorrainewarren #paranormal #riristea #rivetsoro pic.twitter.com/6Ya3WM6K03— Rivet Soro (@Rivet_Soro) July 15, 2025 -
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్
హాంట్స్, ఇంగ్లండ్ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్నెస్ ట్రైనర్కు షాక్ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. హాంట్స్లో సెయింట్ మెరీ చర్చ్ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు. అయితే, ఫెర్గూసన్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దెయ్యం దెబ్బకు ఫిట్నెస్ ట్రైనర్కు షాక్
-
ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.