-
ఒక్క ఓటమి.. సీఎం కుర్చీ దూరం
తుమకూరు: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న నియోజకవర్గాల్లో తుమకూరు జిల్లాలోని కొరటగెరె ఒకటి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, కొరటగెరె జేడీఎస్ ఎమ్మెల్యే సుధాకర్లాల్లు ఈసారి కూడా ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగనుండడంతో కొరటగెరె ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2013 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో పరమేశ్వర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.కొరటగెరె నియోజకవర్గంలో విజయం తమదేనన్న ధీమాతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో జేడీఎస్ అభ్యర్థి సుధాకర్లాల్ 18 వేల ఓట్ల మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు. ఈ ఓటమి పరమేశ్వర్ ఆశలను చిదిమేసింది. చేతికి అందిన ముఖ్యమంత్రి పీఠాన్ని నోటికి అందకుండా చేసింది. దీంతో కొరటగెరె నియోజకవర్గంలో విజయంతో పాటు కలలు కన్న ముఖ్యమంత్రి పీఠం కూడా దూరమవడంతో ఎమ్మెల్సీ కోటాలో హోంమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుమారు ఏడాది కిదంట ఆ పదవిని కూడా వదులుకున్నారు. పట్టు పెంచుకుంటున్న పరమేశ్వర్ పరమేశ్వర్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రత్యర్థి సుధాకర్లాల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో చేసిన తప్పును పునరావృతం చేయకుండా గత రెండు నెలలుగా కొరటగెరెలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హోంమంత్రిగా ఉండగా కొరటగెరె నియోజకవర్గం అభివృద్ధి కోసం పరమేశ్వర్ ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు విడుదల చేయించడంలో సఫలీకృతులయ్యారు. నియోజకవర్గంలో ఏకలవ్య పాఠశాల, కేఎస్ఆర్పీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగలిగారు. తరచూ పల్లె నిద్రలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. త్రిముఖ పోటీ కలకలం అయితే గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత తమ పార్టీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థిని బరిలో దించకపోవడంతో కేవలం కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. అయితే ఈసారి కాంగ్రెస్,జేడీఎస్లతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన బీజేపీ నేత హుచ్చయ్య పోటీలో ఉంటారని వార్తులు వస్తుండడంతో కొరటగెరెలో త్రిముఖ పోటీ తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర వర్గాలూ ప్రధానమే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.97లక్షలు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లు 60వేలు ఉండగా లింగాయత్లు ఓట్లు 40వేలు, ఒక్కళిగల ఓట్లు 30వేలు ఉన్నాయి. ఇక ముస్లింలు, కురుబలు, గొల్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 50వేల వరకూ ఉండగా, మిగిలిన వర్గాల ఓట్లు పదివేల లోపు ఉన్నాయి. త్రిముఖ పోటీ భయంతో ముగ్గురు నేతల తమ సామాజిక వర్గాల ఓట్లతో పాటు గెలుపోటములపై ప్రభావం చూపగలిగే లింగాయత్, ఒక్కళిగల ఓటర్లపై కూడా దృష్టి సారించారు. -
యోగి.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు, విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నోరు అదుపులో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. మంగళవారం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అవినీతి పెరిగిపోయిందని అందుకు సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి చేసిన ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. దేశంలో అవినీతిలో, నేరాల్లో మొదటిస్థానంలో నిలిచే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమేనన్న విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ విస్మరించారని పేర్కొన్నారు. ముందు యూపీలో అవినీతి, నేరాలను అదుపు చేసిన తర్వాత యోగి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులపై విమర్శలు చేయాలంటూ హితవు పలికారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి బాధపడ్డ యోగికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే జాతీయ బ్యాంకుల్లో రాష్ట్ర రైతుల రుణాలను మాఫీ చేయించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం సిద్దరామయ్య మతం, ఆహారపు అలవాట్లపై హిందూ యువతను రెచ్చగొడుతూ మతవిద్వేషాల వైపు వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. సిద్దరామయ్యతో పాటు తాము కూడా హిందువులేమనని అయితే తాము అన్ని మతాలు, వర్గాల ప్రజలను సమానదృష్టితోనే చూస్తామని బీజేపీ నేతల్లా తాము ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టలేదన్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అక్కడి హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సందర్భాలను బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. చివరికి పర్తివర్తన ర్యాలీలో తాము చేయబోయే అభివృద్ధి గురించి కాకుండా కేవలం మత ఘర్షణల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారంటూ విమర్శించారు. చావులపై కూడా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్రావ్ హత్య వెనుక బీజేపీ కార్పొరేటర్ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలోనే ఈ విషయం పోలీసుల విచారణతో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్నారు. -
తెరపైకి దళిత గళం
ఉన్నత పదవుల కోసం ఢిల్లీకి ఆశావహులు సోనియాను కలిసిన మునియప్ప కేపీసీసీ చీఫ్ కోసం యత్నాలు మంత్రి పదవి కోసం మోటమ్మ కూడా బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో దళిత గళం ప్రతిధ్వనిస్తోంది. అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలో ఉన్నత పదవులు దక్కించుకోవ డానికి ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుపుతుండగా మరికొం త మంది దళిత నాయకులకు కీలక పదవులు దక్కాల్సిందేనంటూ బహిరంగంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జీ పరమేశ్వర్ పదవీకాలం కూడా ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో కేపీసీసీ అధ్యక్షస్థానానికి కూడా నూతన నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు సరైన పదవులు దక్కలేదన్న విషయం ఆ పార్టీకి చెందిన నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు. దీంతో పదవుల పంపకాలకు సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలోని దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సదరు పదవులను దక్కించుకోవడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్... పార్లమెంటు సభ్యుడైన కే.హెచ్ మునియప్ప గత శాసనసభ ఎన్నికల సమయంలోనే కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే చివరికి ఆ పదవి పరమేశ్వర్ను వరించింది. అయితే ప్రస్తుతం పరమేశ్వర్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తిరిగీ ఆ పదవి కోసం కే.హెచ్. మునియప్ప తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీలో ఆమె నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు కేపీసీసీ పదవి ఇవ్వాలని అభ్యర్థించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ‘దళిత సీఎం’ ఆవశ్యకత తదితర విషయాలను కూడా కే.హెచ్ మునియప్ప ‘మేడం’కు వివరించారు. భేటీ అనంతరం మునియప్ప మీడియాతో మాట్లాడుతూ...‘నేను ఏడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. సీనియర్ నాయకుల మద్దతు నాకే ఉంది. అందువల్ల నాకు కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందిగా హైకమాండ్ను కోరాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కేపీసీసీ పదవి అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని సోనియాగాంధీ తెలిపారు. ఆ పదవి నాకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నా.’ అని పేర్కొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, మాజీ మంత్రి మోటమ్మ కూడా సోనియాగాంధీని బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యి మంత్రి మండలిలో తనకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. -
డీకే రవి మృతిపై సీబీఐకి లేఖ
కృష్ణరాజపురం : దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిజానిజాలు వెలికితీయాలని సీబీఐకి లేఖ రాస్తానని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్.జీ. పరమేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వసతి కోసం కృష్ణరాజపురంలో రూ.69 కోట్లతో చేపట్టిన 360 గృహాల నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే రవి ఎలా చనిపోయాడో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆనందరావ్ సర్కిల్లో ధర్నా చేపట్టిన అతని తల్లిదండ్రులను తాను పరామర్శించానని, రవి మృతిపై నిజాన్ని బయట పెట్టాలని వారు కోరారన్నారు. ఈ విషయంపై దర్యాప్తు వేగవంతం చేయాలని తాను సీబీఐకి లేఖ రాస్తానన్నారు. బెంగళూరు నగరంలో ఇళ్లు లభించక పోలీసు సిబ్బంది నానా పాట్లు పడుతున్నారన్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు సీఎం సిద్ధరామయ్య పోలీసు గృహ 20-20 పథకాన్ని ప్రవేశపెట్టి 11వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే 3వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పోలీసులకు అప్పగించామన్నారు.ఈ యేడాది చివరి నాటికి మరో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేలా సీఎంకు విన్నవిస్తామన్నారు. ఇటీవల మినీ విధానసౌధ ముట్టడికి వచ్చిన రైతులను చెదరగొట్టారు తప్పితే లాఠీచార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలో 2800 మంది పోలీసు సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణరాజపురంలో కూడా పోలీసు సిబ్బందికొరతన నివారిస్తామన్నారు. కృష్ణరాజపురంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఢిల్లీకి రండి !
బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయమై మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో సమావేశమయ్యారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పరమేశ్వర్కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దసరా పండుగ అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటన కంటే ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్తో చర్చించనున్నారు. కాగా, ఇదే సందర్భంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్కు సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు దిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నుంచి పరమేశ్వర్కు పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎస్.ఎం.కృష్ణతో భేటీ... కాగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఉదయమిక్కడి ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకున్న పరమేశ్వర్ మంత్రి వర్గ విస్తరణతో పాటు తన ఢిల్లీ పయనంపై చర్చించారు. ఎస్.ఎం.కృష్ణతో, జి.పరమేశ్వర్ భేటీ కావ డం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్తో చర్చించేందుకు గాను ఎస్.ఎం.కృష్ణ సైతం ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో పరమేశ్వర్, ఎస్.ఎం.కృష్ణల భేటీపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సమావేశం అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ....ఎస్.ఎం.కృష్ణతో తాను సమావేశం కావడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు. కేవలం ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు మాత్రమే తాను వచ్చానని చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి హైకమాండ్దే తుది నిర్ణయమని పరమేశ్వర్ తెలిపారు. ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులుతీరిన ఆశావహులు... ఇక మంత్రి వర్గ విస్తరణ తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో స్థానాన్ని ఆశించే ఆశావహులంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులు తీరారు. తమకు మంత్రివర్గంలో స్థానం ఇప్పించాల్సిందిగా సిఫార్సు చేయాలని కోరేందుకు వీరంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసేందుకు అంటూ ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా, ఎస్.ఎం.కృష్ణను కలిసిన ఆశావహుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సైతం ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement