‘పారాలీగల్స్’తో పేదలకు సత్వర న్యాయం
ఎన్ఆర్ఎల్ఎం డైరె క్టర్ విజయ్
నల్సార్లో ముగిసిన జాతీయ సదస్సు
శామీర్పేట్: భూ వివాదాలకు సంబంధించి పేదవర్గాలకు న్యాయసహాయం అందించడంలో పారాలీగల్స్ పాత్ర కీలకమైనదని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) డైరె క్టర్ టి.విజయ్కుమార్ అన్నారు. ‘భూ సమస్యలు-సహాయ సంస్థలు’ అంశంపై నల్సార్ యూనివర్సిటీ, ల్యాండెసా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండురోజుల జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. గతంలో తాను పారాలీగల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు భూ సమస్యలను పరిష్కరించామన్నారు.
సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పారాలీగల్స్ వలంటీర్లు, న్యాయనిపుణులు హాజరయ్యారు. ల్యాండెసా కంట్రీ డెరైక్టర్ సంజయ్ పట్నాయక్, స్టేట్ డెరైక్టర్ సునీల్ కుమార్, నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. బాలకృష్ణారెడ్డి, హన్స్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ టి.భాస్కర్రావు, సీనియర్ పాత్రికేయుడు అశోక్, లీగల్ కో ఆర్డినేటర్స్ ఎ.శ్రీకాంత్, డి.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.