-
ఇంటి కుళాయికి బిరడా
మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే. తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్ మాట్లాడుతుండడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్మెన్ను పంపి కాపరి ఫోన్ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తోంది. -
అందని గౌరవం!
సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా.. వీరికి చెల్లించాల్సిన 13 నెలల గౌరవ వేతనాలు అందలేదు. నెలకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.65 వేలు రావాలి. ఇలా జిల్లాలోని 367 మందికి సంబంధించి రూ.2.38 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణ ఖజానాలో తమకు ఇవ్వాల్సిన డబ్బులకు తావు లేకుండా పోతోందని తాజామాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. సాక్షి, వికారాబాద్: ‘గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచులకు ఇంత తక్కువ గౌరవ వేతనాలు ఇవ్వడమేంటీ?. గత ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేశాయి. గ్రామస్థాయిలో పరిపాలన సక్రమంగా, నిజాయతీగా ఉండాలంటే సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచాల్సిందే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవవేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది’ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో చెప్పిన మాటలివి. ఈ మేరకు సర్పంచ్లకు గౌరవ వేతనాలను పెంచుతూ 2015 ఏప్రిల్ 1వ తేదీన ప్రభుత్వం జీవోనెం.53 జారీచేసింది. నెలకోసారి వేతనాలిస్తామని ప్రకటించింది. కానీ ఏప్పుడూ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాలోని 367 జీపీల సర్పంచ్లకు రూ.2,38,55,000 బకాయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్కు నెలకు రూ.5 వేల చొప్పున 13 నెలలకుగాను రూ.65 వేలు రావాల్సి ఉంది. గౌరవ వేతనాలను విడుదల చేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని జిల్లాలోని తాజామాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన జీతాలు... జిల్లాలోని 18 మండలాల్లో 367 పంచాయతీలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో సర్పంచులకు అతి తక్కువ వేతనాలుండేవి. జిల్లా పరిషత్చైర్మన్కు రూ.7,500, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2,250, మండల పరిషత్ అధ్యక్షునికి రూ.1,500, ఎంపీటీసీకి రూ.750 అందజేసేవారు. ఇక సర్పంచుల విషయానికొస్తే మేజర్ పంచాయతీలకు రూ.1,500, మైనర్ జీపీల సర్పంచులకు రూ.1,000 ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అతితక్కువ గౌరవ వేతనం ఉండటాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వీరి వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన 1.4.2015న వేతనాల పెంపును సవరించే విధంగా జీవోనెం.53ను విడుదల చేశారు. దీంతో వారి వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్కు రూ.లక్ష, జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.10 వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచులకు రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం వెలువర్చింది. గ్రామపంచాయతీల అకౌంట్లో జమచేస్తే తీసుకునే అవకాశాన్ని సర్పంచులకు కల్పించారు. ఈ వేతనాలను నెలనెలా ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సర్కారు మొదట్లో నాలుగైదు నెలలకోసారి ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం గతనెలాఖరు వరకు 13నెలల బకాయలు తమకు రావాల్సి ఉందని సర్పంచులు పేర్కొంటున్నారు. 2017 సంవత్సరం జూన్ నెలవరకు వరకు వేతనాలిచ్చారు. 2017 జూలై నుంచి ఈనెల (జూలై) 2018 వరకు 13 నెలల బకాయలు ఉన్నాయి. జిల్లాలో 367 గ్రామపంచాయతీల సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున ఈనెలాఖరు వరకు బకాయలు జిల్లా వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులకు 2,38,55,000 ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ముగిసినప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదని సర్కారుపై అసంతప్తితో ఉన్నారు. ఇటు పర్సన్ ఇన్చార్జులుగా నియమించలేక అటు గౌరవ వేతనాలు ఇవ్వక తమను అవమానపరిచారని వారు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తాజా మాజీ సర్పంచులలో అధికశాతం మంది పేద, మధ్య తరగతివారే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా సర్పంచుల సంఘం విజ్ఞప్తిచేస్తోంది. -
చనిపోయిన వారినీ వదలలేదు..
అట్లూరు: అధికారపార్టీ నాయకుల కబ్జాలు, కుంభకోణాలు, తదితర ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోవడం ఒక ఎత్తయితే.. వారి అండదండలతో మేమేం తక్కువ అంటూ చనిపోయినవారి, కువైటుకు వెళ్లినవారిపేర్లమీద వృద్ధాప్య, వితంతు పింఛన్లు లక్షల రూపాయల్లో పంచాయితీ కార్యదర్శులు స్వాహా చేసిన ఉదంతం అట్లూరు మండలంలో చోటుచేçసుకుంది. ఈవిషయం సామాజిక తనికీ బృంధం వెల్లడించినప్పటికీ తమ పలుకు బడిని ఉపయోగించుకుని బయటికి పొక్కకుండా చేతివాటం ప్రదర్శించారు. మండల పరిదిలోని తంభళ్లగొంది, కుంభగిరి, కొం డూరు, మాడపూరు పంచాయితీలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తంభళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి గ్రామానికి చెందిన కె, వెంకటమ్మ ఐడీ నెంబరు 111450179తో వృద్ధాప్య పించన్ ప్రతినెలా రూ.1000 తీసుకుంటూ ఉండేది. ఆమె 24–3–2015 లో మృతి చెందింది. ఆమె బ్రతికి ఉన్నట్లు ప్రతి నెలా తన వేలిగుర్తుతో పంచాయతీ కార్యదర్శి రూ,27వేలు స్వాహా చేశాడు. ఎరుకుల కాలనీకి చెందిన నామాల లక్ష్మిదేవి కి భర్త చనిపోవడంతో ఐడీ నెంబరు 111545324తో వితంతు పింఛన్ ప్రతి నెలా రూ.100 తీసుకుంటూ ఉండేది. 2014లో జీవనోపాధికోసం కువైట్ వెళ్లింది. అప్పటినుండీ ప్రతినెలా ఆమె పేరున సంబంధిత పంచాయతీ కార్యదర్శి స్వాహా చేయడం జరగింది. ఈమె కువైటు నుంచి ఈనెల 15వ తేదీన వచ్చింది. పింఛన్ గురించి అడగగా నాకు తెలియదు అన్నారు. యర్రబల్లి ఎస్సీకాలనీకి చెందిన కొట్టూరు నరసమ్మ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఈమె పేరున ప్రతినెలా రూ.1000 చొప్పున ఇంతవరకు రూ,29వేలు స్వాహాచేయడం జరిగింది. అలాగే మాడపూరు పంచాయితీ పరిదిలో ఎం. లక్షుమ్మ, సుబ్బమ్మ, గురమ్మ, చిన్నక్క వీరు గ్రామంలో లేనప్పటికీ వారి పేర్ల మీద సంబందిత పంచాయతీ కార్యదర్శి రూ,18వేలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తాం: సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా చనిపోయిన వారిపేర్ల మీద, కువైటుకు వెళ్లిన వారిపేర్లపై పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఉధంతంపై సాక్షి ఎంపీడీఓ రెడ్డెయ్యనాయుడును వివరణ అడుగగా విచారించి చర్యలు తీసుంటామని తెలిపారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
-
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
- నిజాంపేట, భండారి లేఔట్లో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు - హెచ్ఎండీఏ పరిధిలో 1,750 అక్రమ నిర్మాణాలున్నట్టుగా గుర్తింపు - ఇప్పటికే అందరికీ నోటీసులు జారీ.. దశలవారీగా కూల్చివేత షురూ - నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, అనధికారిక లేఔట్లపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎం డీఏ) ఉక్కుపాదం మోపుతోంది. నెలరోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి 15 రోజుల పాటు ముంపులో చిక్కుకున్న నిజాంపేటలోని బండారి లేఔట్లోని అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. తొలుత నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఐదు అంతస్తుల ఏడు భవనాలు, 20 గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను మంగళవారం కూల్చివేశారు. మరో 20 రోజుల్లో ఇక్కడ ఉన్న వందకుపైగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని అధికారులు చెబుతున్నారు. 252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత.. పటాన్చెరువు మండలం కిష్టారెడ్డిపేట గ్రామం, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామం, అబ్దుల్లాపూర్మెట్, ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల, పోచారం, నిజాంపేట, బడంగ్పేట్, ఇబ్రహీంపట్నంలోని 42 అక్రమ నిర్మాణాలు, 11 అనధికారిక లేఔట్లను అధికారులు కూల్చివేశారు. స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా పోలీసుల సహకారంతో జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఏ సిబ్బంది కూల్చివేస్తోంది. నెలరోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్ల నిర్మాణాలను ధ్వంసం చేశారు. శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా విరామం ఇచ్చినా, మంగళవారం నుంచి మళ్లీ స్పెషల్ డ్రైవ్ మొదలుకావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో 1,759 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించి.. వారందరికీ హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకున్నా.. అపార్ట్మెంట్కు వచ్చి తనిఖీలు చేసే సమయంలో అనుమతులు లేవని తెలిసినా కూల్చివేసే ఆస్కారముంది. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆదిబట్ల, కుందుకూరు, పెద్దఅంబర్పేట, బాచుపల్లి, బీబీనగర్, అన్నంపట్ల, బ్రాహ్మణపల్లి, చెంగిచెర్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ప్రగతినగర్, తూప్రాన్, కేతిరెడ్డి పల్లి, భూదాన్ పోచంపల్లిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి పేరిట వెలసిన పటాన్చెరువు, అమీన్పూర్, ఘట్కేసర్, మొయినాబాద్, చిలుకూరు, ప్రగతినగర్, బాచుపల్లిల్లో అక్రమ నిర్మాణాలపై సైతం కొరడా ఝళిపించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు.. వరద ముంపునకు గురైన బండారి లేఔట్లో మళ్లీ అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం.. దీనిపై పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం.. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిజాంపేటలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ దృష్టి కేంద్రీకరించింది. నిజాంపేటలోని శ్రీనివాస్నగర్లో 12 విల్లాలను అధికారులు కూల్చివేశారు. అయితే ప్రతి అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అనుమతులు తనిఖీ చేసి, నోటీసు ఇవ్వకున్నా కూల్చివేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement