breaking news
The Pakistan Cricket Board
-
బహిష్కరిస్తే మనకే నష్టం
పీసీబీకి వసీం అక్రమ్ సూచన కరాచీ: భారత్తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్పై నాన్చుడు ధోరణికి నిరసనగా వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ను బాయ్కాట్ చేయాలనే ఆలోచన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మానుకోవాలని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించారు. ‘పాక్తో ఆడాల్సిన సిరీస్పై నిర్ణయం కోసం భారత్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్న విషయం నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ జరగకపోయినా భవిష్యత్లో కచ్చితంగా ఉంటుంది. భారత్లో జరగాల్సిన టి20 ప్రపంచకప్ను బహిష్కరించే ఆలోచన పీసీబీ మానుకోవాలి. ఎందుకంటే అది ఐసీసీ ఈవెంట్. ఎట్టి పరిస్థితిలోనైనా అందులో పాల్గొనాల్సిందే. అదే జరగకపోతే భవిష్యత్ లో మనకే నష్టం. రెండు జట్ల మధ్య సిరీస్లు జరిగినా జరగకపోయినా ఉగ్రవాదం మాత్రం అంతరించదు’ అని అక్రమ్ తేల్చి చెప్పారు. -
బీసీసీఐ పశ్చాత్తాపం: పీసీబీ
కరాచీ: తమతో చర్చలు అనివార్య కారణాల రీత్యా రద్దయినందుకు బీసీసీఐ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఈమేరకు బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నుంచి తమకు లేఖ అందిందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘చర్చలు రద్దయినందుకు వారు తమ అశక్తతను వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపపడ్డారు. అలాగే ద్వైపాక్షిక సిరీస్ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కూడా చెప్పారు. దీంతో డిసెంబర్లో జరిగే ఈ సిరీస్పై నమ్మకం కుదరుతోంది. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని ఖాన్ తెలిపారు.