breaking news
padma shri awards 2026
-
పశువైద్యంలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయం
పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు. తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్డీడీబీ యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉన్నాయి.స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి ‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. -
విరిసిన సేద్య పద్మాలు!
వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్ కుమార్ సింగ్ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్ డా. పి.ఎల్. గౌతమ్ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్లర్ డా. కె.రామస్వామి (క్లైమేట్ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ డా. జి.ఎల్. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), జోగేష్ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.మాక్స్ చట్టం రూపశిల్పి రామారెడ్డితెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్పంచ్గా, రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంపీసీఎస్)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మాక్స్) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. దూరదృష్టి గల నేత: ఎన్డీడీబీసహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్డీడీబీ ఆకాంక్షించింది.శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్ టెక్నిక్ ప్రత్యేకత. పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) లాడ్ టెక్నిక్లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్ ప్రకటించింది.రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్)మొరాదాబాద్ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్ సింగ్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.జోగేష్ డ్యూరి (అస్సాం)ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. -
నృత్య సేవే దైవారాధన
‘సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు శాస్త్రీయ నృత్యం ద్వారా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను’ అని చెప్పారు తెలంగాణ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ కళాకారిణి ఐదున్నర దశాబ్దాలుగా నృత్య సేవ చేస్తున్నారు. దీపికారెడ్డి చేస్తున్న కృషికి ఈ యేడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ కళా సేవ గురించి తమ జీవన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు..పాశ్చాత్య హోరులో మునిగిపోతున్న మన చిన్నారులకు, యువతకు మన దేశ నృత్య కళలు తెలియాలి. కళలకు గుర్తింపు లభించి, ఇలాంటి అవార్డులు రావడం ద్వారా రాబోయే తరాలకు ప్రేరణ కలిగిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక క్రమ శిక్షణ అలవడుతుంది. మెదడు చురుకుగా, శక్తిమంతం అవుతుంది. నృత్యం ద్వారా వచ్చే మనశ్శాంతి, సంతోషం మనల్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. మా విద్యార్థుల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. నృత్య ప్రదర్శనల్లోనూ పాల్గొంటారు. ఇందులో ఒక టీమ్ వర్క్ ఉంటుంది. అందరి ప్రోత్సాహంతో...నాలో ఈ నాట్య తపనను వెలిగించింది మా అమ్మ రాధికారెడ్డి. తను భరతనాట్య నృత్యకారిణి. ఆమె 1961లో రవీంద్రభారతి ప్రారంభోత్సవానికి చిత్రాంగద బ్యాలె ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అమ్మ సాధనను చూసి, నేనూ స్ఫూర్తి పొందేదాన్ని. నాట్యంపై నాకున్న ఆసక్తి గమనించిన అమ్మ నాచేత గజ్జె కట్టించారు. అలా అమ్మ మొదటి గురువు, ఆ తర్వాత నాట్యంలోని మెళకువలతో ముందుకు తీసుకెళ్లింది గురువు సుమిత్ర కౌశల్. అటు నుంచి ఎంతో మందిని నృత్యకారులుగా తీర్చిదిద్దిన వెంపటి చినసత్యంగారు గురువుగా లభించడం నాకు ఓ వరం. 1976లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు వంటి ప్రముఖులు కూచిపూడి నృత్యానికి టార్చ్బేరర్ అని ప్రశంసించారు. పదకొండేళ్ల వయసులో పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా అదృష్టమే. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. నాన్న వి.ఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో అందరికీ శాస్త్రీయ నృత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. అలా వారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. పెళ్లి తర్వాత నా భర్త శ్యామ్గోపాల్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. పిల్లలు అభినవ్, శ్లోక పుట్టిన తర్వాత కూడా నృత్యం చేస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ నుంచి నృత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటే నా కూతురు శ్లోక కూడా మా బాటలోనే నడిచింది. అలా మూడుతరాల శాస్త్రీయ నృత్యకారులు మా ఇంట్లో ఉన్నారు. మూడు తరాల నృత్యంమహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజునే గంగా పండాల్లోని పెద్ద స్టేజీపైన ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివ సతీయం, గంగావతరణం కథలను దాదాపు గంటసేపు నా కూతురు శ్లోకారెడ్డి, శిష్యబృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చాను. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్యసేవలో ఉండటం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులు శాస్త్రీయ నృత్యకారులుగా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్నారు. నృత్యసేవ అంటే భగవంతుని ఆరాధనే. దేవాలయాల వద్ద, వేదికలపైన నృత్యప్రదర్శనలు ఇస్తున్నప్పుడు దివ్యానుభూతికి లోనవుతుంటాం. ఎంతో మంది ఆ ఆనందంలో మమేకం అవుతుంటారు. ప్రదర్శన తర్వాత కలిసి తమ అనుభూతిని తెలియజేసిన వారెందరో. మొదటి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు చూపిన ఎంతోమంది చూపిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి గౌరవం అందుకునేలా చేసింది’’అని ఆనందంగా వివరించారు ఈ నృత్యకళాకారిణి. సామాజిక అంశాలపై సందేశంఅభినయం అనేది నాటి సినిమా నటీనటుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు నృత్యం నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. కూచిపూడి నృత్యం అనగానే చాలామంది పౌరాణిక గాథలు అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ, ప్రతి నెలా ఒక సామాజిక అంశంతో కొత్త కాన్సెప్ట్ని తీసుకుంటాం. అందులో యువతరపు ఆలోచనలనూ ముందుకు తీసుకువస్తున్నాను. దీంట్లో భాగంగా పర్యావరణం, పర్యాటకం, హ్యాండీక్రాఫ్ట్స్, మహిళల సమస్యలు, మన సంస్కృతికి వన్నెతెచ్చే అంశాలు తీసుకుంటూ సందేశాత్మకంగా ప్రేక్షకుల ముందుకు నృత్యరూపకంగా తీసుకువచ్చాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఎలా పొందవచ్చు అనేవి నృత్య రూపకం ద్వారా చూపించగలిగాను. – నిర్మలారెడ్డి -
అసామాన్య పద్మాలు
జీవితంలో పెను సవాళ్లు నడవాలనుకున్న మార్గంలో ఎదురుగాలులు... అయినా వాళ్లు ఆగలేదు... ముందుకు సాగారు. సవాళ్లను సోపానాలుగా చేసుకున్నారు. అందుకే వారికి నేడు జాతీయ గౌరవంగా ‘పద్మశ్రీ’ దక్కింది. అస్సాం గాయని పోఖిలా లెఖ్తెపి, యాసిడ్ ఆటాక్ను ఎదుర్కొని ప్రొఫెసర్గా స్ఫూర్తినిస్తున్న మంగళా కపూర్ల జీవన విశేషాలు.పోఖిలా లెఖ్తెపి కొండ మీద తేనె పాటకొండలకు పాటలు తెలుసు. కొండలు పాడతాయి. కాని వాటిని గొంతులో నింపుకుని జనానికి పంచేవారే కావాలి. అలాంటి కొండ మీద తేనె పాటే పోఖిలా లెఖ్తెపి. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా ‘స్వరాల రాణి’గా పేరుగాంచిన పోఖిలా లెఖ్తెపికి ‘పద్మశ్రీ’ ప్రకటించడం కొంచెం ఆలస్యమైనట్టే. ఆ మాటకొస్తే ఈ 72 ఏళ్ల జానపద గాయనికి ఈ గౌరవాలు, సత్కారాలు ఏమీ పట్టవు. పాట పాడటమే ఆమెకు తెలుసు. పాట వినిపించడమే ఆమె జీవితం.తండ్రి వద్ద పాటలు నేర్చుకొని..అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్ టిముంగ్ గ్రామంలో పోఖిలా జన్మించారు. తండ్రి ముఖిమ్ లేక్తే, తల్లి బాస్డే టిముపి బాగా పాడతారు. ముఖిమ్ లేక్తే ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే నాటకాలలో సంగీతం అందించేవారు. అలా పోఖిలా చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితురాలైంది. బడిలో ప్రతి శనివారం పాటల పోటీ తండ్రి వద్ద పాటలు నేర్చుకుని పాడితే ప్రెయిజులన్నీ ఆమెకే. ఆ ఉత్సాహంతో తనే సొంతంగా పాటలను స్వరపరచడం ప్రారంభించారు. 1976లో డిఫులో జరిగిన కర్బీ యువజనోత్సవంలో పాడినప్పుడు మొత్తం అస్సాంకు ఆమె పాట తెలిసింది. 1978 నాటికి ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆకాశవాణి గౌహతిలోని కర్బీ శాఖ డైరెక్టర్ ఆమెకు రేడియోలో పాడే అవకాశాన్ని కల్పించారు. కర్బీ భాషలో కొత్త శైలి...పోఖిలా పాడే సమయానికి కర్బీ భాషలో ఆధునిక పాటలు లేవు. పోఖిలా కర్బీ భాషలో మొదటి క్యాసెట్ ‘కాంగ్హోన్’ విడుదల చేశారు. అనంతరం జుబీన్ గార్గ్ సహా అస్సాంకు చెందిన పలువురు కళాకారులతో కలిసి ఆమె పాటలు పాడారు. ఇప్పటి వరకు 300కి పైగా పాటలు పాడారు. కర్బీ పాటలకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ తీసుకురావడంలో ఆమె కృషి విశేషమైనది. కర్బీ సంగీతానికి ఆమె చేసిన సేవకు గాను 2011లో హిల్స్ ఐడల్ ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ బిరుదుతో సత్కరించింది. 2023 అస్సాం ప్రభుత్వం ఆమెకు శిల్పి అవార్డుతోపాటు శిల్పి పెన్ష¯Œ ను ప్రదానం చేసింది. 2024లో అస్సాంలో మూడో అత్యున్నత ΄ûర పురస్కారమైన ‘అస్సాం గౌరవ్’ అవార్డును అందించింది. కర్బీ ఆంగ్లాంగ్ వంటి మారుమూల ప్రాంతానికి చెందిన తనలాంటి గాయనిని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం సంతోషకరమైన విషయం అని ఆమె అంటున్నారు.మంగళా కపూర్ యాసిడ్ దాడిని పాటతో ఓడించారుయాసిడ్ దాడి పిరికివాళ్ల చర్య. దానిని ఎదుర్కొని ఎదగడం స్థైర్యవంతుల లక్షణం. ప్రయాణం ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు గొప్ప ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టారు మంగళా కపూర్. సంగీత సాధన చేసి సంగీత విద్వాంసురాలిగా మారారు. ‘పద్మశ్రీ’ వరకూ ఎదిగారు. ఇది అసాధారణ కథ. స్ఫూర్తి గాథ.గ్వాలియర్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయని మంగళా కపూర్ 1965లో యాసిడ్ దాడి ఎదుర్కొన్నారు. అప్పటి వరకూ అద్భుతమైన తన కంఠంతో ఆమె ‘కాశీ లతా మంగేష్కర్’గా గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఎన్నో కలలు కంటూ ఉండగా యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరు సంవత్సరాలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అయినా కుంగిపోలేదు. ఆ సమయంలో కూడా చదువును కొనసాగించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత విద్య పూర్తి చేశారు. అక్కడే ప్రొఫెసర్గా నియమితులయ్యారు. మంగళా కపూర్ సంగీతం ప్రొఫెసర్ మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఆమెకు అనేక అవార్డులు వరించాయి. రాజ్యసభ ఆమెకు ‘రోల్ మోడల్’ అవార్డును ప్రదానం చేసింది. ఆమె జీవితం ఆధారంగా 2025లో మరాఠీ చిత్రం ‘మంగళ’ నిర్మించారు. సంగీతం, విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకు రాగలమని మంగళా కపూర్ అంటున్నారు. -
పద్మ పురస్కార విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ పురస్కార విజేతలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2026గానూ కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా.. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. -
తెలుగు రాష్ట్రాలకు ‘పద్మశ్రీ’ అవార్డులు
ఢిల్లీ: 2026గానూ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ( జనవరి 25, ఆదివారం) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.సినీ నటులు రాజేంద్రప్రసాద్(ఏపీ), మాగంటి మురళీమోహన్(ఏపీ) పద్మశ్రీ అవార్డులు లభించాయి. కళల విభాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(ఏపీ), దీపికారెడ్డి(తెలంగాణ) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వైద్య విభాగంలో గూడూరు వెంకటరావు(తెలంగాణ) పద్మశ్రీ, పాలకొండ విజయ్ ఆనంద్రెడ్డి(తెలంగాణ)లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమానుగు (తెలంగాణ), కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం(తెలంగాణ), కుమారస్వామి తంగరాజు (తెలంగాణ), విద్య విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి(ఏపీ), పశుసంవర్ధక విభాగంలో రామారెడ్డి మామిడి (తెలంగాణ)కి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. -
జాతకాలకంటే జన్యుక్రమాలు చూడటం మేలు!
పెళ్లంటే... అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ... ఈ స్పీడు యుగంలో అంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే.. జాతకాల కంటే జన్యుపత్రికలు కలిస్తే మేలంటున్నారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్! జన్యుశాస్త్ర పరిశోధనల్లో దశాబ్ధాల అనుభవమున్న, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త చెప్పేది సింపుల్!జన్యుక్రమాల ఆధారంగా పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో జన్యు వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి అని! అంతే కాదు.. జన్యువ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద కార్యక్రమం గురించి.. జన్యువులకు.. జబ్బులకు వేసుకునే మందులకూ మధ్య ఉన్న సంబంధం గురించి.. మరెన్నో అంశాలపై పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన ‘సాక్షి.కాం’తో సవివరంగా మాట్లాడారు. హైదరాబాద్లో సీసీఎంబీలో పనిచేస్తున్న ఆయనకు జన్యు సంబంధ పరిశోధనలకు గాను 2026-పద్మశ్రీ అవార్డు లభించిందిప్రశ్న: జాతకాలు కలవడం కంటే జన్యుక్రమాల మేళవింపు ముఖ్యమన్న శాస్త్రవేత్త మీరు. ఎందుకో వివరిస్తారా? జవాబు: భారత దేశంలో ఇప్పటికీ మేనరికాలు ఎక్కువ. అంతేకాకుండా.. శతాబ్దాలుగా ఒకే సమూహంలో (కులం, దగ్గరి బంధువుల్లో) పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనివల్ల మన జన్యువుల్లోని వ్యాధికారక మార్పులు ఆయా సమూహాల్లో బలపడుతూ వస్తాయి. తల్లిదండ్రుల నుంచి అందుకునే క్రోమోజోముల్లో (ఎక్స్, వై, లు మినహాయించి) ఒకే ఒక్క మార్పు ఉన్నా సంతానానికి వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. దీన్ని ఆటోసోమల్ రిసెసివ్ మ్యూటేషన్ అంటారు.తరాలు మారుతున్న కొద్దీ ఈ మార్పులతో ఉండే వారి సంఖ్య పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆటోసోమల్ మ్యూటేషన్స్ ఉంటే పుట్టే బిడ్డకు జన్యుపరమైన వ్యాధి వచ్చే అవకాశం 25 శాతమవుతుంది. అందుకే మీడియా సహాయంతో ఈ సమాచారాన్ని సమాజానికి సులభమైన భాషలో, చేరవేయడం, కుటుంబం/కులంలోనే పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే రిస్క్ల గురించి చెప్పడం అవసరం, కానీ బలవంతంగా ఏమీ రుద్దకుండా, సమాచారం ఇచ్చి ప్రజలే నిర్ణయం తీసుకునేలా చేయాలి.ప్రశ్న: సరే.. పెళ్లికి ముందు ఎలాంటి జన్యు పరీక్షలు చేయించుకుంటే మేలంటారు?జవాబు: దీనిని రెండు భాగాలుగా చూడాలి. కుటుంబంలో లేదా సమూహంలో జన్యువ్యాధులు ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? దానికి కారణమయ్యే జన్యుమార్పులు ఏవన్నది గుర్తించారా? చూసుకోవాలి. ఆ మార్పు పెళ్లి చేసుకోబోయే వారు ఇద్దరిలోనూ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. రెండవది – కుటుంబ చరిత్రలేమీ లేకపోయినా... స్థూలంగా కొన్ని కొన్ని వ్యాధికారక జన్యుమార్పుల కోసం పరీక్షించడం. కొన్ని వ్యాధులకు కారణమైన జన్యుమార్పులను ఇప్పటికే గుర్తించారు.అయితే ఇది చాలా జాగ్రత్తగా జరగాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సహజంగానే కొన్ని జన్యుమార్పులు ఉంటాయి, అలాంటి వారికి నీలో జన్యుమార్పు ఉంది అంటే ఆందోళనకు గురికావచ్చు. రక్తసంబంధం లేకుండా... ఒకేరకమైన ఆటోసోమల్ రిసెసివ్ మ్యూటేషన్ లేకపోతే సమస్య ఏమీ ఉండదు కానీ.. ఏ జన్యువులు, ఏ రకమైన మార్పులను పరిశీలించాలన్న విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది.ప్రశ్న: జన్యుమార్పులు మనం తీసుకునే మందులపై కూడా ప్రభావం చూపుతాయా? జవాబు: అవును. శస్త్రచికిత్సలకు ముందు ఇచ్చే మత్తుమందులే (అనస్తీషియా) ఒక ఉదాహరణ. నిర్దిష్ట జన్యుమార్పులున్న ఒక సామాజిక వర్గంపై వీటి ప్రభావం భిన్నంగా ఉంటుంది. జన్యుమార్పులుంటే ఈ మందులు శరీరంలో ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీంతో అనుకున్నదానికంటే చాలా ఎక్కువసేపు అనస్తీషియా ప్రభావం కొనసాగి, కొన్ని సందర్భాల్లో పక్షవాతం లేదా ప్రాణాపాయం జరగవచ్చు.కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు తీసుకునే మందులు కూడా కొన్ని జన్యుమార్పులున్న వారిపై భిన్నమైన ప్రభావం చూపుతాయి. అంటే... వ్యాధికారక, మందులకు స్పందించే జన్యుమార్పులను వేర్వేరుగా గుర్తించేందుకు పరీక్షలు అవసరమన్నమాట. భవిష్యత్తులో రాగల వ్యాధులకు సంబంధించిన పరీక్షలూ జోడించి తగిన మార్గదర్శకాలు రూపొందిస్తే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది.ప్రశ్న: జన్యు పరీక్షలతో గుండెజబ్బులను ముందే గుర్తించవచ్చా?జవాబు: జన్యు పరీక్షల ద్వారా రెండు రకాల లాభాలున్నాయి. ముందుగా గుర్తించడం ఒకటైతే... వ్యాధి వేగంగా ముదిరిపోకుండా చూసుకోవడం రెండోది. ఉదాహరణకు కార్డియోమయోపతిని తీసుకుందాం. జన్యుక్రమంలో నిర్దిష్ట మార్పు ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.తల్లిదండ్రులు ఇద్దరి నుంచి ఈ మార్పు సంక్రమించి ఉంటే ప్రమాదం ఎక్కువ. ఒకరి నుంచి మాత్రమే అందితే తక్కువగా ఉంటుంది. పదేళ్ల కుర్రవాడు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయినప్పుడు.. అతడి గుండె కండరాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు జన్యుమార్పు ప్రభావాన్ని గుర్తించారు. అలాంటి మ్యూటేషన్లను ముందుగానే గుర్తిస్తే, గుండెజబ్బు రావడాన్ని ఆలస్యం చేయవచ్చు. ప్రశ్న: కోవిడ్ టీకా తీసుకున్న తరువాత యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారన్న అంచనా ఉంది. రెండింటికీ సంబంధం ఉందా? జవాబు: కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత గుండెపోట్లు పెరిగాయన్న అంశంపై కొన్ని నివేదికలు ఉన్నాయి. చర్చలూ జరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై “కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండె రోగాలు పెరిగాయి” అని నిర్దిష్టంగా నిరూపించిన అధ్యయనం ఏదీ లేదు. ప్రశ్న: భారతదేశంలో స్థూలంగా 4635 జన సమూహాలు ఉన్నాయి. వీరందరికీ జన్యు పరీక్షలు చేయించడం మేలా?జవాబు: దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతూండటం వల్ల దేశంలో కొన్ని సమూహాలకు కొన్ని రకాల జన్యువ్యాధులు వస్తున్నాయి. వీటి తీవ్రత కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒకానొక సముదాయంలో పుట్టిన రెండు నెలలకే పిల్లలు మరణిస్తూంటారు. ప్రజలు అనారోగ్యంగా ఏమీ కనిపించారు కానీ వ్యాధికారక జన్యుమార్పులు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా సమూహాలకు జన్యుపరీక్షలు చేయించడం అవసరం. జినోమ్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకూ 83 సమూహాలకు పరీక్షలు పూర్తయ్యాయి కూడా.త్వరలో మరింత ఎక్కువ సమూహాలకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం పది లక్షల మంది జన్యుక్రమాలను నమోదు చేసి వ్యాధికారక మార్పులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తద్వారా ఆయా సముదాయాల్లో పెళ్లిళ్ల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. premarital, prenatal counseling ద్వారా ముందుగానే సూచనలనిచ్చే అవకాశం ఉంటుంది.ప్రశ్న: దేశంలో premarital లేదా prenatal counseling నిర్వహించడానికి తగినంత మంది జన్యు శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్నారంటారా? జవాబు: ఇటీవలి కాలంలో జన్యువ్యాధులపై వైద్యుల్లోనూ అవగాహన బాగా పెరిగింది. చాలా సందర్భాల్లో వారు రోగులను జన్యుపరీక్షలు చేయించుకోమంటున్నారు. వైద్యులు, జన్యు శాస్త్రవేత్తలతోపాటు ఈ రెండు అంశాలను అర్థం చేసుకుని సామాన్యులకు వివరించగల జెనెటిక్ కౌన్సిలర్లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తారు. జన్యుశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే.. వాటి ఫలితాలను ఆధారంగా genetic counselors సలహాలు ఇస్తారు. వైద్యులు చికిత్స అందిస్తారన్నమాట.ప్రశ్న: జన్యుపరంగా చూస్తే భారత్.. దక్షిణాసియా ప్రజల ప్రత్యేకత ఏమిటి? జవాబు: ఆఫ్రికా తర్వాత, అత్యంత పురాతన జనాభా నివసిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. జన్యు ఆధారాల ప్రకారం ఆధునిక మానవుడు (హోమో సేపియన్ సేపియన్) ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన మొదటి సమూహపు వారసులు. కొంతమంది దక్షిణ భారత దేశంలోనే స్థిరపడ్డారు. మరికొందు అండమాన్ మీదుగా ఆస్ట్రేలియాకి వెళ్లారు. దక్షిణాసియా దేశాల జనాభాల్లో కూడా కనీసం 50% వరకు భారతీయ వారసత్వం కలిగి ఉన్నాయి, రోగాలు ముఖ్యంగా కార్డియో మయోపతికి సంబంధించిన జన్యుమార్పులు భారతదేశంతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మొదలైన దేశాల్లోనూ కనిపిస్తాయి.ప్రశ్న: మీకు అపరిమిత వనరులు ఉన్నాయనుకోండి; జన్యుశాస్త్రంలో మీరు మొదట పరిష్కరించాలనుకునే ఒక పెద్ద సమస్య ఏది?జవాబు: ఆరోగ్యం; దాన్ని ఒక్క రోగానికిపరిమితం చేయకుండా, స్థూల దృష్టితో చూడాలి. ఇందులో రోగాల కారణం, pharmacogenomics, సంక్రమణ రోగాలు – ఇవన్నీ వస్తాయి, వీటిలో ప్రతి దాంట్లోనూ genetics ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి అనేక అవకాశాలు అందిస్తుంది.ప్రశ్న: నేటి యువ శాస్త్రవేత్తలు genetics రంగంలోకి రావాలనుకుంటే, ప్రత్యేకంగా science, society రెండింటిపై ప్రభావం చూపాలని భావిస్తే మీరు ఏ సలహా ఇస్తారు?జవాబు: హ్యూమన్ genomics రంగంలో ప్రస్తుతం గొప్ప అవకాశాలు ఉన్నాయి; అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలు, నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. జన్యుక్రమ రంగంలో చేసే పనులు సమాజ ఆరోగ్యానికి, దేశానికి ఉపయోగపడతాయి. అందుకే యువత జన్యుశాస్త్రాన్ని కెరియర్గా తీసుకుని, తమ సామర్థ్యానికి తగ్గట్లు సమాజానికి, దేశానికి సేవ చేసేలా ప్రోత్సహించాలి. -
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మభూషణ్, 113 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు, కుటుంబశాస్త్రి, రాజేంద్ర ప్రసాద్( కళావిభాగం) మరళీమెహన్( కళావిభాగం), రాజేంద్రప్రసాద్ (కళావిభాగం).... తెలంగాణ విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి (కళావిభాగం), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ లకు పురస్కారం దక్కింది. తెలంగాణలో మెుత్తంగా ఏడుగురికి, ఆంధ్రప్రదేశ్లో నలుగురికి ఈ ఏడాది అవార్డులు దక్కాయి.దివంగత మాజీ సీఎం అచ్యుతానందకు పద్మ విభూషన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. కళా విభాగంలో ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముటికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగాప్రధాని నరేంద్ర మోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రంగాలలో వారి అంకిత భావం, సేవ, భారత సమాజ నిర్మాణాన్ని సుసంపన్నం చేశాయన్నారు. వారి నిబద్ధత, శ్రేష్ఠత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.భారతరత్న తర్వాత పద్మ అవార్డులను కేంద్ర ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాలుగా భావిస్తారు. కళలు, విద్య, సాహిత్యం, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, పరిశ్రమలు, వైద్యం, ప్రజాసేవలు ఇలా విభిన్న రంగాలలో ఉత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తుంది. పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 1. కుమారసామి తంగరాజ్2 మామిడి రామారెడ్డి ( తెలంగాణ)3. భగవందాస్ రైక్వార్4. భిక్ల్య లడక్య ధిండా5. బ్రిజ్ లాల్ భట్6. బుధ్రి తాటి7. చరణ్ హెంబ్రామ్8. చిరంజీ లాల్ యాదవ్9. ధర్మైక్ లాల్ చునీలాల్ పాండ్యా10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి11. హాలీ వార్12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ13. కె. పజనివేల్14. కైలాష్ చంద్ర పంత్15. కేమ్ రాజ్ సుంద్రియాల్ 16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి17.అంకె గౌడ18. మహేంద్ర కుమార్ మిశ్రా19. మీర్ హాజీభాయ్ కసంభాయ్20. మోహన్ నగర్21. నరేష్ చంద్ర దేవ్ వర్మ22. నీలేష్ వినోద్చంద్ర మాండ్లేవాలా23. నూరుద్దీన్ అహ్మద్24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్25. పద్మ గుర్మెట్26. పోఖిల లెక్తేపి27. పున్నిమూర్తి నటేశన్28. ఆర్ కృష్ణన్29. రఘుపత్ సింగ్30. రఘువీర్ తుకారాం ఖేద్కర్31. రాజస్తపతి కాలియప్ప గౌండర్32. ఆర్మిడా ఫెర్నాండెజ్233. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే34. SG. సుశీలమ్మ35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్36. షఫీ షౌక్37. శ్రీరంగ్ దేవబ లాడ్38. శ్యామ్ సుందర్39. సిమాంచల్ పాత్రో40. సురేష్ హనగవాడి41. తగా రామ్ భీల్42. టెకీ గుబిన్43. తిరువారూర్ భక్తవత్సలం44. విశ్వ బంధు45. యుమ్నం జత్రా సింగ్


