breaking news
Ownership Guidelines
-
హిజాబ్ వివాదం.. వేరే పాఠశాలకు విద్యార్థిని
కొచ్చి: ఇక్కడి చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో హిజాబ్ ధారణకు యాజమాన్యం అభ్యంతరం తెలపడంతో, ఆ విద్యార్థినిని మరో పాఠశాలలో చేర్చాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. కాగా, పాఠశాల నిబంధనలకు కట్టుబడితే విద్యార్థిని తిరిగి చదువు కొనసాగించడానికి స్వాగతిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లూరుత్తిలోని సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తండ్రి.. తన కుమార్తెను తిరిగి అదే పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం తర్వాత తన కుమార్తె తీవ్ర ఒత్తిడికి లోనైందని, తిరిగి అదే పాఠశాలకు వెళ్లడం తనకిష్టం లేదని చెప్పిందన్నారు. వివాదం మొదలైనప్పటి నుండి పాఠశాల ఉపాధ్యాయులు లేదా యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ‘నా కూతురు గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు, మాకు స్కూల్ నుండి ఎలాంటి సమాచారం అందలేదు’అన్నారు. ఈ వివాదంపై విద్యార్థినికి మద్దతు పలికిన కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి మాట్లాడుతూ.. హెడ్స్కార్ఫ్ ధరించే ఉపాధ్యాయిని (నన్) ఒక విద్యార్థినిని హిజాబ్ ధరించనివ్వకపోవడం ఆశ్చర్యకరం, విడ్డూరమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ హీలీనా ఆల్బీ మాట్లాడుతూ.. విద్యార్థిని పాఠశాల నియమాలను పాటిస్తే.. ఆమె యధాప్రకారం చదువుకోవచ్చని తెలిపారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. తమ పాఠశాలలో భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ విలువలను సమ్మిళితం చేస్తూ విద్యను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్కూల్ డ్రెస్ కోడ్కు విరుద్ధంగా.. బాలిక హిజాబ్ ధరించడంపై యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. దీనిపై అక్టోబర్ 10న, విద్యార్థిని తల్లిదండ్రులు ఇతరులతో కలిసి పాఠశాలను సందర్శించి యాజమాన్యాని నిలదీశారు, దీంతో పాఠశాల రెండు రోజుల సెలవు ప్రకటించింది. తర్వాత కేరళ హైకోర్టు పాఠశాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. -
అంతా వారిష్టం
ఏలూరు :ప్రభుత్వ శాఖల్లో బదిలీల వేడి రాజుకుంటోంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, మార్గదర్శకాల్లో సర్కార్ మార్పులు చేసింది. దీనివల్ల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా బదిలీల వ్యవహారం నడిపే ప్రమా దం ఉందని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికి మించి బదిలీ చేయకూడదన్న పరిమితిని ఎత్తివేయడం, గరిష్ట సర్వీసు ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గింపు, కొన్నిశాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయడం గుబులు రేపుతోంది. మొత్తం ప్రక్రియను ఇన్చార్జి మంత్రి పర్యవేక్షణలో చేపట్టనుండటంతో ప్రజాప్రతినిధుల జోక్యం మరింత తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీరో సర్వీసు నుంచి మూడేళ్లలోపు ఒకే స్థానంలో పనిచేస్తున్న వారిని ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ రెండు శాఖల్లో సిఫార్సులకే పెద్దపీట మాట వినని అధికారులను బదిలీ చేస్తామని, పదోన్నతుల వ్యవహారం కూడా తమ చేతుల్లోనే ఉందని ఇటీవల జిల్లాకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం గుబులు రేపుతోంది. ఆర్డబ్ల్యుఎస్ ఇన్చార్జి ఎస్ఈగా కొనసాగుతున్న ఏలూరు ఈఈ సీహెచ్ అమరేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తారా, అదే స్థానంలో కొనసాగిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 155 మందిని బదిలీ చే యడానికి అవకాశం ఉందని సమాచారం. డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి జి.సంపత్కుమారి, ఏలూరు డీఎల్పీవో జి.రాజ్యలక్ష్మి ఇక్కడకు వచ్చి మూడేళ్ల కాలం పూర్తికావడంతో వారికి బదిలీ తప్పదని తెలుస్తోంది. రెవెన్యూలో కౌన్సెలింగ్కు అవకాశం? జిల్లా రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకుని ఆర్ఐ, డెప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్లను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా మార్గదర్శకాల్లో మార్పులతో ఎక్కువ మందిని సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. నివేదికలు కోరిన కలెక్టరేట్ జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు, మూడేళ్లు పూర్తికాని ఉద్యోగుల వివరాలను కేడర్ల వారీగా నివేదించాలని కలెక్టరేట్ వర్గాలు విభాగాధిపతులను కోరాయి. సోమవారం నాటికి హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొన్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆదివారం సెలవు రోజైనప్పటికీ కలెక్టరేట్ నుంచి అడిగిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు కుస్తీ పట్టారు. రోజుకో జీవోతో అయోమయం బదిలీలపై నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేయడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇంకా సరైన విధి విధానాలు రాకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. గతంలోనే మాదిరిగా కేడర్ స్ట్రెంగ్త్లో 20 శాతం వరకు మాత్రమే బదిలీలు చేపడితే పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది ఉండదు. ఇష్టారాజ్యంగా ఎవరికి కావాల్సిన ఉద్యోగిని వారు తీసుకునే అవకాశం కొత్త విధానంలో కనిపిస్తోంది. దీనివల్ల కార్యాలయాల్లో పని విధానం దెబ్బతింటుంది. అవసరం మేరకు బదిలీలు చేపట్టాలి. అదికూడా పారదర్శకంగా జరగాలి. - చోడగిరి శ్రీనివాస్, అధ్యక్షులు, జిల్లా ఇరిగేషన్ ఎంప్లాయాస్ అసోసియేషన్ తీరుతెన్నూ లేదు ఈ నెలలో బదిలీల పక్రియపై విడుదల చేసిన షెడ్యూల్ తీరుతెన్నూ లేదు. బదిలీలకు సంబంధించి జీవోలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెలాఖరులో బదిలీలు చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్, ఆయా శాఖాధిపతులు చర్చించి బదిలీలు చేయాల్సి ఉన్నదృష్ట్యా ఈ వ్యవహారంలో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్లోనే వివిధ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఈ దృష్ట్యా అవసరం మేరకే బదిలీలు చేయడం ఉత్తమం. అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పారదర్శకంగా చేయాలి. - ఆర్ఎస్ హరనాధ్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ


