breaking news
old songs program
-
లాహిరి.. లాహిరి..
-
జ్యూక్ బాక్స్ 26th Jan 2019
-
వింటారా.. అలనాటి మధుర స్వరాలు
బంజారాహిల్స్: మ్యాజిక్ 106.4 ఎఫ్ఎం హైదరాబాద్లో మొట్టమొదటి రెట్రో ఎఫ్ఎం చానెల్గా శ్రోతలను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. వింటూ మైమరిచిపోదామంటూ హైదరాబాద్ శ్రోతల జీవితంలోని మధుర స్మృతులను తిరిగి తీసుకురావడానికి మైమరిపించే పాటలను అలనాటి మేటి గీతాలను అందించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజ్కోటిలాంటి మరెందరో అలనాటి మేటి సంగీత దర్శకుల పాటలను వినిపించనుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో శుక్రవారం మ్యాజిక్ 106.4 ఎఫ్ఎం ప్రముఖ దర్శకుడు, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె.విశ్వనాథ్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఆయన శ్రోతలతో మాట్లాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, నిర్మాత అశ్వినీదత్, హీరో రాజశేఖర్, జీవిత విచ్చేసి శ్రోతలతో మాట్లాడి అలరించారు. రోజంతా ఆర్జేలు, సెలబ్రిటీలు వేడుక జరుపుకున్నారు. టాలీవుడ్ గాయకుడు శ్రీకృష్ణ, జ్యోతి, మహతితో పాటు మురళి, సాగర్లు ఆర్జెలుగా వ్యవహరించారు. -
జ్యూక్ బాక్స్ 23th June 2018
-
జ్యూక్ బాక్స్ 26th May 2018
-
జ్యూక్ బాక్స్ 14th April 2018
-
జ్యూక్ బాక్స్ వినుడీ మనసారా..
-
జ్యుక్ బాక్స్ 3rd march 2018
-
జ్యుక్ బాక్స్ 17th Feb 2018
-
జ్యుక్ బాక్స్ 3rd Feb 2018
-
జ్యుక్ బాక్స్ 28th Jan 2018
-
నన్ను ప్రోత్సహించింది బాలమురళియే
గానకోకిల సుశీల అలరించిన ఆ’పాత’మధురాలు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సినీగాయనిగా తొలిసారి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ప్రస్తుతం నాకు సత్కారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై బాలమురళి కూర్చున్నట్టు భావించి, ఆ కుర్చీకి దండలు వేయండ’ని ప్రముఖ గాయని, గానకోకిల సుశీల కోరారు. శుభోదయమ్ ఇ¯ŒS ఫ్రా ఆధ్వర్యంలో గోదావరి సింగర్స్ క్లబ్ సౌజన్యంతో శ్రీహరి ఈవెంట్స్ ఆనం కళాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన సినీ సంగీత విభావరిలో నాటి మేటి గాయని సుశీల ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలమురళి కన్నుమూశారని, ఈ పరిస్థితుల్లో కంటినీరు ఆరకుండా ఈ సత్కారాలు తీసుకోవడం తనకు ఇష్టంలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆమెకు నిర్దేశించిన ఆసనానికి పూలమాలలు వేశాక, పక్కనే మరో సాధారణ ఆసనంపై ఆమె కూర్చున్నారు. నిర్వాహకులు అమెకు జ్ఞాపికను అందజేశారు. బాలమురళి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కొలువుతీరిన సంగీతలక్ష్మి మూడున్నర దశాబ్దాలుగా అన్ని దక్షిణాది భాషల్లో అందరు కథా నాయికలకు తన గాన మాధుర్యాన్ని అందించిన సుశీల సన్నిధిలో ఔత్సాహిక గాయనీ గాయకులు ఆమె పాడిన పాటలనే ఆలపించారు. సుశీల మౌనంగా కూర్చుని, తన్మయత్వంతో ఆ పాటలను విన్నారు. కొన్ని పాటలకు తన కరతాళ ధ్వనులతో అభినందించారు. సమీర్ భరద్వాజ్, యామిని, పిరాట్ల శ్రీహరి, శ్రియ తదితరులు ఆపాత మధురాలను వినిపించారు. తొలుత సుశీలను వేదస్వస్తితో, పూర్ణకుంభంతో వేదిక వద్దకు తీసుకువచ్చారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి హాజరయ్యారు. కలపటపు లక్ష్మిప్రసాద్, రాయుడు చంద్రకుమార్, సన్నిధానం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహం వద్ద నివాళి గోదావరి గట్టున ఉన్న అమర గాయకుడు ఘంటసాల విగ్రహం వద్ద ఆదివారం ఉదయం సుశీల నివాళులర్పించారు.