breaking news
The number of crimes
-
అదుపులోనే నేరాలు : సీపీ
విజయవాడ సిటీ : గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపులోనే ఉంచగలిగామని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. వచ్చే ఏడాది నేరాల సంఖ్యను తగ్గించడంతోపాటు కేసుల దర్యాప్తు, సొత్తు స్వాధీనంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసు కమిషనరేట్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి అర్ధ సంవత్సరంలో పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నందున నేరాల సంఖ్య పెరిగిందన్నారు. రెండో అర్ధ సంవత్సరంలో పోలీసులు నేరాలను గట్టిగా నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఏడాది రూ.8,64,81,828 సొత్తు చోరీకి గురి కాగా, రూ.3,31,15,020 రికవరీ చేశామని తెలిపారు. ఇంటి దొంగతనాలు, మోసాలు, అత్యాచారం కేసులు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాద మృతులను తగ్గించడంలో పోలీసులు సఫలీకృతమైనట్లు చెప్పారు. మగ పోలీసులతో సమస్యలు చెప్పుకోలేని మహిళలు తమకు పరిచయస్తులైన మహిళా పోలీసులతో చెప్పుకోవచ్చన్నారు. ఇందుకు స్టేషన్ పరిధితో నిమిత్తం లేదని తెలిపారు. న్యాయవాది తానికొండ చిరంజీవిపై అపార్టుమెంట్ ప్లాటు ఆక్రమణ కేసు నమోదు చేయడం వెనుక హైకోర్టు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై స్టే విధించడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టేపై తాము హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నామన్నారు. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్కు విశేష ఆదరణ లభిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఇప్పటివరకు శోధన వాహనాల్లో 200పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. పోలీసు సేవలు కావాల్సిన వారు డయల్-100ను విరివిగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. వచ్చే సంక్రాంతిలోపు డయల్-100 విజయవాడ నుంచే పని చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చోరీకి గురైన మోటారు సైకిళ్ల ఆచూకీ కోసం త్వరలోనే ప్రత్యేక తనిఖీ చేపట్టనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డులు దాటిన నేరాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో నేరాల సంఖ్య గత ఏడాది రికార్డులను దాటిపోయింది. 2012 ఏడాదితో పోలిస్తే 2013లో 43.6 శాతంమేర నేరాలు పెరిగినట్టు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు ఏటా నిర్వహించే వార్షిక పత్రికా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. మహిళలపై దాడులు 412 శాతం పెరిగినట్టు పోలీస్ కమిషనర్ స్వయంగా వెల్లడించారు. 2013లో 1,559 అత్యాచార కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. 2012తో పోలిస్తే 129 శాతం అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. నిర్భ య అత్యాచార ఘటన తర్వాతకూడా నగరంలో మహిళల రక్షణ మెరుగుపడలేదనడానికి ఇదే నిదర్శనం. ఢిల్లీ సీపీ పేర్కొన్న ప్రకారం 2012లో 51,479 కేసులు నమోదవగా, 2013లో 73,958 కేసులతో 43.67 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో నగర పోలీసు లు 48.8 కేసులను పరిష్కరించగలిగారు.‘ ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజలకు నిర్లక్ష్యం చెయ్యొద్దన్నాం. అందుకే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నా రు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువచేసేలా పీపుల్స్ ఫెండ్రీ పోలీసింగ్ను అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు. సీపీ వెల్లడించిన వివరాలు నగరంలో ఈ ఏడాది నమోదైన అత్యాచార కేసుల్లో 96 శాతం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు తెలిసినవారే. ఇలాంటి 90 శాతం కేసులను పోలీసులు పరిష్కరించారు. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు నమోదైన కేసుల్లో 77 శాతం కేసులను ఫిర్యాదు అందిన వారంలోనే పరిష్కరించారు. అత్యాచార కేసుల్లో చార్జిషీట్ తప్పనిసరి చేస్తూ వచ్చిన కొత్త నిబంధనతో 20 రోజులలోగానే నిందితుడి అరెస్టు అనివార్యమైంది. బాలికలు, మహిళల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను పెంచారు. మహిళల రక్షణకు 1091 హెల్ప్లైన్ ఏర్పాటు. 370 పీసీఆర్ వ్యాన్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరంలో పీసీఆర్ వ్యాన్ల సంఖ్య 807కి చేరింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 30,130 మంది ని పీసీఆర్ వ్యాన్ల సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్పించింది. అదృశ్యమవుతున్న చిన్నారుల జాడ కనిపెట్టడంపైనా నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారుల అదృశ్యం కేసుల్లో ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. 2012లో 3,503 అపహరణ కేసులు నమోదవగా 2013లో కిడ్నాప్ కేసుల సంఖ్య 5,565కి చేరింది. వృద్ధుల రక్షణలో భాగంగా ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ లిస్టులో 18,574 మందిని చేర్చుకున్నారు. నగరంలో భద్రతా చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా మార్కెట్లు, పలు కీలక ప్రదేశాల్లో కలిపి మొత్తం 5,333 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 2013లో మద్యం తాగి వాహనాలను నడుపుతు న్న 24,564 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటి ంచని 3,397 మందిని కారాగారానికి పంపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారివద్ద నుంచి చలాన్ల రూపంలో 59.34 కోట్లు వసూలు చేశారు. 2013లో మొత్తం 11 మంది ఉగ్రవాదులను అరె స్టు చేశారు. 536 మందిని మద్యం సరఫరా చేస్తుండగా అరె స్టు చేశారు. 9,432 మందిని క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేశారు.